న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలను సెప్టెంబర్ 4 వరకు పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉభయ సభలు తరచు వాయిదా పడుతున్న కారణంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆహార భద్రతా బిల్లు చర్చకు నోచుకోలేకపోతోంది. ఈ బిల్లుపై చర్చ చేపట్టేందుకు వీలుగా సమావేశాలను పొడిగించాలని నిర్ణయించినట్టు సమాచారం. ఈ విషయాన్ని కాంగ్రెస్లోని ఉన్నతస్థాయి నేతలు అంగీకరిస్తున్నారు. జేడీ(యూ) నేత శరద్ యాదవ్ కూడా పార్లమెంటు సమావేశాల పొడిగింపు అంశంపై ఆ పార్టీ బీహార్ యూనిట్కు లేఖ రాసినట్టు తెలిసింది. ఇదిలావుంటే, ప్రధాని మన్మోహన్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్నాథ్లు లోక్సభ స్పీకర్ మీరా కుమార్తో భేటీ కావడం సభ పొడిగిస్తారనే ఊహాగానాలకు బలం చేకూరుస్తోంది.
సెప్టెంబర్ 4 వరకు పార్లమెంటు!
Published Fri, Aug 23 2013 1:14 AM | Last Updated on Tue, Oct 2 2018 8:49 PM
Advertisement
Advertisement