
మావోయిస్టు దంపతుల లొంగుబాటు
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టు దంపతులు ఆదివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. కుక్కల గణపతి అలియాస్ రాజుతోపాటు అతని భార్య చెన్నూరి సర్వక్క అలియాస్ స్వరూప వ్యక్తిగత కారణాల వల్ల లొంగిపోయారని జిల్లా ఎస్పీ భాస్కరన్ తెలిపారు. వీరిద్దరు చర్ల-వెంకటాపూర్ ఏరియా కమిటీలో దళ సభ్యులుగా పని చేశారన్నారు.