సోషల్ మీడియా ఎంత పని చేసింది! | Jallikattu Protest: Stung By Viral Videos, Chennai Police Says 'Should Have Tracked Social Media' | Sakshi
Sakshi News home page

సోషల్ మీడియా ఎంత పని చేసింది!

Published Fri, Jan 27 2017 2:16 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

సోషల్ మీడియా ఎంత పని చేసింది! - Sakshi

సోషల్ మీడియా ఎంత పని చేసింది!

చెన్నై: సోషల్ మీడియా ఎంత పని చేసిందని చెన్నై పోలీసులు వాపోతున్నారు. తాము చేసిన పని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం కావడం పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని భావిస్తున్నారు. జల్లికట్టు ఆందోళనల సందర్భంగా చెన్నైలో నిరసనకారులకు ఆటోలకు నిప్పు పెడుతూ పోలీసులు వీడియోకు చిక్కారు. కమల్ హాసన్, అరవింద్ స్వామి లాంటి సినీ ప్రముఖులతో పాటు చాలా మంది ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసి పోలీసుల తీరును ఎండగట్టారు.

అడ్డంగా దొరికిపోవడంతో ఖాకీలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు పూర్తి చేయడానికి వారం రోజులు పడుతుందని ఉన్నత పోలీసు అధికారి వి. బాలకృష్ణన్ తెలిపారు. వీడియోలో యూనిఫాంలో ఉన్నది నిజమైన పోలీసులా, కాదా అనే దాని గురించి పరిశీలిస్తున్నట్టు చెప్పారు. ఈ వీడియో వెంటనే ఫేస్ బుక్, వాట్సాప్, ట్విటర్ లో ప్రత్యక్షం కావడం తమ శాఖ వైఫల్యంగానే భావిస్తున్నామన్నారు. ఈ వ్యవహరం తమకు పాఠం నేర్పిందని, ఇక నుంచి సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉంటామని వెల్లడించారు.

అయితే ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని అంతకుముందు పోలీసులు పేర్కొన్నారు. ఇది అసలైన వీడియోనా, కాదా అనేది దర్యాప్తులో వెల్లడవుతుందన్నారు. పోలీసు దుస్తుల్లో ఉన్న వ్యక్తులు నిరసనకారుల ఆటోలకు నిప్పు పెట్టినట్టు వీడియోలో కనబడడంతో కలకలం రేగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement