కరాచీ:వచ్చేఏడాది బంగ్లాదేశ్లో జరుగనున్న ఆసియా కప్ టోర్నీ, ప్రపంచ ట్వంటీ 20 మ్యాచ్ ల నుంచి పాకిస్తాన్ వైదొలగనుంది. పాకిస్తాన్ ప్రజలను కించపరిచే విధంగా బంగ్లాదేశ్లో కార్యకలాపాలు సాగుతుండటంతో పాకిస్తాన్ ఆ రెండు ప్రధాన రెండు టోర్నీలకు దూరంగా ఉండనుంది. ఈ మేరకు పాకిస్థాన్ ప్రతినిధి పీటీఐ వార్త సంస్థకు తెలిపారు. ఆసియా కప్ టోర్నీ, ప్రపంచ ట్వంటీ 20లు రెండు టోర్నీలు బంగ్లాదేశ్ లో జరుగుతుండటమే కారణంగా తెలిపారు. బంగ్లాదేశ్ లో పాకిస్థానీల మనోభావాలకు వ్యతిరేకంగా కార్యకలపాలు సాగుతుండటంతో టోర్నీలు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. కాగా, దీనిపై ఐసీసీ జనవరి నెలలో నిర్ణయం తీసుకుంటుందన్నారు.