Petrol price hike
-
బీజేపీ ప్రభుత్వ అవినీతిని బయటపెట్టండి : స్టాలిన్
చెన్నై: ప్రత్యేక పార్లమెంట్ సెషన్ల సందర్బంగా బీజేపీ ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చెయ్యాలని డీఎంకే పార్టీ శ్రేణులను కోరారు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజీపీ ప్రభుత్వం సుమారు రూ.7.50 లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని అవినీతితో పాటు మణిపూర్లో జరిగిన మారణకాండ గురించి కూడా ప్రస్తావించాలని డీఎంకే నేతలను కోరారు. తొమ్మిదేళ్లలో చాలా పెంచేశారు.. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ మరోసారి కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఏర్పడిన ఇండియా కూటమి గెలుపు కోసం పార్టీ శ్రేణులు మరింత కష్టపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 2014 నుంచి 2023 వ్యవధిలో పెట్రోల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారాన్ని పెంచేసిందన్నారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారతదేశ రుణభారం రూ.55 లక్షల కోట్లు ఉండగా బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈ రుణభారం రూ.155 లక్షల కోట్లకు చేరిందన్నారు. ముసుగు తొలగించండి.. కాగ్ నివేదిక ఆధారంగా కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆయా ప్రభుత్వ పధకాల అమల్లో రూ.7.5 కోట్ల అవినీతికి పాల్పడిందని, ఆధారాలతో సహా వారి అవినీతిని బయట పెట్టాలని పార్టీ సభ్యులను కోరారు స్టాలిన్. బీజేపీ అవినీతికి ముసుగు వేసిందని ఆ ముసుగును ఎలాగైనా తొలగించాలని అన్నారు. బీజేపీ అమలు చేస్తోన్న ఒకే జీఎస్టీ విధానం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని అన్నారు. జాతీయ విద్యా విధానం తమిళనాడులో విద్యా వ్యవస్థ పురోగతిపై ప్రభావం చూపిందన్నారు. అవినీతి అంతా ఇక్కడే.. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు రాష్ట్ర బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నారాయణ తిరుపతి మాట్లాడుతూ బీజేపీ హయాంలో ఎల్పీజీ గ్యాస్ వినియోగదారుల సంఖ్య 14 కోట్లు నుంచి 34 కోట్లకి పెరిగిందని అందుకు తగ్గట్టుగానే ధర కూడా పెరుగుతూ వచ్చిందని ఇక కాగ్ నివేదికలో ఏదైనా అవినీతి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వ హయాంలో జరిగినదేనని అన్నారు. ఇది కూడా చదవండి: ఇండియా కూటమిపై సీఎం ఏక్నాథ్ షిండే సెటైర్లు -
అల్లాడుతున్న ప్రజలు.. ఏకంగా రూ.10 పెరిగిన పెట్రోల్ ధర
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో అల్లాడుతున్న ప్రజలపై ఆ దేశ ప్రభుత్వం మరింత భారాన్ని మోపింది. ఇప్పటికే రూ.272 ఉన్న లీటర్ పెట్రోల్ ధరను ఏకంగా రూ. 10 పెంచింది. తాజా పెంపు తర్వాత ఇప్పుడు పెట్రోల్ ధర లీటరుకు రూ.282కి పెరిగింది. ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ అర్ధరాత్ర ఈ పెంపును ప్రకటించారు. ప్రస్తుతం ఆ దేశంలో డీజిల్ ధర రూ.293, తేలికపాటి డీజిల్ ఆయిల్ ధర రూ. 174.68 గా ఉంది. కిరోసిన్ ధర కూడా రూ.5.78 పెరిగి రూ.186.07కి చేరింది. కొత్త ధరలు ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. గత 15 రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరిగిన కారణంగా పెట్రోలు, కిరోసిన్ ధరలు పెంచినట్లు చెప్పారు. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్తాన్ దివాళా తీయకుండా బయటపడేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) నుంచి 1.1 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీకి ప్రయత్నించింది. అయితే దీనికి సంబంధించి ఐఎంఎఫ్తో ఒప్పందం విఫలమైంది. ఈ నిధులు 2019లో ఐఎంఎఫ్ ఆమోదించిన 6.5 బిలియన్ డాలర్ల బెయిల్అవుట్ ప్యాకేజీలో భాగం. విదేశీ రుణాల్లో పాకిస్తాన్ డిఫాల్ట్ కాకుండా ఉండాలంటే ఇది చాలా కీలకం. ఇదీ చదవండి: ఐఫోన్ 15 రాకతో కనుమరుగయ్యే ఐఫోన్ పాత మోడళ్లు ఇవే.. -
‘పెట్రోల్తో పాలు పోటీపడుతున్నాయి.. ఇక్కడితో ఆగదు’
గాంధీనగర్: పాల ధరను లీటరుకు రూ.2 పెంచుతున్నట్లు అమూల్ సంస్థ ప్రకటించింది. ఈ క్రమంలో పాల ధరలపై ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. ధరల పెరుగుదల విషయంలో పెట్రోల్తో పాలు పోటీ పడుతున్నట్లు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా. ధరలపై ఉదాసీనత ప్రదర్శించే ప్రభుత్వ తప్పులతో దేశంలోని మధ్యతరగతి కుటుంబాలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నాయని విమర్శించారు. ఫుల్ క్రీమ్ మిల్క్, గేదె పాలపై లీటర్కు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు అమూల్ బ్రాండ్ పేరిట మార్కెటింగ్ చేసే గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) వెల్లడించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లోనూ కొత్త ధరలు అమలవుతాయని వెల్లడించింది. దీనిపై ఆప్ ఎంపీ రాఘవచద్దా ట్వీట్ చేశారు. ‘మీకు చెప్పాను కదా..! ధరల విషయంలో పాలు, పెట్రోల్ పోటీ పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. పెరుగుదలతో సామాన్యుల నడ్డి విరుగుతోంది. ఈ రోజు అమూల్ పాల ధరలు లీటర్కు రూ.2 చొప్పున పెరిగాయి. ఉదాసీనంగా వ్యహరిస్తోన్న ప్రభుత్వం కారణంగా సామాన్య ప్రజలు మూల్యం చెల్లించుకుంటూనే ఉన్నారు. పాల ధరలు మళ్లీ పెరుగనున్నాయి? కారణాలు.. పశుగ్రాసం ధరల విపరీతంగా పెరగటం, లంపీ వైరస్ వ్యాప్తి’ అని భాజపాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పశుగ్రాసం ధరలు భారీగా పెరిగిపోతున్నాయని, దాంతో రైతులు ఇతర పంటలను పశువులకు అందిస్తున్నట్లు గుర్తు చేశారు రాఘవ్ చద్ధా. పశుగ్రాసం ధరలు 9 ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొన్నారు. ఒక్క గుజరాత్లోనే గత రెండేళ్లలో 1.36 లక్షల హెక్టార్ల పశుగ్రాసం సాగు తగ్గిపోయిందన్నారు. పశుగ్రాసానికి కొరత ఏర్పడిన క్రమంలో 2020లో 100 ఎఫ్పీఓలు ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం.. ఇప్పటి వరకు ఒక్కటి సైతం ఏర్పాటు చేయలేకపోయిందని ఆరోపించారు. ఇదీ చదవండి: రాహుల్ ఓ ఫెయిల్డ్ మిసైల్.. కాంగ్రెస్ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై -
బంగ్లాదేశ్లో 53 శాతం పెరిగిన పెట్రోధరలు
-
బైక్పై శివ-పార్వతుల వేష ధారణలో నిరసన.. అరెస్ట్!
డిస్పూర్: దేశంలో పెట్రోల్, డీజిల్లతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశానంటుతున్నాయి. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ధరల పెరుగుదలపై తమకు తోచిన విధంగా నిరసన తెలుపుతున్నారు ప్రజలు. అలా.. పెట్రోల్ ధరలపై వినూత్న రీతిలో నిరసన తెలిపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శివుడు, పార్వతి వేషధారణలో ధరలపై చిన్న నాటకం ప్రదర్శించి హిందూ సంఘాల ఆగ్రహానికి గురయ్యారు. అసోంలోని నగావ్ జిల్లాకు చెందిన బిరించి బోరా అనే వ్యక్తి తనకు వచ్చిన విద్యతో పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. బోరా.. శివుడిగా చిన్న నాటకం ప్రదర్శించారు. ఆ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీంతో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి హిందూ సంస్థలకు ఆగ్రహాన్ని తెప్పించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాయి. రాజకీయాల కోసం మతాలను వాడుకుంటున్నారని ఆరోపించాయి. ఫిర్యాదు అందుకున్న పోలీసులు.. బిరించి బోరాను అరెస్ట్ చేసి నగావ్ సదర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. శివపార్వతుల నాటకంలో ఏముంది? ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయాంలో ధరల పెరుగుదలపై నిరసన తెలిపేందుకు సిద్ధమైన బిరించి బోరా.. వీధి నాటకం వేశారు. బోరా శివుడిగా.. కోయాక్టర్ పరిశిమిత పార్వతిగా బైక్పై వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లగానే పెట్రోల్ అయిపోయి.. బండి ఆగిపోతుంది. ఈ విషయంపై ఇరువురి మధ్య వాగ్వాదం నడుస్తుంది. దీంతో పెట్రోల్ ధరల పెంపు సహా ఇతర అంశాలను లేవనెత్తుతూ నరేంద్ర మోదీ ప్రభుత్వంపై శివుడు ఆరోపణలు చేస్తారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని పిలుపునిస్తారు. ఇదీ చదవండి: జైలు నుంచే అక్రమాలు.. 81 మంది అధికారులకు లక్షల్లో ముడుపులు -
తప్పడం లేదు.. మాజీ ప్రధాని వల్లే ఇలా జరిగింది
దాయాది దేశం పాకిస్తాన్లో పెట్రో ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రో ధరల విషయంలో ప్రభుత్వం తీరుపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కౌంటర్ ఇచ్చారు. తమ దేశం(పాకిస్తాన్) దివాళా తీయకుండా ఉండేందుకే ఇంధన ధరలను పెంచడం తప్పనిసరి అని ప్రధానియ షరీఫ్ అన్నారు. పెట్రోలియం ధరల పెంపు నిర్ణయం కఠినమైనది కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాల్సి వస్తోందన్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటూ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదన్నారు. గత ప్రభుత్వ నిర్ణయాలు, నిర్లక్ష్యం కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నదని ఇమ్రాన్పై మండిపడ్డారు. గత సర్కార్.. పెట్రోల్ సహా పలు ఇంధనాలపై సబ్సిడీ ఇచ్చింది. ధరల పెంపుపై ఐఎంఎఫ్ సూచనలను పట్టించుకోకుండా సబ్సిడీలను కొనసాగిస్తూ వచ్చారు. కానీ పెట్రోల్ ధరలు పెంచితేనే ఆర్థిక సాయం అందిస్తామని ఐఎంఎఫ్ తేల్చిచెప్పడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు. అంతకుముందు.. ఇంధనంపై అమలులో ఉన్న సబ్సిడీ సదుపాయాన్ని తొలగించే వరకు పాకిస్తాన్కు ఎలాంటి ఆర్థిక సాయం అందించలేమని ఐఎంఎఫ్ తెగెసి చెప్పింది. ఇదిలా ఉండగా.. దేశవ్యాప్తంగా అన్ని రకాల పెట్రోలియం ఉత్పత్తులపై లీటరుకు రూ.30 పెంచుతున్నట్లు పాక్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ.179.85, డీజిల్ లీటరు రూ.174.15, కిరోసిన్ రూ.155.95, లైట్ డీజిల్ రూ.148.41కు ఎగబాకాయి. ఆర్థిక సాయంపై అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాక్ బుధవారం జరిపిన చర్చలు విఫలం కావడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ధరలు పెంచామని పాక్ ఆర్థిక మంత్రి మిఫాత్ ఇస్మైల్ తెలిపారు. ఇది కూడా చదవండి: ఉత్తరకొరియాకు భారీ ఊరట.. -
మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
పెరుగుతున్న పెట్రోల్ రేట్లు.. ప్రతీ ఉద్యోగికి రూ.74 వేలు ఇచ్చిన యజమాని
కరోనా కాటుకు ప్రపంచంలోని అనేక దేశాలు నెమ్మదిగా ద్రవ్యోల్బణం అంచుల్లోకి చేరుకుంటున్నాయి. వరుసగా పెట్రోలు, ఎలక్ట్రిసిటి, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. దీనికి తగ్గట్టుగా జీతాలు పెరగక ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. అయితే వీళ్ల కష్టాలు చూడలేని ఓ కంపెనీ యజమాని అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడది ప్రపంచ వ్యాప్తంగా బిజినెస్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఇంగ్లండ్లో ఇంగ్లండ్కి చెందిన ఎమెరీస్ టింబర్ అండ్ బిల్డర్ మర్చంట్స్ కంపెనీ యజమాని అరుదైన నిర్ణయం తీసుకున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా ఆ దేశంలో ఎలక్ట్రిసిటీ, గ్యాస్, పెట్రోలు పెట్రోలు ధరలు పెరిగిపోవడంతో, ఆ ఖర్చులకు తట్టుకునేలా ప్రతీ ఉద్యోగికి జీతంతో పాటు అదనంగా 750 యూరోలు (సుమారు రూ. 74,251) అందించాడు ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జేమ్స్ హిప్కిన్స్. ఈ విషయాన్ని కంపెనీ ట్విట్టర్ ఖాతాలో ప్రకటించారు. Due to rising costs of fuel/petrol and electricity/gas, we have decided to pay £750 to EVERY Emerys employee ✅ We hope this goes a long way to help our team during an unsettled financial time Much like a family, Emerys takes care of each other during difficult times! 🙌🏼 pic.twitter.com/WK3qeooH55 — Emerys Timber and Builders Merchants (@emerysltd) March 28, 2022 వ్యక్తిగతంగానే పెరుగుతున్న ధరల కారణంగా ఎమెరీస్ కంపెనీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బంది పడొద్దనే లక్ష్యంతోనే ఈ సాయం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ కంపెనీ ఉద్యోగులకు ఎల్లవేళలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఉద్యోగులకు అందించే సాయం మొత్తాన్ని కంపెనీ ఖాతా నుంచి కాకుండా ఎండీ జేమ్స్ హిప్కిన్స్ తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించారు. దీని కోసం ఆయన 45 వేల యూరోలు (సుమారు రూ. 44 లక్షలు) కేటాయించారు. ఎమెరీస్ కంపెనీలో 60 మంది ఉద్యోగులు ఉన్నారు. అండగా ఉంటా వరుసగా కొన్ని రోజులుగా పెట్రోలు రేట్లు పెరుగుతున్నాయి. గతంలో ఫ్యూయల్ కోసం 40 యూరోలు ఖర్చయ్యే చోట ఇప్పుడది 60 యూరోలుగా మారింది. రాబోయే రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగవచ్చంటూ అనేక నివేదికలు చెబుతున్నాయి. ఒక్క ఫ్యూయల్ మాత్రమే కాదు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో కంపెనీ ఉద్యోగులకు అండగా నిలవాలని అనిపించింది అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని జేమ్స్ హిప్కిన్స్ తెలిపారు. సరికొత్త చర్చ ఎమెరీస్ కంపెనీ తీసుకున్న నిర్ణయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఒపెక్ దేశాల ఒంటెద్దు పోకడలకు తోడు ఉక్రెయిన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు తారాస్థాయికి చేరాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎమెరీస్ నిర్ణయం అందరినీ ఆకర్షిస్తూ సరికొత్త చర్చకు తెర తీసింది. అంతటా ఇదే పరిస్థితి ప్రస్తుతం ఇంగ్లండ్లో కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) 6.2 శాతంగా నమోదు అయ్యింది. దీంతో అక్కడ పెట్రోలు, గ్యాస్, ఎలక్ట్రిసిటీతో సహా నిత్యావసర వస్తువుల ధరలు భగ్గుమంటున్నాయి. ఇక్క ఇంగ్లండ్లోనే కాదు అగ్రరాజ్యం అమెరికాతో సహా అనేక దేశాలు ద్రవ్యోల్బణంతో సతమతం అవుతున్నాయి. మన దేశంలో గడిచిన రెండేళ్లలో లీటరు పెట్రోలు/డీజిల్ ధర రూ.40 వరకు పెరిగింది. చదవండి: పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్.. గ్యాప్ లేకుండా బాదుతున్న చమురు సంస్థలు -
పెట్రోల్ 118 నాటౌట్.. డీజిల్ 104 నాటౌట్
సామాన్యులపై కనీస కనికరం చూపకుండా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి చమురు కంపెనీలు. తాజాగా లీటరు, పెట్రోలు, డీజిల్లపై 80 పైసల వంతున ధరను పెంచాయి. వీటికి డీలర్ కమిషన్, వ్యాట్ తదితర అంతా కలిపితే లీటరు పెట్రోలు ధర 91 పైసలు, డీజిల్ ధర 87 పైసలు పెరిగింది. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర 118.59కి పెరగగా లీటరు డీజిల్ ధర రూ.104.62కి చేరుకుంది. రూ.10కి పైగా ఉదయం ఆరు గంటలు అయ్యిందంటే చాలు పెట్రోలు రేట్లు ఎప్పుడు పెంచుదామా అన్నట్టుగా చూస్తున్నాయి చమురు కంపెనీలు. గడిచిన పదిహేను రోజుల వ్యవధిలో కేవలం రెండంటే రెండే రోజులు గ్యాప్ ఇచ్చి పదమూడు సార్లు ధరలను సవరిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ సవరణల కారణంగా లీటరు పెట్రోలు ధర గత రెండు వారాల్లోనే రూ.10.39 పెరగగా డీజిల్ ధర రూ. 10.57లు పెరిగింది. ఉపశమనం లేదు అంతర్జాతీయ మార్కెట్ రేట్లకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ రేట్లను సవరిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటిస్తున్నాయి. ఎన్నికలు పెట్రోలు రేట్లకు సంబంధం లేదని కేంద్ర మంత్రులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. 2022 మార్చి 21న అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 111.83 డాలర్లుగా ఉండగా ఏప్రిల్ 5న 109.41 డాలర్ల వద్ద ఉంది. ఐనప్పటికీ ధరల పెంపు నుంచి సామాన్యులకు ఉపశమనం లభించడం లేదు. ఎన్నికలుంటేనే 2021 మేలో బెంగాల్ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి పెట్రోలు వాతలు మొదలయ్యాయి. ఈ పరంపర 2021 నవంబరు 4 వరకు కొనసాగింది. ఈ దెబ్బకు దేశవ్యాప్తంగా లీటరు పెట్రోలు, డీజిల్ ధర వంద దాటేసింది. దీంతో ప్రజా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో కేంద్రం లీటరు పెట్రోలు, డీజిల్ ధరలను రూ.5 వంతున తగ్గించింది. ఆ తర్వాత ఉత్తర్ ప్రదేశ్తో సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చేశాయి. నాటౌట్ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం 2021 నవంబరు 4 నుంచి 2022 మార్చి 22 వరకు దాదాపు 137 రోజుల పాటు పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచలేదు. ఇక మార్చి 22న మొదలైన చమురు సంస్థల బాదుడు నిరంతరం కొనసాగుతూనే ఉంది. ఈ దెబ్బకు లీటరు పెట్రోలు 118 నాటౌట్, డీజిల్ 104 నాటౌట్ బ్యాటింగ్ అన్నట్టుగా పరిస్థితి మారింది. -
సామాన్యుడు బతికేది ఎలా?.. మోత మోగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. నేడు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు 80 పైసలు చొప్పున పెరిగాయి. గత 10 రోజుల్లో ఇంధన ధరలు లీటరుకు 6.40 రూపాయలకు పెరిగాయి. దీంతో, సామాన్యుడు బయటకి వెళ్లాలంటే బయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి వస్తువు ధర పెరగడంతో మూలిగే నక్క మీద తాటి పండు పడినట్లు ఉంది సామాన్యుడి పరిస్థితి. ద్రవ్యోల్బణం, ఇంధన ధరలు పెరగడం వల్ల కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసన ప్రారంభించింది. గత ఏడాది నవంబర్ 4 చివరి సారిగా ఇంధన ధరలు పెరిగాయి. అప్పటి నుంచి మార్చి 22 వరకు ఇంధన ధరలలో పెద్ద మార్పు లేదు. ఈ మధ్య కాలంలో దేశంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో ఇంధన ధరలు పెంచడానికి కేంద్రం సాహసించలేదు. ఎన్నికలు ముగియగానే పెట్రోల్ ధరలు పెంపు మొదలు పెట్టింది. అయితే, ఈ అంశంపై స్పందించిన కేంద్రం, రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న యుద్దం వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడంతో దేశంలో ఇంధన ధరలను పెంచాల్సి వచ్చినట్లు తెలిపింది. అయితే, ప్రతిపక్షాలు మాత్రం కేంద్రం సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయి. పెట్రోల్, డీజిల్ పై లీటరుకు 80 పైసల చొప్పున పెంచిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.81 ఉండగా.. డీజిల్ లీటర్ రూ.93.07 వద్దకు చేరింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో లీటర్ పెట్రోల్ ధర రూ. 116.72గా ఉండగా.. డీజిల్ ధర రూ.100.94కు చేరుకుంది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంటే.. డీజిల్ ధర రూ.97.52కు చేరుకుంది. ఇక కోల్కతాలో పెట్రోల్ ధర లీటరుకు ₹.111.35(83 పైసలు పెరిగింది), లీటర్ డీజిల్ ధర ₹96.22 (80 పైసలు పెరిగింది)గా ఉంది. (చదవండి: కేంద్రం కీలక నిర్ణయం, అకౌంటెన్సీ వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ!) -
మళ్ళీ భగ్గుమన్న పెట్రోల్ ధర
-
జనం జేబుకు పెట్రో మంట..హైదరాబాద్లో సెంచరీ దాటిన డీజిల్ ధర
దేశంలో వరుసగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బుధవారం లీటర్ పెట్రోల్ పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెరిగాయి. దీంతో పెరుగుతున్న ధరలతో బండి బయటకు తీయాలంటే భయపడుతున్నారు. ఇక ఐదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చమరు కంపెనీలు సామాన్యులపై పెట్రో బాదుడును కొనసాగిస్తున్నాయి. గత మంగళవారం అంటే మార్చి 22 నుంచి ఒక్కరోజు మార్చి 24 మినహా ఇస్తే ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచుతూ వాహనదారుల్ని బెంబేలెత్తిస్తున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ధర రూ.114.51 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.70పైసలుగా ఉంది ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.101.01 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.100.21గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.115.88 పైసలు ఉండగా డీజిల్ధర రూ.100.10గా ఉంది చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.106.69 పైసలు ఉండగా డీజిల్ ధర రూ.96.76 గా ఉంది. -
తగ్గేదేలే అంటున్న పెట్రోల్, డీజిల్..
-
ఎనిమిది రోజుల్లో ఏడోసారి.. పెరుగుతూనే ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్ ధర రూ.99.83ని టచ్ చేసింది. రేపోమాపో డీజిల్ ధర హైదరాబాద్లో వంద రూపాయలను క్రాస్ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఓ దశలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 139 డాలర్లకు చేరుకున్నా.. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పెరిగిన ముడి చమురు ధర భారాన్ని బల్క్ డీజిల్పైకి మోపి సర్థుబాటు చేసింది. ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పెట్రో బాదుడు మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పెట్రోలు , డీజిల్ ధరలను పెంచింది. పెట్రోలుపై ప్రతీ రోజు సగటున 90 పైసల వంతున ఏడు సార్లు పెంచడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలు ధర రూ.6.30 వంతున పెరిగింది. చైనాలో లాక్డౌన్ నేపథ్యంలో గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతోంది. వారం క్రితం బ్యారెల్ ధర 120 డాలర్లు ఉండగా చైనా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఐనప్పటికీ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. -
ఆఫీసుకు రోజూ గుర్రంపై వెళ్తున్న ఉద్యోగి.. ఎందుకో తెలుసా?
సాక్షి, ముంబై: కరోనా మహమ్మారి వల్ల ఆంక్షల నేపథ్యంలో ఇంధన ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో బైక్ను వినియోగించడం కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఓ ఫార్మసీ కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఉద్యోగి ప్రతిరోజూ గుర్రం మీద తన కార్యాలయానికి వెళ్తున్నాడు. ఔరంగాబాద్లో డీజిల్ ధర రూ.100కు కొన్ని పైసలు తక్కువగా ఉండగా, పెట్రోల్ ధర లీటర్కు రూ.115 దాటింది. ఆదివారం లీటర్ పెట్రోల్ ధర 50 పైసలు, లీటర్ డీజిల్ ధర 55 పైసలు పెరిగింది. ఈ నేపథ్యంలో షేక్ యూసుఫ్ తన బైక్ను పక్కనపెట్టి తన ఇంటి నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న తన కార్యాలయానికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్తున్నాడు. అంతకుముందు లాక్డౌన్ సమయంలో ప్రాక్టీస్ చేసినట్లు చెప్పాడు. ‘లాక్డౌన్ తర్వాత గ్యారేజీలు చాలాకాలం పాటు మూసివేసి ఉన్నాయి. దీంతో బైక్ను మెయింటెన్ చేయడం సమస్యగా మారింది. కాబట్టి నేను నా వాహనాన్ని పక్కనపెట్టి కతియావాడి గుర్రాన్ని కొనాలని నిర్ణయించుకున్నాను. రోజూ 30 కి.మీ. ప్రయాణం చేస్తా. పలు కుటుంబ ఫంక్షన్లకు కూడా గుర్రం మీదే వెళ్తా. అంతేకాదు గుర్రం మీద ప్రయాణ చేయడం బైక్ మీద వెళ్లడం కంటే చాలా చవక’ అని యూసుఫ్ చెప్పుకొచ్చాడు. చదవండి: ప్రతి ఆదివారం ఈ రోడ్లకు సెలవు.. నేటి నుంచే అమలు! -
వాహనదారులకు భారీ షాక్.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి భారీగా పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్ ధరలను చమురు సంస్థలు పెంచాయి. నవంబర్ 2 తరువాత పెట్రోల్, డీజీల్ ధరలను పెంచడం ఇదే తొలిసారి. లీటర్ పెట్రోల్పై 91 పైసలు, డీజిల్పై 87 పైసలు పెంచారు. కాగా పెరిగిన ధరలు నేటి(మార్చి 22) నుంచే అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరల ప్రకారం ప్రధాన నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ► ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 96.21 ►లీటర్ డీజిల్ రూ. 87.47 ►ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 110.78 ►లీటర్ డీజిల్ రూ. 94.94 ►హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.109.10 ►డీజిల్ లీటర్ రూ. 95.49 ►విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.8 ►డీజిల్ రూ. 96.83గా ఉంది. చదవండి: (LPG Gas: వినియోగదారులకు షాక్.. భారీగా పెరిగిన వంటగ్యాస్ ధర) -
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
చెప్పింది ఒకటి... చేసేదొకటి!
ఎన్నికలు రాగానే విదేశాలలో ఉన్న నల్లధనాన్ని వెలికితీసి ప్రతి పేదవాడి బ్యాంకు అకౌంట్లో లక్షలు సొమ్ము వేస్తామని చెబితే పేదప్రజలందరూ నమ్మి ఓట్లు వేసి గద్దె నెక్కించారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. ఒక్క రూపాయి కూడా ఏ ఖాతాకు జమ కాలేదు. నోట్లను రద్దు చేసి నల్లధనాన్ని పైకి తీసుకొని వస్తానన్నారు. ఏమయింది? చివరకు నల్ల ధనం, నకిలీధనం కూడా ఆర్బీఐలోకి వెళ్లాయి. ఎంత ధనం ఆర్బీఐకి వచ్చిందో లెక్క తేల్చలేని పరిస్థితి. బ్యాంకులలో ఎన్పీఏ (నిరర్థక ఆస్తులు)లు ఎక్కువ య్యాయని చిన్నాచితకా బ్యాంకుల్ని పెద్ద బ్యాంకుల్లో విలీనం చేశారు. ఇప్పుడు మొత్తం బ్యాంకులను అమ్మివేసే పరిస్థితి! ఫలితంగా ఎన్పీఏలు తగ్గకపోగా సుమారు 15 శాతానికి పెరగటం గమనార్హం. రిజర్వు బ్యాంకులో ఉన్న అధిక ధనాన్ని డివిడెండుగా ప్రభుత్వం వాడుకొని స్వతంత్ర ప్రతిపత్తిగల రిజర్వు బ్యాంకుని నిర్వీరం చేస్తోంది. బ్యాంకులను జాతీయీ కరణ చేసిన ఘనత మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీకే దక్కుతుంది. లేకపోతే సామాన్యుడు బ్యాంకు మెట్లు ఎక్కే పరిస్థితి లేకుండా పోయేది. రైతులకు రెట్టింపు ఆదాయాన్ని ఇస్తానని చెప్పి ఆ పని చేయలేక పోయారు. పీఎం ఫసల్ బీమాని ప్రయివేట్ సంస్థల కిచ్చి రైతులకు పంట నష్టం జరిగినపుడు న్యాయ బద్ధంగా ఇవ్వవలసిన క్లయిమ్ను ఇవ్వకుండా రైతులను మోసం చేశారు. రైతు పండించిన పంటలకు కనీస మద్దతు ధరను నిర్ణయించినా... పంటలను కొనకుండా రైతులను నిండా ముంచుతున్నది కేంద్రం. నిత్యం పాలిచ్చే ఆవులాగ ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)ని కార్పొరేట్లకు అమ్మాలన్న ఆలోచన చూస్తుంటే దేశాన్ని ఈ పాలకులు ఏ దారికి తీసుకెలుతున్నారనే అనుమానం కలుగుతోంది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అని నినదించి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కార్పొరేట్లకు తెగనమ్మాలనుకోవడం దేనికి నిదర్శనం? సుమారు 20 వేల మంది ఉద్యోగుల భవితవ్యాన్ని గాలిలో కలిపేస్తారా? కాంగ్రెసు పార్టీ అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే... దానికి పార్లమెంటులో వత్తాసు పలికి, తిరుపతి వెంకన్న సాక్షిగా ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీ ఏమైంది? విభజన చట్టంలో పోలవరానికి పూర్తిగా నిధులు ఇస్తామని చెప్పిన మాట మార్చి రకరకాల మాటలు చెప్పడం దేనికి సంకేతం? విశాఖ ఉక్కుకి సొంత గనులు కేటాయించకుండా నష్టాలు వస్తున్నాయనే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఫ్యాక్టరీని అమ్మకానికి పెట్టింది. విశాఖ ఉక్కును అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే కొనుగొలు చేస్తాననడం ఒక చారిత్రాత్మక నిర్ణయం. క్రూడ్ ఆయిల్ ధరలు ప్రపంచ మార్కెట్లో తగ్గుతున్నా... మనదేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఇష్టం వచ్చిన రీతిలో పెంచుకుంటూ పోయి సామాన్యుని నడ్డి విరుస్తున్న కేంద్ర పాలన ఎవరికి లాభం చేకూర్చుతున్నదో అర్థం కాని ప్రశ్న. ఒక దేశం ఒకే పన్ను విధానాన్ని (జీఎస్టీ) తీసుకొచ్చి చిన్న వ్యాపారస్థుల నడ్డి విరిచారు. ప్రతి నెలా రిటర్ను దాఖలు చేయడంతోనే సమయం డబ్బు వృథా అవుతుండడం వలన చిన్న వ్యాపార స్తుల కష్టాలు వర్ణనాతీతం. ప్రతి మనిషికి అవసరమైన బట్టలను, చెప్పులను కూడా వదలకుండా పన్ను విధించటం గమనార్హం. బట్టలపై 5% పన్ను విధించి, అంతటితో ఆగకుండా మరలా 7% పన్నుని విధించటం వలన వ్యాపార వర్గంలోను, ప్రజలలోనూ వ్యతిరేకత పెరిగింది.. దీంతో సదరు పన్నును కేంద్రం ఉపసంహరించుకొంది. కొత్త వ్యవసాయ చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా రూపొందించడంతో రైతులు ఉద్యమించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడంతో దిక్కుతోచని పరిస్థితిలో కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొంది. ఈ పాలన ఇలాగే కొనసాగితే ప్రజలు తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటారు. - కొవ్వూరి త్రినాథరెడ్డి కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర వైఎస్సార్సీపీ రైతు విభాగం -
ఆ డబ్బు రాష్ట్రాలకు సమానంగా పంచాలి
కోల్కతా: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పెంచిన చమురు ధరలతో కేంద్రానికి వచ్చిన రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బెంగాల్ శాసనసభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ... ‘పెరిగిన ధరలకు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ విక్రయించడం ద్వారా విధించిన పన్నులతో కేంద్ర సర్కారు ఖాజానాకు దాదాపు రూ.4 లక్షల కోట్లు వచ్చాయి. రాష్ట్రాలు వ్యాట్ తగ్గించాలని బీజేపీ ఇపుడు డిమాండ్ చేస్తోంది. రాష్ట్రాలకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ రూ.4 లక్షల కోట్లను రాష్ట్రాలకు కేంద్రం సమానంగా పంచాల’ని అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ తమ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చిందని మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు. (చదవండి: బీజేపీ నేతలు పేదల రక్తం పీలుస్తున్నారు) ఎన్నికలు దగ్గర పడినప్పుడల్లా ధరలు పెంచి, తర్వాత మళ్లీ పెంచడం మోదీ సర్కారుకు అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు. చమురుపై వ్యాట్ తగ్గించకపోతే ఆందోళనలకు దిగుతామని చెబుతున్న బీజేపీ నాయకులు... కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను గురించి ప్రశ్నించాలని అన్నారు. కోవిడ్ వ్యాక్సిన్ల పంపిణీలోనూ తమ రాష్ట్రంపై మోదీ సర్కారు సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. (‘టచ్ చేయమంటున్నారు కదా.. సంజయ్ టచ్చేయ్’) -
పెట్రోల్ రూ.120 దాటేసింది
న్యూఢిల్లీ/భోపాల్: లీటర్కు రూ.120.. రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రోల్ ధరల్లో కొత్త రికార్డు ఇది. మధ్యప్రదేశ్, రాజస్తాన్లోని పలు ప్రాంతాల్లో లీటర్ ధర రూ.120 మార్కును దాటేసింది. పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజు.. ఆదివారం సైతం 35 పైసల చొప్పున పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ రెండింటి ధరల్లో కొత్త రికార్డులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.34కు, డీజిల్ రేటు రూ.98.07కు చేరింది. మధ్యప్రదేశ్లో స్థానిక పన్నుల కారణంగా పెట్రోల్ ధర మోత మోగుతోంది. పన్నా, సాత్నా, రేవా, షాడోల్, చింద్వారా, బాలాఘాట్ తదితర ప్రాంతాల్లో లీటర్ రూ.120కి పైగానే పలుకుతోంది. రాజస్తాన్లోని గంగానగర్, హనుమాన్గఢ్లోనూ లీటర్ రేటు రూ.120 దాటింది. దేశంలోనే అత్యధిక ధర గంగానగర్లో ఉంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రేటు రూ.121.52కు, డీజిల్ రేటు రూ.112.44కు ఎగబాకింది. ఈ ఏడాది సెప్టెంబర్ 28 నుంచి ఇప్పటిదాకా పెట్రోల్ ధర 25 సార్లు (లీటర్కు రూ.8.15) పెరిగింది. సెప్టెంబర్ 24 నుంచి డీజిల్ రేటు 28 సార్లు(లీటర్కు రూ.9.45) పెరిగింది. రండి.. మా దగ్గర ధర తక్కువ మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఆదివారం వార్తాపత్రికలు తెరిచిన జనం ఆశ్చర్యానికి లోనయ్యారు. పొరుగున ఉన్న మహారాష్ట్రలోని గోండియాలో పెట్రోల్, డీజిల్ రేటు లీటర్కు రూ.4 తక్కువ, అక్కడే పోయించుకోండంటూ ముద్రించిన కరపత్రాలు అందులో ఉండడమే ఇందుకు కారణం. బాలాఘాట్ నుంచి గోండియాకు 45 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రెండు రాష్ట్రాలు పక్కపక్కనే ఉన్నా పెట్రో ధరల్లో వ్యత్యాసం రూ.4 కు పైగా ఉంది. -
దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు
-
Petrol, Diesel Prices: అక్కడ లీటర్ పెట్రోల్ రూ.120!
Petrol, diesel prices today:పెట్రోల్ ధరలకు కళ్లెం పడేది ఎప్పుడా? అని వాహనదారులు ఎదురు చూస్తున్నారు. కానీ, నవంబర్ మధ్య వరకు ఇది ఇలానే కొనసాగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం మరోసారి పెరుగుదలతో పెట్రో రేట్లు హయ్యెస్ట్ మార్క్ను అందుకున్నాయి. వరుసగా నాలుగవ రోజూ శనివారం(అక్టోబర్ 23, 2021) 35 పైసలు పెంపుదల పెట్రోల్, డీజిల్పై కనిపిస్తోంది. తాజా పెరుగుదలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.107.24పై., లీటర్ డీజిల్ ధర రూ.95.97పై.కు వద్ద కొనసాగుతోంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటర్ ధర రూ.113.12పై., డీజిల్ రూ.104కు చేరింది. దేశంలోనే ఫ్యూయల్ ధరలు కాస్ట్లీ కొనసాగుతోంది రాజస్థాన్ టౌన్ గంగానగర్లో. ఇక్కడ పెట్రోల్ ధర రూ.119.42గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధర రూ.110.26గా ప్రస్తుతం నడుస్తోంది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.111.55కి చేరింది. డీజిల్ రూ.104.70పై వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.110.98, రూ.101.86 వద్ద కొనసాగుతున్నాయి. లోకల్ ట్యాక్స్ల ఆధారంగా రేట్లలో మార్పు ఉంటుందనే విషయం గుర్తించాలి. చెన్నైలో మాత్రం పెట్రో ధరలు.. గురువారం నాటివే కొనసాగుతున్నాయి!. లీటర్ పెట్రోల్ రూ.104.22పై., డీజిల్ రూ.100.25పై. తమిళనాడులో డీజిల్ ధర వంద దాటడం ఇదే మొదటిసారి!. ఇక సెప్టెంబర్ 28 నుంచి 19సార్లు పెట్రో ధరలు పెరిగాయి. గత మూడువారాల మొత్తంగా పెట్రోల్ మీద దాదాపు 6 రూపాయలు, డీజిల్ మీద 7 రూపాయలు(సెప్టెంబర్ 24 నుంచి 22 సార్లు పెంపు) పెంపు కనిపిస్తోంది. అంతకు ముందు మే 4 నుంచి జులై 17 మధ్య లీటర్ పెట్రోల్ ధర రూ.11.44 పెంపు చోటుచేసుకోగా, డీజిల్ ధర రూ.9.14కు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతున్న కేంద్రం.. ఈమేరకు చమురు ఉత్పత్తి దేశాలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. -
పెరిగిన పెట్రో ధరలు.. అక్కడ మాత్రం మంటలు
Petrol And Diesel Prices Today: పండుగ తర్వాత చల్లబడుతుందేమో అనుకున్న పెట్రో మంట.. మళ్లీ ఎగసిపడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. దీంతో గురవారం మళ్లీ ధరలు పెరిగాయి. ఇదే స్పీడ్ కొనసాగితే.. మరో రెండు వారాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.120, డీజిల్ ధర రూ.110 చేరుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇవాళ(గురువారం, అక్టోబర్ 21) మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసలు పెరిగాయి. దీనితో ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.106.54పై. గా, డీజిల్ ధర రూ.95.27కు ఎగబాకింది. అటు ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.112.44కి, డీజిల్ ధర రూ.103.26గా చేరింది. రాజస్థాన్లోని గంగానగర్లో పెట్రో మంటలు ఎక్కువగా ఉన్నాయి. లీటర్ పెట్రోల్ రేటు రూ.117.98గా ఉందక్కడ(దేశంలో ఇదే అధికం!). ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.103.71 డీజిల్ 99.59కి చేరింది. బెంగళూరులో లీటర్ పెట్రోల్ రేటు రూ.110.25కి చేరగా, డీజిల్ ధర 101.12ను తాకింది. కోల్కతాలో లీటర్ పెట్రోల్ రూ.107.11, డీజిల్ రూ.98.38గా ఉంది. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ. 110.92, డీజిల్ ధర రూ. 103.91కు చేరింది. పెట్రోల్ ఎంత ప్రియంగా మారిందంటే.. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కంటే 35 శాతం ధర ఎక్కువ!. ఏటీఎఫ్ కిలో లీటర్కు ఢిల్లీలో 79వేలకు అమ్ముడుపోతోంది. అంటే లీటర్కు కేవలం 79 రూ. అన్నమాట. తగ్గించే ప్రయత్నాలు.. పెట్రో మంట తగ్గాలంటే.. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు బ్యారెల్ ధరను 70 డాలర్ల కన్నా దిగువకు తీసుకురావాల్సి ఉందని చెబుతోంది కేంద్రం. ఇందుకోసం సౌదీ అరేబియా నుంచి రష్యా వరకు.. చమురు ఉత్పత్తి దేశాలతో పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంప్రదింపులు నిర్వహిస్తోంది. మరోవైపు పెట్రో ధరలను జీఎస్టీ పరిధిలోకి తెస్తే అందరికీ ఉపశమనం కలుగుతుందనే చర్చ ఎప్పటి నుంచూ జరుగుతూనే ఉంది. -
హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ఎంతంటే..
Petrol Diesel Prices Today: వరుసగా మూడో రోజూ పెరిగిన ఇంధన ధరలు. ముడి చమురు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. ఫలితంగా పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా మూడో రోజూ పెరిగాయి. గత మూడు వారాల్లో డీజిల్ ధరలు 18 సార్లు పెరగ్గా.. పెట్రోల్ ధరలు 15 సార్లు ఎగబాకాయి. తాజాగా దసరా తెల్లారి శనివారం లీటర్ పెట్రోల్ 36 పైసలు, డీజిల్పై 38 పైసలు చొప్పున పెరిగాయి. ఈ పెంపుతో హైదరాబాద్లో ఇవాళ(అక్టోబర్ 16, శనివారం) లీటర్ డీజిల్ ధర రూ. 102.80, లీటర్ పెట్రోల్ ధర రూ.109.73కు చేరుకుంది. ఇక ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.105.49పై.లతో గరిష్టానికి చేరుకోగా, ముంబైలో రూ.111.43పై., డీజీల్ ధర ఢిల్లీలో డీజీల్ లీటర్ ధర. రూ.94.22పై., ముంబైలో రూ.102.15పై.కు చేరుకుంది. చెన్నైలో పెట్రోల్ ధర102.70పైసలుగా, డీజీల్ రూ. 98.59పైసలుగా ఉంది. అక్టోబర్ 12, 13 తేదీల్లో పెట్రో రేట్లలో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న వాహనదారులకు మళ్లీ హ్యాట్రిక్ రోజుల పెంపు కంగారుపుట్టిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ ధరల స్థిరీకరణ పేరుతో గ్యాప్ లేకుండా బాదుతున్నాయి చమురు కంపెనీలు. చదవండి: గ్యాస్ సిలిండర్ పేలుళ్లు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే సురక్షితం -
వరుసగా ఏడో రోజు.. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుతుండటంతో నేరుగా ఆ భారం వినియోగదారుడిపై మోపుతున్నాయి దేశీ చమురు సంస్థలు. లీటరు డీజిల్పై 30 పైసలు, లీటరు పెట్రోలు 37 పైసల వంతున ఛార్జీలు పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా ఏడు రోజులు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో హైదరాబాద్లో లీటరు పెట్రోలు ధర రూ. 108.60 లీటరు డీజిల్ ధర రూ.101.62లకు చేరుకుంది. చేతులెత్తేసిన చమురు సంస్థలు చమురు ఉత్పత్తిపై ఒపెక్ దేశాలు తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి దేశ ప్రజలపై పెట్రోలు భారం పడకుండా చర్యలు తీసుకోవడంలో చమురు సంస్థలు విఫలమవుతున్నాయి. మరోవైపు కేంద్రం సైతం చమురు సంస్థలు ఎడాపెడా ఛార్జీలు పెంచుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తున్నాయి తప్పితే, ధరాఘాతం నుంచి సామాన్యలను రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. నవంబర్ వరకు నవంబర్ వరకు ముడి చమురు ధరలు పెరుగాయని ఒపెక్ దేశాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇటు కేంద్రం, అటు చమురు సంస్థలు ఈలోగా ఏమైనా ఉపశమనం చర్యలు తీసుకోకుంటే చమురు ధరలు భరించలేని స్థాయికి చేరుకునే ప్రమాదం ఉంది. -
సామాన్యుడికి చుక్కలు, మరోసారి పెరిగిన పెట్రో ధరలు
బియ్యం, గోధుమ, వంటనూనెల ధరలు తగ్గుతున్నా..రోజురోజుకీ పెరుగుతున్న పెట్రో ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి.వాహనదారులు బండ్లను బయటకు తీయాలంటే జంకుతున్నారు.దీంతో నిత్యవసర ధరలతో పాటు పెట్రో ధరల్ని తగ్గించాలని కోరుకుంటున్నారు. ఇక శనివారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో వరుసగా ఐదోరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.ముంబై వంటి ప్రధాన నగరాల్లో డీజిల్ ధర కూడా పెట్రోల్తో పోటీ పడీ మరి పెరిగిపోతోంది. శనివారం రోజు లీటర్ పెట్రోల్పై 30 పైసలు, లీటర్ డీజిల్ పై 35పైసలు పెరిగాయి. దేశంలోని వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.82 ఉండగా డీజిల్ ధర 100.29 ఉంది ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 103.84 ఉండగా డీజిల్ ధర రూ.92.47 ఉంది. చెన్నైలో పెట్రోల్ ధర రూ.101.27 ఉండగా డీజిల్ ధర రూ.96.93 ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ. 104.52 ఉండగా డీజిల్ ధర రూ.95.58 ఉంది హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.108.02 ఉండగా డీజిల్ ధర రూ.100.89 ఉంది బెంగళూరులో పెట్రోల్ ధర రూ.107.77 ఉండగా డీజిల్ ధర రూ.98.15 ఉంది. -
ఆగని పెట్రోమంట..మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
దేశంలో సామాన్యుడిపై పెట్రో మంట కొనసాగుతుంది. వరుసగా రుగుతున్న ధరలు సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేస్తున్నాయి. ఆదివారం సైతం లీటర్ పెట్రోల్ పై 25పైసలు, డీజిల్ పై 30పైసలు పెరిగింది. దీంతో దేశంలో పలు ప్రధాన నగరాల్లో డీజిల్ ధరలు సెంచరీని క్రాస్ చేశాయి. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో ఇంధన ధరల పెంపుపై కేంద్రం చెప్పిన కారణాలపై పెదవి విరిస్తున్నారు. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106.51 ఉండగా లీటర్ డీజిల్ ధర రూ.99.04 ఉంది విజయవాడలో పెట్రోల్ ధర రూ.108.57 ఉండగా డీజిల్ ధర రూ.100.45 ఉంది. వైజాగ్లో పెట్రోల్ ధర రూ.107.19 ఉండగా..డీజిల్ ధర రూ.99.14 ఉంది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.102.39 ఉండగా..డీజిల్ ధర రూ.90.77ఉంది కోల్ కతాలో పెట్రోల్ ధర రూ.103.07 ఉండగా .. డీజిల్ ధర రూ.93.87 ఉంది చెన్నైలో పెట్రోల్ రూ100.01 ఉండగా డీజిల్ ధర రూ.95.31 ఉంది. -
పెట్రో పిడుగు.. పెరిగిన హోల్సేల్ ధరల సూచి
పెట్రోల్ ధరల పెరుగుదల తయారీ పరిశ్రమపై ప్రభావం చూపుతోంది. అందుకు తగ్గట్టే ఆగస్టుకి సంబంధించి హోల్సేల్ ప్రైజ్ ఇండెక్స్ (డబ్ల్యూపీఐ) పెరిగింది. జులైలో డబ్ల్యూపీఐ 11.16 శాతం ఉండగా ఆగస్టుకి వచ్చే సరికి 11.39 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరమంతా డబ్ల్యూపీఐ రెండంకెలకు పైగానే నమోదు అవుతూ వస్తోంది. కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో నెగిటివ్గా ద్రవ్యోల్బణం నమోదైంది, 2020 మేలో డబ్ల్యూపీఐ - 3.4 శాతంగా ఉండగా ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. 2020 ఆగస్టున డబ్ల్యూపీఐ నెటటీవ్ను దాటి 0.4 శాతంగా నమోదు అవగా ఏడాది తిరిగే సరికి అది 11.39 శాతానికి చేరుకుంది. ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాలు, పెట్రో కెమికల్స్ తదితర వస్తువుల ధరల్లో హెచ్చుల వల్ల తయారీ రంగంలో ధరలు పెరుతుండగా మరోవైపు కన్సుమర్ ప్రైస్ ఇండెక్స్కి సంబంధించి ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. డబ్ల్యూపీఐ, సీపీఐల మధ్య ఈ తేడా ఎప్పుడూ ఉంటుందని ఇండియా రేటింగ్ , రీసెర్చ్ చీఫ్, ప్రముఖ ఎకనామిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. చదవండి : పెట్రోల్-డీజిల్ జీఎస్టీ పరిధిలోకి తీసుకురాబోతున్నారా? -
Karnataka: ఎద్దులబండిలో అసెంబ్లీకి
సాక్షి, శివాజీనగర (కర్ణాటక): పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెంపును ఖండిస్తూ సోమవారం ఎద్దుల బండిపై కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య తదితరులు విధానసౌధకు ఊరేగింపుగా వచ్చారు. కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ పేదలపై భారం వేస్తోందని దుయ్యబట్టారు. ఎద్దుల బండి పోరాటం ద్వారా ప్రజల్లో జాగృతి కల్పించామని తెలిపారు. భారీ సందోహంతో రావడంతో సౌధ పరిసరాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. వందలాది పోలీసులు మోహరించారు. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది. దివంగతులకు సంతాపం శాసనసభా వర్షాకాల సమావేశాల మొదటి రోజైన సోమవారం ఇటీవల గతించిన రాజకీయ, సామాజిక ప్రముఖులకు సంతాపం వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ఆరంభం కాగానే సభాధ్యక్షుడు విశ్వేశ్వర హెగ్డే కాగేరి సంతాప తీర్మానాన్ని ప్రకటించారు. అసంతృప్తి లేదు: యడ్డి బీజేపీ రాష్ట్రాధ్యక్షునితో కలిసి రాష్ట్రమంతటా పర్యటించనున్నట్లు మాజీ సీఎం యడియూరప్ప తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేగా పని చేస్తానని, సంతోషంగానే ముఖ్యమంత్రి స్థానానికి రాజీనామా చేశానన్నారు. అసెంబ్లీ సమావేశాలకు ఎమ్మెల్యేగా రావడంపై ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ పక్కన సీట్లో కూర్చోవడానికి స్పీకర్ ఆమోదించారని తెలిపారు. స్వచ్ఛ గాలి ఎక్కడ .. స్వచ్ఛ గాలి పథకంతో బెంగళూరులో రూ.2.67 కోట్లను ఖర్చు చేశారు, స్వచ్ఛమైన గాలి ఎక్కడ ఉందో చూపించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కేసీ.కొండయ్య పరిషత్లో ప్రశ్నించారు. పరిసర మంత్రి ఆనంద్సింగ్ తరఫున పరిషత్ నేత కోటే శ్రీనివాసపూజారి సమాధానమిస్తూ కేంద్ర ప్రభుత్వం జాతీయ స్వచ్ఛ గాలి పథకాన్ని బెంగళూరు, దావణగెరె, హుబ్లీ, ధారవాడ, కలబురిగి నగరాల్లో చేపట్టిందన్నారు. 2019 నుంచి 2024 నాటికి గాలిలో ధూళి ప్రమాణాన్ని 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించడమే లక్ష్యమన్నారు. కాగా, చేతనైతే కాంగ్రెస్పాలిత రాష్ట్రాల్లో ఇంధన ధరలను తగ్గించాలని మంత్రి శ్రీరాములు ఆ పార్టీని సవాల్ చేశారు. చదవండి: కర్ణాటక రోడ్డు ప్రమాదం: గాడిదలు కాస్తున్నారా! ఆర్టీఓ అధికారులపై ఎంపీ ఆగ్రహం.. -
అటు ఓలా స్కూటర్... ఇటు ఓల్ట్రో సైకిల్...
ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో జోరు కొనసాగుతోంది. ఒకదాని వెంట ఒకటిగా వరుసగా వాహనాలను మార్కెట్లోకి తెస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే స్కూటర్ విభాగంలో ఓలా సంచలనం సృష్టిస్తుండగా.. ఇప్పుడు సైకిళ్ల సెగ్మెంట్లో ఓల్ట్రో దూసుకొస్తోంది. సాక్షి, వెబ్డెస్క్: లీటరు పెట్రోలు ధర సెంచరీ దాటి పోవడంతో పల్లె పట్నం తేడా లేకుండా పెట్రోలు బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. అయితే ఈవీల ధర ఎక్కువగా ఉండటంతో వీటిని కొనడానికి వెనుకంజ వేస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఇండియాలో అయితే తక్కువ ధరలో ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే కొనేందుకు రెడీగా ఉన్నారు. ఇలాంటి వారిని టార్గెట్గా చేసుకుని ఎలక్ట్రిక్ సైకిల్ తయారీలో పనిలో ఉంది సరికొత్త స్టార్టప్ ఓల్ట్రో. ఓల్ట్రో ఓల్ట్రో స్టార్టప్ 2020 ఆగస్టులో ప్రారంభమైంది. ఈ స్టార్టప్ నుంచి ఓల్ట్రాన్ పేరుతో ఇ సైకిల్ మార్కెట్లోకి వచ్చింది. ఏడాది వ్యవధిలో 35 లక్షల టర్నోవర్ సాధించింది. అయితే ప్రస్తుతం పెట్రోలు రేట్లు పెరిగిపోవడం, ఫెమా పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం నుంచి దన్ను లభిస్తుండటంతో ఓల్ట్రో దూకుడు పెంచింది. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీలలో ఉండే ప్రజల అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్ సైకిల్ని డిజైన్ చేసింది. ఏడాదిలో ఏకంగా పది కోట్ల టర్నోవర్ లక్ష్యంగా మార్కెట్లోకి వస్తోంది. ఒక్క ఛార్జ్తో 100 కి.మీ ఓల్ట్రో సైకిల్లో 750వాట్ల బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఈ బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే సగటున ఒక యూనిట్ కరెంటు ఖర్చు అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేసిన బ్యాటరీతో కనిష్టంగా 75 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 100 కిలోమీటర్ల వరకు ఈ సైకిల్ ప్రయాణం చేస్తుందని ఆ కంపెనీ వ్యవస్థాపకుడు ప్రశాంత అంటున్నారు. దేశవ్యాప్తంగా ఒక యూనిట్ కరెంటు సగటు ఛార్జీ రూ. 4గా ఉందని.. కేవలం నాలుగు రూపాయల ఖర్చుతో 75 కిలోమీటర్ల దూరం ప్రయాణించ్చవచ్చంటున్నారు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. ధర ఎంతంటే ఓల్ట్రో అందించే ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.35,000 వరకు ఉండవచ్చని అంచనా. ఈ సైకిల్పై వన్ ఇయర్ వారంటీని సంస్థ అందిస్తోంది. కోవిడ్ పరిస్థితులు సద్దుమణిగితే ఆన్లైన్, ఆఫ్లైన్లో అమ్మకాలు సాగించేందుకు కంపెనీ సన్నహాలు చేస్తోంది. ఏడాది వ్యవధిలో పది కోట్ల రూపాయల టర్నోవర్ సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీ సమీపంలో నజఫ్గడ్లో ఈ సంస్థకు సైకిల్ తయారీ యూనిట్ ఉంది. ఇక్కడ నెలకు నాలుగు వందల సైకిళ్లు తయారు అవుతుండగా దాన్ని పదిహేను వందలకు పెంచనుంది. వారంటీ సైకిల్కి సంబంధించిన కంట్రోలర్, మోటార్లో ఏదైనా సమస్యలు వస్తే ఏకంగా సైకిల్నే రీప్లేస్ చేస్తామని హామీ ఇస్తోంది. ఈ సైకిల్ రిపేర్ సైతం చాలా ఈజీ అని చెబుతోంది. అయితే ఈ సైకిల్ ఎంత బరువును మోయగలుగుతుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు. -
వడ్డీరేట్ల మార్పుపై రిజర్వ్బ్యాంక్ కీలక నిర్ణయం
ముంబై: బ్యాంకు వడ్డీ రేట్ల మార్పుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులపై మానిటరీ పాలసీ కమిటీ సూచనలకు అనుగుణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లను నిర్ణయించింది. మార్పులేదు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఆర్థిక వ్యవస్థ గాడిన పడే వరకు ప్రస్తుతం ఉన్న రిపో రేటు, రివర్స్ రిపో రేటులను కొనసాగించాలని మానిటరీ పాలసీ కమిటీ సూచించిందని, అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితినే కొనసాగిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్నట్టుగానే రిపో రేటు 4 శాతం, రివర్స్ రిపో రేటు 3.35 శాతంగానే కొనసాగనున్నాయి. గాడిన పడుతోంది వ్యవసాయ సీజన్లో వర్షాలు సమృద్ధిగా కురుస్తుండం, వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతుండటంతో త్వరలోనే ఆర్థిక వ్యవస్థ పూర్వ స్థితికి చేరుకుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు పెట్రోలు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నా.. ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందన్నారు. రిపోరేటు ప్రభుత్వ సెక్యూరిటీలను తన వద్ద ఉంచుకుని వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పులు ఇచ్చేప్పుడు వసూలు చేసే వడ్డీని రెపో రేటుగా వ్యవహరిస్తారు. ఇదే సమయంలో వాణిజ్య బ్యాంకులు తన వద్ద డిపాజిట్ చేసిన మొత్తానికి ఆర్బీఐ ఇచ్చే వడ్డీని రివర్స్ రిపో రేటు అంటారు. -
కలిసికట్టుగా ముందుకెళ్దాం
న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న పెట్రో ధరల్ని నిరసిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం పార్లమెంటుకి సైకిల్పై వెళ్లారు. రాహుల్తో పాటు పలువురు విపక్ష ఎంపీలు కూడా సైకిల్ తొక్కుకుంటూ పార్లమెంటు వరకు ప్రయాణించారు. సైకిల్ తొక్కలేని మరికొందరు ఎంపీలు నడుచుకుంటూ వెళ్లి తమ నిరసనని వ్యక్తం చేశారు. అంతకు ముందు రాహుల్ గాంధీ ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ప్రతిపక్ష పార్టీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకి కాంగ్రెస్ ఎంపీలతో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, డీఎంకే, వామపక్షాలు, ఆర్జేడీ, సమాజ్వాదీ పార్టీల నేతలు హాజరయ్యారు. మొత్తం 17 ప్రతిపక్ష పార్టీలను అల్పాహార విందుకు పిలిచినప్పటికీ బీఎస్పీ, ఆప్ నేతలు హాజరు కాలేదు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతపై చర్చలు జరిపారు. ‘మనందరం ఏకం కావాలన్న లక్ష్యంతోనే మిమ్మల్ని పిలిచాను. ఎంతమందిమి కలిస్తే అంత బలపడతాం. అప్పుడే బీజేపీ, ఆరెస్సెస్కి మనల్ని ఎదుర్కోవడం కష్టమవుతుంది’అని రాహుల్ అన్నారు. విపక్షాల ఐక్యత, సిద్ధాంతాలే కేంద్రాన్ని ఎదుర్కొనే సాధనాలన్నారు. పెగసస్ ఉదంతంపై పార్లమెంట్లో చర్చించాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్న సంగతి తెల్సిందే. సాగు చట్టాలు, పెట్రో ధరలపైనా విపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత ఖర్గే, పార్టీల నేతలు సౌగత రాయ్, కళ్యాణ్ బెనర్జీ, సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది, మనోజ్ ఝా, కనిమొళి, రాంగోపాల్ యాదవ్ భేటీలో పాల్గొన్నారు. -
చంద్రబాబు నిర్వాకంతోనే పెట్రోల్ ధరలు పెరిగాయి
-
సామాన్యులకు కాస్త ఊరట..!
సాక్షి, న్యూఢిల్లీ: ఓ వైపు పెట్రోల్ ధరలతో, మరో వైపు ఆహర ఉత్పత్తుల ధరలతో సామాన్యుడు సతమతమవుతున్నాడు. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాలపై పెరుగుతున్న ధరలతో సామాన్య జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ధరల పెరుగుదలతో ఇబ్బందిపడుతున్న వేళ సామాన్యుడికి కాస్త ఊరట లభించనుంది. భారత్లో జూన్ నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా 6.26 శాతానికి తగ్గింది. రిటైల్ ద్రవ్యోల్బణం మే నెలలో సుమారు 6.3 శాతంగా నమోదైంది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) సోమవారం రోజున రిటైల్ ద్రవ్యోల్భణ గణాంకాలను విడుదల చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదుకావడం ఇది రెండోసారి. జూన్ నెలలో ప్రధానంగా ఆహరోత్పత్తుల ధరలు, ఇంధన ధరల కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూన్లో 5.15 శాతానికి పెరిగిందని, మేలో ఇది 5.01 శాతంగా ఉందని ఎన్ఎస్ఓ పేర్కొంది. ఆహార ఉత్పత్తుల్లో ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా ఉంది. 'ఇంధన, లైట్' విభాగంలో ద్రవ్యోల్బణం మే నెలతో పోల్చుకుంటే జూన్ నెలలో 12.68 శాతం గణనీయంగా పెరిగింది మే నెలలో 11.58 శాతంగా నమోదైంది. -
పెట్రోల్ రేట్ల పెంపుతో ఇంజన్ పీకేసి.. ఇలా సెట్ చేశాడు
Janagaon Electric Bike: పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత రెండు నెలలుగా దాదాపు రోజు విడిచి రోజు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెరిగిన ధరలతో కొందరు తమ వాహనాలను మూలన పడేయగా మరికొందరు ప్రత్యామ్నాయాలను చూసుకున్నారు. కానీ జనగామకు చెందిన విద్యాసాగర్ విభిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. జనగామకు చెందిన కూరపాటి విద్యాసాగర్ ఓ ఎలక్ట్రానిక్ దుకాణం నిర్వహిస్తున్నారు. రోజురోజుకి పెరుగుతున్న పెట్రోలు ధరలు భారంగా మారాయి. జనగామలో కూడా పెట్రోలు ధర లీటరు వంద దాటింది. పెట్రోలు ధరలు పెరగడమే తప్ప తగ్గకపోవడంతో తన భైకుకు ఉన్న పెట్రోల్ ఇంజన్ను తీసేయాలని నిర్ణయించుకున్నాడు. రూ.10 వేల ఖర్చుతో 30ఏహెచ్ కెపాసిటీ కలిగిన నాలుగు బ్యాటరీలు కొనుగోలు చేశారు. ఆ తర్వాత రూ.7500 ఖర్చు చేసి ఆన్లైన్లో మోటారు కొన్నాడు. స్థానిక మెకానిక్ అనిల్ సహకారంతో పెట్రోల్ ఇంజన్ స్థానంలో బైక్కి బ్యాటరీలు, మోటార్ అమర్చాడు. ఈ లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ వెహికల్ 5 గంటలపాటు ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల ప్రయాణిస్తోంది. బ్యాటరీలతో నడుస్తున్న విద్యాసాగర్ బైక్ ఇప్పుడు జనగామలో ట్రెండింగ్గా మారింది. బ్యాటరీలను ఛార్జింగ్ చేసుకోవడానికి ఒకటి నుంచి ఒకటిన్నర యూనిట్ కరెంటు ఖర్చవుతోంది, కేవలం రూ.10తో 50 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నా. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా ఈ ఆలోచన చేశాను - విద్యాసాగర్ -
డీజిల్పై స్వల్ఫ ఊరట.. మరింత పెరిగిన పెట్రోల్ ధర
-
లీటర్ పెట్రోల్ రూ. 120 తప్పదా ?
-
పెట్రో ధరల పెంపుపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి వినూత్న నిరసన
సాక్షి,హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తోం దని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఆయన వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. హైదరా బాద్లోని మాదాపూర్ నుంచి నాంపల్లిలోని గాంధీభవన్ వరకు 14 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ధరల పెంపునకు వ్యతి రేకంగా రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి గాంధీభవన్కు వచ్చిన జగ్గారెడ్డికి పార్టీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. -
మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ:మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరగడంతో అది జాతీయ మార్కెట్ పై ప్రభావం చూపింది. గురువారం పెట్రోల్పై 26 పైసలు, డీజిల్ లీటర్కు 7 పైసలు వరకు పెరిగాయి. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు హైదరాబాద్లో పెట్రోల్ రూ.101.60.. డీజిల్ రూ.96.25 పెరిగింది విజయవాడలో పెట్రోల్ రూ.103.53, డీజిల్ రూ.97.61 పెరిగింది ఢిల్లీలో పెట్రోల్ రూ.97.76.. డీజిల్ రూ.88.30 పెరిగింది ముంబైలో పెట్రోల్ రూ.103.89.. డీజిల్ రూ.95.79 పెరిగింది చెన్నైలో పెట్రోల్ రూ.98.88.. డీజిల్ రూ.92.89 పెరిగింది బెంగళూరులో పెట్రోల్ రూ.101.03, డీజిల్ రూ.93.61 పెరిగింది చదవండి: జేపీ ఇన్ఫ్రాటెక్ : ఆ 20వేలమందికి త్వరలోనే ఫ్లాట్లు ? -
Petrol Price Hike: 23వ సారి.. హైదరాబాద్లో సెంచరీ క్రాస్!
హైదరాబాద్: పెరగడమే కానీ తగ్గడం తనకు లేదన్నట్టుగా ఉంది పెట్రోలు ధరల పరిస్థితి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోలు, డీజిల్లపై లీటరుకు 29 పైసల వంతున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి. నిన్న కాక మొన్న జూన్ 9న పెట్రోలుపై లీటరుకు 23-25 పైసలు, డీజిల్పై 23-27 పైసల మేర ధరను చమురు కంపెనీలు పెంచాయి. ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి వినియోగదారులపై మరోసారి భారం మోపాయి. హైదరాబాద్లో ‘సెంచరీ’ తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోలో ధర వంద దాటనుంది. జూన్ 9న పెరిగిన పెట్రోల్ ధరలతో హైదరాబాదులో లీటరు పెట్రోలు ధర రూ.99.31, డీజిల్ రూ. 94.26గా నమోదు అయ్యింది. తాజాగా 29 పైసలు పెంచడంతో భాగ్యనగరంలో కూడా పెట్రోలు సెంచరీని దాటింది. ఇప్పటికే ఏపీలో పెట్రోలు ధరలు వందను దాటేశాయి. ధరల పెరుగుదలలో ఇదే ట్రెండ్ కొనసాగితే డీజిల్ వందను దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఫలితాల తర్వాత ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడాపెడా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మే 4 నుంచి జూన్ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. జూన్లో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు రూ. 1.37 రూపాయలు పెరిగింది. చదవండి : ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్ -
బాబోయ్ పెట్రోల్.. భవిష్యత్తు హైపర్ ఛార్జర్లదే
వెబ్డెస్క్ : పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. పైకి వెళ్లడమే తప్ప కిందికి రానంట్ను ఫ్యూయల్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. దీంతో పెట్రోలు పోయించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంటోంది. మరోవైపు అనేక కంపెనీలు ఎలక్ట్రికల్ వెహికల్స్ (ఈవీ)కి అనుగుణంగా ఛార్జింగ్ స్టేషన్లను అందుబాబులోకి తెస్తున్నాయి. ఈవీ ఛార్జింగ్ పాయింట్లు పెట్రోల్ బంకులకు ప్రత్యామ్నయం కానున్నాయా? ఛార్జింగ్ సమస్య పెట్రోమంటతో ఉక్కిరిబిక్కిరవుతున్న సామాన్యులు పెట్రోల్ బండ్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కి మారుదామంటే, వాటి ఛార్జింగ్ అంశం సమస్యగా మారింది. ఈవీ వెహికల్స్కి ప్రభుత్వం నుంచి పన్ను రాయితీ, ఇతర ప్రోత్సహకాలు లభిస్తున్నా ఛార్జింగ్ అనేదే ప్రధాన సమస్యగా మారింది. ఇప్పుడీ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆటోమొబైల్ సంస్థలే స్వయంగా ముందుకు వస్తున్నాయి. టీవీఎస్ ఎంఓయూ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సంస్థ టీవీఎస్ కొత్త ఐడియాతో ముందుకు వచ్చింది. ఎంపిక చేసిన నగరాల్లో సొంతంగా ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఒకటైన కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్తో అవగాహన ఒప్పందం చేసుకుంది ఈ మేరకు 2020 మార్చి నాటికి దేశంలోని 20 నగరాల్లో ఈవీ వెహికల్స్ ఛార్జింగ్ నెట్వర్క్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ పేరుతో 2020లోనే ఈవీ వెహికల్ని టీవీఎస్ మార్కెట్లోకి తెచ్చింది. అయితే ఛార్జింగ్ నెట్వర్క్ సమస్య కారణంగా కేవలం ఢిల్లీ, బెంగళూరు నగరాలకే పరిమితమైంది. ఓలా టార్గెట్ లక్ష ఛార్జింగ్ పాయింట్లు క్యాబ్ సర్వీసులు అందిస్తున్న ఓలా సైతం హైపర్ ఛార్జింగ్ స్టేషన్లపై దృష్టి పెట్టింది. భారీ ఎత్తున ఓలా స్కూటర్లను ఈ కంపెనీ తయారు చేస్తోంది. దీంతో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రాబోయే రోజుల్లో 400 నగరాల్లో లక్షలకు పైగా హైపర్ ఛార్జింగ్ నెట్వర్క్లను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇళ్లు, పబ్లిక్ ప్లేసేస్తో పాటు ఇతర ముఖ్యమైన ప్రదేశాల్లో ఈ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో వంద నగరాల్లో ఐదు వేల ఛార్జింగ్ పాయింట్లు నిర్మిస్తామని ప్రకటించింది. మరోవైపు ఛార్జింగ్ సమస్య పరిష్కారానికి హీరో సంస్థ ఏకంగా రూ. 10,000 కోట్ల రూపాయలను రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై ఖర్చు చేస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీపై తైవాన్కి చెందిన గోగోరో సంస్థతో ఒప్పందం కూడా చేసుకుంది చదవండి: ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు చదవండి:Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర -
Petrol, Diesel Prices: మరోసారి పెరగిన ఇంధన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. ఆదివారం లీటర్ పెట్రోల్పై 28 పైసలు, డీజిల్పై 31 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.101.25 డీజిల్ ధర లీటరుకు రూ. 93.10 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.95.03, డీజిల్ రేటు రూ.85.95గా ఉన్నాయి. ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.98.76, డీజిల్ రూ.93.70 ► కోల్కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 95.02, లీటర్ డీజిల్ రేటు రూ. 88.80 ► చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 96.47,లీటర్ డీజిల్ ధర రూ. 90.66 చదవండి: GST: జీఎస్టీ వసూళ్లలో రికార్డు -
Petrol, Diesel Prices: మరోసారి పెరిగిన ధరలు
Petrol, Diesel Prices Today: దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం లీటర్ పెట్రోల్పై 29 పైసలు, డీజిల్పై 28 పైసలు పెరుగుదల నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.100 వద్ద కొనసాగుతోంది. అక్కడ లీటరు పెట్రోల్ ప్రస్తుతం రూ.100.47, డీజిల్ ధర లీటరుకు రూ. 92.25 పెరిగినట్లు ప్రభుత్వ ఇంధన రిటైలర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పేర్కొంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ రేటు లీటరుకు రూ.94.23, డీజిల్ రూ.85.15. దేశంలో మే 3 నుంచి ఇంధన ధరలు.. పెట్రోల్ లీటరు ధర రూ. 3.83, డీజిల్ రేటు రూ.4.42 పెరగటం గమనార్హం. ► హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.97.63, డీజిల్ రూ.92.54 చదవండి: నేడు 2020–21 జీడీపీ గణాంకాలు! -
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
సాక్షి, ముంబై : దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రెండు రోజుల పాటు స్థిరంగా ఉన్న ధరలు మళ్లీ పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్పై 26 పైసలు పెరిగింది. లీటర్ డీజిల్పై 34 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 91.53 కి చేరగా, డీజిల్ ధర రూ. 82.06 కి చేరింది. ప్రధాన నగరాల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరుకు ముంబైలో పెట్రోల్, రూ .97.86, డీజిల్ రూ .89.17 చెన్నై పెట్రోల్ రూ .93.38, డీజిల్ రూ .86.96 కోల్కతాలో పెట్రోల్ రూ .91.66, డీజిల్ రూ.84.90 హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ. 95.13.డీజిల్ ధర రూ.89.47 విజయవాడలో పెట్రోల్ ధర రూ. 97.65 డీజిల్ ధర రూ.91.43 చదవండి: పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ -
పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ
హైదరాబాద్: అసలే దేశంలో ఒక పక్క కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. మరోపక్క నిత్యవసర, అత్యవస వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో స్థానిక లాక్ డౌన్ లతో ఉద్యోగాలు పోయి సామాన్య ప్రజానీకం భాదపడుతుంటే స్థానిక, కేంద్ర ప్రభుత్వాలు కనీసం పట్టించుకోగా పొగ.. ప్రజల బాధలతో సంబంధం లేకుండా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరల బాదుడు మళ్లీ షురూ చేశాయి. ఆదేమని అడిగితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయి అందుకే మేము కూడా పెంచాల్సి వచ్చినట్లు చెబుతున్నాయి. ప్రస్తుతం పెరిగింది పైసాలలోనైన ఇలా కొన్ని రోజులు పెరగిన పెంపును కలిపితే అవి మనకు రూపాయిల్లో కనిపిస్తాయి. అప్పుడు అర్ధం అవుతుంది ఎంత ఎక్కువ పెంచేశారో అని. చమురు ధరలు పెరగడం వల్ల ప్రతి నిత్యవసర వస్తువు మీద పెట్రో ధరల ప్రభావం పడుతుంది. ఫిబ్రవరి 23 తర్వాత వచ్చిన ఐదు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అప్పటి నుంచి పెట్రో ధరలను పెంచలేదు. అవి అయిపోయిన వెంటనే ధరలను మళ్లీ పెంచేశాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు 15 పైసలు పెరగగా, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు పెంచింది. మంగళవారం పెట్రోల్ లీటరుకు రూ.90.55, డీజిల్ లీటరుకు రూ.80.91 చొప్పున రిటైల్ కు అమ్ముతున్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కి రూ.0.17 పైసలు పెరిగి రూ.94.16కి చేరుకుంటే, డీజిల్ ధర లీటర్ రూ.0.20 పెరిగి రూ.88.25 అయ్యింది. విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 92.12 ఉండగా డీజిల్ ధర రూ.89.72 ఉంది. ధరలు పెరుగుదలకు ఎన్నికలకు ఎటువంటి సంబంధం లేదని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ, వాస్తవానికి 5 రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ధరలు పెంచితే ప్రజలు ఆగ్రహంతో ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయరన్న ఉద్దేశంతో బలవంతంగా ధరలను స్థిరంగా ఉంచారనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచ చమురు ధరల హెచ్చుతగ్గులను బట్టి ఇంధన ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. చదవండి: భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు -
పెట్రో బేజారు..సైకిల్ షి‘కారు’
సాక్షి, హైదరాబాద్ : నగరంలో ఆరోగ్యార్థులకు సైక్లింగ్ ఒక మంచి హాబీగా మారిపోయింది. ముఖ్యంగా ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు చాలా మంది నిర్ణీత దూరం నుంచి ఆఫీసులకు సైక్లింగ్ ద్వారానే చేరుకుంటున్నారు కూడా. మరోవైపు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో సైక్లిస్టులు మరింత పెరిగారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలకు రాకపోకల్లో భాగంగా కొంత దరాలకు సైక్లింగ్ మేలని భావిస్తున్నవారు... తమ కార్లకు సైకిల్ను ఇలా తగిలించుకుని మరీ తీసుకుపోతున్నారు. చదవండి: వయసును వెనుకే వదిలి పెట్టెయ్ -
డీజిల్ భారం తగ్గింపునకు ఆర్టీసీ ప్రణాళిక
సాక్షి, అమరావతి : డీజిల్ భారాన్ని తగ్గించుకునేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ప్రణాళికలు రూపొందిస్తోంది. సంస్థకు ఉద్యోగుల వేతనాల తర్వాత డీజిల్పై ఖర్చే అధికం. ఏటా వేతనాలకు రూ.3 వేల కోట్లు వెచ్చిస్తున్న సంస్థ డీజిల్పై రూ.2,100 కోట్లు ఖర్చు చేస్తోంది. ఆర్టీసీలో రోజుకు 8 లక్షల లీటర్ల డీజిల్ వాడుతున్నారు. డీజిల్పై రూపాయి పెరిగితే రోజుకు రూ.8 లక్షలు నెలకు రూ.2.40 కోట్లు అదనపు భారం పడుతుంది. అదే రూ.2 పెరిగితే అదనంగా రూ.4.80 కోట్ల భారం పడుతుంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ సీఎన్జీ బస్సులను పెంచుకోవడం, బయో డీజిల్ వాడకంపై దృష్టి సారించింది. 350 విద్యుత్తు బస్సుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. తిరుమలకు 150, విజయవాడలో 100, విశాఖపట్నంలో 100 విద్యుత్తు బస్సులను నడిపాలని నిర్ణయించింది. కేంద్రం ఫేమ్–2 పథకం కింద నిధులు అందించేందుకు సుముఖంగానే ఉండటంతో ఆర్టీసీ విద్యుత్తు బస్సుల కోసం ప్రతిపాదనలు పంపింది. తొలుత తిరుమలలో 150 బస్సులు నడిపేందుకు అధికారులు నిర్ణయించారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో నడిచే బస్సులు పెంచాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో 302 సీఎన్జీ బస్సులున్నాయి. విజయవాడలో విద్యాధరపురం, గవర్నర్పేట–2, ఇబ్రహీంపట్నం డిపోల పరిధిలోను, తూర్పుగోదావరి రీజియన్లో రాజమండ్రిలోను సీఎన్జీ బస్సులు తిప్పుతున్నారు. వీటిని పెంచేందుకు ఈడీల కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆయిల్ బంకుల ఏర్పాటుపై అధ్యయనం ఆర్టీసీ డిపోల్లో ఆయిల్ బంకులను ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వ వాహనాలకు ఆయిల్ సరఫరా చేస్తే నాన్ టిక్కెట్ రెవెన్యూ కింద కొంత ఆదాయం ఆర్జించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం.. పోలీస్ శాఖ గుంటూరు, విశాఖల్లో నిర్వహిస్తున్న ఆయిల్ బంకులపై అధ్యయనం చేయనున్నారు. అనంతరం ఆర్టీసీ డిపోల్లో బంకుల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నారు. -
పెట్రోల్ వివాదంలో అమితాబ్, అక్షయ్
ముంబై సెంట్రల్ : పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా బాలీవుడ్ నటులు బిగ్బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్కుమార్లు స్పందించకుంటే వారి సినిమాలను రాష్ట్రంలో ప్రదర్శించకుండా అడ్డుకుంటామని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు నానా పటోలే హెచ్చరించారు. అంతేగాకుండా వారి షూటింగులను కూడా అడ్డుకుంటామన్నారు. డిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమానికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ తరఫున భండార జిల్లాలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెరిగిన పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్లు సోషల్ మీడియాలో ‘మేం కార్లయితే కొనగలం కానీ, పెట్రోల్ కొనలేం’ అని వ్యంగ్యంగా పలు పోస్టింగ్లు పెట్టారనీ, అలాంటిది ఇప్పుడెందుకు మౌనంగా ఉన్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి సెలబ్రిటీలు కూడా భయపడుతున్నారని పేర్కొన్నారు. ప్రజస్వామ్య వ్యవస్థలో ప్రజల జీవితాల్ని ప్రభావితం చేసే ఇలాంటి సెలబ్రిటీలు ప్రజల కోసం ప్రభుత్వాలను ప్రశ్నించడం వారి బాధ్యతగా భావించాలన్నారు. కాగా గడిచిన నెల రోజులుగా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దేశంలో తొలిసారి పెట్రోల్ ధర లీటర్ వంద రూపాయలను దాటింది. భారీగా పెరుగుతున్న ఇంధన ధరలతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం కోసమే.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసమే అమితాబ్, అక్షయ్కుమార్ లాంటి సెలబ్రిటీల పేర్లను వాడుకుంటోందని విమర్శించారు. షూటింగ్లను, సినిమా ప్రదర్శనలను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో భాగస్వామియే కానీ, రాష్ట్రానికి యజమాని కాదన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపుల వల్ల రాష్ట్రానికి పరిశ్రమలు రావని, ఫలితంగా నిరుద్యోగ సమస్య పెరుగుతుందని విమర్శించారు. -
పెట్రో ధరలు; వామ్మో.. ఇదేం బాదుడు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలను అంచనా వేస్తూ ధరలను ప్రతిరోజూ సవరిస్తున్న ఆయిల్ కంపెనీలు నాలుగు రోజుల నుంచి ధరలను పెంచేస్తున్నాయి. శుక్రవారం సైతం పెట్రోల్ ధర లీటర్పై 30 పైసలు, డీజిల్పై 39 పైసల మేర పెరిగింది. నిజానికి గడిచిన సోమవారం హైదరాబాద్లో లీటర్ పెట్రల్ ధర రూ.90.42 ఉండగా, మంగళవారం 36 పైసలు పెరిగింది. అప్పటినుంచి రోజూ ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ధర 91.65కి చేరింది. ఈ నాలుగు రోజుల వ్యవధిలోనే లీటర్ పెట్రోల్ ధర రూ.1.23 మేర పెరిగింది. ఇక ఈ నెల ఒకటవ తారీఖు ధరలతో పోలిస్తే ఆయిల్ కంపెనీలు వాహనదా రులపై ఏకంగా రూ.1.88 మేర బాదేశాయి. ఈ నాలుగు రోజుల వ్యవధిలో డీజిల్ ధర సైతం రూ.1.36 మేర పెరిగి లీటర్ రూ.85.50కి చేరింది. ఫిబ్రవరి ఒకటిన ఉన్న ధరలతో పోలిస్తే 2.04 మేర పెరిగింది. రాష్ట్రంలో ప్రతి నెలా సగటున 15 కోట్ల లీటర్ల పెట్రోల్, 21 కోట్ల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ లెక్కన 12 రోజుల్లోనే రాష్ట్రంలోని వాహనదారులపై కనీసంగా రూ.30 కోట్ల మేర భారం పడింది. అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుతున్నాయని సంకేతాలు వస్తున్నా, ఆయిల్ కంపెనీలు మాత్రం ధరల పెంపునకే మొగ్గుచూపుతుండటంతో మరికొద్ది రోజుల్లోనే హైదరాబాద్లో లీటర్ ధరలు రూ.100 కొట్టొచ్చనిపిస్తోంది. -
ధరల దెబ్బతో అమాంతం పెరిగిన ‘జీడీపీ’ : రాహుల్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని పేర్కొన్నాడు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ (గ్యాస్-డీజిల్-పెట్రోల్) భారీగా వృద్ధిని కనబరిచిందని సెటైర్లు వేశారు. ఈమేరకు రాహుల్ ఆదివారం ట్వీట్ చేశారు. కాగా, దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్రవరి 1 నుంచి సాధారణ రైళ్లు) मोदी जी ने ‘GDP’ यानी गैस-डीज़ल-पेट्रोल के दामों में ज़बरदस्त विकास कर दिखाया है! जनता महँगाई से त्रस्त, मोदी सरकार टैक्स वसूली में मस्त। pic.twitter.com/FsiG8ECajk — Rahul Gandhi (@RahulGandhi) January 24, 2021 పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే డీజిల్ రేట్లు కూడా ఆకాశానికి చేరుకున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే అని కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా, చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేసాయి లేదా తగ్గించాయి. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. -
పెట్రోల్ ధర ఆల్టైమ్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. గతంలో మునుపెన్నడూ లేని విధంగా రికార్డులు సృష్టిస్తూ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా బుధవారం లీటర్ పెట్రోల్ ధర రూ.91.85కి చేరింది. దీనికి పోటీగా డీజిల్ ధర రూ.83.87కి వచ్చింది. ఈ ధరలు రాజస్థాన్ రాజధాని జైపూర్లో నమోదయ్యాయి. దేశంలోనే అత్యధిక ధరలు జైపూర్లో ఉన్నాయి. వారం రోజుల పాటు స్థిరంగా ఉన్న పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు 25 పైసల వరకు పెరిగాయి. పెరిగిన ధరలతో దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.45కు పెరిగింది. డీజిల్ రూ.74.38 నుంచి రూ.74.63కు చేరింది. ఇక ధరల్లో రెండోస్థానంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై ఉంది. ముంబైలో పెట్రోల్ ధర రూ.91.07కు చేరగా, డీజిల్ ధర రూ.81.34గా ఉన్నది. వాస్తవంగా గతంలో పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు కంపెనీలు ప్రతి 15 రోజులకు ఒకసారి ధరలను నిర్ణయించేవి. కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017 జూన్ 15వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా పెంచడం.. తగ్గించడం చేస్తోంది. చమురు కంపెనీలు పెట్రో ధరలను ప్రతి రోజు సమీక్షించి ధరలను నిర్ణయిస్తాయి. లాక్డౌన్ తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు అత్యధిక స్థాయికి చేరుకున్నాయి. ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి నగరం పెట్రోల్ (రూ.) డీజిల్ (రూ.) చెన్నై 87.18 79.95 కోల్కతా 85.92 78.22 హైదరాబాద్ 87.85 81.45 బెంగళూరు 87.30 79.14 జైపూర్ 91.85 83.87 (దేశంలోనే అత్యధికం) -
పెట్రోల్, డీజిల్ ధరల సెగ- రెండేళ్ల గరిష్టం
న్యూఢిల్లీ, సాక్షి: కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్, డీజిల్ ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి. సగటున పెట్రోల్పై 30-33 పైసలు, డీజిల్ లీటర్పై రూ. 25-31 పైసల చొప్పున ఎగశాయి. తాజాగా ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 30 పైసలు బలపడి రూ. 83.71కు చేరింది. డీజిల్ ధర సైతం లీటర్కు 25 పైసలు అధికమై రూ. 73.87ను తాకింది. వెరసి పెట్రోల్, డీజిల్ ధరలు రెండేళ్ల గరిష్టానికి చేరాయి. కాగా.. ఇదేవిధంగా దేశంలోని ఇతర ప్రాంతాలలోనూ పెట్రోల్, డీజిల్ ధరలు పన్నులు తదితరాల ఆధారంగా పెంపునకు లోనుకానున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. 48 రోజుల తదుపరి మళ్లీ నవంబర్ 20న దేశీయంగా పెట్రోల్ ధరలకు రెక్కలొచ్చిన విషయం విదితమే. అప్పటినుంచీ విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరలు బలపడుతుండటంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మంటపుట్టిస్తున్నట్లు నిపుణులు వ్యాఖ్యానించారు. 17 రోజుల్లో గత 17 రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ. 2.65 పెరిగినట్లు ఇంధన రంగ విశ్లేషకులు తెలియజేశారు. ఇదేవిధంగా డీజిల్ లీటర్పై మరింత అధికంగా రూ. 3.40 పెంపు అమలైనట్లు తెలియజేశారు. కాగా.. ప్రస్తుతం ముంబైలో పెట్రోల్ 33 పైసలు బలపడి రూ. 90.34కు చేరింది. కోల్కతాలోనూ రూ. 84.86 నుంచి రూ. 85.19కు చేరింది. ఇక చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ. 20 పైసలు పెరిగి రూ. 86.51 అయ్యింది. డీజిల్ ధరలు ఇలా ఢిల్లీలో డీజిల్ ధరలు లీటర్కు రూ. 25 పైసలు పెరిగి 73.87కు, ముబైలో 31 పైసలు బలపడి 80.51కు, కోల్కతాలో 29 పైసలు అధికమై 77.44కు చేరాయి. చెన్నైలోనూ డీజిల్ లీటర్ 28 పైసలు పెరిగి 79.21ను తాకింది. కోతల ఎఫెక్ట్ రష్యాసహా ఒపెక్ దేశాలు ఉత్పత్తిలో కోతలను 2021 జనవరి తదుపరి సైతం కొనసాగించేందుకు అంగీకరించడంతో ముడిచమురు ధరలు ర్యాలీ బాటలో సాగుతున్నాయియి.వారాంతాన దాదాపు 10 నెలల గరిష్టాలకు చేరాయి. ప్రస్తుతం లండన్ మార్కెట్లో బ్రెంట్ బ్యారల్ 0.5 శాతం నీరసించి 49 డాలర్లను తాకింది. న్యూయార్క్ మార్కెట్లోనూ నైమెక్స్ చమురు 0.54 శాతం క్షీణించి 46.01 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒపెక్ తదితర దేశాలు ప్రస్తుతం రోజుకి 7.7 మిలియన్ బ్యారళ్లమేర చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేస్తున్న విషయం విదితమే. తాజా ఒప్పందంలో భాగంగా రోజుకి 7 మిలియన్ బ్యారళ్ల చొప్పున చమురు ఉత్పత్తిలో కోతలను అమలు చేయనున్నట్లు పరిశ్రమవర్గాలు తెలియజేశాయి. వెరసి మార్చి తదుపరి చమురు ధరలు మరోసారి గరిష్టాలను తాకాయి. దేశీయంగా విదేశీ ప్రభావంతో ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ వస్తున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. విదేశీ మార్కెట్లలో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్ క్రూడ్ బాస్కెట్ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. -
హైదరాబాద్లో రూ. 85 దాటిన పెట్రోలు
సాక్షి, ముంబై : ఒక రోజు విరామం తర్వాత గురువారం మెట్రో నగరాల్లో పెట్రోలు మళ్లీ ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు సుమారు 10 పైసలు చొప్పున పెరగ్గా, డీజిల్ రేట్లు యథాతథంగా ఉన్నాయి. దీంతో హైదరాబాద్లో పెట్రోలు ధరలీటరుకు 85 రూపాయల మార్క్ ను దాటేసింది. (చదవండి: వరుసగా ఆరో రోజు పెట్రో బాదుడు) దేశ రాజధానిలో పెట్రోల్ రేటు లీటరుకు 81.83 కు చేరింది. ముంబైలో పెట్రోల్ ధర లీటరుకు రూ .88.48 గా ఉంది. కోల్కతాలో 83.33 రూపాయలు, బెంగళూరులో 84.49 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు 85.04 రూపాయలుగాను ఉంది. మరోవైపు డీజిల్ ధర ఢిల్లీలో లీటరుకు 73.56 రూపాయలు, ముంబైలో 80.11రూపాయలు, చెన్నైలో 78.86 రూపాయలు, కోల్కతాలో 77.06 రూపాయలు, హైదరాబాద్లో లీటరుకు రూ 80.17 రూపాయలు పలుకుతోంది. -
ఆకాశమార్గాన పెట్రో ధరలు
కేవలం ఒక్క రోజు మినహా గత మూడు వారాలుగా అదే పనిగా పైపైకి పోతున్న పెట్రో ధరలు దేశ పౌరుల్ని హడలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వరస లాక్డౌన్లు, ఆ తర్వాత కూడా కొనసాగుతున్న అనేక రకాల ఆంక్షలతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో సొంత వాహనాల దుమ్ము దులిపి బయటకు తీయడం మొదలు పెట్టారు. ఇదే అదునుగా చమురు సంస్థలు నిలువుదోపిడీకి దిగుతున్నాయి. ఈ నెల 7 నుంచి రోజూ ధరల్ని పెంచడం రివాజుగా పెట్టుకున్నాయి. ఆదివారం ఒక్కరోజూ ఎందుకో అవి కనికరించాయి. ధరల పెంపు ప్రక్రియకు ఇక బ్రేకు పడినట్టేనని అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 24 గంటలు గడవ కుండానే సోమవారం మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. ఈ పెరుగుదల ఎంత వింతగా వుందంటే లీటర్ పెట్రోల్కన్నా లీటర్ డీజిల్ ధరే ఇప్పుడు అధికంగావుంది! లాక్డౌన్ కాలంలో తమకొచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి మొదటి పదిరోజులూ చమురు సంస్థలు ధరల్ని పెంచాయి. అటు తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం పెంచడంతో ఆ భారాన్ని చమురు సంస్థలు వినియోగదారులకు బదిలీ చేయడం మొదలుపెట్టాయి. పర్యవసానంగా పెట్రో ధరలు యధేచ్ఛగా పెరుగుతున్నాయి. లాక్డౌన్ సమయంలో పెట్రోల్, డీజిల్ వినియోగం 66 శాతం పడి పోయిందన్నది వాస్తవం. అయితే లాక్డౌన్ వల్ల నష్టపోయింది చమురు సంస్థలు ఒక్కటే కాదు. దేశంలో అన్ని రంగాలూ, సంస్థలూ తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిపై ఆధారపడే కోట్లాదిమంది కూలీలు, కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు కూడా ఎనలేని నష్టాన్ని చవిచూస్తున్నారు. తమ కొచ్చిన కష్టాల నుంచి వారింకా కోలుకోలేదు. ఇప్పట్లో కోలుకునే అవకాశం కూడా లేదు. ఇంతగా అగచాట్లు పడుతున్నవారిపై రోజూ ధరల దరువు వేయడం ఎంతవరకూ సమంజమన్న స్పృహ కూడా ఎవరికీ లేకుండా పోయింది. పెట్రో ధరలపై విధిస్తున్న నియంత్రణ వల్ల చమురు సంస్థలకు ప్రభుత్వాలు భారీగా చెల్లించాల్సి వస్తున్నదని, దీన్ని తొలగించదల్చుకున్నామని 2002లో తొలిసారి వాజపేయి నేతృత్వంలోని అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల కదలికలకు అనుగుణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలుండాలి. అయితే దీన్ని గట్టిగా వ్యతిరేకించిన కాంగ్రెస్...తన నేతృత్వంలో 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పడగానే తిరిగి నియంత్రణ విధానాన్ని తీసుకొచ్చింది. కానీ 2010లో పెట్రోల్ ధరలపై మాత్రం నియంత్రణ తొలగించింది. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ అధికారంలోకొచ్చాక డీజిల్ ధరలపై వున్న నియంత్రణ కూడా పోయింది. వాస్తవానికి ఇలా నియంత్రణ తొలగించడం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వినియోగదారులు లాభపడాలి. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఎప్పుడూ లేనంత తక్కువగా వున్నాయి. నిరుడు డిసెంబర్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లో ఆ ధరలు క్షీణించడం మొదలుపెట్టాయి. మొన్న మార్చిలో రష్యాకూ, సౌదీ అరేబియా నేతృత్వంలోని చమురు దేశాల కూటమి ఒపెక్ కూ మధ్య వచ్చిన విభేదాల వల్ల అవి మరింత పతనమయ్యాయి. ఆ తర్వాత కాలంలో కరోనా వైరస్తో ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్లో ఉండటంవల్ల ఏర్పడ్డ సంక్షోభంతో డిమాండ్ పడిపోయి పతనమవుతున్నాయి. ఈ పతనావస్థ సోమవారం కూడా కొనసాగింది. బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ 40 డాలర్లుంది. అమెరికా ఉత్పత్తి చేసే ముడి చమురు బ్యారెల్ ధర 37.77 డాలర్ల వద్ద నిలిచిపోయింది. అయితే చమురు ధరల్ని డాలర్ రేటుతో పాటు మరికొన్ని అంశాలు ప్రభావితం చేస్తాయి. మనం కొనుగోలు చేసే ముడి చమురుకు డాలర్లలో చెల్లించాల్సి వుంటుంది గనుక డాలర్ రేటు అధికంగా వున్నప్పుడు ముడి చమురు ధర తగ్గడం వల్ల కలిగే లాభం ఆవిరయ్యే మాట నిజమే. అలాగే చమురు శుద్ధి ప్రక్రియ, దేశంలోని వివిధ ప్రాంతాలకు పెట్రోల్, డీజిల్, కిరోసిన్ పంపిణీ వగైరాలకు అదనంగా ఖర్చవుతుంది. కానీ వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకున్నాక సైతం తగ్గాల్సిన పెట్రో ధరలు కూడా కేంద్రం విధిస్తున్న సుంకాల కారణంగా పైపైకి పోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడల్లా తమకు అంతక్రితం ఏర్పడ్డ నష్టాలను పూడ్చుకోవడానికి వచ్చిన అవకాశంగా అటు చమురు సంస్థలూ, ఇటు కేంద్ర ప్రభుత్వమూ భావిస్తున్నాయి. వీటికితోడు రాష్ట్రాల స్థాయిలో విధిస్తున్న పన్నులు సరేసరి. ఆదాయానికీ, వ్యయానికీ మధ్య వుండే ద్రవ్యలోటు జీడీపీలో 3.5 శాతం మించరాదన్నది కేంద్ర ప్రభుత్వ సంకల్పం. కరోనా వైరస్ బీభత్సం పర్యవసానంగా రాబడి గణనీయంగా పడిపోవడం... ఉద్దీపన ప్యాకేజీల కింద అదనంగా ఖర్చుపెట్టాల్సిరావడం వంటి కారణాల వల్ల ఆ సంకల్పానికి చిల్లుపడే ప్రమాదం వచ్చిపడింది. పర్యవసానంగా ద్రవ్యలోటు ఈసారి 7 శాతం వరకూ ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. అది ఏమేరకు తగ్గించుకోగలమన్నదానిపైనే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇతరత్రా ఆదాయాలన్నీ పడిపోయిన నేపథ్యంలో ఉన్నంతలో చమురు వినియోగం ద్వారానే లోటు పూడ్చుకోవడం సాధ్యమన్న నిర్ణయానికొచ్చింది. కనుకనే అంత ర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా మన దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ప్రపంచ మార్కెట్లో అధిక ధరలున్నప్పుడు సబ్సిడీల యుగానికి కాలం చెల్లిందని మాట్లాడటం... అవి తగ్గినప్పుడు సుంకాల పేరుతో భారీగా వడ్డిస్తూ ఆ లాభాన్ని వినియోగదారులకు దక్కకుండా చేయడం కేంద్రంలో ఎవరున్నా చేస్తున్న పనే. పెట్రో ధరల పెంపువల్ల ద్రవ్యోల్బణం విజృంభించి, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యులు నిస్సహాయంగా వుండిపోతున్నారు. దీన్నంతటినీ మౌనంగా భరిస్తున్నారు. ఈ పరిస్థితి మారాలి. పెట్రో ధరలపై ఇప్పుడనుసరిస్తున్న విధానాలు మార్చాలి. -
‘పెట్రో’ మంట; వైరలవుతున్న బిగ్బీ ట్వీట్
ముంబై : ట్రోల్, డీజిల్ ధరల పెంపుపై 2012లో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. అప్పట్లో 8 రూపాయలు పెరిగిన పెట్రోల్ ధరలపై రగులుతున్న జనాలు తమ కార్లను ఎలా తగలపెట్టాలనుకుంటున్నారో చెబుతూ.. బిగ్బీ చేసిన విమర్శలు ఇప్పటి పరిస్థితులకు కూడా సరిగ్గా సరిపోయేలా ఉన్నాయి. అమితాబ్ ట్వీట్ ప్రకారం.. పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లిన ఓ ముంబై వాసిని ‘ఎంత పొయ్యమంటారు సార్’ అని అడుగుతాడు.. దానికి అతడు బదులిస్తూ ‘2 లేదా 3 రూపాయల పెట్రోల్ కార్ మీద పోయ్యి బ్రదర్.. తగలబెట్టేస్తాను’ అని అంటాడు. (1993 నుంచే యోగా ప్రాక్టిస్:) T 753 -Petrol up Rs 7.5 : Pump attendent - 'Kitne ka daloon ?' ! Mumbaikar - '2-4 rupye ka car ke upar spray kar de bhai, jalana hai !!' — Amitabh Bachchan (@SrBachchan) May 24, 2012 ఈ ట్వీట్ చేసిన 8 సంవత్సరాల తర్వాత తాజాగా నెటిజన్లు ఈ పోస్టుపై సరదా కామెంట్ చేస్తున్నారు. ‘బాగుంది సార్ జోక్ మళ్లీ ఒకసారి వేయండి ప్లీజ్, వాస్తవాల గురించి ధైర్యంగా మాట్లాడేందుకు ఇది సరైన సమయం’ అంటూ పేర్కొంటున్నారు. కాగా గత 19 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజూ పెరుగుతూనే ఉన్నాయి. గురువారం డీజిల్ లీటర్ ధర 0.14 పైసలు పెరిగి 80.02కు చేరింది. ఇప్పటి వరకు నమోదైన డీజిల్ ధరలలో ఇదే అత్యాధికం. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 0.16 పైసలుపెరిగి 79.92 గా ఉంది. అంటే పెట్రోల్ ధర డీజిల్ కంటే ఇంకా పది పైసలు తక్కువగానే ఉంది. అయితే 2012 సంవత్సరంలో ఢిల్లీలో పెట్రోల్ ధరలో మూడింట రెండు వంతులు లేదా అంతకంటే తక్కువగా డీజిల్ ధర ఉండేది. 2002 నుంచి 2012 మధ్య పెట్రోల్ రిటైల్ ధరలు డీజిల్ రిటైల్ ధర కంటే ఎప్పుడూ పెరగలేదు. (మాస్క్ను హిందీలో ఏమంటారో తెలుసా) -
ఇంధన ధరలు పైపైకి..!
సాక్షి, సిటీబ్యూరో: పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ ఎగబాకుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాలైన అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలపై పడింది. దీంతో గత పది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా పెట్రోల్, డీజిల్పై ఒక్క రూపాయి వరకు పెరిగినట్లయింది. దీంతో మంగళవారం నాటికి హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ.80.54 పైసలు, డీజిల్ లీటర్ ధర రూ.75 లకు చేరింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్పై పడి పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100కు చేరువయ్యే అవకాశాలున్నాయి విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మధ్యతరగతి ప్రజలపై భారం తీవ్రంగా పడే అవకాశం ఉంది. అలాగే నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి -
‘పెట్రో’ ధరలు పైపైకే..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం పెట్రోల్, డీజిల్ ధరలపై పడింది. దేశంలో పెట్రోల్ లీటర్పై 9 పైసలు.. డీజిల్పై 11 పైసలు ఆదివారం పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ లీటర్కు రూ.75.54.. డీజిల్ లీటర్కు రూ.68.51లకు చేరింది. ఏడాది కాలంలో పెట్రోల్ ధర ఇదే అత్యధికం. భారత్కు పెట్రో ఉత్పత్తుల దిగుమతుల్లో ఎటువంటి అంతరాయం ఉండబోదని, ధరలపై మాత్రం ప్రభావముంటుందని అధికారులు తెలిపారు. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ.80.12.. డీజిల్ లీటర్కు రూ.74.70లకు చేరింది. -
బాబోయ్ పెట్రోల్ ధరలు..
సాక్షి, న్యూఢిల్లీ: పెట్రోల్ ధరల దూకుడు ఇప్పట్లో ఆగేలా లేదు. వరుసగా నాలుగో రోజు పెట్రోల్ ధరలు పెరిగాయి. పైసా.. పైసా పెరుగుతూ రూపాయలకు చేరి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. ఢిల్లీ, కోల్కతా, ముంబైలలో సోమవారం పెట్రోల్ ధర లీటర్కు 12 పైసలు పెరిగింది. చెన్నైలో 13 పైసలు ఎగిసింది. డీజిల్ ధరలో ఎటువంటి మార్పు లేదు. గత నాలుగు రోజుల్లో ఢిల్లీలో పెట్రోల్ ధర 46 పైసలు హెచ్చింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు ధరలు పెంచాయి. తాజా పెరుగుదలతో పెట్రోల్ ధర ఏడాది గరిష్టానికి చేరుకుంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 80.32 ఉండగా, ఢిల్లీలో రూ.74.66గా ఉంది. డీజిల్ ధరలు ఢిల్లీలో రూ. 65.73, కోల్కతాలో రూ. 68.14, ముంబైలో రూ. 68.94, చెన్నైలో రూ. 69.47గా ఉన్నాయి. పెట్రోల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, బయట పనులకు వెళ్లేవారు సొంత వాహనాలు ఎక్కువగా వాడుతున్నారు. ఆర్టీసీ సమ్మెకు తోడు, పెట్రోల్ ధరలు పెరగడంతో సామాన్యులు మరింత భారం మోయాల్సి వస్తోంది. -
పది రోజుల్లో 84 పైసలు పెరిగిన పెట్రోలు ధర
-
పెరిగిన పెట్రోలు ధర
సాక్షి, ముంబై : పెట్రోలు ధరలు పెరిగాయి. వివిధ మెట్రో నగరాల్లో గురువారం పెట్రోల్ ధర లీటరుకు 16 పైసల చొప్పున ఎగిసింది. అయితే డీజిల్ ధరలు యథాతథంగా ఉన్నాయి. బ్రెంట్ ఫూచర్స్ 0.3 శాతం పెరిగి బ్యారెల్కు 62.53 డాలర్లుగా ఉంది. అటు దేశీయ కరెన్సీ రూపాయి కూడా అమెరికా డాలర్తో పోలిస్తే 15 పైసలు క్షీణించి 72.24 ను తాకింది. బుధవారం రెండు నెలల కనిష్ట స్థాయి 72.09 వద్ద ముగిసింది. కాగా గత పది రోజుల్లో పెట్రోలు ధర 85 పైసలు పెరిగింది. బ్రెంట్ ముడి చమురు రేట్లు బ్యారెల్కు 62 డాలర్లకు మించడంతో, ప్రభుత్వ ఇంధన రిటైలర్లు గత 10 రోజులలో పెట్రోల్ ధరను 85 పైసలు పెంచగా, డీజిల్ ధర 4 పైసలు మాత్రమే పెరిగింది. హైదరాబాద్ : పెట్రోలు ధర రూ. 78.16, డీజిల్ ధర 71.80 విజయవాడ : పెట్రోలు ధర రూ. 77.40, డీజిల్ ధర 70.76 ఢిల్లీ : పెట్రోలు ధర రూ. 73.45, డీజిల్ ధర 65.79 కోలకతా: పెట్రోలు ధర రూ. 76.15, డీజిల్ ధర 68.2 చెన్నై : పెట్రోలు ధర రూ. 76.34 డీజిల్ ధర 69.54 ముంబై : పెట్రోలు ధర రూ. 79.12, డీజిల్ ధర 69.01 -
ధరల దూకుడు.. ఆగేదెప్పుడు!
సాక్షి,సిటీబ్యూరో: మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు దూకుడు పెంచాయి. రోజువారీ పెరుగుదల పైసల్లోనే ఉన్నా.. వైగంగా పైపైకి ఎగబాకుతూ రికార్డు సృష్టిస్తున్నాయి. సౌదీ అరేబియాలోని ఆయిల్ ప్లాంట్లపై డ్రోన్ దాడులతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల ప్రభావం పెట్రోల్, డీజిల్పై పడింది. కేవలం పది రోజుల్లో లీటర్ పెట్రోల్పై రూ.2.30, డీజిల్పై రూ.1.80గా పెరుగుదల నమూదైంది. వాస్తవంగా రోజువారీ ధరల సవరణ వినియోగదారుల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే దేశంలో డీజిల్ ధర టాప్ గేర్లో పరుగెడుతుండగా.. పెట్రోల్ రెండో స్థానంలో పరుగులు తీస్తోంది. 2017 జూన్ వరకు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధరలు సమీక్షించిన చమురు సంస్థలు.. తర్వాత ఆ విధానానికి స్వస్తి పలికాయి. మార్కెట్ ధరలకు అనుగుణంగా ఏ రోజుకారోజు ధరలను నిర్ణయిస్తూ వస్తున్నాయి. నూతన విధానం అమల్లోకి వచ్చిన తొలి పదిహేను రోజుల్లో ధరలు తగ్గగా.. ఆ తర్వాత క్రమంగా విజృంభిస్తున్నాయి. పెట్రో ఉత్పత్తుల ధరల దూకుడుకు పన్నుల మోత, రవాణ చార్జీల ప్రభావం కనిపిస్తోంది. రికార్డుకు చేరువలో పెట్రోల్ ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ.79.02కు చేరింది. పదిరోజుల క్రితం రూ.76.72గా «ఉన్న ధర.. తర్వాత పైసల్లోనే పెరుగుతోంది. డీజిల్ ధర సైతం అదేస్థాయిలో పరుగులు పెడుతోంది. సరిగ్గా పదిరోజుల క్రితం రూ.71.49 ఉన్న డీజిల్ లీటర్ ప్రస్తుతం రూ.73.29కి చేరింది. రెండేళ్ల క్రితం ధరల సవరణ సమయంలో డీజిల్ లీటర్ రూ.59.30కి చేరిన ధర.. ఆ తర్వాత పెరుగుతునే ఉంది. మహానగరంలో వినియోగం ఇలా.. హైదరాబాద్ మహా నగరంలో పెట్రో/డీజిల్ వినియోగం రోజురోజుకు పెరగుతోంది. నగరంలో సుమారు 60.50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో 10 లక్షల వరకు వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగర వ్యాప్తంగా మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 540 వరకు పెట్రోల్, డీజిల్ బంకులు ఉండగా వాటి ద్వారా నిత్యం సుమారు 65 లక్షల లీటర్ల పెట్రోల్, 40 లక్షల లీటర్ల డీజిల్ అమ్ముడవుతోంది. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్ల ఇంధనం సరఫరా అవుతోంది. ఒక్కో ట్యాంకర్ సామర్థ్యం సగటున 12 వేల నుంచి 20 వేల లీటర్లు ఉంటుంది. -
పెట్రో షాక్ షురూ..
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక సమరం ముగియడంతో పెట్రో ఉత్పత్తుల ధరలకు రెక్కలొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారమైనా ఎన్నికల సీజన్ కావడంతో రిటైల్ ధరలను సవరించని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు క్రమంగా పెట్రో ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నాయి. గత నాలుగు రోజుల్లో పెట్రోల్ ధరలు 40 పైసలు పైగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. పెట్రోల్ ధరలు రానున్న రోజుల్లో లీటర్కు ఏకంగా రూ 99కు పెరుగుతాయని ప్రముఖ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థకు చెందిన ఓ ఆర్థిక వేత్త బాంబుపేల్చారు. మరోవైపు డాలర్తో రూపాయి మారకం విలువ రూ 69.30 వద్ద స్ధిరంగా ఉండటంతో పెట్రోల్ రిటైల్ ధరల పెంపు భారం వినియోగదారులపై పరిమితంగానే ఉంటుందని డెలాయిట్ ఇండియా ఎనర్జీ రిసోర్సెస్ లీడర్ దేవశీష్ మిశ్రా చెప్పడం కొంత ఊరట ఇస్తోంది. -
పెట్రో ధరలపై వినూత్న నిరసన
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు కన్యాకుమారి జిల్లా కరుంగల్కు చెందిన పొన్ షోజిన్రాజ్ సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి తిక్కనంగాడుకు చెదిన పొన్నిట్ర అనే ఉపాధ్యాయురాలితో బుధవారం ఉదయం వివాహం జరిగింది. పెళ్లికాగానే నవవధూవరులు కరుంగల్లోని వరుడి ఇంటికి చేరుకున్నారు. అదేరోజు సాయంత్రం వివాహ రిసెప్షన్ కోసం వధూవరులు కల్యాణమండపానికి వెళ్లేందుకు జోడెద్దుల బండిని పిలిపించుకున్నారు. బండి ముందువైపు కేరళ వాయిద్యాలు, నృత్యాలు సాగుతుండగా ఊరేగింపుగా బయలుదేరారు.ఇదేం చోద్యమని పలువురు ప్రశ్నించగా పెరిగిపోతున్న పెట్రోలు ధరలకు నిరసనగా తానే ఈ ఏర్పాటు చేసినట్లు కాంగ్రెస్ నేతైన వరుడి తండ్రి జవాబిచ్చాడు. పెట్రోలు, డీజిల్ ధరలు ఇలాగే పెరిగిపోతే మరికొంతకాలానికి ఎడ్లబండే దిక్కు అనే సందేశాన్ని కేంద్రానికి ఇవ్వడానికే ఈ ఊరేగింపని అన్నాడు. -
తగ్గినట్లే తగ్గి..
సాక్షి,సిటీబ్యూరో: పండుగ వేళ పెట్రో ధరలు పై పైకి ఎగబాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గుముఖం పట్టిన దేశీయంగా ముడిచమురు ఉత్పత్తుల ధరలు నానాటికి భారంగా మారుతున్నాయి. గత మూడు నెలల అనంతరం మహీల్ల పెట్రో ధరలు దూకుడు పెంచాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పోటా పోటీగా పెరుగుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో పైసా పైసా పెరుగుతూనే లీటర్ పెట్రోల్ పై సుమారు రూ.2 వరకు, డీజిల్పై రూ.2.20 పైసలు పెరిగాయి. సరిగ్గా గత వారం రోజుల క్రితం స్వల్పంగా పెరిగి ఆ తర్వాత రెండు రోజుల పాటు నిలకడగా ఉన్న పెట్రో ధరలు ఆ తర్వాత విజృంభించాయి. పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్కు 20 నుంచి 53 పైసల మధ్య, డీజిల్ ధరలు లీటర్కు 30 నుంచి 64 పైసల పెంచుకుంటూ వస్తున్నాయి. సోమవారం నాటికి హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ. 74.40పైసలు, డీజిల్ ధర లీటర్కు రూ 69.77 పైసలకు చేరింది. మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మళ్లీ విజృంభణ... అసెంబ్లీ ఎన్నికల మందు తగ్గు ముఖం పట్టిన పెట్రోల్, డీజిల్ ధరల మళ్లీ విజృంభిస్తున్నాయి. రోజువారి ధరల సవరణ ప్రక్రియలో గత నాలుగు మాసాల క్రితం వరకు హడలెత్తించిన పెట్రోల్, డీజిల్ ధరలు వెనక్కి తగ్గినట్లే తగ్గి అంతర్జాతీయ మార్కెట్ చమురు« ధరలు తగ్గు ముఖం పట్టినా మళ్లీ ఎగబాగుతున్నాయి. నాలుగు నెలల క్రితం హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ ధర రూ. 89.06 చేరుకుని ఆల్టైమ్ రికార్డు సృష్టించింది. అదేబాటలో డిజిల్ ధర కూడా ఎగబాకి దేశంలోనే రికార్డు సృష్టించింది. అప్పట్లో లీటర్ డీజిల్ ధర రూ.82.33 పైసలు పలికింది. వినియోగంలో టాప్... హైదరాబాద్ మహా నగరం పెట్రోల్, డీజిల్ వినియోగంలో మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రం మొత్తం మీద సగం వినియోగం నగరంలోనే జరుగుతోంది. నగరంలో సుమారు 50 లక్షలకు పైగా వాహనాలు ఉండగా, మరో పది లక్షల వరకు వాహనాల వరకు నగరానికి రాకపోకలు సాగిస్తుంటాయి. నగరంలో మూడు ప్రధాన ఆయిల్ కంపెనీలకు చెందిన సుమారు 460 పెట్రోల్, డీజిల్ బంకుల ఉండగా వాటి ద్వారా ప్రతి రోజు 40 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్ అమ్మకాలు జరుగుతున్నాయి. ఆయిల్ కంపెనీల టెర్మినల్స్ నుంచి ప్రతిరోజు పెట్రోల్ బంకులకు 150 నుంచి 170 ట్యాంకర్లు ద్వారా ఇంధనం సరఫరా అవుతుంది. ఒక్కో ట్యాంకర్ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది . -
పండగ వేళ పెట్రో భారాలు
సాక్షి, న్యూఢిల్లీ : పండగ వేళ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో భారాలు మోపాయి. గత మూడు రోజులుగా స్వల్పంగా పెరిగిన పెట్రో ఉత్పత్తుల ధరలు ఆదివారం మరింతగా భారమయ్యాయి. పలు చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ ధరలను లీటర్కు 49 నుంచి 60 పైసల మధ్య పెంచగా, డీజిల్ ధరలు లీటర్కు 59 నుంచి 75 పైసల వరకూ భారమయ్యాయి. తాజా పెంపుతో హైదరాబాద్లో పెట్రోల్ లీటర్ రూ 73.47కు ఎగబాకింది. ఇక డీజిల్ ధర లీటర్కు రూ 69.24కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ 69.75కు పెరిగింది. డీజిల్ ధర లీటర్కు రూ 63.69కు చేరింది. ముంబైల్లో పెట్రోల్ ధర లీటర్ రూ 75.39 పలికితే, డీజిల్ ధర 62 పైసలు పెరిగి రూ 66.66కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడంతో పాటు ముడిచమురు ఉత్పత్తులను రోజుకు ఎనిమిదిలక్షల బారెల్స్కు పరిమితం చేయాలన్న సౌదీ అరేబియా నిర్ణయంతో పెట్రో ఉత్పత్తుల ధరలు భారమయ్యాయి. -
ఇంధన దిగుమతులతోనే సంక్షోభ సెగలు..
సాక్షి, న్యూడిల్లీ : అపరిమిత ముడి చమురు దిగుమతుల వల్లే భారత్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. రూపాయి క్షీణత, వాణిజ్య లోటు పెరగడంపై త్వరలో మంత్రుల బృందంతో భేటీ నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. భారత్ తన ఇంధన అవసరాల్లో 80 శాతం వరకూ విదేశీ మార్కెట్ల నుంచి దిగుమతులపైనే ఆధారపడటంతో పెద్దమొత్తంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్నాయి. మరోవైపు డాలర్తో రూపాయి మారకం మరింత క్షీణించడంతో ఇంధన దిగుమతులపై అత్యధికంగా చెల్లింపులు అవసరమవుతున్నాయి. ముడిచమురు ధరలు ప్రస్తుతం బ్యారెల్కు 85 డాలర్లకు ఎగబాకాయి. ఇక రోజురోజూ భారమవుతున్న పెట్రోల్ ధరలు వరుసగా గురువారం సైతం పలు నగరాల్లో సామాన్యుడి జేబుకు చిల్లుపెడుతూ పైపైకి ఎగిశాయి. పెరుగుతున్న ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు పెట్రో ఉత్పత్తులపై సుంకాలు తగ్గించాలని, ఇంధన ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. -
భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు
-
పెట్రో షాక్ : ఆల్ టైం హైకి చేరిన ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్ ధర ఆల్టైం హై స్ధాయిలో లీటర్కు రూ 89.69కు చేరగా, డీజిల్ ధర లీటర్ రూ 78.42కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ 82.32కు చేరగా, డీజిల్ ధర లీటర్కు రూ 73.87కు ఎగిసింది. ఇక హైదరాబాద్లో ఇంధన ధరలు భారమై పెట్రోల్ లీటర్కు రూ 87.30కి చేరాయి. పెట్రో ధరలు లీటర్కు రూ వందకు చేరువగా పరుగులు తీస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో భారాలతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్ భేటీలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు. పెట్రో భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం తన వంతుగా కొద్దినెలల కిందటే పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు. -
పెట్రో షాక్ : సెంచరీ దిశగా ఇంధన ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో సెగలు కొనసాగుతున్నాయి. ముడిచమురు ధరల భారంతో పాటు రూపాయి క్షీణించడంతో ఇంధన ధరలు సరికొత్త గరిష్టస్ధాయిలకు చేరాయి. లీటర్ పెట్రోల్ రూ వంద దిశగా పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం పెట్రోల్ ధరలు లీటర్కు రూ 89.29కి చేరగా డీజిల్ ధర లీటర్కు రూ 78.26కు పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ 86.25 పలికింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు రూ 81.91కు పెరగ్గా, డీజిల్ ధరలు లీటర్కు రూ 73.32కు చేరాయి. ముంబైలో శనివారం తొలిసారిగా పెట్రోల్ ధరలు లీటర్కు రూ 80కి చేరడంతో ఇంధన ధరల రికార్డు పెరుగుదలపై సర్వత్రా ఆందోళన నెలకొంది. ఇంధన ధరలకు చెక్ పెట్టేందుకు రూపాయిని బలోపేతం చేసే చర్యలు చేపట్టడంతో పాటు, పెట్రో ఉత్పత్తులపై పన్ను భారాలు తగ్గించాలనే డిమాండ్ ఊపందుకుంది. aasss -
స్వల్పంగా పెరిగిన పెట్రోల్ ధరలు
సాక్షి, హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా ఇంధన ధరలు మాత్రం అసలు తగ్గడం లేదు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరల పెరుగుదల, దేశీయంగా పన్నుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా పెట్రో ధరలు పెరుగుతున్నాయే తప్ప ఏ మాత్రం తగ్గుదల కిందకి దిగిరావడం లేదు. బుధవారంతో పోలిస్తే గురువారం పెట్రో ధరలు స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా సగటున పెట్రోలు ధర 13 పైసలు, డీజిల్ ధర 11 పైసల చొప్పున పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రికార్డు స్థాయిల్లో రూ. 81 మార్కును తాకింది. లీటరు డీజిల్ ధర కూడా చారిత్రాత్మక గరిష్టంలో రూ. 73.08గా నమోదైంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటరు పెట్రోలు ధర 15 పైసలు పెరిగి, రూ. 88.39, డీజిల్ ధర రూ. 77.58గా ఉంది. అయితే అంతకంతకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం సైతం ఒత్తిడులను ఎదుర్కొంటోంది. అటు ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శల నుంచి తప్పించుకునేందుకు పడరాని పాట్లు పడుతోంది. రూపాయి విలువ తగ్గుతుండటం, పెట్రోల్, డీజిల్పై కూడా ప్రభావం కనిపిస్తోంది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై, క్షీణిస్తున్న డాలర్ మారకంలో రూపాయి విలువపై ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారంలో సమావేశం నిర్వహించబోతున్నారు. హైదరాబాద్ : లీటరు పెట్రోలు ధర : రూ 85.88 డీజిల్ ధర రూ.79.49 -
జడేజా పరుగుల వేగం కంటే...
కర్ణాటక, బొమ్మనహళ్లి : క్రికెటర్ జడేజా పరుగుల వేగం కంటే దేశంలో పెట్రోల్ ధర వేగంగా పెరుగుతోందని ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు రమ్య తన ట్వీట్ లో ఎద్దేవా చేశారు. ఇంగ్లాండ్లో జరుగుతున్న భారత్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ రవీంద్ర జడేజా చేసిన పరుగుల కంటే భారత దేశంలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉందని ఆమె పేర్కొన్నారు. జట్టులో అత్యధిక స్కోర్ సాధించిన రవీంద్ర జడెజా 86 పరుగులు చేశారని, దేశంలో పెట్రోల్ ధర రూ. 87 ఉందని ఆమె తన ట్వీట్లో ఎద్దేవా చేశారు. -
పెట్రో షాక్: ఆ పట్టణంలో అత్యధిక ధర
సాక్షి, ముంబై : పెట్రోల్ ధరలు రికార్డు స్ధాయిలో భగ్గుమంటుంటే మహారాష్ట్రలోని పర్బాని పట్టణంలో దేశంలోనే అత్యధికంగా లీటర్ పెట్రోల్ రూ 89.97కు చేరి రికార్డు సృష్టించింది. పెట్రోల్ ధరలు తమ ప్రాంతంలో సోమవారం లీటర్కు రూ 90కు చేరువగా, డీజిల్ లీటర్కు రూ 77.92 పలికిందని పర్బాని జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజయ్ దేశ్ముఖ్ వెల్లడించారు. ఇక మహారాష్ట్ర అంతటా పెట్రోల్ ధరలు రూ 88, డీజిల్ ధరలు లీటర్కు రూ 76 పలికాయని అఖిల భారత పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ ప్రతినిధి అలి దరువాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ పిలుపు మేరకు పెట్రో ధరల పెంపునకు నిరసనగా భారత్ బంద్లో భాగంగా మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. పాలక బీజేపీ-శివసేన మినహా అన్ని పార్టీలు బంద్లో పాల్గొన్నాయి. ముంబైలోని అంథేరి స్టేషన్ వెలుపల మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ అశోక్ చవాన్, ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు సంజయ్ నిరుపమ్ నేతృత్వంలో వేలాది మంది కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. -
పెట్రోలు ధర పెంచడం దారుణం
నెల్లూరు(సెంట్రల్): పెట్రోలు ధరలను మరోసారి పెంచి ప్రజలపై భారం మోపడం దారుణమని నెల్లూరుసిటీ ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ పేర్కొన్నారు. నగరంలోని 7వ డివిజన్ మైపాడుగేటు సెంటరు, సాయిబులపాళెం, కుమ్మరవీధి ప్రాంతాల్లో ప్రజాదీవెన కార్యక్రమాన్ని డిప్యూటీమేయర్ ముక్కాల ద్వారకానాథ్తో కలసి మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపాయన్నారు. అంతర్జాతీయంగా పెట్రోలు, డిజిల్కు సంబం ధించి క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా కూడా ప్రభుత్వాలు మాత్రం ధరలు పెంచుకుంటూ పోతున్నాయన్నారు. మన చుట్టుపక్కల రాష్ట్రాలకంటే ఆంధ్రాలో లీటర్కు రూ.2 నుంచి రూ.3 అదనంగా ఎందుకు పెంచుతున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ రహదారిపై వెళుతున్నలారీలు, తదితర వాహనాల డ్రైవర్లు డీజిల్ ధర తక్కువగా ఉన్న పక్కరాష్ట్రాలలో పట్టించుకుంటున్నారన్నారు. దీనివల్ల మనరాష్ట్రంలో పెట్రోలు బంకులకు నష్టం వచ్చే పరిస్థితి ఉందన్నారు. మనరాష్ట్రంలో చమురు ధరలు పెంచేసి కేంద్ర ప్రభుత్వంపై నిందలు మోపతూ రాష్ట్ర ప్రభుత్వం దొంగనాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. వారంరోజుల క్రితం గుంటూరులో జరిగిన మైనార్టీలసభలో అలెగ్జాండర్ను రాష్ట్రపతిని చేసింది తానే అంటూ చంద్రబాబు మతిస్థిమితం లేని విదంగా మాట్లాడుతున్నారన్నారు. ఆ సభలో తమకు రావాల్సిన పథకాలు అందలేదని శాంతియుతంగా నిరసన తెలిపిన ముస్లింయువకులపై దేశద్రోహులుగా అన్నట్లు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ముక్కాల ద్వారకానాథ్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ భరోసా, నమ్మకం కలిగించే విధంగా నగర ఎమ్మెల్యే అనిల్కుమార్ జెండా ఆవిష్కరించారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దామవరపు రాజశేఖర్, ఓబిలి రవిచంద్ర, నాయకులు రఫి, నాగభూషణం, సందీప్, తంబి, బత్తా కోటేశ్వరరావు, రాములు, తేజ, వంశీ, పోలంరెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి, దార్ల వెంకటేశ్వర్లు, నాగరాజు, మద్దినేని శ్రీధర్ పాల్గొన్నారు. -
పెట్రో మంటలు
నర్సంపేట (వరంగల్) : ఆయిల్ కంపెనీలు పెట్రో, డీజిల్ ధరలను ఇష్టారాజ్యంగా పెంచుతుండడం సామాన్యులను ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ చమురు మార్కెట్లో పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు తడిసి మోపెడవుతుండడంతో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. పెరుగుతున్న ధరలు నిత్యావసర సరకుల ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. 24 గంటలకోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరిచేస్తున్నారు. పేద, మధ్య తరగతి కుటుంబాల సంక్షేమాన్ని ఆలోచించాల్సిన పాలకులు.. ఆ వైపు దృష్టి సారించడం లేదు. దీంతో ఎలా బతకాలని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. పెరుగుతున్న ధరలు ఆటోడ్రైవర్లతోపాటు ఆర్టీసీ, ఇతర ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ వాహనదారులపై ఆర్థిక భారం మోపుతున్నాయి. రవాణా చార్జీలు పెంచలేక.. ఆటో, ఇతర వాహనాలు నడిపించడం మానలేక నరకయాతన అనుభవిస్తున్నారు. కేవలం రోజువారి సంపాదనపై ఆధారపడుతూ కుటుంబాలను పోషించుకుంటున్న ఆటోవాలాలు లాభాల కంటే నష్టాలనే ఎక్కువగా చవిచూస్తున్నారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు పది ట్రిప్పులు రవాణా చేసినా.. పైసా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల పెరుగుదలతో ట్రాన్స్పోర్ట్ చార్జీలు తడిసిమోపడై నిత్యావసర సరుకుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సామాన్యులు ఆం దోళన చెందుతున్నారు. రోజు రూ.60 లక్షలకుపైగా భారం జిల్లావ్యాప్తంగా 43 పెట్రోల్ బంకులు ఉండగా.. పెరుగుతున్న ధరలతో జిల్లావాసులపై రోజుకు రూ.60 లక్షలకుపైగానే అదనపు భారం పడుతోంది. సెప్టెంబర్ ఆరంభంలోనే పెట్రోల్ లీటర్కు 50 పైసలు పెరగడంతో ఆందోళన కలిగిస్తోంది. 2018 ఫిబ్రవరి నుం చి ఇప్పటి వరకు లీటరు డీజిల్పై రూ.9.87, పెట్రోల్పై రూ.8.19 పైసలు పెరిగింది. ఏడు నెలల కాలంలోనే లీటర్ ధర రూ.10 వరకు పెరుగుతూ సామాన్యులను కంగారు పెట్టిస్తోంది. దీంతో వాహన చోదకులు ఇబ్బందిపడడమేగాక పెట్రోల్ బంకు యజమానులు సైతం అవస్థలు ఎదుర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు చుక్కలనంటడం ఖాయంగా కనిపిస్తోంది. ధరల పెంపు మోయలేని భారం సామాన్య ప్రజలు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ద్విచక్ర వాహనాల వినియోగం పెరిగిన తరుణంలో పెట్రోలు ధరలు మోయలేని భారంగా మారాయి. సామాన్యుల అవసరాలను గుర్తెరిగి వీలైనంత వరకు ధరలను తగ్గించి ఆదుకోవాలి. శ్రీలత, ఉపాధ్యాయురాలు ఆదాయం సగం పడిపోయింది.. మేము గతంలో రోజంతా ఆటో నడిపితే రూ.600 లాభం ఉండేది. ఈ మధ్య పెరుగుతూ వస్తున్న డీజిల్ ధరలతో ఆదాయం 300కు పడిపోయింది. మళ్లీ డీజీల్ ధరలు పెరుగుతాయని తెలుస్తాంది. ఇట్లయితే వచ్చే రోజుల్లో ఆటో నడుపుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రభుత్వాలు డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గిస్తే బాగుంటుంది. –కారోజు నగేష్, ఆటో డ్రైవర్ -
‘మోదీ వ్యాఖ్యలు అరుంధతి నక్షత్రాన్ని చూపినట్లున్నాయి’
సాక్షి, హైదరాబాద్: పెట్రోలు, డీజిల్ ధరల పెరగుదలపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మాజీ ఎంపీ పొన్నంప్రభాకర్, సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డిలు మంగళవారం మీడియాతో మాట్లాడారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ రూపాయి విలువ తగ్గడంపై చేసిన వ్యాఖ్యలు అరుంధతి నక్షత్రాన్ని చూపినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దుతో ఈ పరిస్థితి వస్తుందని మన్మోహన్ సింగ్ గతంలోనే చెప్పారని గుర్తుచేశారు. నాడు మన్మోహన్ మాటలను తప్పుపట్టిన మోదీ ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో మోదీ కాళ్లు మొక్కుతారు.. ఇక్కడ నిలదీస్తానంటాడని విమర్శించారు. పెరుగుతున్న ద్రవ్యోల్భణం, పెట్రో ధరలపై కేసీఆర్ మోదీని ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు. క్రూడాయిల్ బ్యారెల్ ధర తగ్గినా పెట్రో ధరలు ఎందుకు తగ్గడం లేదో మోదీ సమాధానం చెప్పాలన్నారు. పెట్రోలు, డీజిల్ను జీఎస్టీ పరిధిలో తేవాలి పొంగులేటి సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. పెట్రో, డీజిల్లపై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ను రద్దచేయాలని కోరారు. పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. సామాన్యుల శాపాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పకుండా తగులుతాయని తెలిపారు. పెరిగిన పెట్రో ధరలను నిరనగా కాంగ్రెస్ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని పేర్కొన్నారు. -
షాకింగ్ : ఆల్ టైం హైలో పెట్రోల్ ధరలు
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం వరుసగా 15వ రోజు కూడా భగ్గుమన్నాయి. హైదరాబాద్లో పెట్రోల్ లీటర్కు రూ 84.09కు చేరగా, ముంబైలో అత్యధికంగా పెట్రోల్ లీటర్కు రూ 86.72 పలికింది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్కు రూ 79.31కు చేరింది. ఇక డీజిల్ ధరలూ రికార్డు స్ధాయికి చేరాయి. దేశ ఆర్థిక, వాణిజ్య రాజధాని ముంబైలో డీజిల్ లీటర్కు రూ 75.74కు పెరిగింది. అమెరికన్ డాలర్తో రూపాయి అత్యంత కనిష్టస్ధాయికి పడిపోయిన క్రమంలో ఆగస్ట్ 16 నుంచి ఇంధన ధరలు భగ్గుమంటూనే ఉన్నాయి. దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలకు ముడిచమురు ధరలు భారమవడం, రూపాయి బలహీనం వంటి అంతర్జాతీయ అంశాలే కారణమని పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెబుతున్నారు. ముడిచమురు ఉత్పాదన పడిపోవడం కూడా ధరల పెంపునకు కారణమని చెప్పుకొచ్చారు. పెట్రో ధరల పెంపు తాత్కాలికమేనని త్వరలోనే పరిస్థితి కుదుటపడుతుందని మంత్రి పేర్కొన్నారు. -
పెట్రో మంటకు సామాన్యులే సమిధలు
‘‘కొందర్ని కొన్నిసార్లే మోసగించగలం, అందర్నీ అన్నిసార్లు మోసపుచ్చడం కష్టం!’’ అన్నది ఓ పాత నానుడి. అందర్నీ అన్ని వేళలా మోసపుచ్చవచ్చని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరూపించే సాహసం చేస్తోంది. యూపీఏ హయాంలో ముడి చమురు ధర బ్యారెల్కు 100–140 డాలర్ల మధ్య ఊగిసలాడినపుడు భారతీయులు లీటర్ పెట్రోలుకు చెల్లించిన ధర రూ. 70 నుంచి రూ. 75 మధ్యనే ఉంది. 2014 మేలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీ యంగా క్రూడాయిల్ ధరలు గణనీయంగా పతనమయ్యాయి. ధరలు తగ్గించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం మరింత పెంచుకున్నాయి. క్రూడాయిల్ బ్యారెల్ ధర 40 డాలర్ల కనిష్ట స్థాయికి దిగినప్పుడు కూడా వినియోగదారులు లీటర్ పెట్రోల్కు రూ. 70 చెల్లించాల్సి వచ్చింది. ప్రస్తుతం రూ. 80 దాటిపోయింది. డీజిల్ ధర రూ. 75కి పైనే. 2014 మేలో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్ చమురు ధర.105 డాలర్లు ఉండగా 2018 మే చివరి వారానికి రూ.74 డాలర్లకు తగ్గింది. అయినా, చమురు ధరలు 2014 నాటికన్నా ఎందుకు ఎక్కువగా ఉన్నాయన్నది అంతుబట్టని రహస్యం. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ఎక్కడా లేనంతగా 34 శాతం ఉంది. దీనికి అదనంగా ప్రత్యేక పన్ను రూపంలో లీటర్కు నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా బాబు పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే వ్యాట్ తగ్గిస్తామని, డీజిల్పై రాయితీలు ఇస్తామని ప్రకటిం చారు. ఆయన ప్రకటనలు, హామీలు అసెంబ్లీ రికార్డుల్లో పదిలంగా ఉన్నాయి తప్ప కార్యరూపం దాల్చ లేదు. ఢిల్లీ, బొంబాయి, బెంగుళూరు చివరకు హైదరాబాద్లో కంటే ఏపీలోని ప్రధాన నగరాల్లో అమ్ముతున్న పెట్రో ధరలు లీటర్కు రూ.5 కంటే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో పెట్రో ఉత్పత్తులపై వ్యాట్ను గరిష్టంగా 34 శాతం వడ్డిస్తుండగా, హిమాచల్ప్రదేశ్లో 18 శాతం మాత్రమే. ఈ ఏడాది మే ఒకటి నాటికి దేశంలో వివిధ రాష్ట్రాలు పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న సేల్స్ టాక్స్/వ్యాట్ పరిశీలిస్తే పెట్రోలుపై మహారాష్ట్ర 39.79 శాతంతో మొదటి స్థానంలో నిలిస్తే, 36.06 శాతంతో ఏపీ రెండో స్థానంలో నిలిచింది. డీజిల్పై పన్ను విషయంలో ఏపీ 28.47 శాతంతో ప్ర«థమ స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా బ్యారల్ ధర ఒక డాలర్ పెరి గితే రాష్ట్రాలన్నింటికి కలిపి అదనంగా రూ.18,728 కోట్లు ఆదాయం పెరుగుతోందని ఎస్.బి.ఐ. నివేదిక వెల్లడించింది. పెట్రో ఉత్పత్తుల ధరలను జీఎస్టీ పరి ధిలోకి తేకుంటే దేశ ఆర్థికాభివృద్ధికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందని పలు వాణిజ్య పారిశ్రామిక మండళ్ల సమాఖ్యలు చేస్తున్న హెచ్చరికలను కేంద్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన పద్మవ్యూహంలో సామాన్యులే సమిధలై విలవిల్లాడుతున్నారు. డీజిల్ ధరల పెరుగుదలతో తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సంస్థలకు సగటున రూ. 680 కోట్లు అదనపు భారం పడినట్లు అంచనా. సామాన్యులపై పెట్రో ఉత్పత్తుల భారాన్ని తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక ప్రత్యామ్నాయాలున్నాయి. 2004–2009 మధ్య కాలంలో ఏపీ సీఎంగా ఉన్న వైఎస్ రాజ శేఖరరెడ్డి వంటగ్యాస్ ధర పెరిగినపుడు ఆ భారం పేద, మధ్య తరగతి వర్గాలపై పడకుండా సిలిండర్కు రూ. 50 మేర పెరిగిన ధరను సబ్సిడీ రూపంలో అందించారు. నాలుగేళ్ల పాలన పూర్తి చేసుకున్నప్పుడైనా మోదీ చమురు ధరల విషయంలో ఏదైనా తీపికబురు చెబుతారేమోనని ఎదురు చూసినవారికి నిరాశే మిగిలింది. ఈ నాలుగేళ్లల్లోనే కేంద్రం కేవలం ఎక్సైజ్ సుంకం పెంపు ద్వారా రూ.10 లక్షల కోట్లకు పైగా ఆర్జించిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వ్యాట్ గరిష్టంగా వసూలు చేస్తున్న రాష్ట్రాలు కూడా ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్లు వ్యాట్ను తగ్గించాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆఖరుకు బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ఖాతరు చేయలేదు. ‘పెంచడం రూపాయల్లో... తగ్గిం చడం పైసల్లో’ అనే విధానాన్ని ప్రభుత్వాలు అనుసరిస్తూ ప్రజాభిప్రాయాన్ని అపహాస్యం చేస్తున్నాయి. వ్యాసకర్త ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నాయకులు డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మొబైల్ : 99890 24579 -
వరుసగా 14వ రోజూ పెట్రో షాక్..
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్ ధరలు వరుసగా 14వ రోజు ఆదివారం కూడా భగ్గుమన్నాయి. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్కు రూ 78.12 పలికింది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటర్కు రూ 82.76కు చేరింది. ఇక ముంబయి, చెన్నై నగరాల్లో పెట్రో ధరలు రికార్డు స్థాయిలో లీటర్కు రూ 85.93, రూ 81.11కు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరగడం, పెట్రో ఉత్పత్తులపై ఎక్సయిజ్ సుంకం విధింపు కారణంగా పెట్రో ధరలు రోజురోజుకూ భారమవుతున్నాయి. మరోవైపు పెట్రో ధరల తగ్గింపుపై దృష్టిసారిస్తామని, ఎక్సైజ్ సుంకంలో కోత సహా పలు చర్యలు చేపడతామని కేంద్రం ఇప్పటికే ప్రకటించినా ఆ దిశగా అడుగులు పడకపోవడంతో వినియోగదారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పెట్రో ధరలు అత్యంత గరిష్టస్థాయికి చేరడంతో వాహనదారులు సహా నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
అధిక పన్నుల్లో మీరే ఆదర్శం: దాసోజు
సాక్షి, హైదరాబాద్ : పెట్రో ఉత్పత్తులపై అత్యధిక పన్నులు వేసి ప్రజలను వేధించడంలో సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. గతంలో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 120 డాలర్లు ఉన్నప్పుడు రూ.68, రూ.53 ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు బ్యారెల్ ధర 79 డాలర్లకు తగ్గినప్పుడు రూ.84, రూ.74కు ఎందుకు పెరిగాయో చెప్పాలని నిలదీశారు. గురువారం గాంధీభవన్లో ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 22 రాష్ట్రాల కన్నా ఎక్కువ పన్ను విధిస్తున్న రాష్ట్రం తెలంగాణే అన్నారు. 16 నుంచి 18 శాతం వరకు ఇతర రాష్ట్రాల్లో పన్నులుంటే తెలంగాణలో పెట్రోల్పై 35.02 శాతం, డీజిల్పై 27 శాతం పన్నులను విధించడం న్యాయమా అంటూ ప్రశ్నించారు. -
‘మోదీనామిక్స్ ముఖ్య సూత్రం ఫూల్స్ చేయడం’
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటకలో పెట్రోల్, డిజిల్ ధరల పెంపుపై జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు. కర్ణాటక ఎన్నికల ఓటింగ్ ముగియగానే ఇంధన ధరలు భారీగా పెంచారన్నారు. సాధ్యమైనంత మందిని ఫూల్స్ను చేయడమే మోదీనామిక్స్ ముఖ్య సూత్రంగా ట్వీటర్లో పేర్కొన్నారు. సోమవారం కర్ణాటకలో పెట్రోల్పై 17 పైసలు, డిజిల్పై 21 పైసలు ధర పెరిగిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లలో ఇదే అధికం. ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులు అన్ని కలుపుకుని ధరలు మండిపోతున్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 74.80 పైసలు, డిజిల్ రూ. 66.14 పైసలుగా ఉంది. డిజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. Karnataka finishes voting, FUEL prices rise to a 4 yr. high! The Key Principle of Modinomics: fool as many people as you can, as often as you can. #PeTrolledhttps://t.co/TdRP20rfAb — Rahul Gandhi (@RahulGandhi) May 14, 2018