
సాక్షి, హైదరాబాద్: ఫెడరేషన్ కప్ త్రోబాల్ చాంపియన్షిప్లో తెలంగాణ మహిళల జట్టు కాంస్య పతకం సాధించింది. హరియాణాలో జరిగిన ఈ టోర్నీలో రాష్ట్ర మహిళల జట్టు మూడో స్థానంలో నిలిచింది. కాంస్య పతక పోరులో తెలంగాణ జట్టు 15–8, 15–11తో తమిళనాడుపై విజయం సాధించింది. లీగ్ దశలో అద్భుతంగా రాణించిన మహిళల జట్టు పోరాటం సెమీస్లో ముగిసింది.
ఆంధ్రప్రదేశ్, ఒడిశాలపై వరుస విజయాలతో తెలంగాణ జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టింది. అక్కడ తెలంగాణ 13–15, 12–15తో ఢిల్లీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో మరో సెమీస్లో ఓడిన తమిళనాడుతో మూడో స్థానం కోసం తలపడి విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment