
సెమీస్లో పంకజ్ అద్వానీ
హర్గాడా (ఈజిప్టు): అంతర్జాతీయ బిలియర్డ్స్ స్నూకర్ సమాఖ్య (ఐబీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత స్టార్ పంకజ్ అద్వానీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో పంకజ్ అద్వానీ 6-0 (70-62, 112-0, 107-14, 83-46, 114-12, 64-27) ఫ్రేమ్ల తేడాతో అలెక్స్ బోర్గ్ (మాల్టా)పై విజయం సాధించాడు. సెమీఫైనల్లో లుకాస్ క్లెకెర్స్ (జర్మనీ)తో అద్వానీ తలపడతాడు. ఇప్పటికే 14 సార్లు ప్రపంచ టైటిల్స్ను నెగ్గిన అద్వానీ ఈ టోర్నీలో సెమీస్కు చేరడం ద్వారా కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.