రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్ | rahane hits ton in 2nd test against srilanka | Sakshi
Sakshi News home page

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

Published Sun, Aug 23 2015 2:44 PM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్ - Sakshi

రహానె సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో అజింక్యా రహానె (126) సెంచరీతో కదంతొక్కడంతో టీమిండియా భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. ఓవర్నైట్ స్కోరు 70/1తో మ్యాచ్ నాలుగో రోజు ఆదివారం రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. టీ విరామానికి 5 వికెట్ల నష్టానికి 283 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ ఓవరాల్గా 370 పరుగుల ఆధిక్యంలో ఉంది.

మురళీ విజయ్ (82) హాఫ్ సెంచరీకి తోడు రోహిత్ 34 పరుగులు చేశాడు. లంక బౌలర్ కౌశల్ 4 వికెట్లు తీశాడు. కాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్ల్లో భారత్ 393, లంక 306 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement