రసూల్‌కు ఐదు వికెట్లు | Parvez Rasool took five wickets | Sakshi
Sakshi News home page

రసూల్‌కు ఐదు వికెట్లు

Published Fri, Sep 27 2013 1:04 AM | Last Updated on Fri, Sep 1 2017 11:04 PM

రసూల్‌కు ఐదు వికెట్లు

 మైసూర్: జమ్ము కాశ్మీర్ ఆల్‌రౌండర్ పర్వేజ్ రసూల్ (5/116) ఐదు వికెట్లతో రాణించినా... భారత్ ‘ఎ’తో జరుగుతున్న అనధికార తొలి టెస్టులో వెస్టిండీస్ ‘ఎ’ జట్టు భారీ స్కోరు సాధించింది. ఫుదాదిన్ (86 నాటౌట్), మిల్లర్ (49) సమయోచితంగా రాణించడంతో గురువారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 135 ఓవర్లలో 429 పరుగులకు ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆట ముగిసే సమయానికి 43 ఓవర్లలో 3 వికెట్లకు 124 పరుగులు చేసింది.
 
 జునేజా (47 నాటౌట్), ఖడివాలే (5 నాటౌట్)లు క్రీజులో ఉన్నారు. ఓపెనర్లలో లోకేశ్ రాహుల్ (46) ఓ మోస్తరుగా ఆడాడు.  వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ చతేశ్వర్ పుజారా (3) విఫలమయ్యాడు. నాలుగు పరుగుల వ్యవధిలో  రెండు వికెట్లు కోల్పోయిన భారత్...  రాహుల్, జునేజాలు మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించడంతో కుదురుకుంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement