డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ | south africa batting | Sakshi
Sakshi News home page

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

Published Sun, Oct 11 2015 10:59 AM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ

కాన్పూర్: ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్నతొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు 30 ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. డుప్లెసిస్ 56 పరుగులు (69 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్స్), డివిలియర్స్ 12 పరుగుల(19 బంతులు,)తో ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రైనా బౌలింగ్లో సిక్స్ కొట్టిన డు ప్లెసిస్ అర్ధశతకాన్ని పూర్తిచేసుకున్నాడు.

అంతకుముందు ఓపెనర్ హషీం ఆమ్లా 37 పరుగులు(59 బంతులు, 3 ఫోర్లు) చేసి జట్టు స్కోరు 102 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన డివిలియర్స్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ డుప్లెసిస్కు సహకారం అందిస్తున్నాడు. మూడో వికెట్కు ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 37 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత బౌలర్లలో అశ్విన్, అమిత్ మిశ్రాలు చెరో వికెట్ తీశారు.

Advertisement
Advertisement
 
Advertisement