పెట్రో ధరలపై వినూత్న నిరసన | New Couple Protest On Petrol Price Hikes in Tamil Nadu | Sakshi
Sakshi News home page

ఎడ్లబండిలో నవవధూవరుల షికారు

Published Fri, Jan 25 2019 12:18 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

New Couple Protest On Petrol Price Hikes in Tamil Nadu - Sakshi

ఎడ్లబండిపై షికారుచేస్తున్న నవ వధూవరులు

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కన్యాకుమారి జిల్లా కరుంగల్‌కు చెందిన పొన్‌ షోజిన్‌రాజ్‌ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిక్కనంగాడుకు చెదిన పొన్నిట్ర అనే ఉపాధ్యాయురాలితో బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెళ్లికాగానే నవవధూవరులు కరుంగల్‌లోని వరుడి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు సాయంత్రం వివాహ రిసెప్షన్‌ కోసం వధూవరులు కల్యాణమండపానికి వెళ్లేందుకు జోడెద్దుల బండిని పిలిపించుకున్నారు. బండి ముందువైపు కేరళ వాయిద్యాలు, నృత్యాలు సాగుతుండగా ఊరేగింపుగా బయలుదేరారు.ఇదేం చోద్యమని పలువురు ప్రశ్నించగా పెరిగిపోతున్న పెట్రోలు ధరలకు నిరసనగా తానే ఈ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్‌ నేతైన వరుడి తండ్రి జవాబిచ్చాడు. పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలాగే పెరిగిపోతే మరికొంతకాలానికి ఎడ్లబండే దిక్కు అనే సందేశాన్ని కేంద్రానికి ఇవ్వడానికే ఈ ఊరేగింపని అన్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement