
ముక్కోణపు సిరీస్: 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 121/3
ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 121/3.
మెల్బోర్న్: ముక్కోణపు టోర్నీ రెండో వన్డేలో భారత్- ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 25 ఓవర్ల అనంతరం భారత్ స్కోరు 121/3.
ఓపెనర్ రోహిత్ శర్మ 77 బంతుల్లో 2 ఫోర్లు , 3 సిక్సర్లతో 62 పరుగులు, సురేష్ రైనా 31 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. తొలి ఓవర్లోనే శిఖర్ ధావన్ రూపంలో వికెట్ కోల్పోయిన భారత్కు రోహిత్ అండగా నిలిచాడు.
తరువాత వచ్చని రహానే, కోహ్లి ఎవరూ క్రీజులో కుదురుకోకపోయినా తనదైన శైలిని మరోసారి కొనసాగిస్తున్నారు. రోహిత్కు తోడుగా రైనా కూడా చక్కటి ప్రతిభ కనబరుస్తున్నాడు.
ఓపెనర్ శిఖర్ ధావన్ (2), రహానే (12), కోహ్లి (9) ఔటయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్, ఫాల్క్నర్, గురిందర్ చెరో వికెట్ తీశారు.