
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్–4 టోర్నమెంట్లో హైదరాబాద్ అమ్మాయి శ్రీవల్లి రష్మిక ముందంజ వేసింది. థాయ్లాండ్లో జరుగుతోన్న ఈ టోర్నీలో క్వార్టర్స్కు చేరుకుంది. బుధవారం జరిగిన బాలికల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో శ్రీవల్లి రష్మిక (భారత్) 6–1, 6–4తో ఎవెలినా కొంటారెవా (రష్యా)పై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన రెండోరౌండ్లో రష్మిక 6–1, 6–0తో పి కోర్సుబ్ (థాయ్లాండ్)ను ఓడించింది.
Comments
Please login to add a commentAdd a comment