'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు' | roja takes on chandrababu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు'

Published Sat, Oct 1 2016 11:30 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు' - Sakshi

'చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదు'

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ నుంచి మన్నవరంలోని భెల్ ప్రాజెక్ట్ మరో రాష్ట్రానికి తరలిపోతున్న చంద్రబాబుకు చీమకుట్టినట్లు కూడా లేదని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తిలోనే నిర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ... ఎమ్మెల్సీ శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష శనివారం రెండో రోజుకు చేరుకుంది.

తిరుపతిలో శ్రీనివాసులు రెడ్డి చేపట్టిన దీక్ష స్థలి వద్దకు రోజా, పార్టీ నాయకుడు బియ్యపు మధుసూదన్రెడ్డి చేరుకుని... సంఘీభావం ప్రకటించారు. శ్రీకాళహస్తిలోనే మన్నవరం ప్రాజెక్టు చేపట్టాలని బియ్యపు మధుసూదన్రెడ్డి డిమాండ్ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement