పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ | ap bjp in charge siddharth nath singh comments over pawan kalyan tweets | Sakshi
Sakshi News home page

పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ

Published Tue, Dec 20 2016 5:45 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ - Sakshi

పవన్ ట్వీట్లపై ఘాటుగా స్పందించిన బీజేపీ

ఢిల్లీ: జనసేన అధినేత, సినీ హీరో పవన్ కల్యాణ్ ట్వీట్లపై భారతీయ జనతా పార్టీ ఘాటుగా స్పందించింది. పవన్ అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జ్ సిద్ధార్థ్నాథ్ సింగ్ మండిపడ్డారు.

ట్విట్టర్లో స్పందించే ముందు అధ్యయనం చేయాలని ఆయన పవన్కు చురకలంటించారు. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో ఐదు అంశాలపై సమాధానం చెప్పాలని గతంలోనే కోరామన్నారు. గోవధపై ఆయా రాష్ట్రాల్లో చట్టాలున్నాయని ఈ సందర్భంగా సిద్ధార్థ్నాథ్ సింగ్ గుర్తుకు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంపై బీజేపీ వ్యవహారిస్తున్న తీరుపై పవన్ ట్విట్టర్లో ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.  (చదవండి : బీజేపీని వదిలి పెట్టం: పవన్‌ కల్యాణ్‌ )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement