జింఖానా, న్యూస్లైన్: నిరంతర సాధనతోనే ఎవరికైనా విజయాలు లభిస్తాయని టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ తెలిపింది. సాధనతో పాటు గురువు పట్ల గౌరవం ఉంటేనే అనుకున్నది సాధిస్తామని చెప్పింది. శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయింది.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి అశ్విన్ కుమార్, నైనా సోదరుడు అగస్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ‘పిల్లలందరూ ఒకే స్థాయిలో జ్ఙాపక శక్తి కలిగి ఉంటారు. వారికి సరైన శిక్షణ అవసరం.
దాని ద్వారానే వారు ఏ రంగంలోనైనా ముందుకు వెళ్లగలరు. అయితే విజయం మాత్రం నిరంతర సాధన, విద్య నేర్పే గురువు పట్ల గౌరవం అనే రెండు సూత్రాలను పాటిస్తేనే సాధ్యపడుతుంది’అని చెప్పింది. అనంతరం నైనా జైస్వాల్ను శ్రీవైష్ణవి ఒలంపియాడ్ స్కూల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ సత్కరించారు.
నిరంతర సాధనతో విజయాలు: నైనా
Published Mon, Mar 17 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 4:47 AM
Advertisement
Advertisement