disproportionate assets
-
కానిస్టేబుల్ రూ.500 కోట్ల అక్రమాస్తులపై రాజకీయ దుమారం
భోపాల్: మధ్యప్రదేశ్లో రవాణాశాఖ మాజీ కానిస్టేబుల్ ఇంట్లో ఏకంగా రూ.500 కోట్ల అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. బయటపడింది. గత నెలలో కానిస్టేబుల్ సౌరభ్ శర్మ ఇంట్లో లోకాయుక్త పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అతని ఇంట్లో ఉన్న పాడుబడిన వాహనంలో ఏకంగా రూ.11 కోట్ల రూపాయల నగదు, 52 కిలోల బంగారం, ఒక డైరీ బయటపడింది. ఇంతేకాక శర్మ మొత్తంగా రూ.500 కోట్ల ఆస్తులు పోగేసినట్లు లోకాయుక్త పోలీసులు కనుగొన్నారు. శర్మ అవినీతి వ్యవహారం ప్రస్తుతం మధ్యప్రదేశ్లో రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లే ఈ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత జితూ పట్వారీ ఆరోపిస్తున్నారు. ఈ విషయం సౌరభ్శర్మ డైరీ చూస్తే తెలుస్తుందన్నారు. తనకు శర్మ డైరీలోని ఆరు పేజీలు మాత్రమే దొరికాయని పట్వారీ చెప్పారు. ఈ ఆరోపణలపై బీజేపీ ధీటుగా స్పందించింది. గతంలో అధికారంలో ఉన్న కమల్నాథ్ ప్రభుత్వం అవినీతికి మారుపేరుగా ఉండేదని కౌంటర్ ఇచ్చారు. అయితే కానిస్టేబుల్ సౌరభ్శర్మ మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. -
ఏసీబీ సోదాలు.. కోట్లలో బయటపడ్డ అడిషనల్ కలెక్టర్ అక్రమాస్తులు
సాక్షి,హైదరాబాద్ : రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి నివాసంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు ఏసీబీ అధికారులు. ఈ ఏడాడి ఆగస్ట్ నెలలో రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి రూ.8లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. కేసు నమోదు చేసుకున్న ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.5కోట్లకు పైచీలుకు స్థిర,చర ఆస్తుల గుర్తించారు.అయితే రూ.4కోట్ల 19లక్షల విలువైన ఆస్తులు బినామీల పేరు మీద ఉన్నట్లు నిర్ధారించారు. ఈ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో మూడు రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు ఏసీబీ అధికారులు. రూ.8లక్షల లంచం తీసుకుంటూఈ ఆగస్ట్ 13న రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్రెడ్డి ఏసీబీకి చిక్కారు. రూ.8 లక్షల లంచం తీసుకుంటూ భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ దొరికిపోయారు. వ్యక్తి ధరణి వెబ్ సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి 14 గుంటల ల్యాండ్ను తొలగించాలని సీనియర్ అసిస్టెంట్ను బాధితుడు కోరాడు. ఈ పని చేసేందుకు సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్లాల్ రూ. 8 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో అప్రమత్తమైన ఏసీబీ అధికారులు రూ.8 లక్షల లంచం తీసుకుంటుండగా భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ను పట్టుకున్నారు. తాజాగా మరోసారి సోదాలు నిర్వహించగా భూపాల్రెడ్డి వద్ద భారీ మొత్తంలో ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించారు. -
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
ఉద్ధవ్పై కేసు.. దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన(ఉద్ధవ్ వర్గం) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుటుంబసభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ముంబై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించామని గురువారం బాంబే హైకోర్టుకు ముంబై ఆర్థిక నేరాల విభాగం పోలీసులు తెలిపారు. మరోవైపు, ఉద్ధవ్ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలంటూ బాంబే హైకోర్టులో మహిళా పబ్లిషర్ గౌరి బిధే వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్)పై తీర్పును డివిజన్ బెంచ్ రిజర్వ్ చేసింది. చదవండి: (కొలీజియం మన దేశ చట్టం.. అందరూ అనుసరించాల్సిందే: సుప్రీంకోర్టు) -
నెలకు 4వేల జీతంతో మొదలైన ‘హీరో’, కళ్లు చెదిరే ఇల్లు,కోట్ల ఆస్తి..చివరికి!
భోపాల్: భోపాల్కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కోట్ల ఆస్తిని కూడబెట్టిన వైనం వెలుగులోకి వచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల ఫిర్యాదుపై విచారణ జరిపిన మధ్యప్రదేశ్ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యు) అతని ఇంట్లో దొరికిన నగదు, ఇతర ఆస్తి పత్రాలు చూసిన నివ్వెర పోయారు. స్థిరాస్తులు, ఇతర కోట్ల రూపాయల విలువైన ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలతో పాటు రూ 85 లక్షలకు పైగా నగదు లభించినట్టు అధికారులు వెల్లడించారు. లెక్కింపు, పత్రాల వెరిఫికేషన్ తర్వాతే అతడి మొత్తం విలువ తెలుస్తుందని ఈఓడబ్ల్యు ఎస్పీ రాజేష్ మిశ్రా తెలిపారు. (ఇదీ చదవండి: అరుదైన ఘనత దక్కించుకున్న ఎల్ఐసీ!) నెలకు నాలుగువేల రూపాయల జీతంతో రాష్ట్ర వైద్య విద్యా శాఖలో అప్పర్ డివిజన్ క్లర్క్గా కరియర్ ప్రారంభించిన హీరో కేశ్వాని ప్రస్తుతం నెలకు దాదాపు రూ.50 వేల జీతం తీసుకుంటున్నాడు. అక్రమ ఆస్తులు ఫిర్యాదుల విచారణ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు అతని నివాసంలో సోదాలు నిర్వహించగా రూ. 85 లక్షలకు పైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. నోట్ లెక్కింపు యంత్రాన్ని సాయంతో డబ్బును లెక్కించినట్టు ఈఓడబ్ల్యు అధికారి తెలిపారు. అలాగే కోట్లాది రూపాయల పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు ఖరీదైన అలంకార వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేస్వానీ నివాసం విలువ సుమారు కోటిన్నర ఉంటుందని అంచనా వేశారు. కేశ్వాని కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో లక్షల రూపాయలు జమ అయినట్లు గుర్తించారు. ఎలాంటి ఆదాయ వనరులు లేని గృహిణి అయిన కేశ్వాని భార్య పేరిట చాలా ఆస్తులు కొనుగోలు చేసినట్లు అధికారి తెలిపారు. బైరాగఢ్ ప్రాంతంలో బుధవారం అర్థరాత్రి వరకు ఈ సోదాలు కొనసాగాయి. అయితే ఇంకో ట్విస్టు ఏంటంటే అధికారుల సోదాలను ప్రతిఘటించిన కేశ్వానీ, తన ఎత్తులు సాగకపోయేసరికి బాత్రూమ్ క్లీనర్ను తాగేశాడు. అతడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం పరిస్థితి నిలకడగానే ఉందని ఎస్పీ మిశ్రా తెలిపారు. #WATCH | MP:Around Rs 80 Lakhs cash, property documents & gold-silver recovered from residence of Hero Keswani, sr clerk of Medical Education Dept in Bhopal. Economic Offences Wing conducted a raid at his residenc. He was hospitalised after his health deteriorated when raid began pic.twitter.com/FgK73jBMQx — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 3, 2022 -
హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్! నాలుగేళ్ల జైలుశిక్ష
సాక్షి, న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలా(86)కు ఢిల్లీ న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువరించింది. అధికారులు ఆయన్ను శుక్రవారం తిహార్ జైలుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం రెండో నంబర్ జైలులో మరో ఇద్దరితో కలిపి ఆయనకు గదిని కేటాయిస్తామని అధికారులు తెలిపారు. 1993–2006 మధ్య కాలంలో ఆయన ఆస్తులు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయని ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధూల్ గత వారమే చౌతాలాను దోషిగా నిర్ధారించారు. చౌతాలా ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని ఆదేశించారు. 2005లో చౌతాలాపై కేసు నమోదు చేసిన సీబీఐ 2010 మార్చి 26న చార్జిషీటు దాఖలు చేసింది. హరియాణా సీఎంగా ఉన్న కాలంలో చౌతాలా తన పేరుతో, కుటుంబ సభ్యుల పేర్లతో భారీగా స్థిర, చరాస్తులెన్నిటినో కొనుగోలు చేశారు. ఆ సమయంలో ఆయన వాస్తవంగా చూపిన ఆదాయం కంటే 189.11% ఎక్కువగా, అంటే రూ.6.09 కోట్ల ఆస్తుల్ని సమకూర్చుకున్నారని, ఇందుకు తగిన ఆధారాలను చూపలేకపోయారని సీబీఐ పేర్కొంది. -
కేసుల నమోదులో ఏసీబీ డీలా!
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారుల భరతం పట్టాల్సిన ఏసీబీ వెనక్కి తగ్గిందా? కేవలం లంచాలు తీసుకుంటూ పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగులనే కాకుండా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన పెద్ద చేపలను ఊచల్లోకి నెట్టాల్సిన అవినీతి నిరోధక శాఖ ఎందుకు సైలెంట్ అయ్యింది? ఏడాదిలో కనీసం ఒక్క అవినీతి అధికారిపై కూడా డీఏ (డిస్ప్రొపార్సినేట్ అస్సెట్స్) కేసు నమోదు చేయకపోవడం వెనుకున్న ఆంతర్యం ఏంటి? నిజంగానే రాష్ట్రంలో ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన అధికారులు లేరని ఏసీబీ భావిస్తోందా? లేక అలాంటి అధికారులపై ఫిర్యాదు రాకపోవడం వల్ల కేసులు నమోదు చేయడం లేదా? ఈ ప్రశ్నలు, అనుమానాలు ఇప్పుడు రాష్ట్ర అవినీతి నిరోధక శాఖను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఉన్న ఊపేది... తెలంగాణ ఏర్పడిన కొత్తలో పలు సంచలనాత్మక కేసులను డీల్ చేసిన అవినీతి నిరోధక శాఖ నెమ్మదించినట్టు కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఓటుకు నోటు కేసుతో ఏసీబీ విచారణ జరిపి చార్జిషీట్లు దాఖలు చేసింది. ఆ తర్వాత ఈఎస్ఐ స్కాంలో వందల కోట్లు నొక్కేసిన వ్యవహారంలో ఉద్యోగులతో పాటు పలు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్చేసి కటకటాల్లోకి నెట్టింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడగట్టారన్న వ్యవహారంలో రాష్ట్ర స్థాయి హోదా ఉన్న అధికారులను ఊచలు లెక్కబెట్టేలా దూకుడుతో వ్యవహరించింది. అంతటి ఏసీబీ ఇప్పుడు పెద్దగా ఉలుకూ పలుకూ లేకుండా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటివరకు కేవలం ట్రాప్ కేసులకే ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన ఏసీబీ, ఒక్క ఆదాయానికి మించిన కేసు గానీ, నిధుల దుర్వినియోగంతో సొమ్ము చేసుకున్న కేసులు గానీ నమోదు చేయకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తున్న అంశం. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 63 ట్రాప్ కేసులు మాత్రమే ఏసీబీ నమోదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో రెవెన్యూ, పోలీస్ శాఖలే ప్రధానంగా ఉన్నాయి. గతేడాది పది వరకు డీఏ కేసులు నమోదు చేసిన ఏసీబీ ఈ ఏడాది ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనేక ఆరోపణలకు తావిస్తోంది. కీసర నాగరాజు వ్యవహారమే కారణమా? గతేడాది ఆగస్టులో రాంపల్లి భూముల వ్యవహారంలో కీసర ఎమ్మార్వో రూ. కోటి లంచం తీసుకుంటుండగా ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో సంచలనం రేపింది. ఈ కేసులో ఎమ్మార్వో నాగరాజుతో పాటు సర్పంచ్ అంజిరెడ్డి, వరంగల్కు చెందిన రియల్టర్ శ్రీనాథ్ యాదవ్, వీఆర్ఓ సాయిరాజులను అరెస్ట్ చేసింది. అదే ఎమ్మార్వోపై రోజుల వ్యవధిలోనే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులతో పాటు పీసీ యాక్ట్ కింద మరో కేసు నమోదు చేశారు. బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగానే అక్టోబర్ 14న ఎమ్మార్వో నాగరాజు చంచల్గూడ జైళ్లో కిటికీ గ్రిల్స్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఈ కేసు మరింత హీటెక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఉండి అరెస్టయి బెయిల్పై వచ్చిన ధర్మారెడ్డి అనే వ్యక్తి నవంబర్ 8న కుషాయిగూడలో ఓ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం దుమారానికి తెరదీసింది. ఒక్క కేసులో ప్రధాన నిందితుడితో పాటు మరో నిందితుడు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి తెరలేపడంతో ఏసీబీ కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వచ్చాయి. రెవెన్యూ ఉద్యోగ సంఘాల నుంచి సైతం ఒత్తిడి వచ్చినట్టు తెలిసింది. అప్పటి నుంచి అవినీతి తిమింగళాల వేటకు ఏసీబీ స్పీడ్ బ్రేకర్ వేసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ప్రాసిక్యూషన్ అనుమతి కూడా కారణమేనా? ఏసీబీ కేసుల్లో నిందితుల విచారణకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాకపోవడం కూడా ఆదాయానికి మించి ఆస్తుల కేసులు నమోదు చేయకపోవడానికి ప్రధాన కారణమని ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ నమోదు చేసిన వేలాది కేసుల్లో కనీసం పదుల సంఖ్యలో కూడా నిందితుల విచారణ కోసం ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ అనుమతి రాలేదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
సాక్షి, విజయవాడ : మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన పెండ్యాల శ్రీనివాస్రావు నివాసాల్లో రెండో రోజూ ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ఏకకాలంలో విజయవాడ, హైదరాబాద్లో ఆయన నివాసాల్లో దాదాపు 36 గంటలపాటు సోదాలు జరుగుతున్నాయి. ఇక మాజీ మంత్రి నారా లోకేష్ ప్రధాన అనుచరుడు కిలారి రాజేష్ ఇళ్లల్లో, కంపెనీ కార్యాలయాల్లో కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. (చదవండి : చంద్రబాబు సన్నిహితుల ఇళ్లల్లో ఐటీ సోదాలు) విజయవాడలోని శ్రీనివాస్రావు ఫ్లాట్లో పలు కీలకమైన పత్రాలు, హార్డ్ డిస్క్లను ఆదాయపు పన్ను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడలో సోదాలు ముగిసిన తర్వాత హైదరాబాద్లోని చంపాపేట్ గ్రీన్పార్క్ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్కు ఆయన్ను తరలించారు. సీఆర్పీఎఫ్ పహారాలో ఆ ఫ్లాట్లో సోదాలు నిర్వహించిన ఐటీ అధికారులు శ్రీనివాస్రావు నుంచి కీలక సమాచారం రాబట్టినట్టు తెలిసింది. 2019 ఎన్నికల వరకు చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన ఆయన ఎన్నికల తర్వాత సచివాలయంలోని జీఏడీలో పని చేస్తున్నారు. పదేళ్లుగా చంద్రబాబు వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాసరావు ఆ సమయంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన చంద్రబాబుకు బినామీగా ప్రచారం సాగుతోంది. -
చంద్రబాబు మాజీ పీఎస్ ఇళ్లల్లో రెండో రోజూ సోదాలు
-
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
-
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అక్రమాస్తుల కేసుపై తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై హైదరాబాద్లోని ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని, ఆయన ఆస్తులపై సమగ్ర విచారణ జరిపించాలని లక్ష్మీ పార్వతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆయనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయాలని కోరారు. చంద్రబాబుపై స్టే వేకెట్ అయిన వివరాలను ఆమె స్వయంగా కోర్టుకు సమర్పించారు. 1978 నుంచి 2005 వరకు బాబు ఆస్తుల వివరాలను ఆమె కోర్టు ముందుంచారు. (చదవండి : అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?) కేసు రిజిస్టర్ కాకముందే హైకోర్టు నుంచే స్టే ఎలా తెచ్చుకున్నారో తెలపాలని ఆమె కోర్టు ద్వారా ప్రశ్నించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా రూ.300 తీసుకున్న బాబు.. అక్రమంగా వేలకోట్ల రూపాయలు సంపాదించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు. చంద్రబాబు ఆస్తులపై సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. అయితే, హైకోర్టులో ఇప్పటికే ఈ కేసుపై స్టే ఉందని బాబు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో హైకోర్టు స్టే వివరాలను పరిశీలిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. (చదవండి : ఆదాయం వేలల్లో.. కోట్లు ఎలా సంపాదించారు?) -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారంటూ తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీపార్వతి వేసిన అక్రమాస్తుల కేసు పిటిషన్పై శుక్రవారం ఏసీబీ కోర్టులో విచారణ జరిగింది. లక్ష్మీపార్వతి తరఫున సీనియర్ న్యాయవాది కోకా శ్రీనివాస్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ఆస్తుల వివరాల ఆధారంగానే తాము ఫిర్యాదు చేశామని కోర్టుకు తెలిపారు. రూ.వేలల్లో ఆదాయం ఉన్న చంద్రబాబు కొద్ది కాలానికే కోట్లకు ఎలా పడగెత్తారో వివరించలేదన్నారు. ‘పిల్లనిచ్చిన ఎన్టీఆర్ కూడా కట్నం ఇవ్వలేదని అధికారిక పత్రాల్లో పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు ఎన్నికల సమయంలో.. అసెంబ్లీకి ఇచ్చిన పత్రాల్లో ప్రస్తావించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పొందిన జీతభత్యాలతోనే కోట్లాది రూపాయలు సంపాదించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఎలా కూడగట్టారో తేల్చాల్సిన అవసరం ఉంది. హెరిటేజ్ కంపెనీ ఏర్పాటు చేశాక నెలకు రూ.20 వేలు చొప్పున ఐదు నెలలే తీసుకున్నట్లు చంద్రబాబు చెప్పారు. అలాంటప్పుడు కోట్ల రూపాయల ఆస్తిని ఎలా ఆర్జించారో తేల్చేందుకు తగిన ఉత్తర్వులివ్వాలి’ అని కోర్టును కోరారు. అయితే సాంకేతిక కారణాల వల్ల నేటికీ ఈ కేసులో స్టే ఉన్నట్లు వెబ్సైట్లో ఉండటంతో పూర్తి వివరాలు తెలుసుకుని వచ్చే విచారణ సమయంలో చెప్పాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 7వ తేదీకి వాయిదా వేసింది. కేసు నేపథ్యం ఇదీ.. : ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో 2005లో చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై పూర్తిస్థాయిలో విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. తన వాదనలను సైతం వినాలని కోరారు. అయితే ఫిర్యాదును విచారణకు స్వీకరించడానికి ముందు దశలోనే వాదనలు వినడం సాధ్యంకాదని చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై చంద్రబాబు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి స్టే పొందారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే 6 నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గతేడాది ఇచ్చిన తీర్పు నేపథ్యంలో స్టే గడువు ముగిసింది. లక్ష్మీపార్వతి వేసిన పిటిషన్పై ఏసీబీ కోర్టు గతేడాది నవంబర్ 18న విచారణ ప్రారంభించింది. -
చంద్రబాబు అక్రమాస్తుల కేసు; విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుపై విచారణ జరిపించాలని 14 ఏళ్ల క్రితం లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై హైదరాబాద్ ఏసీబీ కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించింది. పిటిషన్పై విచారణకు సంబంధించి లక్ష్మీపార్వతి నుంచి ఆధారాలు సేకరించాలని అధికారులను ఏసీబీ కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 6కు వాయిదా వేసింది. గతంలో అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించి తదుపరి చర్యలు నిలిపేస్తూ స్టే ఉత్తర్వులిచ్చారు. అయితే స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి కొనసాగుతూ వస్తున్న స్టే గడువు ముగియడంతో ఏసీబీ కోర్టు విచారణను పునఃప్రారంభించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం స్టే 10 సంవత్సరాలు దాటితే ఎత్తివేయబడుతుంది. -
చంద్రబాబుకు ఏసీబీ కోర్టు షాక్
సాక్షి, అమరావతి : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్ లోని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ప్రత్యేక న్యాయస్థానం గట్టి షాక్ ఇచ్చింది. 14 ఏళ్ల క్రితం ఏసీబీ కోర్టులో లక్ష్మీపార్వతి దాఖలు చేసి న ఫిర్యాదుపై తదుపరి విచారణ చేపట్టేందుకు ఏసీబీ కోర్టు అంగీ కరించింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కేసులో చంద్రబాబు స్టే గడువు ముగియడం, స్టే విష యంలో హైకోర్టు నుంచి ఎలాంటి పొడిగింపు లేకపోవడంతో కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభి స్తామని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి సాంబశివరావు నాయుడు సోమ వారం లిఖితపూర్వక ఉత్తర్వులు జారీ చేశారు. ఫిర్యాదుదారుగా ఉన్నలక్ష్మీపార్వతి సాక్ష్యాన్ని నమోదు చేయాలని నిర్ణయించి తదుపరి విచారణను ఈ నెల 25కి కోర్టు వాయిదా వేసింది. సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే ఆరు నెలలకు మించకూడదని సుప్రీంకోర్టు గత ఏడాది ఇచ్చిన తీర్పును, చంద్రబాబు స్టే గడువు ముగిసిన విషయాన్ని, ఆ స్టేకు ఎలాంటి పొడిగింపు లేకపోవడాన్ని జడ్జి తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. విచారణ సందర్భంగా చంద్రబాబు తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ, తదుపరి ఉత్తర్వులు వెలువరించేంత వరకు 2005లో హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులు కొనసాగుతాయని వాదించారు. లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది సురేందర్రెడ్డి జోక్యం చేసుకుంటూ, సివిల్, క్రిమినల్ కేసుల్లో స్టే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేశారు. ఆ స్టే పొడిగింపు ఉత్తర్వులు లేవని కోర్టుకు వివరించారు. పూర్వాపరాలు పరిశీలించి.. ఈ కేసు ప్రస్తుత దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు నిబంధనలు అంగీకరించవని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2005 మార్చి 14న అప్పట్లో ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను జడ్జి పరిశీలించారు. కేసు విచారణకు స్వీకరించడానికి ముందు దశలో చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు వినిపించేందుకు వీలులేదన్న ఆ ఉత్తర్వుల్ని జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. 2005లో హైకోర్టు ఇచ్చిన స్టేను పొడిగించని విషయాన్ని, ఈ విషయాన్ని చంద్రబాబు తరఫు న్యాయవాది నిర్ధారించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, చంద్రబాబు 2005లో తెచ్చుకున్న స్టేను పొడిగిస్తూ హైకోర్టు ఎలాంటి లిఖితపూర్వక ఉత్తర్వులు ఇవ్వలేదని జడ్జి గుర్తు చేశారు. అందువల్ల ఈ కేసులో తదుపరి ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. 14 ఏళ్లుగా కొనసాగుతున్న స్టే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని, దీనిపై ఏసీబీ విచారణకు ఆదేశించాలని కోరుతూ లక్ష్మీపార్వతి 2005లో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదుపై పూర్తిస్థాయి విచారణ ప్రారంభించక ముందే చంద్రబాబు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించడానికి ముందే వాదనలు వినడం సాధ్యం కాదంటూ చంద్రబాబు అభ్యర్థనను ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. దీనిపై ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కింది కోర్టు ఉత్తర్వులు సవాలు చేస్తున్నప్పుడు క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం పరిపాటి.. అయితే చంద్రబాబు రిట్ పిటిషన్ దాఖలు చేయడం అప్పట్లో పెద్ద చర్చనీయాంశమైంది. ఆ పిటిషన్పై విచారణ జరిపిన అప్పటి న్యాయమూర్తి డీఎస్ఆర్ వర్మ ఏసీబీ కోర్టులో విచారణకు సంబంధించిన తదుపరి చర్యలు నిలిపేస్తూ 2005లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ లక్ష్మీపార్వతి అనుబంధ పిటిషన్ దాఖలు చేయగా, దానిని హైకోర్టు కొట్టేసింది. అప్పటి నుంచి స్టే కొనసాగుతూ వస్తోంది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఇటీవల ఈ కేసు ఏసీబీ కోర్టు ముందుకు విచారణకొచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో స్టే లేనట్లేనని భావిస్తూ విచారణ కొనసాగింపునకు జడ్జి గోవర్థన్రెడ్డి నిర్ణయించారు. లక్ష్మీపార్వతి హాజరుకు ఆదేశాలిచ్చి విచారణ వాయిదా వేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే గోవర్థన్రెడ్డి బదిలీ అయ్యారు. -
మురళీగౌడ్ వద్ద వందకోట్ల ఆస్తులు..!
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారి బాలగౌని మురళీగౌడ్ సుమారు వంద కోట్ల రూపాయల అక్రమాస్తులను కలిగి ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆయన ఆస్తులపై మూడు రాష్ట్రాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం ఆరు బృందాలుగా విడిపోయిన అధికారులు నంద్యాల, తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. నంద్యాలలో 8 ఎకరాల పొలం, హైదరాబాద్, నంద్యాలల్లో రెండు భవనాలు, నంద్యాల, తిరుపతిల్లో మూడు ప్లాట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఆయన బ్యాంకు ఖాతాలో రూ.20 లక్షలు ఉండగా, తిరుపతిలోని మురళీగౌడ్ బంధువుల ఇంట్లో రూ.16లక్షలు, మురళీగౌడ్ బావమరుదుల ఇంట్లో మరో రూ.16లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారి పేరుతో బెంగళూరులో భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు అధికారులు గుర్తించారు. మురళీగౌడ్ భార్య పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలను లెక్కించాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ రావడానికి ముందు మురళీగౌడ్ నంద్యాల, తిరుపతిల్లో పనిచేశారు. ఆ సమయంలోనే ఆయనకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. నంద్యాలకు చెందిన మురళీగౌడ్ పురపాలక శాఖలో టెక్నికల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరారు. తర్వాత పదోన్నతులు పొంది, తిరుపతిలో అసిస్టెంట్ సిటీప్లానర్గా పనిచేశారు. ఆ సమయంలో విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. 2014లో ఆయన విజయవాడలోని సీఆర్డీఏకు డిప్యూటేషన్పై వచ్చారు. వారం క్రితం విజయవాడ నగరపాలక సంస్థలో టౌన్ప్లానింగ్ ఆఫీసర్గా బాధ్యతలు చేపట్టారు. నాటి ఫిర్యాదులతో ఈ సోదాలు జరిగాయి. తిరుపతి ద్వారకానగర్లోని నివాసముంటున్న మురళీ గౌడ్ బంధువు ఇంట్లో 14 లక్షలను ఏసీబీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. అలాగే తిరుపతి రూరల్ పేరూరులోని బిల్లు కలెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు, లక్షా యాభైవేల రూపాయల నగదు లభించింది. మురళీగౌడ్తో కలిసి అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరి ఇళ్లలోనూ సోదాలు చేశామని ఏసీబీ సీఐ ప్రసాద్రెడ్డి చెప్పారు. -
రాష్ట్రంలో భారీగా ఏసీబీ దాడులు
సాక్షి, బెంగళూరు : కర్నాటకలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మెగా దాడులకు దిగారు. ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా పీడబ్యూడీ, ఎడ్యుకేషన్, మైన్స్ అండ్ జ్యుయాలజీ విభాగాలకు చెందిన ముగ్గురు అధికారుల నివాసాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ధార్వాడ్, బెళగావి, ధండేలి, జోయిడా చిత్ర దుర్గ తదితర ప్రాంతాలలోని ఉన్నత అధికారుల ఇళ్లలో భారీగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో వివిధ పత్రాలను, ఆస్తులకు సంబంధించిన పత్రాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కర్నాటక యూనివర్శిటీ ప్రొఫెసర్ మహదేవప్ప, మైన్స్ అండ్ జ్యుయాలజీ అధికారి ఉదయ్ డి చబ్బీ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అధికారి ఇళ్లలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. అక్రమ సంపాదన ఆరోపణలతో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఈ దాడులకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి వుంది. K'taka: Anti-Corruption Bureau is conducting searches at premises of a Professor in Karnataka University, an official of Dept Of Mines & Geology, Mangaluru & an Asst Executive Engineer of PWD in Joida, Uttara Kannada. Raids on at Dharwad, Belagavi, Dandeli & two more locations. — ANI (@ANI) June 12, 2019 -
ములాయంకు సీబీఐ క్లీన్చిట్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయంసింగ్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణల్లో వాస్తవం లేదని సుప్రీంకోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తును 2013 ఆగస్టు 7న ముగించామనీ, ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆధారాలేవీ తమకు లభించలేదని కోర్టుకు సీబీఐ చెప్పింది. ఈ కేసుకు సంబంధించి ఓ అఫిడవిట్ను సుప్రీంకోర్టుకు సీబీఐ సమర్పించింది. ములాయం, ఆయన కొడుకు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, మరో కుమారుడు ప్రతీక్ యాదవ్, అఖిలేశ్ భార్య డింపుల్ తదితరులపై అక్రమాదాయ ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ నాయకుడు విశ్వనాథ్ చతుర్వేది 2005లో పిటిషన్ వేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా 2007లో సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. సీబీఐ విచారణను నిలిపివేయాలంటూ ములాయం, ఆయన కొడుకులు వేసిన పిటిషన్ను 2012లో సుప్రీంకోర్టు తోసిపుచ్చుతూ, దర్యాప్తు కొనసాగించాల్సిందిగా సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటికీ డింపుల్ ప్రభుత్వ పదవిలో లేనందున ఆమెపై మాత్రం విచారణ నిలిపేయాల్సిందిగా కోర్టు స్పష్టం చేసింది. 2012లో సుప్రీంకోర్టు ఆదేశాలతో తాము విచారణ కొనసాగించగా, అక్రమ మార్గాల్లో ఆస్తులు సంపాదించారనేందుకు తమకు ప్రాథమిక ఆధారాలేవీ లభించలేదని సీబీఐ తన 21 పేజీల అఫిడవిట్లో పేర్కొంది. 2013 ఆగస్టు 7 నాటికే ఈ కేసులో విచారణను ముగించామంది. ప్రాథమిక ఆధారాలు కూడా లేనందున ఈ కేసులో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని సీబీఐ తెలిపింది. -
అక్రమాస్తుల కేసు : ములాయం, అఖిలేష్లకు క్లీన్చిట్
లక్నో : అక్రమాస్తుల కేసులో సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్కు, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్కు ఊరట లభించింది. గురువారం ఈ కేసులో సీబీఐ తండ్రికొడుకులిద్దరికి క్లీన్చిట్ ఇచ్చింది. అంతేకాక అఖిలేష్, ములాయంల మీద రెగ్యూలర్ కేసు నమోదు చేసేందుకు తమ వద్ద ఎటువంటి ఆధారాలు లేవని సీబీఐ, సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ములాయం సింగ్ అధికారంలో ఉన్న రోజుల్లో వారి ఆస్తులు అనూహ్యంగా పెరగాయంటూ గతంలో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీని మీద విచారణ చేపట్టాలంటూ విశ్వనాథ్ చతుర్వేదీ అనే వ్యక్తి 2005లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్ యాదవ్, ప్రతీక్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత 2012లో కోర్టు ఈ కేసు నుంచి డింపుల్ యాదవ్కు మినహాయింపు కల్పించింది. అయితే ఈ కేసులో సీబీఐ ఇంత వరకూ ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకపోవటంతో విశ్వనాథ్ మరోసారి సుప్రీ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై ఈ ఏడాది మార్చిలో మరోసారి విచారణ చేపట్టిన కోర్టు సీబీఐకి నోటీసులు జారీ చేసింది. ములాయం, అఖిలేష్ల కేసు దర్యాప్తు ఎంత వరకూ వచ్చిందో తెలుపుతూ.. రెండు వారాల్లోగా తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దాంతో సీబీఐ నేడు చార్జ్షీట్ దాఖలు చేసింది. -
మాజీ మంత్రికి అయిదేళ్లు, భార్యకు రెండేళ్లు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ మంత్రికి మద్రాస్ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. అక్రమ ఆస్తుల కేసులో ఎఐఎడిఎంకెకు చెందిన మాజీ మంత్రి సత్యమూర్తికి, ఆయన భార్యకు జైలుశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది. మాజీ మంత్రి సత్యమూర్తికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్షను ఖరారు చేసింది. అలాగే ఆయన భార్యకు రెండేళ్ల శిక్ష విధించింది. దీంతోపాటు ఇద్దరూ రూ. 5లక్షల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా కోర్టు ఆదేశించింది. ఈ జరిమానా చెల్లించడంలో విఫలమైతే ఒక్కొక్కరికి ఒక్క సంవత్సరం జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది. ఈ కేసులో ఆగస్టు, 2000లో సత్యమూర్తిని, ఆయన భార్యను నిర్దోషులుగా నిర్ధారించి దిగువ కోర్టు విడుదల చేసింది. తాజాగా ఈ తీర్పును కొట్టివేసిన జస్టిస్ జి.జయచంద్రన్ ఈమేరకు సంచలన తీర్పునిచ్చారు. విజిలెన్స్ డైరెక్టరేట్ అండ్ యాంటీ కరప్షన్ శాఖ దాఖలు చేసిన అప్పీల్ను సమర్ధించిన కోర్టు ఈ తీర్పును వెలువరించింది. అవినీతి నిరోధక చట్టం యొక్క సెక్షన్ 13 (1) (ఇ) కు సంబంధించిన వివరణను కింది కోర్టు పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మద్రాస్ హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో 1993-1996 మధ్య వాణిజ్య పన్నుల మంత్రిగా సత్యమూర్తి పనిచేశారు. -
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
-
హిమాచల్ సీఎంకు బెయిల్ మంజూరు
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి వీరభద్రసింగ్తో పాటు, ఆయన భార్యకు సీబీఐ కోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని న్యాయస్థానం ఆదేశించింది. అలాగే వీరభద్రసింగ్ పాస్పోర్టును కోర్టులో సమర్పించాలని సూచించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. -
మాయావతి పార్టీకి మరో తలనొప్పి
లక్నో: మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ)కి మరో ఎదురుదెబ్బ తగిలింది. రూ. 4 కోట్ల అక్రమ ఆస్తుల కేసులో బీఎస్పీ యూపీ అధ్యక్షుడు రామ్ ఆచల్ రాజ్భర్పై ఉత్తరప్రదేశ్ విజిలెన్స్ విభాగం చార్జిషీటు దాఖలు చేసింది. దీన్ని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి సమర్పించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే ఆయనపై కేసు నమోదు చేసే అవకాశముందని తెలిపాయి. 2007-2012లో తన ఆదాయం రూ. 34 లక్షలుగా అఫిడవిట్లో పేర్కొన్న రాజ్భర్ ఎన్నికల్లో రూ. 4 కోట్లు ఖర్చు చేశారు. ఈ సమయంలో యూపీలో బీఎస్పీ అధికారంలో ఉంది. ఆయనపై 2012లో రాష్ట్ర లోకాయుక్తకు ఫిర్యాదు అందడంతో దర్యాప్తు మొదలైంది. తనపై విచారణను అడ్డుకునేందుకు అంబుడ్స్మన్ ఆశ్రయించగా ఆయనకు చుక్కెదురైంది. తర్వాత వచ్చిన సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం దర్యాప్తు గురించి పట్టించుకోకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇటీవల అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణ వేగవంతం చేసింది. -
ఒంటరిగా శశికళ.. కావాలనే వేరే సెల్లోకి..
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఏఐఏడీఎంకే నేత శశికళ ఇప్పుడు ప్రత్యేక సెల్లోకి మారినట్లు తెలుస్తోంది. ఆమె ఒంటరిగానే ఉండాలని యోచిస్తున్నట్లు జైలు వర్గాల సమాచారం. ఇదే కేసులో జైలులోని 2వ సెల్లో తన వదిన ఇళవరసితో కలిసి ఉంటున్న శశికళ.. ప్రస్తుతం 4వ నెంబర్ సెల్లోకి మారినట్లు జైలు వర్గాల ద్వారా తెలిసింది. పరప్పన అగ్రహారలోని సెంట్రల్ జైలులో శశికళ జైలు శిక్షను అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆమె చాలామందిని జైలులో కలుస్తున్నారు. ఆమె జైలు కారిడార్లో నడుస్తూ పలువురిని కలిసేందుకు వెళుతున్న సమయంలో ఇతర ఖైదీలకు ఇబ్బందవుతుందని, రక్షణపరమైన సమస్యలు వస్తాయని చెప్పడం, ఇక నుంచి వీలయినంత తక్కువమందిని కలవాలని ఆమె నిర్ణయించుకోవడం తదితర కారణాలతో ఆమె ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకొని ప్రత్యేక సెల్లోకి వెళ్లారట. కారిడార్లో కూడా మునుపటిలాగా ఆమె కనిపించడం లేదంట. ఇటీవలె ఆమెకు ఒక పెద్ద దోమ తెర కూడా ఇచ్చారంట. అందులోనే కూర్చుని ఆమె భోజనం చేస్తూ తమిళ వార్తా చానెళ్లకంటే సినిమాలే ఎక్కువగా చూస్తున్నట్లు జైలు వర్గాలు చెబుతున్నాయి. ఇక ఉదయం వేళల్లో తమిళ పేపర్లు మాత్రం చదువుతున్నారని సమాచారం. -
చిన్నమ్మ కోసం జైలు రూల్స్ బ్రేక్
బెంగళూరు: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న చిన్నమ్మ శశికళ కోసం జైలు రూల్స్ బ్రేక్ చేస్తున్నారట. బెంగళూరు సెంట్రల్ జైలు నిబంధనలకు వ్యతిరేకంగా రోజుకు ఒక్క విజిటర్ నైనా ఆమె కలవడానికి అనుమతిస్తున్నారని వెల్లడైంది. 31 రోజుల్లో 27 మంది విజిటర్లు ఆమెను కలవడానికి వచ్చినట్టు తెలిసింది. రోజుకు ఓ విజిటర్ అయినా ఆమె దగ్గరకు రావడం బెంగళూరు జైలు మాన్యువల్ ప్రకారం కఠోర ఉల్లంఘన. కానీ ఆ రూల్స్ ను బెంగళూరు జైలు ఉల్లంఘిస్తోంది. మరోవైపు సాధారణ ఖైదీల్లా కాకుండా... శశికళ టీమ్ కు వీవీఐపీ ట్రీట్ మెంట్ ఇస్తున్నట్టు ఇండియా టుడే తెలిపింది. జైలు మాన్యువల్ ప్రకారం.. ఖైదీలను చూడటానికి విజిటర్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల ప్రాంతంలోనే రావాలి. కొన్ని సందర్భాల్లో శశికళను, ఆమెతో పాటు శిక్ష అనుభవిస్తున్న మరో ఇద్దరు ఇల్లవరసి, సుధాకరన్ లను చూడటానికి వచ్చే విజిటర్లు సాయంత్రం 5 గంటల తర్వాత కూడా వస్తున్నారని తెలిసింది. జైలులో శిక్ష అనుభవిస్తున్న ప్రముఖులు వారానికోసారి లేదా 15 రోజుల్లో ఓసారి మాత్రమే ఇంటర్వ్యూ ఇవ్వడానికి మాత్రమే అర్హులై ఉంటారు. ఇప్పటివరకు శశికళను, ఇల్లవరసిని కలవడానికి వచ్చిన విజిటర్ల జాబితాను ఇండియా టుడే రాబట్టింది. ఆ జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 18 వరకు చెన్నైకు చెందిన అడ్వకేట్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు జైలుకు వచ్చి శశికళను కలిసినట్టు తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ, ఇల్లవరసి, సుధాకరన్ లు ప్రస్తుతం బెంగళూరులోని పరపణ్ణ అగ్రహార జైలు జీవితం అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. -
అంతా ఆయనే చేశారు..
ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారు.. టీడీపీ నేతపై ఏసీబీ అధికారుల వద్ద భీమిలి తహసీల్దార్ మొర విచారణలో దేశం నాయకుడిపై ఆరోపణలు? విశాఖపట్నం : అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో అరెస్టయిన తహసీల్దార్ బి.టి.వి.రామారావు ఏసీబీ విచారణలో భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడిపై తీవ్రమైన ఆరోపణలు చేసినట్టు తెలుస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న అభియోగంతో ఈనెల 22వ తేదీన అవినీతి నిరోధకశాఖ అధికారులు ఏడు బృందాలుగా ఏర్పడి భీమిలి తహసీల్దార్ రామారావు ఇల్లు, ఆఫీసు, బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన సంగతి తెలిసిందే. సోదాల్లో అవినీతి, అక్రమార్జనకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించడంతో ఒక రోజంతా విచారించి 23న రిమాండ్కు పంపారు. ఏసీబీ అధికారుల విచారణలో రామారావు భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడిపై బలంగానే ఆరోపణలు చేసినట్టు తెలిసింది. పాస్ పుస్తకాలు మంజూరు మొదలు... ప్రతి పనికీ ఒత్తిడి చేసేవారని, బీచ్ ఒడ్డున ఆక్రమణలను క్రమబద్ధీకరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసేవారని రామారావు ఏసీబీ అధికారుల వద్ద ఏకరవుపెట్టినట్టు సమాచారం. రామారావుపై ఏసీబీ అధికారులకు అందిన 12 ఫిర్యాదుల్లో పది కేసులు సదరు టీడీపీ నేత సిఫార్సు చేసిన పైరవీలేనని తెలుస్తోంది. రామారావు ఏకరవు పెట్టిన విషయాలు, చేసిన ఆరోపణలను ఓ నివేదిక రూపంలో ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు పంపినట్టు సమాచారం. కాగా, ఏసీబీకి అడ్డంగా దొరికిన తర్వాత టీడీపీ నాయకుడే లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్న రామారావు.. స్వతహాగా కూడా చేయి తడపందే పనులు చేసే బాపతు నియోజకవర్గ నాయకుడు ఏరికోరి ఇక్కడ తహశీల్దార్గా వేయించుకున్నట్టు స్పష్టమవుతోంది. మంగమారిపేట టీడీపీ నేత ఎక్కడ? ఇక భీమిలి తహసీల్దార్ రామారావు అండతో రెండేళ్లు హల్చల్ చేసిన మంగమారిపేట టీడీపీ నాయకుడు రెండు రోజులుగా ఆచూకీ లేకుండా అండర్ గ్రౌండ్లోకి వెళ్లడం చర్చాంశనీయమైంది. భీమిలి నియోజకవర్గ టీడీపీ నాయకుడికి ప్రధాన అనుచరుడైన మంగమారిపేట గ్రామ నేత తహసీల్దార్కు ప్రతి అక్రమ పనిలోనూ చేదోడువాడోదుగా ఉండేవాడన్న వాదనలు ఉన్నాయి. ఏసీబీ అధికారులు దాడి చేసిన రోజు ఉదయం కూడా సదరు మంగమారిపేట నేత తహసీల్దార్కు రూ. 20 లక్షల నగదు ఇంటికి తీసుకువెళ్లి అందించినట్టు చెబుతున్నారు. మంగమారిపేటలో సర్వే నెంబర్ 293లో బీచ్ ఒడ్డున పది ఎకరాలకు పైగా స్థలాన్ని టీడీపీ నేత అనుచరులు ఆక్రమించి ఫెన్సింగ్ కూడా వేసేశారు. ఆ స్థలం జోలికి రాకుండా ఉండేందుకే టీడీపీ నేత తహసీల్దార్కు రూ.20 లక్షలు ముడుపులు అందించినట్టు చెబుతున్నారు. ఏసీబీ సోదాల్లో దొరికిన నగదు కూడా అదేనని అంటున్నారు. మొత్తంగా రెండేళ్లుగా తహసీల్దార్తో ఎన్నో అక్రమాలు చేయించిన మంగమారిపేట టీడీపీ నేత రెండు రోజులుగా పత్తా లేకపోవడం చర్చాంశనీయమైంది. ఆ కేసులు మా పరిధిలోవి కావు : ఏసీబీ డీఎస్పీ తహసీల్దార్ రామారావు అవినీతి, అక్రమాలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వస్తున్నాయి. మేం దాడులు నిర్వహించి అరెస్టు చేసిన దరిమిలా ఆయన బాధితులు పెద్దసంఖ్యలో ఏసీబీ ఆఫీసుకు వస్తున్నారు.. భూ వివాదాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయి. వాస్తవానికి ఆ కేసులన్నీ మా పరిధిలోవి కావు.. ఆ ఫిర్యాదులను మేం ఉన్నతాధికారులకు, రెవెన్యూ అధికారులకు పంపిస్తాం.. అని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణ ఆదివారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు. ఏసీబీ విచారణలో రామారావు ఏం మాట్లాడారో తాము బహిర్గతం చేయలేమని స్పష్టం చేశారు. -
ఫైన్ కట్టలేదో శశికళ మరో 13నెలలు జైల్లోనే!
బెంగళూరు: అక్రమాస్తుల కేసులో ఇప్పటికే జైలు శిక్షను ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ కోర్టు విధించిన జరిమానా చెల్లించకుంటే ప్రస్తుతం అనుభవిస్తున్న శిక్షాకాలం కంటే మరో 13 నెలలు అదనంగా అనుభవించాల్సి ఉంటుంది. ఈ నెల 14న అక్రమాస్తుల కేసులో తీర్పును వెల్లడించిన సుప్రీంకోర్టు శశికళ మరికొందరికి జైలు శిక్షను ప్రకటించింది. దీని ప్రకారం శశికళ మూడు సంవత్సరాల 11నెలలపాటు జైలు కాలాన్ని పూర్తి చేయాలి. అదే సమయంలో రూ.10 కోట్ల జరిమానాను కూడా సుప్రీంకోర్టు విధించింది. ఈ జరిమానాను శశికళ చెల్లించకుంటే మాత్రం మరో 13 నెలలపాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ‘ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం శశికళ రూ.10 కోట్ల జరిమానా కట్టాలి. అలా చేయలేకపోతే మరో 13 నెలలపాటు జైలు శిక్షను అనుభవించాల్సి ఉంటుంది’ అని జైళ్ల సూపరింటెండెంట్ కృష్ణ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. -
శశికలే
► తీర్పుతో చిన్నమ్మ సేన కలవరం ► కొత్త నేతగా ఎడపాడి ► ఎమ్మెల్యేల కోసం పన్నీరు ఎదురుచూపు సాక్షి, చెన్నై : అక్రమాస్తుల కేసులో 2014 సెప్టెంబరు 29వ తేదీన బెంగళూరు కోర్టు ఇచ్చిన తీర్పు తమిళనాట అలర్లకు దారి తీశాయి. తమ అమ్మ జయలలితకు జైలు శిక్ష పడడంతో అన్నాడిఎంకే సేనలు వీరంగాన్ని సృష్టించారు. అధికార పక్షం సృష్టించిన ఈ వీరంగం ఓ మచ్చే. ఇక, 2017 ఫిబ్రవరి 14వ తేది ఉదయం పదిన్నర గంటలు సమయం అయ్యే కొద్ది అదే ఉత్కంఠ. మళ్లీ వీరంగాలు బయలు దేరేనా, అన్న ఆందోళన. ఇందుకు కారణం, అమ్మ జయలలిత తదుపరి, ప్రస్తుతం అన్నాడీఎంకే వర్గాల హృదయాల్లో చిన్నమ్మగా ముద్ర పడ్డ శశికళకు వ్యతిరేకంగా అదే కేసులో ఎలాంటి తీర్పు వస్తుందో అన్నదే. తీర్పు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠతో రాష్ట్రంలో హై అలెర్ట్ ప్రకటించారు. సమయం గడిచే కొద్ది క్షణం..క్షణం ఉత్కంఠ రెట్టింపు అవుతూ వచ్చింది. రాత్రంతా ఎమ్మెల్యేలతో కలిసి కూవత్తూరు క్యాంప్లోనే శశికళ ఉండడంతో, ఆ పరిసరాలను మూడు జిల్లాల పోలీసులు తమ భద్రతా వలయంలోకి తెచ్చారు. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో అన్నాడీఎంకే శ్రేణులు కూవత్తూరు వైపుగా చొచ్చుకు వస్తే అడ్డుకునేందుకు తగ్గ అస్త్రాలతో ఈసీఆర్ రోడ్డునే తమ గుప్పెట్లోకి బలగాలు తీసుకున్నాయి. పోయెస్గార్డెన్, రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయం, గ్రీన్ వేస్ రోడ్డులోని పన్నీరు సెల్వం నివాసం, గోపాలపురంలోని డిఎంకే అధినేత ఎం కరుణానిధి నివాసం, డిఎంకే కార్యాలయాల వద్ద సైతం భద్రతను పెంచారు. మీడియాల్లో తీర్పు ఎలా ఉండబోతుందోనన్న చర్చలు హోరెత్తడంతో సర్వత్రా టీవీలకు అతుక్కు పోయారు. నీరసించిన సేన : సరిగ్గా పదిన్నర గంటలకు సుప్రీం కోర్టులో అక్రమ ఆస్తుల కేసు తీర్పును న్యాయమూర్తులు వెలువరించడంతో ఉత్కంఠ పెరిగింది. సర్వత్రా అప్రమత్తంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో చిన్నమ్మకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పు ఆమె సేనల్ని నీరసించేలా చేశాయి. వీరంగాలు, అల్లర్లు జరగవచ్చని భావించినా, చివరకు సేనలు అనేక మంది గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదలడం గమనార్హం. సోమవారం అభిమాన కెరటంతో నిండిన పోయేస్ గార్డెన్ కోర్టు తీర్పుతో కళ తప్పింది. అక్కడ ఉన్న కొద్దో గొప్ప చిన్నమ్మ మద్దతు దారులు తీవ్ర ఆవేదనలో మునిగారు.కొందరు అయితే, ఉద్వేగాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టారు. పన్నీరును తిట్టి పోశారు. ప్రధాని నరేంద్ర మోదీపై దుమ్మెత్తి పోశారు. ఈ సమయంలో పోయేస్ గార్డెన్కు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బాణా సంచాల్ని హోరెత్తించడంతో ఉద్రిక్తత బయలు దేరింది. అక్కడున్న బలగాలు అప్రమత్తం కావడంతో పరిస్థితి అదుపు తప్పలేదు. అక్కడక్కడ చిన్నమ్మమద్దతు దారులు రోడ్డు మీదకూర్చుని తీవ్ర విషాదంలోమునిగారు. రాయపేటలోని పార్టీ కార్యాలయంలో అదే పరిస్థితి. ఇక్కడ ప్రైవేటు సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేసి ఉండటం గమనార్హం. కూవత్తూరు వేదికగా జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ఎడ పాడి పళని స్వామిని శాసన సభా పక్ష నేతగా చిన్నమ్మ ఎంపిక చేసిన సమాచారం అన్నాడిఎంకే కార్యాలయంలో కాస్త సందడిని నింపింది. పన్నీరు శిబిరంలో జోష్ : శశికళకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు రావడంతో పన్నీరు శిబిరంలో ఆనందం తాండవం చేసింది. బాణా సంచాల పేల్చారు. స్వీట్లు పంచి పెట్టారు. ఇక, కూవత్తూరు క్యాంప్లో నిర్భందంలో ఉన్న తన మద్దతు ఎమ్మెల్యేలను బయటకు తీసుకొచ్చేందుకు పన్నీరు దూకుడు ప్రదర్శించారు. పన్నీరు మద్దతు మంత్రి పాండియరాజన్ నేతృత్వంలో ఎంపిలు, ఎమ్మెల్యేలు,మాజీలు కూవత్తూరు వైపుగా దూసుకెళ్లడంతో ఉద్రిక్తత తప్పలేదు.ఎట్టకేలకువారిని కోవళం సమీపంలోనే పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి సద్దుమనిగింది. మాజీల సంఖ్య పెరుగుతున్నా, ఎమ్మెల్యేల సంఖ్య పెరగని దృష్ట్యా, పన్నీరు శిబిరంలో కలవరంతప్పలేదు. మంగళవారం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం మద్దతు ప్రకటించడంతో, మిగిలిన వారి కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేలు బయటకు అడుగులు పెడితే గానీ, తమ సంఖ్య పెరగదన్న ఉత్కంఠ వారిని వీడటం లేదు. కూవత్తూరులో హై టెన్షన్: రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేసినా, కూవత్తూరులో మాత్రం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కోర్టు తీర్పు తదుపరి చిన్నమ్మ అరెస్టు కావచ్చన్న సంకేతాలు బయలు దేరాయి. తిరువణ్ణామలై, కాంచీపురం, చెన్నై జిల్లాలకు చెందిన పది వేలమంది పోలీసుల్నిఅక్కడ రంగంలోకి దించారు. ఐజీ వరదరాజన్ నేతృత్వంలో ఇద్దరు ఎస్పీల పర్యవేక్షణలో కూవత్తూరు పరిసరాల్లోని రెండు కీ. మీ దూరంలో ఉన్న ప్రాంతాలు, గోల్డెన్ బే రిసార్ట్ను బలగాలు చుట్టుముట్టాయి. పన్నీరు శిబిరం నుంచి మాజీలు పలువురు రిసార్ట్లో ఉన్న ఎమ్మెల్యేను వెంట బెట్టుకు వెళ్లేందుకు రానున్న సమాచారంతో ఆందోళనకర పరిస్థితి ఆపరిసరాల్లో నెలకొంది. వస్తే అడ్డుకుని తీరుతామని చిన్నమ్మ సేనలు హెచ్చరికలు ఇవ్వడంతో ఉత్కంఠ రెట్టింపు అయింది. అలాగే, చిన్నమ్మ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో హాజరు పరచాల్సి ఉండటంతో, ఆమెను అరెస్టు చేస్తారేమో అన్న ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో కూవత్తూరులో 144సెక్షన్ అమల్లోకి తెస్తున్నట్టు కాంచీపురం జిల్లా యంత్రాంగం ప్రకటించినట్టు వచ్చిన సంకేతాలతో టెన్షన్...వాతావరణం తప్పలేదు. -
శశి వర్గం కొత్త సీఎం అభ్యర్థి ఇతనే
చెన్నై: అనుకున్నట్లే అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ప్లాన్ బీ అమలు మొదలైంది. శశివర్గం సీఎం అభ్యర్థిని ప్రకటించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళనిస్వామి అంటూ స్పష్టం చేసింది. ఆయనే తమ శాసనసభా పక్ష నేత అంటూ ప్రకటించారు. అదే సమయంలో పన్నీర్ సెల్వాన్ని అన్నాడీఎంకే పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి పూర్తిగా తొలగించారు. ప్రస్తుతం పళని స్వామి రహదారులు, ఓడ రేవుల మంత్రిగా ఉన్నారు. ఈయన సేలం జిల్లా ఎడప్పాడి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలకు రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం.. శశికళకు ఎదురుతిరిగిన విషయం ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు, తాను ముఖ్యమంత్రి అయ్యి తీరుతానని శశికళ ప్రకటించడంవంటి పరిణామాలు తెలిసిందే. ఈలోగా సుప్రీంకోర్టు తీర్పు శశికళ సీఎం ఆశలపై పిడుగులా పడిన నేపథ్యంలో శశివర్గానికి వేరే ముఖ్యమంత్రి అభ్యర్థిని తీసుకోవాల్సిరాడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది. అయితే, వాస్తవానికి తొలుత శశివర్గం నుంచి ముఖ్యమంత్రి రేసులో కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ తాజాగా జయలలిత మేనళ్లుడు దీపక్ జయకుమార్ పేర్లు కూడా వినిపించాయి. అయితే, తమిళనాడు రహదారులు, ఓడరేవుల బాధ్యతలు నిర్వహిస్తున్న పళని స్వామికి జయలలిత వద్ద మంచి పేరున్నట్లు తెలుస్తోంది. పన్నీర్ తర్వాత అంతటి స్థాయి సౌమ్యుడు కూడా పళని స్వామి అని శశివర్గం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయననే సీఎం అభ్యర్థిగా తెరమీదికి తీసుకొచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
శశికళ కొత్త ముఖ్యమంత్రి అభ్యర్థి ఇతనే
-
శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా?
చెన్నై: అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఉన్న శశికళ దోషి అంటూ సుప్రీకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శశికళ వర్గం ఏం చేయబోతోంది? 131మంది తనతోనే ఉన్నారంటూ పలువురు ఎమ్మెల్యేలో ప్రస్తుతం గోల్డెన్ బే రిసార్ట్లో ఉన్న శశికళ ఎలాంటి అడుగువేయబోతున్నారు? ఆమెతో ఉన్న మద్దతుదారులంతా ఇప్పుడు ఏం చేస్తారు? అనే తదితర అంశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు.. నిజంగానే స్వచ్ఛందంగా శశికి మద్దతుగా 119మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నారని ప్రభుత్వం తరుపు ప్రతినిధి ఇప్పటికే మద్రాస్ హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. ఇప్పుడా 119మంది ఎమ్మెల్యేల దారి ఎటు? ఈ తీర్పు తర్వాత శశికళ కుంగిపోకుండా ధైర్యంగా ముందడుగువేసి తనతో ఉన్న ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తారా? లేదంటే భవిష్యత్ మరింత చీకటిగా మారుతుందేమో అనే భయంతో మధ్యేమార్గంతో రాజీయత్నాలకు దిగుతారా? ఒక వేళ ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుకు తెస్తే ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఇలా సవాలక్ష ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కొత్త సీఎం అభ్యర్థిగా ఎవరొస్తారు..! తనకు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఏం చేయాలో అనే విషయంలో కూడా ఇప్పటికే శశి వర్గం కూడా ముందస్తు వ్యూహాలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడు సీఎం అభ్యర్థులుగా కే పళని స్వామి, తంబిదురై, సెంగొట్టయన్ ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం పార్టీ ప్రిసీడియం చైర్మన్ సెంగొట్టయన్ ఉన్నారు. ఈయన ఎమ్మెల్యేగా గెలవడం ఇది ఎనిమిదో సారి. అలాగే, తంబిదురై లోక్ సభ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. ఇక కే పళని స్వామి మాత్రం ప్రస్తుతం తమిళనాడు జాతీయ రహదారులు, మైనర్పోర్ట్స్ శాఖను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా జయలలిత వద్ద ఈయనకు మంచి పేరుంది. అది కాకుండా శశివర్గంలోనే ప్రస్తుతం కే పళని స్వామి ఉన్నాడు. అయితే, ముఖ్యమంత్రి అవడానికి యత్నిస్తున్న శశికళపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇప్పటికే మన్నార్ గుడి వర్గం సెంగుట్టయన్ పేరును ప్రతిపాదించినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు నేపథ్యంలో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే బావుంటుందని ఆమె వర్గం భావిస్తోందట. అంతేకాదు, చాలామంది ఎమ్మెల్యేలు తనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పళనిస్వామినికానీ, సెంగొట్టయన్ను కానీ, ముఖ్యమంత్రిగా కొనసాగించే యోచనలో శశికళ ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాకుండా, జయ మేనళ్లుడు దీపక్ జయకుమార్కు కూడా ముఖ్యమంత్రిగా తెరపైకి తీసుకొచ్చే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఏదీ ఏమైనా తాను కాకుంటే ముఖ్యమంత్రిగా మరో వ్యక్తిని పెడదాం అనే ప్లాన్ బీ శశిదగ్గర అసలు ఉందా లేదా అనేది తర్వాత పరిణామాలు తెలిసే వరకు కూడా అనుమానమే. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. -
ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు
-
శశికళ కేసు పూర్వాపరాలివి..
చెన్నై: సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశపడిన జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. ప్రమాణ స్వీకారానికి గవర్నర్ పిలవాలని కోరుతున్న ఆమెకు కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. దీంతో ఆమె రాజకీయ జీవితం శూన్యమైంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలివీ... * 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్లపై ప్రత్యేక కోర్టు చార్జిషీటు నమోదు చేశారు. * జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్హౌస్లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఒక ఫామ్హౌస్, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి. * 1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్ లో ఉంచారు. 2014లో వీటిని బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. * 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. * 2014 సెప్టెంబర్ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ. 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించింది. * ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు. * ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో.. జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. * జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన సంచలన తీర్పును మంగళవారం ప్రకటించింది. (సాక్షీ నాలెడ్జ్ సెంటర్) శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ -
ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు
చెన్నై: అక్రమాస్తుల కేసులో శశికళ దోషి అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుతో నిజంగా పన్నీర్ సెల్వంపై పన్నీర్ జల్లు పడినట్లయింది. శశికళ ముఖ్యమంత్రి ఆశలపై నీళ్లు జల్లినట్లయింది. ఈ తీర్పుతో పన్నీర్ వర్గం మొత్తం కూడా దాదాపు సంబురాల్లో మునిగిపోయింది. ఇప్పటికే పన్నీర్తో ఉన్న నేతలు, కార్యకర్తలంతా కూడా సెల్వం ఇంటికి వెళుతున్నారు. కొన్ని చోట్ల బాణాసంచాలు కూడా పేలుస్తున్నారు. సెల్వం మద్దతుదారులు వీధుల్లోకి వచ్చి చిందులేస్తున్నారు. పన్నీర్ సెల్వం మరికాసేపట్లో మీడియా సమావేశానికి సిద్ధమయ్యారు. తాము ఊహించిన తీర్పే వచ్చిందని, శశికళ ఈ కేసులో ముద్దాయి అవుతుందని తమకు ముందే తెలుసని పన్నీర్ వర్గం చెబుతోంది. మరోపక్క, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది కీలకంగా మారనుంది. -
తమిళనాడులో హైటెన్షన్: అల్లర్లు !
-
శశికళకు కారాగారమా? అధికారమా?
-
చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ
♦ నేడు కోర్టు తీర్పు ♦ పోయెస్ గార్డెన్కు పోటెత్తిన అభిమానం ♦ కార్యకర్తల్లోకి శశికళ ♦ భద్రత మరింత కట్టుదిట్టం అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ చిన్నమ్మ శశికళ మద్దతుదారుల్లో నెలకొంది. దీంతో రాష్ట్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సోమవారం చిన్నమ్మకు మద్దతుగా పోయెస్గార్డెన్కు అభిమానులు పోటెత్తారు. గార్డెన్ నుంచి బయటకు వచ్చిన శశికళ కార్యకర్తలతో ముచ్చటించారు. సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వంకు మద్దతుగా ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు, తారలు, మాజీ ఎమ్మెల్యేలు గ్రీన్ వేస్ రోడ్డు వైపుగా కదులుతున్నారు. పెద్ద సంఖ్యలో రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానుల తాకిడి రెండు రోజులుగా గ్రీన్వేస్ రోడ్డు వైపుగా పెరిగింది. ఈ పరిస్థితుల్లో ఆదివారం చిన్నమ్మ కువత్తూరు వేదికగా చేసిన ఉద్వేగపూరిత ప్రసంగం అన్నాడీఎంకే కింది స్థాయి కార్యకర్తల్ని, నాయకులను కదిలించినట్టుంది. రెండు రోజులుగా అంతంత మాత్రంగానే పోయెస్గార్డెన్ పరిసరాల్లో సందడి నెలకొనగా, ప్రస్తుతం అభిమాన కెరటం పోటెత్తుతోంది. శశికళకు మద్దతుగా తండోపతండాలుగా కార్యకర్తలు తరలి రావడంతో ఆ పరిసరాలు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కాయి. ముందుగా పార్టీ ముఖ్యులతో మాట్లాడే క్రమంలో అమ్మ జయలలిత వెన్నంటి ఉంటూ తాను చేసిన సేవలు, అందించిన సహకారాన్ని వివరించారు. పన్నీరు రూపంలో పార్టీలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ, ఆ శిబిరం ఎత్తులను చిత్తు చేస్తూ, అధికారం చేజిక్కించుకోవడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఒకే మార్గంలో పయనిద్దామని పిలుపునిచ్చారు. క్రమంగా అభిమాన తాకిడి పెరగడంతో శశికళ పోయెస్ గార్డెన్ నుంచి బయటకు రాక తప్పలేదు. కార్యకర్తల్లో చొచ్చుకు వస్తూ, వారితో ముచ్చటించారు. కార్యకర్తల మ«ధ్యలో నిలబడి మరీ ప్రసంగ పాఠంతో ఆకర్షించే యత్నం చేశారు. పోయెస్ గార్డెన్ నుంచి కువత్తూరుకు వెళ్లే మార్గంలో ప్రజాకర్షణ దిశలో చిన్నమ్మ పయనం సాగినా, చిన్నమ్మ ప్రసంగాలు ఆకర్షించే విధంగా ఉన్నా, మంగళవారం వెలువడబోయే తీర్పుపై ఆమె మద్దతుదారుల్లో తీవ్ర ఉత్కంఠ మాత్రం తప్పడం లేదు. చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ: అక్రమాస్తుల కేసులో మరి కాసేపట్లో సుప్రీంకోర్టు తన తీర్పును ప్రకటించనుంది. మంగళవారం పదిన్నర గంటలకు తీర్పును ప్రకటించనున్నట్టు సుప్రీంకోర్టులో నుంచి వెలువడ్డ ప్రకటనతో చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ మరింతగా పెరిగింది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడుతుందోనన్న ఆందోళన బయల్దేరింది. చిన్నమ్మకు అనుకూలంగా వస్తుందా, వ్యతిరేకంగా వస్తుందో అన్న చర్చ మీడియాల్లో సైతం పెరగడంతో తీర్పుపై ఆసక్తి పెరిగింది. తీర్పు వ్యతిరేకంగా ఉన్న పక్షంలో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఏదేని సంఘటనలు చోటు చేసుకోవచ్చన్న సమాచారంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భద్రత పెంచుతూ, ప్రధాన ప్రాంతాల్లో చెక్ పోస్టులు, పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. -
శశికళకు కారాగారమా? అధికారమా?
శశికళ భవితవ్యంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు (సాక్షి నాలెడ్జ్ సెంటర్): తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి శశికళ నటరాజన్ రాజకీయ భవిష్యత్తుపై సుప్రీంకోర్టు మంగళవారం ‘తీర్పు’ ఇవ్వనుంది. తమిళనాడులో నెలకొన్న ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని.. 20 ఏళ్ల నాటి ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇవ్వబోయే ఈ తీర్పు మరో మలుపు తిప్పనుంది. జయలలిత 1991-96 మధ్య తమిళనాడు ముఖ్యమంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆదాయానికి మించి రూ. 66 కోట్లకు పైగా ఆస్తులు సమీకరించుకున్నారనేది అసలు కేసు. ఇందులో జయలలితతో పాటు.. ఆమె స్నేహితురాలు శశికళ, ఆమె బందువులు ఇళవరశి, వి.ఎన్.సుధాకరన్లు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ కేసు పూర్వాపరాలివీ... * 1996 ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి, డీఎంకే అధికారంలోకి వచ్చింది. అదే ఏడాది జూన్ 14న సుబ్రమణ్యం స్వామి (ప్రస్తుతం బీజేపీ ఎంపీ) జయలలితపై ఫిర్యాదు చేశారు. డీఎంకే ప్రభుత్వం జయలలితపై కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత జయలలిత, శశికళ, ఇళవరశి, సుధాకరన్లపై ప్రత్యేక కోర్టు చార్జిషీటు నమోదు చేశారు. * జయలలితకు చెందిన చెన్నైలోని ఫామ్హౌస్లు, బంగళాలు, తమిళనాడులో వ్యవసాయ భూమి, హైదరాబాద్లో ఒక ఫామ్హౌస్, నీలగరి కొండల్లో ఒక టీ ఎస్టేట్, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, లగ్జరీ కార్ల శ్రేణి తదితర ఆస్తులు ఈ కేసు పరిధిలో ఉన్నాయి. * 1997లో జయలలిత నివాసంలో సోదాలు జరిపి 800 కిలోల వెండి, 28 కిలోల బంగారం, 750 జతల చెప్పులు, 10,500 చీరలు, 91 వాచీలు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని చెన్నైలోని రిజర్వు బ్యాంకు వాల్ట్ లో ఉంచారు. 2014లో వీటిని బెంగళూరుకు తరలించాలని ప్రత్యేక న్యాయమూర్తి ఆదేశించారు. * 2001 మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఓడిపోయి అన్నా డీఎంకే మళ్లీ అధికారంలోకి రావడంతో.. కేసు విచారణను తమిళనాడు వెలుపలకు బదిలీ చేయాలని 2003లో సుప్రీంకోర్టును కోరింది. ఈ కేసును కర్ణాటకకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. * 2014 సెప్టెంబర్ 27న తీర్పు చెప్పిన కర్ణాటక ప్రత్యేక కోర్టు.. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)ఇ, 13(2) సెక్షన్ల కింద జయలలితను దోషిగా ప్రకటించింది. శశికళ, మిగతా ఇద్దరిని ఐపీసీలోని 120బి, 109 సెక్షన్ల కింద దోషులుగా నిర్ధారించింది. నలుగురికీ నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. జయలలితపై రూ. 100 కోట్లు, మిగతా ముగ్గురిపై తలా రూ. 10 కోట్ల చొప్పున జరిమానా కూడా విధించింది. * ఆ తీర్పు వచ్చేటప్పటికి జయలలిత మళ్లీ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రిని దోషిగా నిర్ధారించి, జైలు శిక్ష వేయడం ఇదే తొలిసారి. ఈ తీర్పు ఫలితంగా జయ.. ముఖ్యమంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికీ అనర్హురాలయ్యారు. ఆ పదవులు కోల్పోయారు. కోర్టుకు హాజరైన జయలలితను తీర్పు వెలువడిన వెంటనే పారప్పణ అగ్రహార జైలుకు తరలించారు. శశికళ సహా మిగతా ముగ్గురినీ ఇతర జైళ్లకు పంపారు. * ప్రత్యేక కోర్టు తీర్పుపై కర్ణాటక హైకోర్టులో అప్పీలు చేసిన జయ తదితరులు.. బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు నలుగురికీ బెయిల్ మంజూరు చేసింది. 2015 మే 11వ తేదీన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి సి.ఆర్.కుమారస్వామి.. విచారణ కోర్టు తీర్పును కొట్టివేశారు. జయలలిత, శశికళ సహా మిగతా ఇద్దరిపైనా అభియోగాలను రద్దుచేశారు. దీంతో.. జయలలిత అదే నెల 23వ తేదీన మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. * జయ తదితరులను నిర్దోషులుగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును వేగంగా విచారించిన సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. జయలలిత 2016 డిసెంబర్ 5వ తేదీన మరణించారు. శశికళ సహా మిగతా ముగ్గిరిపై కేసును కొనసాగించిన సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం ప్రకటించనుంది. తమిళనాడు కథనాలు చదవండి... గవర్నర్కు సలహా.. సెల్వంకు ఫస్ట్ ఛాన్స్? శశికళకు 119 మంది 'రిసార్ట్ ఎమ్మెల్యేల' మద్దతు! కమల్.. మళ్లీ వేసేశాడు! చిన్నమ్మతో ప్రభుత్వం ఏర్పాటు చేయించండి: సుప్రీంలో పిల్ పన్నీర్ - స్టాలిన్.. సచివాలయంలో భేటీ! పన్నీర్ అమ్ముడుపోయారు.. చిన్నమ్మే కావాలి శశికళా.. మొసలి కన్నీరు ఆపండి: సెల్వం 'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' జయలలిత చివరి మాటలు ఏంటో తెలుసా? సచివాలయానికి సీఎం పన్నీర్ సెల్వం! ఢిల్లీని ఢీ కొడతా ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? ‘అమ్మ’ కోసం అవమానాలు భరించా తమిళనా(ఆ)ట.. బీజేపీ మా(ఆ)ట -
శశికళ జాతకంపై నేడే తీర్పు
తమిళనాడులో హైటెన్షన్: అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక - తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని చిన్నమ్మ ధీమా - వ్యతిరేక తీర్పు వస్తే ప్రత్యామ్నాయాలపై చిన్నమ్మ శిబిరం మంతనాలు - శశికళ జైలుకు పోవడం ఖాయమని పన్నీర్ వర్గాల ప్రచారం - అల్లర్లు జరిగే అవకాశం ఉందని సీఎస్, డీజీపీని హెచ్చరించిన గవర్నర్ - పోలీసు అధికారులతో సీఎస్ అత్యవసర సమావేశం - పన్నీర్ గూటికి మరో ఎమ్మెల్యే, ఎంపీ - అదను చూసి అధికారం దక్కించుకోవాలని డీఎంకే వ్యూహం - గవర్నర్ వెనుక కేంద్రమంత్రులు ఉన్నారన్న ఎంపీ సుబ్రమణ్య స్వామి చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా మంగళవారం ఏం జరగబోతోందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతోపాటు పలువురు ఫైల్ చేసిన అప్పీళ్లపై జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్లతో కూడిన బెంచ్ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తమ తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్తో కలసి ఆయన సోమవారం రాత్రి ఆయన పన్నీర్ గూటికి చేరారు. దీంతో పన్నీర్కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్ ఎద్దేవా చేశారు. న్యాయ నిపుణులతో సమాలోచనలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని గవర్నర్కు రోహత్గీ సూచించినట్లు తెలిసింది. గవర్నర్ నిర్ణయం సాగదీయడం వెనుక కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ ఇంకా సాగదీస్తే కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. శశికళ సీఎంగానే ఢిల్లీకి వస్తారని ధీమాగా చెప్పారు. గవర్నర్ రాజ్యాంగానికి బ్రేకులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీని విమర్శిస్తే అంతు చూస్తామని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేలా గవర్నర్ను ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్ విద్యాసాగర్రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారె వరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశాన్ని సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన రెండు గంటలకే ఇంటెలిజెన్స్ ఐజీ కె.ఎన్.సత్యమూర్తిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో పోలీస్ వెల్ఫేర్ ఐజీ డేవిడ్సన్ దేవాశీర్వాదంను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. సంతకాల పరిశీలన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల పేర్లతో శశికళ సమర్పించిన జాబితాలోని సంతకాలను గవర్నర్ పరిశీలన చేయిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్యే మనోరంజితం తాను ఎమ్మెల్యేల సమావేశానికే హాజరు కాలేదని చెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ప్రజాభిప్రాయం మేరకు తాను పన్నీర్కు మద్దతిస్తానన్నారు. మరోవైపు సెంగోట్టి యన్కు పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవి ఇవ్వడంతో లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అసంతృప్తితో ఢిల్లీలోనే ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని శశికళ వర్గం ఖండించింది. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని, శశికళతో టచ్లోనే ఉన్నారని ఆ వర్గాలు చెప్పాయి. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
అప్పటి వరకు అమ్మ నగలు అక్కడే..
బెంగళూరు: జయలలిత వీలునామా రాయకపోవడంతో ఆమె ఆస్తులు ఎవరికి చెందుతాయనేది ప్రశ్నగా మారింది. చెన్నైలో పాటు హైదరాబాద్లో జయలలితకు విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. ఇళ్లు, తోటలు ఉన్నాయి. ఈ విషయం అటుంచితే జయలలితకు చెంది బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు కర్ణాటక ట్రెజరీలో ఉన్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నట్టు జయలలితపై కేసు నడుస్తున్న సంగతి తెలిసిందే. 1996లో చెన్నైలోని జయలలిత నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేసి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10 వేల చీరలు, 91 వాచీలు, 44 ఎయిర్ కండీషనర్లు, 750 జతల చెప్పులు ఉన్నాయి. ఈ వస్తువుల విలువ 6 కోట్ల రూపాయలకుపైగా ఉంటుందని అంచనా. ఆదాయపన్ను శాఖ అధికారులు అప్పట్లో ఈ వస్తువులను కర్ణాటక ట్రెజరీలో భద్రపరిచారు. ప్రస్తుతం అక్కడే ఉన్నాయి. జయలలితపై నమోదైన కేసును కర్ణాటకలో విచారించారు. సుదీర్ఘ విచారణ అనంతరం కింది కోర్టు జయలలితను దోషిగా తీర్పు చెప్పగా, బెంగళూరు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవిని కోల్పోవాల్సి వచ్చింది. హైకోర్టులో విముక్తి లభించడంతో మళ్లీ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అయితే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సుప్రీం కోర్టులో నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు వెలువరించే వరకు జయలలిత నగలు కర్ణాటక ట్రెజరీలోనే ఉంటాయి. -
జైలు జీవితమే దెబ్బతీసిందా?
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. ఆస్పత్రి నుంచి వస్తుందనుకున్న ‘అమ్మ’కు అస్తమించడంతో తమిళ ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయారని సన్నిహితులు వాపోతున్నారు. జైలు జీవితం ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసిందని అంటున్నారు. అక్రమాస్తుల కేసులో కోర్టు విధించడంతో 2014, సెప్టెంబర్ లో ఆమె జైలుకు వెళ్లారు. దాదాపు ఎనిమిది నెలల పాటు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలోనే అనారోగ్య సమస్యలు తలెత్తాయని జయ సన్నిహితులు వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చికిత్స కోసం అమెరికా వెళ్లాలని అనుకున్న జయలలిత తర్వాత నిర్ణయాన్ని మార్చుకున్నారు. తనపై ఆరోగ్యంపై ఆమె ఆద్యంతం గోప్యత పాటించారు. సెప్టెంబర్ 22వ తేదీన తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్తో చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరే వరకు జయ అనారోగ్యం గురించి సన్నిహితుల తప్ప ఎవరికీ తెలియదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత కూడా కొంతమందికి తప్ప ఎవరికీ కనిపించలేదు. సెప్టెంబర్ 20న చెన్నై ఎయిర్ పోర్టు మెట్రో స్టేషన్ లో కొత్త లైను ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, రాధాకృష్ణన్ తో కలిసి వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారు. జయలలిత పాల్గొన్న చివరి అధికారిక కార్యక్రమం ఇదే. -
రెండోరోజు సీబీఐ విచారణకు హిమాచల్ సీఎం
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ విచారణ నిమిత్తం రెండోరోజు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అక్రమాస్తుల కేసులో ఆయనను నిన్న కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. కాగా సీబీఐ విచారణ నిమిత్తం వీరభద్రసింగ్ బుధవారం ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. గురువారం ఆయనను సీబీఐ అధికారులు సుమారు ఏడు గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. 2009-2012 మధ్య కాలంలో కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించడంపై సిబిఐ ఆయనను ప్రశ్నించింది. తన పేరుతోపాటు భార్యాబిడ్డలపై ఆయన 6.03 కోట్లు అక్రమంగా కూడబెట్టారు. దీనికి సంబంధించి వీరభద్రసింగ్ భార్య ప్రతిభా సింగ్, ఎల్ఐసీ ఏజెంట్ ఆనంద్ చౌహాన్, చున్నీలాల్ చౌహాన్లపై గత ఏడాది కేసు నమోదైంది. కాగా తన భార్య, పిల్లలు పేరు మీద ఆస్తులు ఎలా సంపాదించానో తెలియదని సీబీఐ విచారణలో ఆయన చెప్పినట్టు సమాచారం. మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కూడా వీరభద్రసింగ్తో పాటు ఆయన అనుచరులు, కుటుంబసభ్యులపై కేసులు నమోదు చేసింది. -
అవినీతి సీఐపై వేటు
నేడు బెయిల్ పిటిషన్పై విచారణ రాకుండా అడ్డుకోవాలనుకుంటున్న ‘ఏసీబీ’ విశాఖపట్నం: అక్రమాస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డ మెరైన్ సీఐ షేక్ హుస్సేన్ను సస్పెండ్ చేస్తూ విశాఖ రేంజ్ డిఐజీ ఎ.రవిచంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 17న అవినీతి శాఖ అధికారులు హుస్సేన్ ఆస్తులపై ఏకకాలంలో 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆదాయానికి మించి కోట్లాది రూపాయల ఆస్తులను బంధువులు, స్నేహితులు, బినామీల పేరుపై కూడబెట్టిన విషయం ఈ దాడుల్లో వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్టయిన హుస్సేన్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. తనకు బెయిల్ ఇప్పించాల్సిందిగా కోర్టులో అప్పీలు చేసుకున్నారు. దానిపై గురువారం విచారణ జరగనుంది. బెయిల్ను అడ్డుకోవాలనుకుంటున్న ఏసీబీ కేసు తీవ్రత దృష్ట్యా హుస్సేన్కు బెయిల్ రాకుండా అడ్డుకోవాలని ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాని కోసం పక్కా అధారాలతో పకడ్బందీగా కేసు షీట్ తయారు చేస్తున్నారు. మరోవైపు హుస్సేన్ బాధితులు ఏసీబీ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. అతని చేతిలో మోసపోయిన వారు, దౌర్జన్యానికి గురైన వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించి తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. వారు చెబుతున్న అంశాల్లో అక్రమ ఆదాయానికి సంబంధించిన విషయాలను ఏసీబీ నమోదు చేసుకుంటోంది. ముందుగా ఇప్పటి వరకూ లభించిన ఆధారాలు, అక్రమాస్తుల డాక్యుమెంట్లను క్షుణ్ణంగా క్రోడీకరించే పనిలో ఉన్నారు. వాటిని నేడు కోర్టుకు సమర్పించనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ ‘సాక్షి’కి బుధవారం తెలిపారు. లంచాల ‘దొర’కు రిమాండ్ పాత సీసాల వ్యాపారి నుంచి రూ.18వేలు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీకి చిక్కిన పెందుర్తి నేర విభాగం హెడ్ కానిస్టేబుల్ ఎ.అప్పలస్వామిదొరను బుధవారం ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. -
'అమ్మ'ను వెంటాడుతున్న ఆస్తుల కేసు
-
సీఎంను అరెస్టు చేసేందుకు సుప్రీంకోర్టుకు..
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యను అరెస్టు చేయకుండా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ను సవాల్ చేస్తూ సీబీఐ అధికారులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. తమ పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టి వెంటనే వీరభద్ర సింగ్ను అరెస్టు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ అత్యవసర వాదోపవాదనల పిటిషన్ దాఖలు చేశారు. లెక్కకు మించిన అక్రమాస్తులను కలిగి ఉన్నారని ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్, ఆయన భార్యపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో వారిని అరెస్టు చేసి విచారణ చేయాలని సీబీఐ భావించగా వీరభద్ర సింగ్ హైకోర్టును ఆశ్రయించి అరెస్టు నుంచి ఉపశమనం, ఇతర వెసులుబాటులు పొందారు. ఈ నేపధ్యంలో సీబీఐ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా, ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన ప్రధాన న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తుతో కూడిన ధర్మాసనం దసరా తర్వాత ఈ కేసుపై విచారణ చేపడతామని పేర్కొంది. ఈ ధర్మాసనంలోని మరో న్యాయమూర్తి అరుణ్ మిశ్రా.. దీనిని అత్యవసరంగా విచారణ చేపట్టే అంశంగా తాము భావించడం లేదని, రేపటికి రేపు వాదోపవాదనలు ప్రారంభించలేమని చెప్పారు. దీంతో ప్రస్తుతం దసరా పండుగ పూర్తయ్యే వరకు ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఉపశమనం లభించినట్లయింది. -
'ముఖ్యమంత్రి అరెస్టుపై హైకోర్టు స్టే'
షిమ్లా: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్కు ఊరట కలిగింది. ఆయన అరెస్టుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకు అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. అక్రమంగా ఆస్తులు పోజేశారని వీరభద్రసింగ్పై ఆరోపణలు సీబీఐ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై భార్యపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తమను అరెస్టు చేయకుండా స్టే విధించాలని వారు బుధవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆ అరెస్టుపై స్టే విధించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే తమ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహించిందని, ఇది అక్రమం అని పేర్కొంటూ వారిని ప్రశ్నించాలని కోర్టుకు తెలియజేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న కోర్టు నవంబర్ 18న తదుపరి ఉత్తర్వులు వెలువరిస్తామని, అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయొద్దని స్పష్టం చేసింది. -
సీఎం ఇంట్లో సీబీఐ దాడులా!
'నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. అత్యున్నత పదవిలో ఉన్న నాపై కేసు నమోదు చేయాలంటే ముందు ప్రాసిక్యూషన్, ప్రభుత్వ అనుమతులు తీసుకోవాలి. ఇది నేను చెబుతున్న విషయం కాదు. రాజ్యాంగమే పేర్కొంది. అలాంటిది.. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా సీబీఐ నా ఇల్లు, ఆఫీసులోకి చొరబడి దాడులు చేస్తుందా? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్ మెంట్ లోని ఆరో సెక్షన్ ప్రకారం ఇది కచ్చితంగా చట్ట విరుద్ధం. ఎఫ్ఐఆర్ లో నా పేరు, నా భార్య పేరు చేర్చడం దారుణం. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర. అందుకే ఈ విషయంలో మీరు కలుగజేసుకోవాలని కోరుతున్నాను'.. అంటూ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ షిమ్లా హైకోర్టులో బుధవారం పిటిషన్ దాఖలు చేశారు. వీరభద్రసింగ్, అతని సతీమణుల అక్రమ ఆస్తుల వ్యవహారంపై ఇప్పటికే ఆదాయం పన్ను శాఖ దర్యాప్తు జరుపుతున్నది. ఈలోపే సీబీఐ కూడా ఇదే వ్యవహారానికి సంబంధించి ఆ ఇరువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. వీరభద్ర సింగ్ దాఖలు చేసిన పిటిషన్ గురువారం విచారణకు రానుంది. జస్టిస్ రాజివ్ శర్మ, జస్టిస్ సురేశ్వర్ సింగ్ ఠాకూర్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ ను విచారించనుంది. -
ఆమె విడుదలపై అప్పీలు చేస్తాం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ పార్టీ సవాలు చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే హక్కు డీఎంకేకు ఉందని సుప్రీంకోర్టు రెండుసార్లు చెప్పిందని, అందుకే తాము అప్పీలు చేద్దామని అనుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ ఇద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారని కరుణానిధి చెప్పారు. ఈ కేసులో ముందుగా ఫిర్యాదుచేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి కూడా అప్పీలువైపే మొగ్గు చూపిస్తుననట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో డీఎంకే ప్రధాన కార్యదర్శి అంబళగన్ కూడా ఓ పిటిషనర్. -
జయకు మోదీ అభినందనలు
చెన్నై : అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అభినందనలు వెల్లువెత్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు. అక్రమాస్తుల కేసులో జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ ఫోన్ ద్వారా జయలలితను అభినందించినట్లు అన్నాడీఎంకే సోమవారం ఓ ప్రకటన చేసింది. జయను అభినందనలు తెలిపినవారిలో తమిళనాడు గవర్నర్ రోశయ్య కూడా ఉన్నారు. అలాగే కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, నజ్మా హెప్తుల్లా కూడా పురచ్చితలైవికి అభినందనలు తెలిపారు. ఇక ఎన్సీపీ నేత శరద్ పవార్, టీఎంసీ నేత జీ.కె.వాసన్, పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు తమిళ చలనచిత్ర ప్రముఖులు కూడా జయను గ్రీట్ చేశారు. -
వాదనలు అనవసరం.. తీర్పు ఇవ్వండి
న్యూఢిల్లీ: అక్రమాస్తుల కేసు విషయంలో తీర్పు ఇవ్వకుండా కర్ణాటక హైకోర్టుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. ఈ కేసు విషయంలో ఇక తాజాగా వాదనలు వినాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. ఇప్పటికే జరిగిన వాదనలతో తుది తీర్పును ఇవ్వొచ్చని స్పష్టం చేసింది. దీంతోపాటు ఈ కేసు విషయంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ను నియమించే అధికారం తమిళనాడు ప్రభుత్వానికి లేదని, నియమించినా ఆయన ద్వారా కర్ణాటక హైకోర్టులో ఈ కేసుపై తాజాగా వాదనలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. భవానీ సింగ్ అనే వ్యక్తిని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించడాన్ని వ్యతిరేకిస్తూ డీఎంకే నేత ఒకరు కోర్టుకు వెళ్లడంతో దానిపై గతంలో నిర్ణయాన్ని ప్రకటించిన కోర్టు తాజాగా సోమవారం తుది నిర్ణయాన్ని వెలువరించింది. ఈ కేసులో ప్రత్యేక వాదనలు అవసరం లేదని, ఇప్పటి వరకు జరిగిన వాదనలతో తీర్పు వెలువరించ వచ్చని చెప్పింది. వీరి వ్యవహారం చూస్తుంటే కేసును మరింత జాప్యం చేయాలని చూస్తున్నట్లుగా ఉందన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసింది. తమ ఆదేశాలు అందిన వెంటనే ఈ కేసులో ముందుకు వెళ్లాలని కూడా సుప్రీంకోర్టు కర్ణాటక హైకోర్టుకు చెప్పింది. చట్టంలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసీక్యూటర్ అనే వ్యవస్థ సరైనది కాదని కోర్టు ఈ సందర్భంగా తప్పుబట్టింది. -
జయలలితకు మరోసారి బెయిల్ పొడిగింపు
న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కొంత ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువు మరోసారి పొడగించింది ధర్మాసనం. అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్లిన జయలలిత బెయిల్ను సుప్రీంకోర్టు మే 12వ తేదీవరకు పొడిగించింది. జయలలిత తదితరులకు మే 12వ తేదీవరకు బెయిల్ను పొడిగిస్తూ ఎపెక్స్ కోర్టు చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు ఆదేశాలు జారీచేశారు. కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్పై ఉన్న ఆమెకు గత డిసెంబర్ 18న సుప్రీంకోర్టు నాలుగు నెలలు బెయిల్ గడువు పొడిగించింది. -
జయలలిత కేసు విచారణ నేటికి వాయిదా
బెంగళూరు: అక్రమాస్తుల కేసుకు సంబంధించి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసు విచారణను మంగళవారానికి వాయిదా పడింది. ఇక్కడి ప్రత్యేక కోర్టులో సోమవారం వాదనలు మొదలైన వెంటనే జయలలితపై తాను కేసు దాఖలు చేశానని, అందువల్ల ఈ కేసును వాదించేందుకు తనకు అనుమతివ్వాలంటూ న్యాయమూర్తి పి.ఆర్.కుమారస్వామిని సుబ్రహ్మణ్యస్వామి కోరారు. ఈ విషయాన్ని రాత పూర్వకంగా ఇవ్వాలని ఆయనకు న్యాయమూర్తి సూచించారు. అనంతరం జయలలిత తరుఫు న్యాయవాది పి.కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను మంగళవారానికి న్యాయమూర్తి వాయిదా వేశారు. -
జయలలితకు ఊరట..
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలితకు మరింత ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువును సుప్రీంకోర్టు 2015 ఏప్రిల్ 18 వరకూ పొడిగిస్తూ తీర్పు చెప్పింది. అలాగే జయలలిత కేసును విచారించేందుకు స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేయాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. మరోవైపు జయ కేసు విచారణ మూడు నెలల్లోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. -
జయలలిత బెయిల్ పొడగింపు
-
667 పుస్తకాలతో కోర్టుకు అప్పీలు ..
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధ్యక్షురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో అప్పీల్ వివరాలు దాఖలు చేశారు. మొత్తం 667 పుస్తకాల్లో 2 లక్షల 15వేల పేజీల పత్రాలను కోర్టుకు సమర్పించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు నాలుగేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.100కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన ఆమెకు అక్కడ ఊరట లభించింది. బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షపై చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు ....ఈ కేసులో రెండు నెలల్లోగా అప్పీల్కు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆ తర్వాత ఒక్క రోజు కూడా గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో జయలలిత ...ఇవాళ అప్పీల్కు సంబంధించిన వివరాలు న్యాయస్థానంలో దాఖలు చేశారు. -
జైలు నుంచి జయ విడుదల
‘అమ్మ’కు ఎదురేగి తమిళనాడు సీఎం, మంత్రుల స్వాగతం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరిక మానవహారంగా ఏర్పడి అభిమానుల ఘన స్వాగతం బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21 రోజులపాటు జైలుశిక్ష అనుభవించిన తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. జయ బెయిల్ పత్రాలతోపాటు రూ. 2 కోట్లకు ఒక బాండ్ను, రూ. కోటికి ఒక పూచీకత్తును ఆమె తరఫు న్యాయవాదులు బెంగళూరులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ డి కున్హాకు సమర్పించగా ఆయన విడుదల ఆదేశాలు జారీ చేశారు. అనంతరం మిగిలిన లాంఛనాలు పూర్తి చేశాక జైలు అధికారులు మధ్యాహ్నం 3.20 గంటలకు జయతోపాటు ఆమె సన్నిహితురాలు శశికళ, సమీప బంధువు ఇళవరసి, ఒకప్పటి దత్తపుత్రుడు సుధాకరన్లను విడుదల చేశారు. జయ జైలు నుంచి బయటకు రాగానే ఆమెకు స్వాగతం పలికేందుకు తమిళనాడు ప్రభుత్వమే కదిలివచ్చింది. చెన్నై నుంచి బెంగళూరులోని పరప్పన జైలు ప్రాంగణానికి ఉదయమే చేరుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వంతోపాటు ఆ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు ‘అమ్మ’కు సాదర స్వాగతం పలికారు. అలాగే జైలు వెలుపల వేచి ఉన్న వందలాది మంది అన్నాడీఎంకే కార్యకర్తలు సైతం జయను చూడగానే నినాదాలు చేశారు. తనకున్న జెడ్ ప్లస్ భద్రతకుతోడు కర్ణాటక ప్రభుత్వం వందలాది మంది పోలీసులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక భద్రత నడుమ జయలలిత పరప్పన అగ్రహార జైలు నుంచి దాదాపు 4 గంటలకు హెచ్ఏఎల్ ఎయిర్పోర్టుకు బయలుదేరారు. జయ ఎక్కిన వాహనంలో ఆమె సెంటిమెంట్గా భావించే కుర్చీని అధికారులు ప్రత్యేకంగా అమర్చారు. శశికళ, ఇళవరసి సైతం జయ వాహనంలో ఎక్కగా సుధాకరన్ మరో వాహనంలో వారిని అనుసరించారు. ఎయిర్పోర్టుకు వెళ్లే దారి పొడవునా జయ మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ‘అమ్మ’ ఫొటోలు చేతబూని ఆమె కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. వారికి జయలలిత నవ్వుతూ అభివాదం చేశారు. చెన్నైలో ఘన స్వాగతం.. ప్రత్యేక విమానంలో 4:50 గంటలకు చెన్నై చేరుకున్న జయకు ఎయిర్పోర్టులో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. జయ, శశికళ ఒకే కారులో భారీ బందోబస్తు నడుమ పోయెస్గార్డెన్లోని తన ఇంటికి చేరుకోగా ఇళవరసి, సుధాకరన్లు మరో కారులో జయ కారును అనుసరించారు. చెన్నైలో భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు లెక్కచేయకుండా విమానాశ్రయం నుంచి పోయెస్గార్డెన్లోని జయ నివాసం వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా బారులు తీరారు. అనేక కూడళ్లలో ‘అమ్మ’ కారుపై పూలవర్షం కురిపించారు. సుమారు 12 కిలోమీటర్ల దూరాన్ని గంటకు పైగా ప్రయాణించి సాయంత్రం 6.10గంటలకు జయ తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరే ముందు జయ దారిలో ఆగి ఓ గుడిలో పూజలు చేశారు. కాగా, జయ బెయిల్పై విడుదలవుతారంటూ ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలతో పందెం వేసిన ఓ అన్నాడీఎంకే కార్యకర్త తాను చెప్పినది జరగడంతో తన భారీ గుబురు మీసం తీసేశారు. -
జయకు షరతులతో బెయిల్
ఆస్తుల కేసులో సుప్రీం బెయిల్ మంజూరు శశికళ, ఇళవరసి, సుధాకరన్లకు కూడా... న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మూడు వారాలుగా జైలు శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు శుక్రవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షపై చీఫ్ జస్టిస్ హెచ్.ఎల్. దత్తూతో కూడిన ధర్మాసనం స్టే విధించి జయకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని...పైగా మహిళను, వయోవృద్ధురాలిని అయినందున ఈ కారణాలను దృష్టిలో ఉంచుకొని తనకు తక్షణమే బెయిల్ ఇవ్వాలన్న జయ విజ్ఞప్తిని కోర్టు మన్నించింది. జయతోపాటు జైలుశిక్ష అనుభవిస్తున్న ఆమె సన్నిహితురాలు శశికళ, దగ్గరి బంధువు ఇళవరసి, ఒకప్పటి దత్త పుత్రుడు సుధారకరన్లకు కూడా బెయిల్ ఇచ్చింది. ఈ కేసులో రెండు నెలల్లోగా అప్పీల్కు సంబంధించిన వివరాలను కర్ణాటక హైకోర్టులో దాఖలు చేయాలని ఆదేశించింది. ఒకవేళ రెండు నెలల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఆ తర్వాత ఒక్క రోజు కూడా గడువు ఇవ్వబోమని తేల్చి చెప్పిం ది. పార్టీ కార్యకర్తలు శాంతిభద్రతల సమస్యలు సృష్టించకుండాచూడాలని జయనుఆదేశించింది. బెయిల్పై కోర్టు తొలుత నిరాసక్తత సుమారు గంటపాటు సాగిన విచారణలో సర్వోన్నత న్యాయస్థానం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. జయకు బెయిల్ మంజూరుపై తొలుత నిరాసక్తత కనబరిచిన ధర్మాసనం అందుకు సంబంధించి పలు సందేహాలు లేవనెత్తింది. ట్రయల్ కోర్టులో ఈ కేసు విచారణను జయ ఏళ్ల తరబడి జాప్యం చేశారని... ఒకవేళ ఇప్పుడు బెయిల్పై విడుదల చేస్తే హైకోర్టులో కేసు అప్పీల్పై విచారణకు 20 ఏళ్లు పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేసింది. అయితే జయ తరఫు న్యాయవాది, ఫాలీ ఎస్. నారీమన్ వాదనలు వినిపిస్తూ హైకోర్టులో అప్పీల్పై జాప్యం చేయబోమని హామీ ఇచ్చారు. ‘‘హైకోర్టులో విచారణపై జాప్యం జరగదని హామీ ఇస్తున్నా. గతంలో ఇది(జాప్యం చేయడం) ఆట అయ్యుం డచ్చు. కానీ ఈసారి మాత్రం ఇది ఆట కాబోదు. వాయిదా కోరబోమన్న నా మాటను నమోదు చేసుకోండి’’ అని నారీమన్ కోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ హైకోర్టులో అప్పీల్పై విచారణను ఎన్ని నెలల్లో ముగిస్తారని నారీమన్ను ప్రశ్నించగా అప్పీల్కు సంబంధించి 5 వేల పేజీలతో కూడిన వివరాలను అనువదించి హైకోర్టుకు సమర్పించేందుకు తనకు 6 వారాల సమయం కావాలన్నారు. అలాగే హైకోర్టులో విచారణను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో పూర్తిచేస్తామన్నారు. అప్పీల్పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకూ అవసరమైతే రెండు-మూడు నెలలు ఇంటికే పరిమితం అయ్యేందు కు కూడా జయ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అయితే గృహ నిర్బంధం వంటి అసాధారణ ఆదేశాలను జారీ చేయజాలమని ధర్మాసనం తెలిపింది. అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తమ ఆదేశాలను జయ పాటించేలా చూసేందుకు ఆమె బెయిల్ పిటిషన్ ను పరిష్కరించినట్లు ప్రకటించకుండా విచారణను డిసెంబర్ 18కి వాయిదా వేసింది. జయ అప్పీల్పై మూడు నెల ల్లోగా తీర్పు వెలువరించాలని హైకోర్టునుకోరతామని ధర్మాసనం తెలిపింది. కార్యకర్తల సంబరాలు చెన్నై: జయలలితకు శుక్రవారం బెయిల్ లభించడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు అభిమానులు చెన్నై సహా తమిళనాడువ్యాప్తంగా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రోడ్లపై బాణాసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెడుతూ ఆనందంతో నృత్యాలు చేశారు. జయ జైల్లో ఉం డటంతో శుక్రవారం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవాన్ని చెన్నైలోని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయంలో నిరాడంబరంగా చేసుకున్నా, బెయిల్ వార్త తెలియగానే ఘనంగా జరుపుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పులు లేదా వాటిని వెలువరించిన జడ్జీలపై విమర్శలు చేయరాదని తమిళులు, నా మద్దతుదారులకు విజ్ఞప్తి చేస్తున్నానని జయ జైలు నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. -
జయ బెయిల్ పిటిషన్పై 17న సుప్రీం విచారణ
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై విచారణ జరపడానికి సుప్రీంకోర్టు శుక్రవారం అంగీకరించింది. విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది. పిటిషన్ను ఈ వారంలోనే విచారించాలన్న జయ తరఫు న్యాయవాది ఫాలీ నారీమన్ విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని ధర్మాసనం మన్నించింది. దీపావళికి ముందు జైల్లోంచి బయటకు రావాలంటే ఈ నెల 17(శుక్రవారం) జయకు చివరి అవకాశం. జయలలితను తమినాడుకు పంపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల ద్వారా కోరితే తరలించడానికి తమకు అభ్యంతరం లేదని కర్ణాటక హోం మంత్రి కేజీ జార్జి చెప్పారు. -
జయ బెయిల్పై శుక్రవారం వాదనలు
న్యూఢిల్లీ : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బెయిల్ పిటిషన్ ఈ నెల 17న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జయ బెయిల్ పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్ధానం శుక్రవారం వాదనలు విననుంది. బెంగళూరు హైకోర్టు బెయిల్ నిరాకరించటంతో జయలలిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తోంది. జైలు ఆమెకు నాలుగేళ్లు జైలుతో పాటు వందకోట్ల జరిమానా విధించింది. మరోవైపు జయలలితను సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఒకవేళ ఆమెకు సుప్రీంలో కూడా చుక్కెదురు అయితే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని అధికారులు ... ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చెప్పినట్లు సమాచారం. దాంతో ఆమెను తమిళనాడు జైలుకు తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. -
జయకు బెయిల్ రాకపోతే తమిళనాడు జైలుకు?
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బెంగళూరు శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న తమిళనాడు మాజీ సీఎం జయలలితను ఆమె సొంత రాష్ట్రంలోని జైలుకు తరలించాలని కర్ణాటక ప్రభుత్వం యోచిస్తోంది. ఆమె కర్ణాటక జైలులోనే ఉంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని నిఘా అధికారులు ఆదివారం సీఎం సిద్ధరామయ్యతో చెప్పినట్లు తెలిసింది. ‘‘జయను చూసేందుకు వేలాదిగా తమిళలు జైలు వద్దకు చేరుకుని గొడవ చేస్తున్నారు. సుప్రీం కోర్టులో జయ బెయిల్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అక్కడా బెయిల్ మంజూరు కాకపోతే కర్ణాటకలో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది’’ అని అధికారులు ముఖ్యమంత్రికి వివరించినట్లు తెలిసింది. దీంతో ఆమెను తమిళనాడులోని జైలుకు తరలించాలని సిద్ధరామయ్య భావిస్తున్నట్లు సమాచారం. -
జయ బెయిల్ విచారణ వాయిదా
కర్ణాటక హైకోర్టు రెగ్యులర్ బెంచ్కు కేసు అప్పగింత బెంగళూరు/చెన్నై: ఆదాయూనికి మించిన ఆస్తుల కేసులో అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత బెయిల్ పిటిషన్పై విచారణను కర్ణాటక హైకోర్టు ఈ నెల 7కు వాయిదా వేసింది. దీంతో, తన పిటిషన్ విచారణకోసం జయలలిత ఈ నెల 7వరకూ జైలులోనే ఉండాల్సిఉంటుంది. సహనిందితులైన జయు స్నేహితురాలు శశికళ, బంధు వు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకరన్ కూడా మరో 6 రోజులు జైలులోనే గడపక తప్పదు. తన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయలని, బెయిల్ మంజూరు చేయూలని జయలలిత తన పిటిషన్లో కోర్టును కోరారు. బుధవారం ఉదయుం,. కట్టుదిట్టమైన భద్రత మధ్య జనంతో కిక్కిరిసిన హైకోర్టులో జయలలిత పిటిషన్ను, వెకేషన్ బెంచ్ సత్వర ప్రాతిపదికన పరిశీలించిం ది. ఐపీసీ 389వ సెక్షన్ప్రకారం జయులలిత జైలు శిక్షను సస్పెండ్ చేయూలని, బెయిల్పై విడుదల చేయూలని న్యాయువాది రాం జెఠ్మలానీ కోరారు. అరుుతే, జయ కోరినట్టుగా శిక్షను సస్పెండ్ చేస్తే, మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఆమె తన స్వేచ్ఛను దుర్వినియోగం చేయువచ్చని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏఎస్పీ) భవానీ సింగ్ వాదించారు. వాదనల తర్వాత హైకోర్టు న్యాయువుూర్తి జస్టిస్ రత్నకళ, విచారణను రెగ్యులర్ బెంచ్కు అప్పగిస్తూ ఈ నెల 7వ తేదీకి వారుుదా వేశారు. జయు పిటిషన్పై హైకోర్టు విచారణకు సంబంధించి ఎస్ఎస్పీగా తనను నియుమిస్తూ జారీ అరుున మెమోను భవానీ సింగ్ అంతకు వుుందు కోర్టుకు సమర్పించారు. బెయిల్పై విచారణ మరోసారి వారుుదాతో అన్నా డీఎంకే మద్దతుదార్లు, కొందరు న్యాయువాదులు కోర్టు బయట అసంతృప్తి, ఆందోళన వ్యక్తంచేయగా, పోలీసులు వారిని అదుపుచేశారు. కాగా, అన్నా డీఎంకే అధినేత్రి జయకు సంఘీభావంగా తమిళనాడులో ఐదవరోజూ నిరసనలు కొనసాగాయి. జయకు స్వల్ప అస్వస్థత బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న జయలలిత బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మార్నింగ్వాక్ అనంతరం ఆమె పత్రికలు చదువుతుండగా బీపీ పడిపోవడంతో జైలు అధికారి దివ్యశ్రీ వైద్య పరీక్షలు చేయించారు. మందులు వాడాక జయుకు ఉపశమనం కలిగింది. తర్వాత, తన సహాయకుడు వీర పెరుమాళ్ తెచ్చిన ఇడ్లీ, పొంగల్ను జయ ఆహారంగా తీసుకున్నారు. బుధవారం ఆమె ఎవరినీ కలవలేదు. మరోవైపు, తమిళనాడు నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న అభిమానులు జయులలిత దర్శనం కోసం జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. -
జయ బెయిల్ పిటిషన్పై నేడు విచారణ
విచారణను తొలుత అక్టోబర్ 6కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు సత్వర విచారణపై జయ తరఫు లాయర్ల వినతికి ఆ తర్వాత ధర్మాసనం అంగీకారం బెంగళూరు/చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కర్ణాటక హైకోర్టు బుధవారం విచారణ జరుపుతుంది. కేసులో తక్షణం బెయిల్ మంజూరు చేయాలని, ప్రత్యేక కోర్టు విధించిన నాలుగేళ్ల జైలుశిక్షను రద్దుచేయాలని కోరుతూ జయలలిత దరఖాస్తు చేసుకున్నారు. జయలలిత బెయిల్ దరఖాస్తుపై విచారణను వెకేషన్ బెంచ్ తొలుత వచ్చేనెల 6వ తేదీకి వాయిదావేసింది. అయితే, సత్వర విచారణ కోరుతూ, జయలలిత తరఫున రాంజెఠ్మలానీ నేతృత్వంలోని న్యాయవాదుల నివేదన మేరకు విచారణ బుధవారం చేపట్టేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీహెచ్ వాఘేలా సారథ్యంలోని హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. విచారణను సత్వరమే చేపట్టాలని, దీని కోసం తాను లండన్ నుంచి వచ్చానని, తనకు 5నిముషాలు అవకాశం ఇస్తే జయలలితపై ఆరోపణలన్నీ సత్యదూరాలని నిరూపించగలనని అంత కు ముందు రాం జెఠ్మలానీ విన్నవించారు. హైకోర్టుకు దసరా సెలవుల కారణంగా జయలలిత పిటిషన్ మంగళవారం ఉదయం వెకేషన్ బెంచ్ పరిశీలనకు వచ్చింది. ఆస్తుల కేసులో తనపై అభియోగాలు సరికాదని, చట్టబద్ధంగానే తాను ఆస్తులు సంపాదించానని జయలలిత తన అప్పీల్లో వాదించారు. అయితే, అప్పీలుపై హైకోర్టు విచారణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎస్ఎస్పీ)గా తన నియామకానికి సంబంధించిన, నోటిఫికేషన్ ఏదీ తనకు అందనందున ఎస్ఎస్పీ హోదాలో వాదనకు తనకు అధికారం లేదని, అందువల్ల తనకు మరికొంత వ్యవధి కావాలని, ఇదే కేసుపై ప్రత్యేక కోర్టులో ఎస్ఎస్పీగా వ్యవహరించిన జీ భవానీ సింగ్ కోరారు. దీంతో విచారణను తొలుత అక్టోబర్ 6కు కోర్టు వాయిదా వేసింది. జయలలిత స్నేహితురాలు శశికళ, సమీప బంధువు ఇళవరసి, దత్తపుత్రుడు సుధాకర న్ల బెయిల్ పిటిషన్లపై విచారణను కూడా అదే తేదీకి వాయిదా వేశారు. కానీ, జయలలిత తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు బుధవారం విచారణకు ధర్మాసనం సమ్మతించిం ది. దాదాపు18ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం, జయలలిత సహా నలుగురిని దోషులుగా ప్రత్యేక కోర్టు గత శనివారం నిర్ధారించింది. జయలలితకు నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, రూ. 100కోట్ల భారీ జరిమానా, మిగతా ముగ్గురికి నాలుగేళ్ల జైలు సహా పదికోట్ల చొప్పున జరిమానా విధిస్తూ ప్రత్యేక న్యాయమూర్తి జాన్ మైకేల్ డీకున్హా తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ ‘మౌన నిరసన’ అన్నా డీఎంకే అధినేత్రి, ఒకప్పటి సినీనటి జయలలితకు సంఘీభావంగా తమిళనాడు సినీ పరిశ్రమ చెన్నైలో మంగళవారం మౌన నిరసన దీక్ష నిర్వహించింది. దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం కళాకారులు, కార్మికులు దీక్ష నిర్వహించారు. సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, నటులు ప్రభు, భాగ్యరాజ్, వెన్నిరాడై నిర్మల తదితరులు దీక్షలో పాలు పంచుకున్నారు. ఇతర ప్రాంతాల్లో షూటింగ్లో ఉన్నట్టుగా భావిస్తున్న ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్, విజయ్లు నిరసనల్లో పాల్గొనలేదు. సినిమా, టెలివిజన్ సీరియళ్ల షూటింగులు, సినిమా ప్రదర్శనలు రద్దు చేశారు. మరోవైపు, జయలలితకు జైలుశిక్ష పట్ల ఆవేదనతో తాజాగా ఐదుగురు మరణించారు. దీనితో మృతుల సంఖ్య 18కి పెరిగింది. అన్నా డీఎంకే కార్యకర్తలు పలుచోట్ల నిరసనలుకొనసాగించారు. ‘అమ్మ’ ఫొటోల తొగింపు ఇక, చెన్నైలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటుగా వెబ్సైట్లలో కూడా జయలలిత ఫొటోలను తొలగించారు. -
జయలలిత కేసు తీర్పులోని ముఖ్యాంశాలు
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత 1991-1996 సంవత్సరాల మధ్య కాలంలో స్థిరాస్తులు, నగదుపై సమర్పించిన లెక్కలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని బెంగళూరు సీబీఐ ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. ఆమె ముఖ్యమంత్రిగా ఉన్న ఆ కాలంలో ఆదాయం రూ. 9.91 కోట్లు, వ్యయం రూ. 8.49 కోట్లు ఉంది. అయితే, జయలలిత పేరున, ఆమెతోపాటుగా మరో ముగ్గురు నిందితుల పేరిట, వారి పేరున ఉన్న వాణిజ్య సంస్థల పేరిట ఉన్న స్థిరాస్తులు, నగదు విలువ మాత్రం మొత్తం రూ. 53.6 కోట్లుగా ఉంది. దీనిపై జయలలిత పేర్కొన్న లెక్కలు సంతృప్తికరంగా లేవనే అంశాన్ని ఎలాంటి సందేహాలకు తావులేని రీతిలో ప్రాసిక్యూషన్ నిర్ధారించిందని ప్రత్యేక కోర్టు తన తీర్పులో స్పష్టంచేసింది. ఈ కేసుకు సంబంధించి జయలలితను, మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారిస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జాన్ మైఖేల్ కున్హా గత శనివారం ఇచ్చిన తీర్పులో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. * ఆదాయ వనరులకు మించి జయలలిత ఆస్తులను కూడబెట్టేందుకు, ఆమె స్నేహితురాలు, శశికళ, సమీప బంధువు ఇళవరసి, పెంపుడు కొడుకు వీఎన్ సుధాకరన్, ఉద్దేశపూర్వకంగా నేరానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారాలతో రుజువు చేసింది. అందువల్ల భారతీయ శిక్షాస్మతి (ఐపీసీ), అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద జయలలితతో పాటుగా మిగిలిన ముగ్గురూ శిక్షార్హులే. * కోర్టు విధించిన రూ. 100 కోట్ల జరిమానా జయలలిత చెల్లించని పక్షంలో ఆమె మరో ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. * దోషులు చెల్లించవలసిన జరిమానా వసూలు కోసం తగిన చర్యలను కూడా ప్రత్యేక కోర్టు ప్రకటించింది. వారిపేరున ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లను, ఖాతాల్లోని నగదు నిల్వలను జరిమానా మొత్తానికి సర్దుబాటు చేసేలా సంబంధిత బ్యాంకులకు తగిన ఆదేశాలు ఇవ్వాలి. సర్దుబాటు చేసిన మొత్తం జరిమానాకంటే తక్కువగా ఉన్నపక్షంలో,. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారాన్ని, వజ్రాభరణాలను రిజర్వ్ బ్యాంకుకు, స్టేట్ బ్యాంకుకు అమ్మడం లేదా వేలం వేయడం ద్వారా నగదును సమీకరించి జరిమానా మొత్తానికి సర్దుబాటు చేయాలి. * నిందితులకు సంబంధించిన ఆరు కంపెనీల పేరున ఉన్న స్థిరాస్తులను రాష్ట్రప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నిందితుల నుంచి వసూలు చేసిన జరిమానా మొత్తంలో ఐదు కోట్ల రూపాయలను బెంగళూరులో జరిగిన ప్రత్యేక కోర్టు విచారణ ఖర్చు నిమిత్తం కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించాలి. ** -
శరాఘాతం
మరో రెండేళ్ల వ్యవధిలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతున్న జయలలితకు ఊహించని షాక్ తగిలింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెకు నాలుగేళ్ల జైలుశిక్ష విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం శనివారం తీర్పునిచ్చింది. ఈ కేసులో ఆమెకు రూ. వంద కోట్ల జరిమానా కూడా విధించింది. జయ సన్నిహితురాలు శశికళసహా మరో ముగ్గురికి కూడా వేర్వేరు శిక్షలు పడ్డాయి. ఈ సమయంలో ఇలాంటి తీర్పు వెలువడటం రాజకీయంగా ఆమెకూ, ఆమె నాయకత్వంవహిస్తున్న అన్నా డీఎంకేకూ ఎంత నష్టదాయకమో వేరే చెప్పనవసరంలేదు. అధికారంలో ఉన్నవారు మొదటి మూడేళ్లూ ఎలా పాలించినా చివరి రెండేళ్లలో అన్నివిధాలా సర్దుకునే ప్రయత్నంచేస్తారు. పాలనలో ఏర్పడిన లోటుపాట్లను పూరించేవిధంగా వ్యూహాలు రచించు కుంటారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే జయలలిత దోషిగా నిర్ధారణ అయి, జైలుకు వెళ్లాల్సివచ్చింది. ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీరుసెల్వం సోమవారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే, ఆమె నేరుగా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుని పాలించిన స్థాయిలో పన్నీరుసెల్వమైనా, మరొకరైనా వ్యవహరిస్తారనీ... ఆ లోటు భర్తీ చేస్తారని అనుకోలేం. అందుకు వారిని తప్పుబట్టి ప్రయోజనం లేదు. వ్యక్తి ప్రాధాన్యం అధికంగా ఉండే అన్నాడీఎంకే వంటి పార్టీ సారథ్యంవహించే సర్కారులో సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం, చొరవగా వ్యవహరించడం ఇతరులకు సాధ్యపడే విషయం కూడా కాదు. ఉన్నత న్యాయస్థానంలో ఈ తీర్పు అమలుకాకుండా స్టే ఇవ్వకపోతే రాజకీయంగా జయలలితకు చాలా నష్టం ఉంటుంది. కేసులో నాలుగేళ్ల శిక్ష అనుభవించడం పూర్తయ్యాక ఆరుసంవత్సరాలు ఎన్నికల్లో పోటీచేయడానికి ఆమె అనర్హురాలవుతారు. మొత్తానికి పదేళ్లపాటు ఆమె ఎన్నికలకూ, పదవులకూ దూరంగా ఉండాల్సివస్తుంది. 1996లో కేసు నమోదైననాటినుంచి చూస్తే తీర్పు వెలువడటానికి పద్దెనిమిదేళ్ల సుదీర్ఘకాలం పట్టింది. ఇది పొరుగునున్న కర్ణాటకలోని బెంగళూరుకు బదిలీ అయ్యాక చూసుకున్నా పదకొండేళ్లు పట్టినట్టు లెక్క. ఈ కేసు 130సార్లు వాయిదాలు పడిందని, విచారణ కాలంలో ఏడుగురు న్యాయమూర్తులు మారారని విన్నప్పుడు కాస్త వింతగానే ఉంటుంది. కేసు ఒక కొలిక్కి రాకుండా చూడటానికి జయలలిత అన్ని ప్రయత్నాలూ చేశారన్నది నిజమేకావొచ్చుగానీ... అధికారంలో ఉండి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారందరిదీ దాదాపు అదే రూటు. తమపై ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు సిద్ధపడకపో వడం, చివరకు ఆ ఆరోపణలు న్యాయస్థానాల గడప తొక్కినప్పుడు వమ్ముచేయాలని చూడటం, కొన్ని సందర్భాల్లో స్టేలు తెచ్చుకుని కాల క్షేపం చేయడం మన దేశంలో సర్వసాధారణమే. జయలలిత, లాలూ, చౌతాలా, యడ్యూరప్పవంటివారు ఇందుకు మినహాయింపు కావొచ్చు. దేశంలోనే కుల రహిత సమాజాన్ని కలగని, దాని ప్రాతిపదికన ఎన్నో సామాజిక సమస్యలపై పోరాడిన చరిత్ర ద్రవిడ ఉద్యమానిది. ఆ ఉద్యమంలోనుంచే డీకే, డీఎంకే, అన్నాడీఎంకేవంటి పార్టీలు ఆవిర్భవించాయి. తమిళ ఆత్మగౌరవం పునాదిగా పుట్టిన ఈ పార్టీలన్నీ తమ భాషనూ, సంస్కృతినీ పరిరక్షించుకోవడానికి ఎన్నో ఉద్యమాలు చేశాయి. ముఖ్యంగా హిందీ భాష ఆధిపత్యంపై ఆ పార్టీలు చేసిన పోరాటాలు దక్షిణాదిన పలు రాష్ట్రాలవారికి ఒరవడి అయ్యాయి. హేతువాదం, కాంగ్రెస్ వ్యతిరేకవాదం రెండూ ఈ పార్టీలకు రెండు కళ్లుగా ఉండేవి. అయితే ఇవన్నీ అనంతరకాలంలో వ్యక్తి కేంద్ర పార్టీలుగా మారిపోయాయి. పెరియార్ రామస్వామి ప్రవచించిన సిద్ధాంతాలను ఒక్కసారి చూస్తే డీఎంకే, అన్నా డీఎంకే వంటి పార్టీలను ద్రవిడ పార్టీలు అనవచ్చా అన్న సందేహం కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డాక అవినీతి ఆరోపణలు రావడం వింతేమీ కాదు. చిత్రమేమంటే, జయలలితకు శిక్షపడినట్టు వార్తలు వెలువడిన వెంటనే స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్న డీఎంకే కూడా అలాంటి సంకట స్థితిలోనే ఉన్నది. కరుణానిధి కుమార్తె కనిమొళి, బంధుగణం మారన్ సోదరులు మొదలుకొని ఆ పార్టీకి చెందిన ఎ.రాజావంటివారు తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ తీర్పుతో జయలలిత రాజకీయ జీవితం ముగిసినట్టేనని కొందరు నేతలు అంటున్నారు. న్యాయపరంగా ఆమెకు ఇంకా పలు ప్రత్యామ్నాయాలు మిగిలి ఉన్నపుడు ఇలా మాట్లాడటం తొందరపాటే అవుతుంది. జయలలితను రాజకీయ పటంనుంచి చెరిపేయడం అంత సులభమేమీ కాదు. ఈ పద్దెనిమిదేళ్లలో ఆమె దాదాపు డజను కేసులు ఎదుర్కొని నిర్దోషిగా బయటికొచ్చారు. టాన్సీ భూముల కుంభకోణంలో 2001లో ఆమె దోషిగా రుజువై అయిదేళ్లు శిక్షపడ్డాక ఎన్నికల్లో పోటీచేయడం సాధ్యంకాకపోయినా లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికై సీఎం పదవి చేపట్టారు. దోషిగా నిర్ధారణైనవారు ఇలా పదవి చేపట్టడం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు స్పష్టంచేయడంతో అదే ఏడాది సెప్టెంబర్లో ఆమె రాజీనామా చేయాల్సివచ్చింది. ఆ కేసులో అప్పీల్కు వెళ్లిన సందర్భంలో నిరపరాధిగా తేలాక 2002లో జయ మళ్లీ సీఎం అయ్యారు. నిష్పాక్షికంగా, సమర్ధవంతంగా వ్యవహరించి కేసులను తెమల్చడంలో, తీర్పులివ్వడంలో మన న్యాయస్థానాల చరిత్ర తిరుగు లేనిది. అయితే, ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా పూర్తయ్యేవిధంగా చర్యలు తీసుకోవడం కూడా అవసరం. అలాగే అధికార దుర్వినియో గాన్ని అరికట్టేందుకు పాలనాపరంగా పారదర్శక విధానాలు అమలయ్యే లా చూడవలసి ఉన్నది. ఇలాంటి కట్టుదిట్టమైన ఏర్పాట్లున్నప్పుడు అధికారంలో ఉన్నవారు అవినీతికి పాల్పడటమూ సాధ్యంకాదు. ఒకవేళ అలాంటిది జరిగినా వెనువెంటనే చర్యలు తీసుకునే వెసులుబాటూ ఉంటుంది. జయలలిత కేసునుంచి తీసుకోవాల్సిన గుణపాఠాలివే. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జయలలిత
-
బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన జయలలిత
బెంగళూరు : కర్ణాటల హైకోర్టులో జయలలిత సోమవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరపు న్యాయవాదులు ఈరోజు ఉదయం పిటిషన్ వేశారు. తనకు విధించిన శిక్షను సవాల్ చేస్తూ ...ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని జయలలిత తన పిటిషన్లో కోరారు. ఈ పిటిషన్ మంగళవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. జయలలితతో పాటు శశికళ, ఇళవరసి, సుధాకరన్ కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. ఆయన ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత సాదాసీదాగా గడిపారు. జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్లో ఉంచారు. -
బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జయ
బెంగళూరు : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత సోమవారం కర్ణాటక హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. నేటి నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ హైకోర్టుకు దసరా సెలవుల నేపథ్యంలో ఆమె తరపు న్యాయవాదులు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై స్టే విధించాలని పిటిషన్లో కోరనున్నారు. కాగా ఈ బెయిల్ పిటిషన్ను ప్రత్యేక వెకేషన్ బెంచ్ మంగళవారం విచారణకు తీసుకోనున్నట్లు సమాచారం. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. మరోవైపు అమ్మకు వీరవిధేయుడైన ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు నిన్న ఆయనను శాసనసభపక్ష నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. -
జైలులో సాదాసీదాగా జయ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడి ఇక్కడి పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఉన్న జయలలిత ఆదివారం సాదాసీదాగా గడిపారు.జయను వీఐపీల కోసం కేటాయించిన 23వ బ్యారెక్లో ఉంచారు. ఇందులో ఓ ఫ్యాన్, మంచాలు, టేబుల్, టీవీ, కుర్చీలు ఉంటాయి. వీఐపీ హోదా ఉండడంతో సాధారణ ఖైదీల దుస్తులను ఆమెకివ్వలేదు. జైలుకు చేరిన తొలి రోజు రాత్రి (శనివారం) ఆమె సరిగా నిద్రపోలేదని తెలుస్తోంది. అర్ధరాత్రి తర్వాత నిద్రకు ఉపక్రమించిన జయ ఆదివారం పొద్దున 5.30కు లేచారు. 45 నిమిషాలు మార్నింగ్ వాక్ చేశారు. అనంతరం దినపత్రికలు చదివారు. జైలులో వండిన ఆహారం తినేందుకు నిరాకరించిన జయ బయటి నుంచి ఇడ్లీ, సాంబార్ తెప్పించుకుని అల్పాహారం చేశారు. మధుమేహంతో బాధపడుతున్న జయకు ఆదివారం రెండుసార్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. మరోవైపు జయను కలవడానికి ఆదివారం ఉదయం తమిళనాడు నుంచి వచ్చిన మంత్రులు, అధికారులను జైలు సిబ్బంది అనుమతించలేదు.జైలు నిబంధనల ప్రకారం ఆదివారం బయటి వ్యక్తులను ఖైదీలతో కలవడానికి అనుమతించడం లేదు. జయకు బెయిల్ కోసం ఆమె లాయర్లు సోమవారం కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేయనున్నారు. జయ తరఫున ప్రముఖ న్యాయవాది రామ్ జెఠ్మలానీ వాదించనున్నారు. -
జయ ఆస్తుల వివరాలు
చెన్నై: జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా వెలుగు చూసిన ఆస్తుల వివరాలు... జయలలితకు చెన్నైలోని పోయెస్ గార్డెన్లో విలాసవంతమైన భవనంతో పాటు తమిళనాడులోనే పలు చోట్ల బంగళాలు, వ్యవసాయ భూమి, నీలగిరిలో తేయాకు తోట, విలువైన ఆభరణాలు, పారిశ్రామిక షెడ్లు, బ్యాంకుల్లో నగదు డిపాజిట్లు, పెట్టుబడులు, రెండు లగ్జరీ కార్లు తదితర ఆస్తులు ఉన్నాయి. 1997లో చెన్నైలోని జయలలిత నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించినప్పడు...800 కేజీల వెండి, 28 కేజీల బంగారం, 750 జతల పాదరక్షలు, 10,500 చీరలు, 91 వాచీలు తదితర విలువైన వాటిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున స్థిరాస్తులను కూడా జయ కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. జయలలితకు హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో 651.18 చదరపు మీటర్ల స్థలంలో భవనం. జీడిమెట్ల, రంగారెడ్డి జిల్లా బషీరాబాద్లో 11.35 ఎకరాల్లో ద్రాక్ష తోట, రెండు ఫామ్ హౌస్లు, కార్మికుల కోసం ఇళ్లు ఉన్నాయి. అలాగే, మేడ్చల్ సమీపంలో 3.15 ఎకరాల స్థలం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆంజనేయ తొట్టంలో 222.92 చదరపు మీటర్ల స్థలంలో భవనం ఉంది. అయితే, వీటిలో కొన్ని ఆస్తులు జయలలిత ఒకనాటి ఇష్టసఖి శశికళ, నాటి దత్త పుత్రుడు సుధాకరన్, శశికళ సోదరుని కోడలు ఇళవరసిల పేరు మీద ఉండడంతో వారు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. వీటికి తోడు సుధాకరన్ వివాహం కోసం జయ రూ.100 కోట్లు ఖర్చు పెట్టినట్లు గతంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. -
కేసు విచారణ ఖర్చు రూ.5 కోట్లు!
చెన్నై: జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణకు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. ఒక్క కర్ణాటక ప్రభుత్వమే జయ కేసు విచారణకు సుమారు రూ. 2.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగులోకి వచ్చింది. అధికారంలో ఉన్న సమయంలో ఆదాయానికి మించిన ఆస్తులు గడించారంటూ జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ, బంధువులు ఇలవరసి, సుధాకరన్పై కేసులు నమోదవడం తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి 18 ఏళ్లుగా కోర్టుల్లో విచారణ సాగుతోంది. తొలుత మద్రాసు హైకోర్టులో విచారణ సాగింది. రాష్ట్రంలో అన్నాడీఎంకే మళ్లీ అధికారం చేపట్టడంతో కేసు నీరుగారుతుందనే భావన వ్యక్తమైంది. దీంతో డీఎంకే ప్రధాన కార్యదర్శి అన్భళగన్ దాఖలు చేసిన పిటిషన్తో కేసు విచారణ బెంగళూరు ప్రత్యేక కోర్టుకు చేరింది. -
నేను ఆ తీర్పును చూడలేదు!
న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కోర్టు దోషిగా తేల్చిన అంశానికి సంబంధించి మాట్లాడానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తిరస్కరించారు. 18 ఏళ్ల నాటి కేసులో జయలలితకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేస్తూ బెంగళూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాజ్ నాథ్ సింగ్ దాటవేత ధోరణి అవలంభించారు.'నేను ఆ తీర్పుకు సంబంధించి ఎటువంటి కామెంట్ చేయలేను. ఆ తీర్పును నేను ఇంతవరకూ చూడలేదు'అని తెలిపారు. 1991 నుంచి 1996 వరకూ జయలలిత సీఎంగా ఉన్న మధ్యకాలంలో రూ. 66. 65కోట్ల అక్రమాస్తులను కూడగట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. -
ఒక్క కోర్టు తీర్పుతో రాజకీయాల్లో పెనుమార్పులు!
చెన్నై: ముఖ్యమంత్రి జే.జయలలిత ఆదాయానికి మంచి ఆస్తులున్నాయనే ఆరోపణలతో నమోదైన కేసులో బెంగళూరు కోర్టు వెల్లడించే తీర్పు తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 18 సంవత్సరాలుగా కోర్టు విచారణలో ఉన్న ఈ కేసులో జయలలిత, మరో ముగ్గురుపై తీర్పును శనివారం కర్నాటక రాజధాని బెంగళూరులోని ఓ ప్రత్యేక కోర్టు వెల్లడించనుంది. ఒకవేళ జయలలితకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడితే తమిళనాడు రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని, అంతేకాకుండా 2016లో పార్టీ విజయావకాశాలు, ఆమె ఇమేజ్ దెబ్బతినడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రలో బలయ్యానని ఆరోపణలు చేస్తున్న జయలలితకు అనుకూలంగా తీర్పు వస్తే డీఎంకే పరిస్తితి మరింత దెబ్బతినే విధంగా ఉంటుందంటున్నారు. 1996లో ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జయలలిత 66 కోట్ల రూపాయలు..లెక్కకు మించి ఉన్నాయని డీఎంకే అధినేత ఎం కరుణానిధి కేసు నమోదు చేశారు. -
మెడికో బలవన్మరణం
నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్లో ఘటన నెల్లూరు రూరల్: ఓ వైద్య విద్యార్థిని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. చింతారెడ్డిపాళెంలోని నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ సీఐ సుధాకర్రెడ్డి కథనం మేరకు..కర్నూలులోని అబ్దుల్ఖాన్ ఎస్టేట్లో ఉన్న కొండవీటి అపార్టుమెంట్లో నివసిస్తున్న దాసరి భాస్కర్రెడ్డికి ఇద్దరు సంతానం. కుమార్తె నాగశ్రావణి(21) నారాయణ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతోంది. మొదటి నుంచి చదువులో రాణించే నాగశ్రావణి సున్నిత మనస్కురాలు. కొంతకాలంగా ఆమె ముఖంపై మచ్చలతో బాధపడుతూ చికిత్స పొందుతోంది. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటికి వస్తానని కుటుంబసభ్యులకు ఫోన్ చేసింది. ఒక్క రోజు సెలవుకు ఇంతదూరం ఎందుకు సోమవారం తానే వస్తానని తండ్రి సర్దిచెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన నాగశ్రావణి తన గదిలో రాత్రి చున్నీతో ఉరివేసుకుంది. రాత్రి 10.45 గంటలకు సహచర విద్యార్థిని తలుపుతట్టగా ఎంతకీ తెరవకపోవడంతో పక్క గదుల్లోని విద్యార్థినులు, వాచ్మన్తో కలిసి గడ్డపారతో తలుపు తెరిచి ఉరికి వేలాడుతున్న నాగశ్రావణిని హుటాహుటిన నారాయణ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆమె అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సీఐ సుధాకర్రెడ్డి, ఎస్సై గిరిబాబు ఆదివారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహానికి నెల్లూరులోని పెద్దాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. కుటుంబసభ్యులు, బంధువులు, మెడికల్ కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పెద్దసంఖ్యలో పెద్దాసుపత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. సీఐ సుధాకర్రెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చిక్కుల్లో జయలలిత!
న్యూఢిల్లీ: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. 66 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఈ కేసు విచారణపై విధించిన స్టేను కోర్టు మంగళవారం ఎత్తివేసింది. అలాగే ఆమెకు చెందిన ఆదాయానికి మించిన ఆస్తుల్లో తమ ఆస్తులను చేర్చి జప్తు చేశారని చెన్నైకి చెందిన లెక్స్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వేసిన పిటిషన్ను దిగువ కోర్టు పరిష్కరించేదాకా విచారణపై స్టే విధించాలన్న జయ పిటిషన్ను కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో ఆమె చిక్కుల్లో పడ్డారు. లెక్స్ ప్రాపర్టీ డెవలప్మెంట్ కంపెనీ వాటాలతో తనకు సంబంధంలేదని జయలలిత వాదన. జయపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై ఆమె హయాంలో చెన్నైలో పారదర్శక విచారణ సాధ్యం కాదని ఓ పిటిషన్ దాఖలు కావడంతో సుప్రీం కోర్టు ఆదేశంపై కేసును 2003లో బెంగళూరు కోర్టుకు బదిలీ చేశారు. -
అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు ఊరట
అక్రమాస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఊరట లభించింది. ఈ కేసులో విచారణపై సస్పెన్షన్ను సుప్రీంకోర్టు జూన్ 16వ తేదీ వరకు పొడిగించింది. సుప్రీం న్యాయమూర్తులు జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ సి.నాగప్పన్లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ఉన్న బినామీ ఆస్తుల అసలు యజమానులు ఎవరన్న విషయం తేలేవరకు ఈ కేసులో విచారణ ముందుకు వెళ్లకూడదని ఈ ధర్మాసనం భావించింది. ఈ కేసులో విచారణపై స్టేను వెకేట్ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన డీఎంకే నాయకుడు కె.అన్బళగన్కు కూడా కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. కాగా, తమిళనాడు విజిలెన్స్, ఏసీబీ శాఖ వారం రోజుల్లోగా జయలలిత పిటిషన్పై తమ సమాధానాన్ని తెలపాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. -
గులాబీలో గుబులు!
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: గులాబీ దళంలో సీబీఐ గుబులు నెలకొన్నట్టు సమాచారం. ఎన్నికల వేళ ఇవేం చిక్కులు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు విజయశాంతి సైతం ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ సీనియర్ నాయకుడు హరీష్రావు, అలాగే విజయశాంతిపై అక్రమాస్తుల ఆరోపణలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని నాంపల్లి సీబీసీ ప్రత్యేక కోర్టు సీబీఐ ఎస్పీని ఆదేశించడంతో మెతుకుసీమలో రాజకీయ కలకలం రేగుతోంది. ఇదే జిల్లాకు చెందిన బీజేపీ నాయకుడు(మాజీ టీఆర్ఎస్ నేత) రఘునందన్రావు చేసిన ఆరోపణల ఆధారంగా హైదరాబాద్కు చెందిన బాలాజీ వడేరా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. పిటిషనర్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో రాజకీయ విశ్లేషకుల దృష్టి జిల్లా రాజకీయాల మీద పడింది. 2001 తర్వాత కేసీఆర్ ఉద్యమం పేరుతో అక్రమంగా డబ్బు కూడబెట్టారని కోర్టుకు విన్నవించారు. అప్పట్లో టీఆర్ఎస్లో ఉన్న విజయశాంతి ఇంట్లోనే రూ. 100 కోట్ల లావాదేవీలు నడిచాయని, ఇదంతా అక్రమంగా వసూలు చేసిన మొత్తం అని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిజానికి పైముగ్గురు నాయకులు కూడా ఇటీవలే ఎన్నికల కమిషన్కు తమ ఆస్తుల అఫిడవిట్లను సమర్పించారు. ఈ ముగ్గురు ఆస్తులు అన్నీ కలిపి కనీసం రూ. 40 కోట్లు కూడా దాటలేదు. కానీ కోర్టు ఏకంగా రూ. 100 కోట్ల అక్రమ ఆస్తులపై విచారణ జరపాలని ఆదేశించడంతో మిగిలిన ఆస్తులు ఎక్కడ నుంచి బయట పడతాయోనని జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల అఫిడవిట్లో కేసీఆర్ తనకు కారు లేదని చూపించారు. జగదేవ్పూర్ మండలం ఎర్రవ ల్లి గ్రామంలో 37 ఎకరాల 70 గుంటల వ్యవసాయ భూమి ఉన్నట్టు కేసీఆర్ చూపించారు. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ 4.5 కోట్లు అని పేర్కొన్నారు. దీనితో పాటు సిద్దిపేట మండలం మిట్టపల్లిలో 2 ఎకరాల భూమి ఉందని దీని మార్కెట్ విలువ రూ. 50 లక్షలు ఉంటుందని చెప్పారు. బంజారాహిల్స్లో 584 గజాల స్థలం, కరీంనగర్లో 1,449 గజాల స్థలం ఉందని వీటి మార్కెట్ విలువ రూ. 8.65 కోట్లు అని చెప్పారు. వీటితో పాటు రూ. 7.88 కోట్లు అప్పులు ఉన్నట్లు కేసీఆర్ చూపించారు. ఆయన భార్య పేరిట 650 గ్రాముల బంగారం ఉన్నట్లు చూపించారు. విజయశాంతి ఆస్తులు: ఇక విజయశాంతి , ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్ పేరిట రూ. 29.87 కోట్లు స్థిరాస్తి ఉన్నట్లు చూపించారు. రూ 70.61 లక్షల చరాస్తి ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అప్పులు ఏమి లేవన్నారు. టయోటా(రూ.5.89 లక్షలు) వాహనం ఉన్నట్లు చూపించారు. హరీష్ ఆస్తుల వివరాలు: హరీష్రావు తన పేరిట రూ. 1.35 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తి ఉందని, తన భార్య శ్రీనిత పేరిట రూ. 1.60 కోట్ల చరాస్తులు ఉన్నాయని చూపించారు. వాటితో పాటు తన భార్యకు రూ 1.21 కోట్ల అప్పుందని పేర్కొన్నారు. 16 లక్షల విలువ చేసే ఇన్నోవా కారు ఉందని చూపించారు. -
బినామీ ఆస్తుల కేసులో బబన్కు మూడేళ్ల జైలు
సాక్షి, ముంబై: తిరుగుబాటుదారులతో సతమతమవుతున్న శివసేనకు మరో షాక్ తగిలింది. ఈ సారి శివసేనకు తిరుగుబాటుదారులతోకాకుండా కోర్టు నుంచి ఆ పార్టీకి తేరుకోలేని దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఆ పార్టీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో షిరిడీ లోక్సభ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించిన మాజీ మంత్రి బబన్రావ్ ఘోలప్పై 14 ఏళ్ల కిందట నమోదైన బినామీ ఆస్తుల కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు బబన్రావ్ ఘోలప్కు మూడేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ. లక్ష జరిమానా విధించింది. 1995-99 మద్యకాలంలో శివసేన-బీజేపీలు అధికారంలో ఉండగా బబన్రావ్ ఘోలప్ మంత్రిగా విధులు నిర్వహించారు. అదే సమయంలో ఆయన అనేక బినామీ ఆస్తులను సంపాదించారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై మిలింద్ యావత్కర్ ఫిర్యాదు చేశారు. అలాగే ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే కూడా ఆయనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో బబన్రావ్ మంత్రి పదవిని కూడా కోల్పోయారు. గత 14 ఏళ్లుగా కోర్టులో కేసు విచారణ కొనసాగుతోంది. ఎట్టకేలకు శుక్రవారం కోర్టు తీర్పు వెలువడింది. తన తీర్పులో నిందితుడైన బబన్రావ్ ఘోలప్కు మూడేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ. ఒక లక్ష జరిమానా విదించింది. బబన్రావ్ రాజకీయ జీవితానికి ముప్పు..? కోర్టు తీర్పు అనంతరం బబన్రావ్ రాజకీయజీవితానికి ముప్పు ఏర్పడిందని చెప్పవచ్చు. సుప్రీంకోర్టు గతంలో ప్రకటించిన ఆదేశాల మేరకు రెండేళ్లకంటే అధికంగా శిక్షపడినవారు ఎన్నికల్లో పోటీ చేయరాదు. దీంతో బబన్రావ్ ఘోలప్ అభ్యర్థిగా ఉంటారా లేదా శివసేన మరో అభ్యర్థిని ప్రకటిస్తుందా అనేది వేచిచూడాల్సిందే. ఆస్తులను జప్తుచేయాలి... అన్నా హజారే బబన్రావ్ ఘోలప్కు కోర్టు వేసిన శిక్షపై అన్నా హజారే హర్షం వ్యక్తం చేశారు. రాజకీయపార్టీలకు కూడా ఇది ఒక గుణపాఠం కావాలన్నారు. అవినీతి రాజకీయనాయకులను అసెంబ్లీ, పార్లమెంట్కు పంపొద్దన్న సందేశానికి ఈ తీర్పు బలం చేకూరేలా చేసింది. ఇలాంటి అవినీతికి పాల్పడేవారి ఆస్తులను ప్రభుత్వం జప్తు (స్వాధీనం) చేసుకోవాలి. -
మెస్ నిధులు మింగేశారు!
కోనాం ఆశ్రమ పాఠశాలలపై ఏసీబీ దాడులు రెండు పాఠశాలలో అవకతవకలు ఉన్నట్లు గుర్తింపు రికార్డులు స్వాధీనం లేని విద్యార్థుల పేరిట మెస్ నిధులు స్వాహా ఆయా శాఖలకు ఫిర్యాదు చేస్తాం: డీఎస్పి ప్రకటన చీడికాడ, న్యూస్లైన్: మండలంలోని కోనాంలో గల గిరిజన బాలుర ఆశ్రమోన్నత పాఠశాల, సాంఘిక సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలపై ఏసీబీ అధికారులు గురువారం దాడులు జరిపారు. రికార్డుల్లో పలు అవకవకలు గుర్తించారు. ఉదయం 9.15 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకు రెండు బృందాలుగా దాడులు చేపట్టారు. ఏసీబీ డిఎస్పి ఎం.నర్సింహారావు ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో రెండు పాఠశాలల్లో అవకతవకలు బయటపడ్డాయి. దీనిపై డీఎస్పీ నర్సింహారావు విలేకరులతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదుల మేరకు ఈ దాడులు చేపట్టినట్లు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి. గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో రికార్డుల పరంగా 189 మంది విద్యార్థులు ఉండాల్సి ఉండగా బుధవారం రాత్రి 168 మంది ఉన్నట్లు మెస్ రికార్డుల్లో వార్డెన్ దేముడబ్బాయి నమోదు చేశారన్నారు. అయితే గురువారం ఉదయం తనిఖీల్లో 53 మందే ఉన్నట్లు గుర్తించామని, రోజుకు 115 మంది పేరిట మెస్ చార్జిల నిధులు కాజేస్తున్నట్లు గుర్తించామన్నారు. అలాగే సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో రికార్డులు పరంగా 439 మంది విద్యార్థినులు ఉండాగా బుధవారం రాత్రి 431 మంది ఉన్నట్లు మెస్ రికార్డుల్లో నమోదు చేసుందని, అయితే తమ తనిఖీల్లో 409 మందే విద్యార్థులు మాత్రమే ఉన్నట్టు గుర్తించామని తెలిపారు. ఇక్కడ 22 మంది విద్యార్థుల పేరిట ప్రిన్సిపాల్ శ్రీదేవి, వార్డెన్ రామలక్ష్మి మెస్ ఛార్జిలు కాజేస్తున్నట్టు గుర్తించామని అన్నారు. సంబంధిత రికార్డులను సీజ్ చేసి వీరిపై ఆయా శాఖలకు ఫిర్యాదులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడుల్లో 30 మంది సిబ్బంది పాల్గొన్నారు.