పెట్రో షాక్‌ : ఆల్‌ టైం హైకి చేరిన ఇంధన ధరలు | Fuel Prices Continue To Rise | Sakshi
Sakshi News home page

పెట్రో షాక్‌ : ఆల్‌ టైం హైకి చేరిన ఇంధన ధరలు

Sep 21 2018 10:53 AM | Updated on Sep 21 2018 12:37 PM

Fuel Prices Continue To Rise - Sakshi

ఆల్‌ టైం హైతో సెగలు పుటిస్తున్న పెట్రో ధరలు

సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో శుక్రవారం పెట్రోల్‌ ధర ఆల్‌టైం హై స్ధాయిలో లీటర్‌కు రూ 89.69కు చేరగా, డీజిల్‌ ధర లీటర్‌ రూ 78.42కు పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ 82.32కు చేరగా, డీజిల్‌ ధర లీటర్‌కు రూ 73.87​కు ఎగిసింది. ఇక హైదరాబాద్‌లో ఇంధన ధరలు భారమై పెట్రోల్‌ లీటర్‌కు రూ 87.30కి చేరాయి.

పెట్రో ధరలు లీటర్‌కు రూ వందకు చేరువగా పరుగులు తీస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పెట్రో భారాలతో వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పేర్కొన్నారు. దీనిపై జీఎస్టీ కౌన్సిల్‌ ఓ నిర్ణయం తీసుకోవాలని కోరారు. జీఎస్టీ కౌన్సిల్‌ భేటీలో కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వాలే ఎక్కువగా ప్రభావితం చేస్తాయని చెప్పారు.

పెట్రో భారాల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు కేంద్రం తన వంతుగా కొద్దినెలల కిందటే పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించిందని గుర్తుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement