జయలలిత కేసు విచారణ నేటికి వాయిదా | Jayalalithaa today's trial postponed | Sakshi
Sakshi News home page

జయలలిత కేసు విచారణ నేటికి వాయిదా

Published Tue, Jan 6 2015 2:09 AM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా

బెంగళూరు: అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా పడింది. ఇక్కడి ప్రత్యేక కోర్టులో సోమవారం వాదనలు మొదలైన వెంటనే జయలలితపై తాను కేసు దాఖలు చేశానని, అందువల్ల ఈ కేసును వాదించేందుకు తనకు అనుమతివ్వాలంటూ న్యాయమూర్తి పి.ఆర్.కుమారస్వామిని సుబ్రహ్మణ్యస్వామి కోరారు.

ఈ విషయాన్ని రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. అనంతరం జయలలిత తరుఫు న్యాయవాది పి.కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement