నేను ఆ తీర్పును చూడలేదు! | Rajnath refuses to comment on Jayalalitha's conviction | Sakshi
Sakshi News home page

నేను ఆ తీర్పును చూడలేదు!

Published Sat, Sep 27 2014 7:39 PM | Last Updated on Thu, Sep 27 2018 8:37 PM

నేను ఆ తీర్పును చూడలేదు! - Sakshi

నేను ఆ తీర్పును చూడలేదు!

న్యూఢిల్లీ: ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కోర్టు దోషిగా తేల్చిన అంశానికి సంబంధించి మాట్లాడానికి కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ తిరస్కరించారు. 18 ఏళ్ల నాటి కేసులో జయలలితకు నాలుగేళ్ల శిక్షను ఖరారు చేస్తూ బెంగళూర్ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నలకు రాజ్ నాథ్ సింగ్ దాటవేత ధోరణి అవలంభించారు.'నేను ఆ తీర్పుకు సంబంధించి ఎటువంటి కామెంట్ చేయలేను. ఆ తీర్పును నేను ఇంతవరకూ చూడలేదు'అని తెలిపారు.

 

1991 నుంచి 1996 వరకూ  జయలలిత సీఎంగా ఉన్న మధ్యకాలంలో రూ. 66. 65కోట్ల అక్రమాస్తులను కూడగట్టారని ఆరోపిస్తూ సుబ్రహ్మణ్యం కోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా ఆమెకు నాలుగేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement