10 ఓవర్లలో టీమిండియా స్కోరు 59/1 | team india gets 59 runs after 10 overs | Sakshi
Sakshi News home page

10 ఓవర్లలో టీమిండియా స్కోరు 59/1

Published Sun, Oct 11 2015 1:50 PM | Last Updated on Sun, Sep 3 2017 10:47 AM

team india gets 59 runs after 10 overs

కాన్పూర్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 59 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా విసిరిన 304 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి బరిలోకి దిగిన టీమిండియా 42 పరుగుల వద్ద శిఖర్ ధవన్ (23) ను తొలి వికెట్ రూపంలో కోల్పోయింది. క్రీజ్ లో రోహిత్ శర్మ(25), అజింక్యా రహానే(7) ఉన్నారు. ట్వంటీ 20 సిరీస్ ను కోల్పోయిన టీమిండియా ఈ మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని భావిస్తోంది. అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 303 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్ (104) అజేయ సెంచరీతో ఆకట్టుకుని జట్టు భారీ స్కోరు చేయడంలో సహకరించాడు.

Advertisement
Advertisement
 
Advertisement