ప్రత్యేక బస్సుతో బీజేపీ ఎన్నికల ప్రచారం | BJP election campaign Special buses | Sakshi
Sakshi News home page

ప్రత్యేక బస్సుతో బీజేపీ ఎన్నికల ప్రచారం

Dec 14 2014 10:05 PM | Updated on Mar 29 2019 9:24 PM

విధానసభ ఎన్నికలు ఏక్షణంలోనైనా జరిగే అవకాశముండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలదళం శతవిధాలా

 న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికలు ఏక్షణంలోనైనా జరిగే అవకాశముండడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు కమలదళం శతవిధాలా యత్నిస్తోంది. ఇందులోభాగంగా మెహ్రౌలీ ప్రాంతంలో బీజేపీ ప్రత్యేక బస్సును ఏర్పాటుచేసింది. ఈ బస్సులో ఎల్‌సీడీ టీవీతో మెహ్రౌలీ నియోజకవర్గంలో తమ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ప్రచారం చేస్తోంది. ఈ బస్సుకు మిషన్ మెహ్రౌలి అని నామకరణం చేసింది. ఈ బస్సు ఈ నియోజకవర్గం పరిధిలో ప్రతిరోజూ మొత్తం 300 చోట్ల ఆగుతుంది. ఆగిన ప్రతిచోటా ఓ లఘుచిత్రాన్ని ప్రదర్శిస్తారు. ఇందులో 50 సీట్లు ఉంటాయి.  ఇందులోకి స్థానికులను అనుమతిస్తారు.ఈ చిత్రంలో పది నిమిషాలపాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగం ఉంటుంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement