roja
-
రాష్ట్రంలో హిట్లర్, గడాఫీ పాలన
-
‘బావ కళ్లలో ఆనందం కోసం కాదు’..పురందేశ్వరిపై ఆర్కే రోజా ఫైర్
సాక్షి,అమరావతి : ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరిపై మాజీ మంత్రి రోజా ఫైరయ్యారు. బావ కళ్లల్లో ఆనందం చూడడం కంటే.. భక్తుల కళ్లల్లో ఆనందం చూడాలని సెటైర్లు వేశారు. సీఎం చంద్రబాబు ఏదైనా మాట్లాడొచ్చని అనడం సిగ్గు చేటని మండిపడ్డారు. రోడ్లమీద మాట్లాడే బాబు,లోకేష్, పవన్ సుప్రీం కోర్టులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. విచారణ సమయంలో సుప్రీం కోర్టు అడిగిన ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వ తరుపు లాయర్ ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పలేదని రోజా ప్రశ్నించారు. తిరుపతి లడ్డూపై ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడిన మీరు అత్యున్నత న్యాయం స్థానం అడిగిన ప్రశ్నలు బదులు ఇవ్వచ్చు కదా? అని రోజా అన్నారు. సుప్రీం కోర్టు వ్యాఖ్యలపై పురందేశ్వరి ఏమన్నారంటే?తిరుపతి లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబును తూర్పారబట్టింది. తిరుపతి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనడానికి మీ దగ్గర ఆధారాలున్నాయా? అని ప్రశ్నిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, సుప్రీం కోర్టు చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలపై పురందేశ్వరి స్పందించారు. ‘‘సీఎం(చంద్రబాబును ఉద్దేశిస్తూ)రాజ్యంగం పరంగా రాష్ట్రాదినేత. సమీక్షలు చేసి సీఎం కామెంట్స్ చేస్తారు. అంతేకానీ ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడారు అని ప్రశ్నించే అధికారం కోర్టులకు ఉందా అనేది అందరూ ఒక్కసారి ఆలోచించుకోవాలి అని పురందేశ్వరి అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా అమలవుతున్నాయా? లేదా? అని పరిగణలోకి తీసుకోవాల్సిన బాధ్యత కోర్టులకు ఉందంటూ’’ పురందేశ్వరి ఈ వ్యాఖ్యలు చేశారు. నీళ్లు నమిలిన సిదార్థ్ లూథ్రాగత సోమవారం (సెప్టెంబర్ 30న)సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ వివాదంపై విచారణ జరిగింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా.. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది.‘నెయ్యి కల్తీ జరిగినట్లు సాక్ష్యం ఉందా? ఉంటే చూపించండి.ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు తీసుకోలేదు?ఎన్డీడీబీ మాత్రమే ఎందుకు? సెకండ్ ఒపీనియన్ ఎందుకు వెళ్లలేదు.కల్తీ జరిగినట్టు ఆరోపించిన లడ్డూలను పరీక్షించారా..?లడ్డూలను ముందుగానే ఎందుకు పరీక్షకు పంపలేదు? కల్తీ జరగనప్పుడు ఎందుకు బహిరంగ ప్రకటన చేశారు?’’అని సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ధర్మాసనం వేసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఏపీ ప్రభుత్వం తరుపు న్యాయవాది సిదార్థ్ లూథ్రా నీళ్లు నమిలారు. గురువారం (అక్టోబర్ 3న) తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. -
25 వసంతాలు పూర్తి చేసుకున్న 'రాజా'.. ఈ సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్
రాజా.. 1999 మార్చి 18న ముప్పలనేని శివ దర్శకత్వంలో సూపర్ గుడ్ ఫిల్మ్స్ పతాకంపై ఆర్.బి.చౌదరి నిర్మించిన విజయవంతమైన సినిమా. ఇందులో వెంకటేష్, సౌందర్య జంటగా నటించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ అందించిన స్వరాలు విపరీతమైన ప్రజాదరణ పొందాయి. ఈ సినిమా 1998లో తమిళంలో కార్తీక్, రోజా జంటగా వచ్చిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే సినిమాకు రీమేక్.. ఇప్పటికి టాలీవుడ్లో ఈ సినిమా విడుదలయ్యి 25 ఏళ్లు పూర్తి కావడం జరిగింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్ చేయడం అన్నది ఎప్పటి నుంచో ఉన్నదే. ఈ క్రమంలోనే రాజా చిత్రం తెలుగులో రీమేక్ అయి భారీ విజయాన్ని అందుకుంది. 1999లో విడుదలయిన ఈ సినిమా వెంకటేశ్- సౌందర్య జోడీని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. వాస్తవంగా 'రాజా'లో హీరోయిన్ మొదట సౌందర్య కాదట. ఈ సినిమాకు మొదటగా రోజాను హీరోయిన్గా అనుకున్నారట. అందుకు కారణం రాజా మాతృక అయిన 'ఉన్నిడతిల్ ఎన్నై కొడుతేన్' అనే చిత్రంలో మొదట నటించింది రోజానే కావడం. తమిళంలో వచ్చిన ఆ సినిమాతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తమిళంలో లీడ్ రోల్స్లో కార్తిక్, రోజా, అజిత్ నటించారు. తమిళంలో ఈ సినిమాకు ప్రేక్షకుల దగ్గర నుండి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా చాలానే అందాయి. ఈ సినిమాకు ఉత్తమ నటిగా తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు అందుకున్న రోజా తెలుగు రీమేక్లో కూడా నటించాలని నిర్ణయించుకుంది. దానికి తనకు అవకాశం లభించింది కూడా. కానీ ఆ సమయంలో రోజా వద్ద అవసరమైన డేట్స్ లేకపోవడంతో సౌందర్యను సంప్రదించి రాజా సినిమాను పట్టాలెక్కించారు. ఇందులో వెంకీ, సౌందర్య కెమిస్ట్రీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. వీరిద్దరిని ఆన్ స్క్రీన్ క్యూట్ కపుల్గా అనేవారు. అంతలా ప్రేక్షకులకు సినిమా కనెక్ట్ అయింది. ఆ రోజుల్లో రాజా సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ వచ్చాయి. విడుదలైన అన్ని చోట్లు 50రోజులు ఆడిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మొదట దొంగగా కనిపించిన వెంకీ ఆ తర్వాత తన సరైన నటనతో ప్రేక్షకులను కదిలించాడు. అంతే స్థాయిలో సౌందర్య తన సెంటిమెంట్తో కట్టిపడేసింది. 71 కేంద్రాల్లో రాజా సినిమా 100 రోజులు ఆడింది. 4 సెంటర్లలో రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా వెంకటేశ్ కెరియరల్లో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా ఒరియా, కన్నడ, హిందీ, బెంగాలీ బంగ్లాదేశ్, బెంగాలీ భాషల్లో రీమేక్ అయ్యింది. ఈ సినిమాకు ఉత్తమ ఉత్తమ నటిగా సౌందర్యకు నంది అవార్డు దక్కింది. రాజా విడుదలయ్యి నేటితో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. -
రుషికొండ భవనాల వినియోగంపై త్వరలోనే నిర్ణయం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను ఏ విధంగా వినియోగించాలన్న అంశంపై త్వరలోనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా వెల్లడించారు. రుషికొండపై నిర్మించిన ఆ భవనాలను విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సరస్వతితో కలిసి మంత్రులు అమర్నాథ్, రోజా, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు అమర్నాథ్, రోజా మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండపై 9.88 ఎకరాల్లో టూరిజం ప్రాజెక్టు నిర్మించామని, గతంలో ఈ ప్రాంతంలో ఉన్న హరిత రిసార్టుల స్థానంలో ఈ నిర్మాణాలు జరిగాయన్నారు. అత్యంత సుందరమైన విశాఖ నగరానికి తగ్గట్లుగా పూర్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ భవన నిర్మాణాలు సాగాయని తెలిపారు. పర్యాటకంగా విశాఖను తీర్చిదిద్దడంలో భాగంగా రూపుదిద్దుకున్న ఈ భవనాలు నగరానికే తలమానికమన్నారు. ఈ భవన నిర్మాణాలకు అనేక అడ్డంకులు కల్పించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ అనేక కుట్రలు పన్నాయని, వాటన్నింటినీ దాటుకుంటూ ప్రాజెక్టును పూర్తిస్థాయి అనుమతులతో పూర్తిచేశామని వారు వివరించారు. విశాఖపట్నం రాజధానిగా చేయాలని సంకల్పించిన సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై ఇప్పటికే ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో త్రీమెన్ కమిటీని ఏర్పాటుచేశారన్నారు. ఇందులో సీఎం క్యాంపు కార్యాలయం ఉంటే మంచిదని ఆ కమిటీ సూచించిందని మంత్రి రోజా అన్నారు. అయితే, ఈ భవనాల్ని పూర్తిగా పర్యాటకం కోసం వినియోగించాలా? లేదా ముఖ్యమంత్రి కార్యాలయంగా ఉపయోగించాలా? అన్న అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని మంత్రి అమర్నాథ్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ డా.ఎ. వరప్రసాదరెడ్డి, జెడ్పీ చైర్మన్ సుభద్ర, ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, కె.రవిబాబు, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.రజత్భార్గవ, మేనేజింగ్ డైరెక్టర్ కె.కన్నబాబు, జేసీ కె.మయూర్ అశోక్, పర్యాటక శాఖ ఆర్.డి. శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ లొడగల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టు వివరాలివీ.. ♦ నూతన రిసార్ట్స్ని 9.88 ఎకరాల విస్తీర్ణంలో 1,48,413 చ.అడుగుల విస్తీర్ణంలో ఏడు బ్లాకులుగా నిర్మించారు. ♦ అంతర్జాతీయ ప్రమాణాలతో పచ్చదనం, ల్యాండ్ స్కేపింగ్ పనులతో వీటిని అభివృద్ధి చేశారు. రహదారులు, డ్రైనేజీ, నీటిసరఫరా, వీధిదీపాలు, పార్కింగ్, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశారు. ♦ 2021లో సీఆర్జెడ్ ఆమోదం, 2022లో స్థానిక సంస్థల ఆమోదం, 2023లో అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ కూడా తీసుకోవడంతో పాటు సంబంధిత చట్టబద్ధమైన ఆమోదాలు తీసుకున్నారు. ♦ వేంగి–ఏ, బీ, కళింగ, గజపతి, విజయనగర ఏ, బీ, సీ బ్లాకులుగా మొత్తం ఏడు బ్లాక్లు నిర్మించారు. వీటిల్లో రిసెప్షన్, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్ హాల్స్, గెస్ట్రూమ్లు, ప్రీమియం విల్లా సూట్స్, స్పా, ఇండోర్ గేమ్స్, ఫిట్నెస్ సెంటర్, బ్యాక్ఆఫీస్, సర్వీస్ ఏరియాలు అభివృద్ధి చేశారు. ♦ నీటి సరఫరా సౌకర్యం కోసం 150 కేఎల్, ఫైర్ సంప్, పైప్ నెట్వర్క్తో పాటు 100 కేఎల్ డొమెస్టిక్ సంప్ ఏర్పాటుచేశారు. ♦ వ్యర్థ జలాల శుద్ధి, పునర్వినియోగం కోసం 100 కేఎల్డీ మురుగునీటి శుద్ధి ప్లాంట్ కూడా నిర్మించారు. ♦ 1,000 కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు 2, 1010 కేవీఏ జనరేటర్లు 3, ఎలక్ట్రికల్ కాంపోనెంట్ పనులు, వీధిదీపాలు ఏర్పాటుచేశారు. ♦ రిసార్ట్ అభివృద్ధికి స్థలం చదును చేయడం, నిర్మాణం, మౌలిక సదుపాయాలు.. ఇలా మొత్తం ప్రాజెక్టుకు రూ.365.24 కోట్లు ఖర్చుచేశారు. ♦ వేంగి–ఏ బ్లాక్లో సెక్యూరిటీ, బ్యాక్ ఆఫీస్, సూట్ రూమ్లు, రెస్టారెంట్స్ ఉన్నాయి. ♦ వేంగి–బీ బ్లాక్లో అతిథి గదులు, సమావేశ మందిరాలు, రెస్టారెంట్తో కూడిన బిజినెస్ హోటల్ ఉంది. ♦ కళింగ బ్లాక్లో రిసెప్షన్, వెయిటింగ్ ఏరియా, లగ్జరీ సూట్ రూమ్లు, కాన్ఫరెన్స్ హాల్స్, బ్యాంక్వెట్ హాల్స్ ఉన్నాయి. ♦ గజపతి బ్లాక్లో హౌస్ కీపింగ్, కేఫ్టేరియా, వ్యాపార కేంద్రాలున్నాయి. ♦ విజయనగరం–ఏ, బీ, సీ బ్లాక్లలో ప్రెసిడెన్షియల్ సూట్, విల్లా సూట్స్, స్పా, ఫిట్నెస్ సెంటర్, బ్యాంక్వెట్ హాల్స్ ఏర్పాటుచేశారు. -
అట్టహాసంగా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా సంబరాలు
విశాఖ స్పోర్ట్స్ : ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలు విశాఖ వేదికగా శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులు, అధికారులు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో బెలూన్లను ఎగురవేసి రాష్ట్ర పర్యాటక, యువజన స ర్విసులు, క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా వీటిని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి, స్పోర్ట్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న, శాప్ ఎండీ ధ్యాన్చంద్ర, కలెక్టర్ డా. ఎ. మల్లికార్జున ఇతర అధికార, రాజకీయ ప్రముఖులతో కలిసి జాతీయ పతాకాన్ని, శాప్ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. క్రీడాకారులందరితో ప్రతిజ్ఞ చేయించారు. శాప్ అధికారులు రూపొందించిన ప్రత్యేక ప్రకటనను చదవటం ద్వారా ‘ఆడుదాం ఆంధ్ర’ రాష్ట్రస్థాయి పోటీలు క్రీడాకారుల కేరింతలు మధ్య విశాఖ రైల్వే మైదానంలో మంత్రి రోజా ప్రారంభించారు. అనంతరం.. అధికారులతో కలిసి 26 జిల్లాల నుంచి విచ్చేసిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. క్రీడాకారులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. యువతలో క్రీడానైపుణ్యాలను పెంపొందించడానికే ఆడుదాం ఆంధ్రా పోటీలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని చెప్పారు. ‘ఆడుదాం ఆంధ్ర’ అనేది అందరి ఆట.. యువతకు భవిష్యత్తుకు బంగారు బాట అని కొనియాడారు. యువ ఆటగాళ్లలో దాగి ఉన్న టాలెంట్ను వెలికితీసే వేట అన్నారు. 15,400 సచివాలయాల పరిధిలోని ఎంతో మందిని ఈ క్రతువులో భాగస్వామ్యం చేశామన్నారు. ఈనెల 13న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజేతలకు వైఎస్సార్ స్టేడియంలో రాష్ట్ర టైటిల్స్ అందిస్తారన్నారు. విజేతలకు ప్రత్యేక శిక్షణ : కలెక్టర్ ఈ క్రీడలకు విశాఖ మహానగరం వేదిక కావటం అదృష్టంగా భావిస్తున్నానని కలెక్టర్ డా.ఎ. మల్లికార్జున చెప్పారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన జట్ల సభ్యులకు ఏసీఏ, ప్రొ కబడ్డీ, బ్లాక్ హాక్స్, శ్రీకాంత్, సింధు బ్యాడ్మింటన్, ఖోఖో అసోసియేషన్ల తరఫున ప్రత్యేక శిక్షణ ఉంటుందని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, డీసీసీబీ చైర్మన్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జేసీ కె. మయూర్ అశోక్, ఏడీసీ కె.ఎస్. విశ్వనాథన్, జాతీయ క్రికెటర్ శ్రీకర్ భరత్ తదితరులు పాల్గొన్నారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి: బైరెడ్డి ‘ఆడుదాం–ఆంధ్ర’ వేదికగా క్రీడాకారులు వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆకాంక్షించారు. జీవితంలో గెలుపు ఓటములు సహజమని.. కష్టం విలువ తెలుసుకున్న రోజు విజయాలు వాటంతట అవే వస్తాయని క్రీడాకారుల్లో ఉత్సాహం నింపారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనివిధంగా క్రీడల కోసం రూ.130 కోట్లు ఖర్చుపెట్టి గ్రామస్థాయి నుంచే పత్రిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేలా పోటీలు నిర్వహించడం ఇదే మొదటిసారన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రద్యుమ్న మాట్లాడుతూ.. క్రీడాకారులు పోటీతత్వాన్ని అలవర్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. అనంతరం.. క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు, వారిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే ‘ఆడుదాం ఆంధ్రా’ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని శాప్ ఎండీ ధ్యాన్చంద్ర చెప్పారు. ఇక ఇప్పటివరకు జరిగిన క్రీడల్లో విజేతలకు రూ.12 కోట్లతో బహుమతులు అందజేశామని, రాష్ట్రస్థాయి విజేతలకు రూ.87 లక్షలతో బహుమతులు అందజేయనున్నామన్నారు. ఆ బకాయిలు, ఆస్తులను రాబట్టండి.. షర్మిలకు మంత్రి రోజా సూచన అనంతరం.. మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి మనకు రావల్సిన రూ.ఆరువేల కోట్లు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలో ఏపీకి రావల్సిన రూ.లక్షా 80వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ పార్టీకి చెందిన షర్మిల రాబట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పోరాటం చేస్తా అని చెప్పి అక్కడ నేతలను ఆమె నిండా ముంచారని, పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో ఎందుకు పోరాటం చేస్తున్నారో షర్మిల చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. చంద్రబాబు అమిత్ షా కాళ్లు పట్టుకోవడం సిగ్గుచేటన్నారు. రాజకీయంగా చంద్రబాబు రోజురోజుకి దిగజారిపోతున్నాడని రోజా ధ్వజమెత్తారు. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’ కిట్లపై స్పందిస్తూ.. వాటిపై సీఎం జగన్మోహన్రెడ్డి ఫొటో వేస్తే తప్పేంటని.. ఆంధ్రా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో వేయాలా అంటూ ప్రశ్నించారు. -
'వ్యూహం' సినిమాని.. 2024లో జగనన్న విజయాన్ని ఆపలేరు: మంత్రి రోజా
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ తీసిన 'వ్యూహం' సినిమా పార్ట్-1.. డిసెంబరు 29న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జరుగుతుండగా.. తాజాగా విజయవాడలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈవెంట్లో వైసీపీ మంత్రి రోజాతో పాటు మల్లాది విష్ణు, ఎంపీ నందిగం సురేశ్, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సినిమా గురించి సీఎం జగన్మోహనరెడ్డి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్) 'వ్యూహం' చిత్ర వ్యూహకర్త ఆర్జీవీకి అభినందనలు. బెజవాడ గడ్డ మీద పుట్టిన ముద్దుబిడ్డ ఆర్జీవీ. శివ నుంచి కంపెనీ వరకూ సినిమాలు తీసి, బెజవాడ నుంచి ముంబై వరకూ తన సత్తాను చూపిన వ్యక్తి వర్మ. ఆర్జీవీ అంటేనే ఒక సంచలనం. 'వ్యూహం' టైటిల్ ప్రకటించగానే సైకిల్ పార్టీ షేకైపోయింది. ఆర్జీవీ డైరెక్టర్ అనగానే పచ్చ పార్టీ నేతల ప్యాంట్లు తడిచిపోయాయి. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలకు జగన్ మోహన్ రెడ్డికి మధ్య జరిగిన సంఘర్షణే ఈ 'వ్యూహం'. ఎందుకూ పనికిరాని పప్పు లోకేష్గాడు కూడా పవన్ సీఎంగా పనికిరాడని చెప్పాడు. రాజమండ్రి సెంట్రల్ జైలుకెళ్లి బాబుకి మద్దతు పలికి తనతో పాటు తన వర్గానికి పవన్ వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబు ఎన్నో కుట్రలు చేశాడు. ఎలాగైనా వ్యూహం సినిమాను ఆపాలనుకుంటున్నారు. అయితే 'వ్యూహం' చిత్రాన్ని ఆపలేరు, 2024లో జగనన్న విజయాన్ని కూడా ఆపలేరు' అని మంత్రి రోజా చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. 'వ్యూహం చిత్రానికి కర్తకర్మ క్రియలైన వర్మ, కిరణ్కు అంభినందనలు. రాజకీయాల్లో భయపడని వ్యక్తి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. సినిమాల్లో భయపడని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. 'వ్యూహం' విషయంలో చంద్రబాబు,లోకేష్ ఎందుకు భయపడుతున్నారో అర్ధం కావడం లేదు. ముంబై మాఫియాకే ఆర్జీవి భయపడలేదు...మీకు భయపడతారనుకుంటున్నారా?చంద్రబాబు కుట్రలు... పవన్ కమెడియన్ వేషాలను కళ్లకు కట్టినట్లు ఈ చిత్రం రూపొందించారనుకుంటున్నాను. సినిమా మంచి ఘన విజయం సాధిస్తుంది' అని అన్నారు. ఇక పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ.. కచ్చితంగా సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఫైబర్ నెట్కు సినిమాను ఇస్తే పదిలక్షల మంది ఒకేసారి సినిమా చూపించే ప్రయత్నం చేస్తామని అన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న హిట్ సినిమా 'మంగళవారం'.. డేట్ ఫిక్స్) -
సీటు ఇవ్వకున్నా.. జగనన్న వెంటే: మంత్రి రోజా
సాక్షి, తిరుమల: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాదని ప్రచారం చేస్తున్నారని ప్రతిపక్షాలు, యెల్లో మీడియాపై మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనపై అసత్య ప్రచారం చేస్తూ కొంతమంది శునకానందం పొందుతున్నారని అన్నారామె. ‘‘ప్రభుత్వ కార్యక్రమాలు ఏది జరిగినా ముందు వరుసలో ఉండేది నేనే. నేను సీఎం జగననన్నకు సైనికురాలిని. జగనన్న కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం. సీటు ఇవ్వకపోయినా జగనన్న వెంటే ఉంటా. మిషన్ 2024లో 175/175లో భాగం అవుతా’’ అని అన్నారామె. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనా ఆమె స్పందించారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారామె. అయితే జగనన్న మాటే తనకు శిరోధార్యని చెప్పారామె. సీఎం వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని దేవుడిని కోరుకున్నట్లు తెలిపారు. ఎల్లో మీడియా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పవన్, చంద్రబాబు ఎక్కడ పోటీ చేయాలో తెలియక.. రెండేసి చోట్ల సర్వే చేయించుకుంటున్నారని మంత్రి రోజా దుయ్యబట్టారు. -
Minister RK Roja: గుంటూరు నుంచి తిరుపతికి వందేభారత్ రైలులో ప్రయాణించిన మంత్రి రోజా (ఫొటోలు)
-
యువతకు మంచి అవకాశం..‘ఆడుదాం ఆంధ్రా’ : మంత్రి రోజా
సాక్షి,విజయవాడ : దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఆడుదాం ఆంధ్రా వంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టలేదని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త క్రీడా టోర్నమెంట్ల వీడియో లాంఛ్ ,బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డితో కలిసి రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ ప్రస్తుతం యువతలో ఫిజికల్ ఫిట్నెస్ సరిగా ఉండటం లేదు. ఆడుదాం ఆంధ్రా యువతకు మంచి అవకాశం. టోర్ణమెంట్లో 12 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ అందిస్తున్నాం’ అని రోజా తెలిపారు. ’100 కోట్ల బడ్జెట్తో ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నాం. టోర్ణమెంట్లో పాల్గొనేందుకుగాను 72 గంటల్లో 5 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంతమంచి అవకాశం మళ్లీ వస్తుందో లేదో ...ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలి. కోటి మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారని భావిస్తున్నాం. ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లక్ష్యం. ఆడపిల్లలు కూడా ఉత్సాహంగా పాల్గొనాలి’ అని రోజా కోరారు. శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి మాట్లాడుతూ... ‘రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడే వస్తారనే అభిప్రాయం ప్రజల్లో ఉండేది. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఒక ట్రెండ్ను సృష్టించారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి ప్రతీ నాయకుడిని నిత్యం జనాల్లో ఉండేలా చూశారు. ఆడుదాం ఆంధ్రా రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద క్రీడా సంబరం. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం’ అని తెలిపారు. ఇదీచదవండి..రామోజీ.. విషం కక్కడం కాదు.. చర్చకు రా : మంత్రి మేరుగ -
Minister RK Roja Photos: తాను చదువుకున్న కాలేజీకి చీఫ్గెస్ట్గా రోజా.. భావోద్వేగంతో కన్నీళ్లు (ఫొటోలు)
-
కూచిపూడి నాట్యాన్ని.. విశ్వవ్యాప్తం చేసిన మహనీయులు - 'పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం'
సాక్షి, పత్రికా ప్రకటన: మచిలీపట్నం అక్టోబర్ 15: పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం కూచిపూడి నాట్య సాంప్రదాయ పరిరక్షణకి, పునరుద్ధరణకి, ప్రాచుర్యానికి ఎంతో కృషి చేశారని మంత్రి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన అభ్యుదయ శాఖ మంత్రివర్యులు జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు ఆర్కే రోజా కొనియాడారు. ఆదివారం కృష్ణాజిల్లా మొవ్వ మండలం కూచిపూడి గ్రామంలోని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జిల్లా యంత్రాంగం, సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్, కూచిపూడి అకాడమీ చెన్నై, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, జయహో భారతీయం సంయుక్త ఆధ్వర్యంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత డాక్టర్ వెంపటి చిన సత్యం గారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆలరించాయి. ముఖ్యంగా అక్షర, ఇమాంసి, అన్షికలు టెంపుల్ నృత్యం, కూచిపూడి ఆర్ట్ అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ వెంపటి చినసత్యం మనవరాలు కామేశ్వరి బృందం చెన్నై వారి ఆధ్వర్యంలో మహిషాసుర మర్దిని నృత్యం ఎంతో అద్భుతంగా కమనీయంగా ప్రదర్శించారు. అలాగే నాలుగవ ప్రపంచ కూచిపూడి దినోత్సవం సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వెయ్యి మంది విద్యార్థులు డాక్టర్ వెంపటి చిన సత్యం రూపొందించిన బ్రహ్మాంజలి మహా బృంద నృత్యం ఆహుతులను మంత్రముగ్ధుల్ని చేసింది. తొలుత ఇంచార్జి మంత్రివర్యులు వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలిపే చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు అనంతరం జ్యోతి ప్రకాశనం చేసి డాక్టర్ వెంపటి చినసత్యం వేడుకలను ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర సృజనాత్మకత సాంస్కృతిక సమితి సీఈవో ఆర్ మల్లికార్జున రావు రూపొందించిన డాక్టర్ వెంపటి చినసత్యం చిత్రపటాన్ని మంత్రులు ఆవిష్కరించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఆర్కే రోజా మాట్లాడుతూ మన సంస్కృతి, కళలను సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయులని అన్నారు. ఈ వేడుకలతో కూచిపూడి ప్రాంతమంతా అంగరంగ వైభవంతో పండుగ వాతావరణం నెలకొంది అన్నారు. డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి ఆ గ్రామానికి పరిమితం కాకుండా కూచిపూడి నృత్యాన్ని ప్రపంచంలో మారుమోగేలా కృషి చేశారన్నారు. ఏ రాష్ట్రానికి వెళ్లిన, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఏ కార్యక్రమంలోనైనా మొదట తెలుగు నేలను తెలుగు ఖ్యాతిని ప్రతిబింబించే విధంగా కూచిపూడి నృత్యంతో ప్రారంభిస్తారన్నారు. డాక్టర్ వెంపటి చిన సత్యం మరణించి 13 సంవత్సరాల అయినప్పటికీ వారి శిష్యులు ప్రదర్శించే హావభావాలు,, నృత్యంలో సజీవమై కనిపిస్తున్నారన్నారు. సినిమా పరిశ్రమలో కూడా వైజయంతి మాల, హేమమాలిని, జయలలిత, ప్రభ ,చంద్రకళ, మంజు భార్గవి వంటి ఎందరో నటీమణులు వారి వద్ద శిష్యరికం చేశారన్నారు. 2011లో 1800 మంది చిన్నారులతో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదయిందన్నారు.. తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను కూచిపూడి నృత్యం నేర్చుకునేందుకు ప్రోత్సహించాలని తద్వారా వారికి వ్యాయామంతో పాటు ఆరోగ్యం కూడా పొందవచ్చు అన్నారు మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ డాక్టర్ వెంపటి చినసత్యం కూచిపూడి గ్రామంలో పుట్టి కూచిపూడి నాట్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మహనీయులని ప్రశంసించారు. గతంలో విజయవాడ చెన్నై లో జరిగే వారి జయంతి వేడుకలను మంత్రి ఆర్కే రోజా చొరవతో ఈరోజు వారు జన్మించిన కూచిపూడి గ్రామంలోనే జరుపుకోవడం ఎంతో గొప్ప విషయం అన్నారు. కూచిపూడి నృత్యం వంటి కళారూపాలను మరిచిపోతున్న తరుణంలో డాక్టర్ వెంపటి చినసత్యం వారి శిష్య బృందం ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి ప్రాచుర్యం కల్పిస్తూ ఆరాధిస్తుండడం వారిని వారి తల్లిదండ్రులు ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. జిల్లా కలెక్టర్ పి రాజాబాబు మాట్లాడుతూ ప్రతి రాష్ట్రానికి ఏదో ఒక కళారూపం ముఖ్యంగా చెప్పుకుంటున్నామని, ఆ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూచిపూడి నృత్యం, ఒరిస్సాకు ఒడిస్సి, ఉత్తరప్రదేశ్ కు కథాకళి, కేరళ కు మోహిని అట్టం వంటి కళారూపాలు ఎంతగానో ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నారు. మరుగున పడిపోతున్న కూచిపూడి నృత్యానికి డాక్టర్ వెంపటి చిన సత్యం జీవం పోసి విశ్వవ్యాప్త ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేశారన్నారు. వివిధ ప్రాంతాల్లోని నాట్యాచారులను, విద్యార్థులను ఒక చోట చేర్చి ఇలాంటి పెద్దయెత్తున వేడుకలు నిర్వహించడం గొప్ప విషయం అన్నారు. పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ తాను ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం పరిధిలో మహానుభావులు డాక్టర్ వెంపటి చినసత్యం జన్మించిన కూచిపూడి గ్రామం ఉండటం వారి ద్వారా కూచిపూడి నృత్యం ప్రపంచానికి పరిచయం కావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అలాగే మన జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు జన్మించిన ప్రాంతం బాట్ల పెనుమర్రు కూడా తన పరిధిలోనే ఉండటం సంతోషకర విషయం అన్నారు. శ్రీ సిద్ధేంద్ర యోగి కళాశాలను అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రిని, మంత్రిని కోరుతున్నానన్నారు. రాష్ట్రంలో రెండు కళాశాలలు ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని కూచిపూడి లో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ నర్తకి కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత మంజు భార్గవికి డాక్టర్ వెంపటి చినసత్యం జయంతి పురస్కారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని మంత్రులు అతిథులు అందజేసి ఘనంగా సత్కరించారు. డాక్టర్ వెంపటి చినసత్యం జీవిత విశేషాలను తెలియజేసే పుస్తకాన్ని ఈ సందర్భంగా మంత్రులు అతిథులు ఆవిష్కరించారు. అలాగే శ్రీ సిద్ధేంద్ర యోగి కళాక్షేత్రం కూచిపూడి ప్రధానాచార్యులు కేంద్ర సంగీత నృత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి గారికి సిద్ధేంద్ర యోగి పురస్కారం, నాట్యాచార్యులు మాధవ పెద్ది మూర్తికి వెంపటి చినసత్యం జీవిత సాఫల్య పురస్కారం, వేదాంతం రాదే శ్యామ్కు డాక్టర్ పద్మశ్రీ శోభా నాయుడు జీవిత సాఫల్య పురస్కారం, పార్వతీ రామచంద్రన్ కుమారి లంక అన్నపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం, పటాన్ మొహిద్దిన్ ఖాన్ కు వెంపటి వెంకట్ సేవా పురస్కారాలను మంత్రులు అతిధులు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సంగీత నాటక అకాడమీ సభ్యులు డాక్టర్ ఎస్పీ భారతి, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి చైర్పర్సన్ వంగపండు ఉష, అధికార బాషా సంఘం సభ్యులు డాక్టర్ డి.మస్తానమ్మ, రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ఆర్ మల్లికార్జున రావు, డిఆర్ఓ పి. వెంకటరమణ, ఉయ్యూరు ఆర్డిఓ విజయ్ కుమార్, డిఆర్డిఎడ్ డ్వామా పీడీలు పిఎస్ఆర్ ప్రసాదు, సూర్యనారాయణ, విద్యుత్ అధికారి భాస్కరరావు, తహసిల్దార్ ఆంజనేయ ప్రసాద్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు కళాకారులు, వారి తల్లిదండ్రులు, కళాభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. - జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి, కృష్ణాజిల్లా, మచిలీపట్నం వారిచే జారీ చేయబడినది. -
ఆ మాటలనడానికి నోరెలా వచ్చింది
సాక్షి, అమరావతి: మంత్రి రోజాపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. సహ నటీమణులు, జాతీయస్థాయి నేతలు, పక్క రాష్ట్రాల నేతలు రోజాకు మద్దతుగా గళం విప్పుతున్నారు. ఇప్పటికే కుష్బూ, రాధిక వంటి నటీమణులు.. బండారు సత్యనారాయణ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తాజాగా నటి, ఎంపీ నవనీత్ కౌర్, నటీమణులు రమ్యకృష్ణ, కవిత వంటి వారు రోజాకు మద్దతుగా నిలిచారు. రోజా గురించి ఆ మాటలనడానికి నోరెలా వచ్చిందని మండిపడ్డారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పలు తెలుగు సినిమాల్లో నటించిన నటి, ఎంపీ (మహారాష్ట్ర అమరావతి లోక్సభ నియోజకవర్గం) నవనీత్ కౌర్ బండారుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజాకు మద్దతుగా ఆమె తెలుగులో మాట్లాడుతూ వీడియో విడుదల చేశారు. రోజాకు దేశంలోని మహిళా లోకమంతా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ‘మహిళా ప్రజా ప్రతినిధిపై ఇలాంటి మాటలు మాట్లాడటానికి సిగ్గులేదా? నీకు ఇంటిలో భార్య, కూతురు, సోదరి వంటి వాళ్లు ఎవ్వరూ లేరా? ఇంత నీచంగా మాట్లాడటానికి నోరెలా వచ్చింది? తెలుగు అమ్మాయిలాగా తెలుగులో మాట్లాడుతుంది, తెలుగు సినిమాల్లో పని చేసింది అంటూ ఏపీ, తెలంగాణ ఎంపీలు నన్ను ఎంతో గౌరవంగా చూస్తారు. ఎంతో మంది అగ్ర హీరోలతో పని చేసి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన రోజాపై ఇంత దిగజారి మాట్లాడటానికి నీకు ఎంత ధైర్యం కావాలి’ అంటూ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రాజకీయాలు ముఖ్యమా లేక తెలుగు మహిళల గౌరవం ముఖ్యమా అన్నది తేల్చుకోవాలని అన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఖండించాలి: కవిత తెలుగుదేశం పార్టీ నేతలు మహిళలపై దిగజారి మాట్లాడుతున్నారని సినీ నటి, తెలుగుదేశం పార్టీ మాజీ మహిళా నేత కవిత ధ్వజమెత్తారు. మహిళా మంత్రి రోజాపై బండారు సత్యానారాయణ అత్యంత హేయంగా మాట్లాడారని అన్నారు. ఆయన వ్యాఖ్యలను భువనేశ్వరి, బ్రాహ్మణి వెంటనే ఖండించాలని డిమాండ్ చేశారు. దరిద్రపు మాటలు ఎలా మాట్లాడారో తెలియడంలేదని వ్యాఖ్యానించారు. టీడీపీ నాయకులు రాజకీయాలను ఇంతలా దిగజారుస్తారనుకోలేదన్నారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత నీచంగా మాట్లాడతారా?: రమ్యకృష్ణ భారత మాతాకి జై అని గర్వంగా చెప్పుకొనే మన దేశంలోఒక మహిళపై ఇంత నీచంగా మాట్లాడతారా అంటూ సినీ నటి రమ్యకృష్ణ బండారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, జెండర్ తో సంబంధం లేకుండా బండారు వ్యాఖ్యలను అందరూ ఖండించాలన్నారు. ఓ మహిళగా, నటిగా, స్నేహితురాలిగా మంత్రి రోజాకి అండగా ఉంటానని చెప్పారు. నీచమైన వ్యాఖ్యలు చేసిన బండారు సత్యానారాయణను క్షమించకూడదన్నారు. ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బండారుపై కఠిన చర్యలు తీసుకోవాలి అల్లూరి జిల్లాలో మహిళల నిరసన.. కొవ్వొత్తుల ర్యాలీ సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): పర్యాటకశాఖ మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించిన టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి డిమాండ్ చేశారు. బండారు సత్యనారాయణ వైఖరిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఆధ్వర్యాన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్లమామిడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. బండారు ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మంత్రి రోజాతోపాటు మహిళా సమాజానికి బండారు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపట్ల అగౌరవంగా ప్రవర్తిస్తున్న బండారు సత్యనారాయణకు టీడీపీ నేతలు మద్దతు తెలపడం సిగ్గుచేటన్నారు. బండారుపై కేంద్ర, రాష్ట్ర మహిళా కమిషన్లు విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీకే చెందిన మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు గతంలో మహిళా మున్సిపల్ కమిషనర్ను అసభ్య పదజాలంతో దూషించడం, చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేయడం వంటి దారుణమైన ఘటనలు రాష్ట్ర ప్రజలు చూశారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎస్.రాంబాబు, వైస్ ఎంపీపీ కుంతూరు కనకాలమ్మ, పాడేరు మార్కెట్ కమిటీ చైర్మన్ కూతంగి సూరిబాబు, పలువురు నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కాగా, మంత్రి రోజాను బండారు సత్యనారాయణ అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ పాడేరులో కొవ్వొత్తులతో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, పలువురు నేతలు ర్యాలీ నిర్వహించారు. -
సీఎం జగన్, మంత్రి రోజాలను దూషించిన కేసులో బండారుకు బెయిల్
గుంటూరు లీగల్/గుంటూరు ఈస్ట్/సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పైన, మంత్రి రోజా పైన అనుచిత వ్యాఖ్యలు చేసి, దూషించిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి మంగళవారం గుంటూరు మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో విశాఖపట్నం సమీపంలోని వెన్నలపాలెంలో సోమవారం రాత్రి అరెస్టు చేసిన బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు మంగళవారం ఉదయం గుంటూరు నగరంపాలెం స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేసేందుకు వచ్చిన టీడీపీ నేతలు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్యనారాయణమూర్తిని కలిసేందుకు విశాఖపట్నానికి చెందిన న్యాయవాదులు పి.ఎస్.నాయుడు, బి.వి.రమణ, గుంటూరు న్యాయవాది ముప్పాళ్ల రవిశంకర్, టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు, సత్యనారాయణమూర్తి కుమారుడు అప్పలనాయుడు స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ పోలీసులు వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఒక ఎస్ఐ తన తండ్రిపై ఫిర్యాదు చేయడం ఏమిటని ప్రశ్నించారు. సత్యనారాయణమూర్తిని పోలీసులు బందోబస్తు మధ్య మధ్యాహ్నం జీజీహెచ్కు తరలించారు. ఆయనకు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించారు. తనకు అనారోగ్యంగా ఉన్నందున ఆస్పత్రిలోనే ఉంచాలని సత్యనారాయణమూర్తి కోరారు. వైద్యపరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏకుల కిరణ్కుమార్ నిర్ధారించారు. తరువాత సత్యనారాయణమూర్తిని పోలీసులు కోర్టుకు తరలించారు. ప్రాసిక్యూషన్ తరఫున పీపీ వాదనలు వినిపిస్తూ.. సెక్షన్లు బెయిల్ ఇవ్వదగినవి అయినప్పటికీ నేర తీవ్రతను, వ్యక్తి చరిత్రను పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయాధికారి జి.స్రవంతి.. బండారు సత్యనారాయణమూర్తిని రూ.25 వేల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. చట్టప్రకారమే వ్యవహరించాం.. సీఎం జగన్, మంత్రి రోజాలపై అసభ్య, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసుల్లో టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని అరెస్ట్ చేసే విషయంలో చట్టప్రకారమే వ్యవహరించామని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. తన సోదరుడు సత్యనారాయణమూర్తిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ బండారు సింహాద్రిరావు హైకోర్టులో సోమవారం హౌస్మోషన్ రూపంలో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్రాయ్, జస్టిస్ తర్లాడ రాజశేఖర్రావు ధర్మాసనం విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. సత్యనారాయణమూర్తిపై గుంటూరు అరండల్పేట, నగరంపాలెం స్టేషన్లలో కేసులు నమోదైనట్లు చెప్పారు. నరగంపాలెం స్టేషన్లో నమోదైన కేసులో సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సత్యనారాయణమూర్తికి నోటీసులు ఇవ్వలేదన్నారు. అరండల్పేట పోలీస్స్టేషన్లో నమోదైన కేసులో నోటీసు జారీచేస్తే.. దాన్ని తీసుకోవడానికి సత్యనారాయణమూర్తి నిరాకరించారని, దీంతో చట్ట నిబంధనల మేరకు ఆయన్ని అరెస్ట్ చేశామని వివరించారు. ఒకవైపు నోటీసు తీసుకోవడానికి నిరాకరించి, మరోవైపు హైకోర్టులో నోటీసు తీసుకున్నట్లు చెబుతున్నారని, ఇది కోర్టును తప్పుదోవ పట్టించడమేనని తెలిపారు. 41ఏ నోటీసును తీసుకున్నట్లు పెట్టిన సంతకం సత్యనారాయణమూర్తిది కాదన్నారు. అరెస్ట్ తరువాత సత్యనారాయణమూర్తిని గుంటూరు కోర్టులో హాజరుపరిచినట్లు చెప్పారు. పిటిషనర్ న్యాయవాది వి.వి.సతీష్ వాదనలు వినిపిస్తూ.. 41ఏ నోటీసు ఇచ్చి దానిపై పోలీసులు సంతకం కూడా తీసుకున్నారని తెలిపారు. 41ఏ నోటీసు ఇచ్చి విచారణకు రావాలని చెప్పి, ఆ వెంటనే అరెస్ట్ చేశారన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. సత్యనారాయణమూర్తి అరెస్ట్ విషయంలో చట్టనిబంధనలను పాటించలేదని తేలితే దర్యాప్తు అధికారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. విచారణ ఈ నెల 5కి వాయిదా వేసింది. -
పవన్ నువ్వెంత.. నీ బతుకెంత?
సాక్షి, అమరావతి: ప్యాకేజీ కోసం కన్న తల్లిని దుర్భాషలాడిన వ్యక్తుల దగ్గర పవన్కళ్యాణ్ బానిసలా బతుకుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. అవినీతి కేసులో జైలులో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని.. సొంత కార్యకర్తలు, సొంత సామాజికవర్గాన్ని అమ్మేసిన పవన్ను ‘నువ్వెంత? నీ బతుకెంత?’.. అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ దేశ చరిత్రలో పవన్లాంటి సిగ్గులేని రాజకీయ నాయకుడిని ఎవరూ చూసి ఉండరన్నారు. ప్రజలకిచ్చిన మాట కోసం ఢిల్లీని ఢీకొట్టి.. ప్రతిపక్ష నేతగా.. ముఖ్యమంత్రిగా జగన్ తనను తాను నిరూపించుకుంటే.. పవన్ మాత్రం పార్టీ పెట్టి దశాబ్దం గడిచినా ఇప్పటికీ అందరి జెండాలు మోసే కూలీగానే మిగిలిపోయారని ఎద్దేవా చేశారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. ఆరోగ్యశ్రీలో నీ పిచ్చి కుదురుస్తాం.. జనసేన పోటీచేసిన 136 స్థానాల్లో 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి. నీ స్థాయికి తగ్గట్టు నువ్వు మాట్లాడాలి పవన్. అసలు నువ్వు ఒక్క దానిలోనైనా సక్సెస్ అయ్యావా? చదువులో, ఫ్యామిలీలో, కొడుకుగా, భర్తగా, రాజకీయ నాయకుడిగా అన్నింట్లోనూ ఫెల్యూర్. నీ తల్లిని తిట్టిన వాళ్లతో అంటకాగుతున్నావు.. త్వరలోనే ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం. ఇక అమిత్ షా దగ్గరకెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తావు? నీ మీద చెప్పులు, రాళ్లు వేయించిన చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నా.. మీరూ రండి.. అని చెప్తావా? మోడీని, ఆయన భార్యను, తల్లిని తిట్టించిన టీడీపీతో కలుద్దామని పిలుస్తావా? ఎన్నికల్లో సొంతంగా పది మంది అభ్యర్థులను నిలపలేని వ్యక్తి యుద్ధానికి సిద్ధమనడం హాస్యాస్పదంగా ఉంది. బ్రాహ్మణి బ్రహ్మాస్త్రం తుస్సుమంది.. చంద్రబాబు అరెస్టును ప్రజలు పట్టించుకోకపోవడంతో పచ్చ బ్యాచ్కు పిచ్చెక్కిపోతోంది. లోకేశ్, భువనేశ్వరి, బాలకృష్ణ, పవన్ విఫలమవడంతో బ్రహ్మాస్త్రంగా బ్రాహ్మణిని తీసుకొచ్చారు. రాజకీయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడిన బ్రహ్మాస్త్రం తుస్సుమంది. చంద్రబాబును డైరెక్టుగా ఎలా అరెస్టు చేశారని బ్రాహ్మణి అంటోంది. సాక్ష్యాధారాలతో దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ.. జైలర్ సినిమాకు పంపుతారా? అలాగే, దేవాన్షుకి దయచేసి బాబు రిమాండ్ రిపోర్ట్ చూపించొద్దు. వాళ్ల తాత ఎంతపెద్ద దొంగో తెలిస్తే అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. మీ మామ(చంద్రబాబు) గురించి మీ తాత ఎన్టీఆర్ చివరి క్షణాల్లో విడుదల చేసిన వీడియో చూడు. చంద్రబాబు గొడ్డుకన్నా హీనం.. గాడ్సే కన్నా ఘోరం అని స్వయంగా ఎన్టీఆర్ విలపించారు. మీ మామ నిరపరాధని మీ దగ్గర ఆధారాలుంటే మీడియాలో కాదు కోర్టుల్లో చూపించాలి. ఇక స్కిల్ స్కాంలో లోకేశ్, అచ్చెన్నాయుడుతో పాటు పాత్రధారులందరూ జైలుకెళ్లకతప్పదు. -
చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఉంది: మంత్రి రోజా
-
'దొంగ' దొరికాడు..చంద్రబాబు నోరుతెరవడం లేదంటే..!
-
‘బాలకృష్ణలా చంద్రబాబు మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?
సాక్షి, విజయవాడ: చంద్రబాబు అరెస్ట్ అయితే రాష్ట్ర ప్రజలు సంబరాలు చేసుకుంటారని, ఆయన జైలుకి వెళ్లడం ఖాయమని మంత్రి రోజా అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు జైలుకెళ్లితే ఎన్టీఆర్ ఆత్మ సంతోషిస్తుందన్నారు. ‘‘రూ.118 కోట్ల ముడుపుల కేసులో విచారణ ఎదుర్కోనే దమ్ముందా లేదా..?. విచారణ ఎదుర్కొంటాడా లేక బాలకృష్ణలా మెంటల్ సర్టిఫికెట్ తెచుకుంటాడా..?’’ అంటూ రోజా మండిపడ్డారు. ‘‘విజయ్ మల్యాలా విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది. చంద్రబాబు, లోకేష్లను జైలులో పెడితేనే ప్రజలకు మేలు. బాబు అడ్డంగా దొరికిపోయినప్పుడు సింపతి డ్రామాలు ఆడటం అలవాటు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయి రాష్ట్రానికి పారిపోయి వచ్చాడు. చంద్రబాబు మీద అలిపిరిలో బాంబు పేలినప్పుడే ఆయనకి సింపతి రాలేదు. బాబు అంటే ప్రజల్లో అంత వ్యతిరేకత ఉంది.’’ అని మంత్రి పేర్కొన్నారు. ‘‘2019లో ఎన్నికల ముందు మోదీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి డ్రామా ఆడింది చంద్రబాబు కాదా?. చంద్రబాబుని కచ్చితంగా అరెస్ట్ చేయాలి. బాబుని ముడుపుల కేసులో సీబీఐ, ఈడీ విచారించాలి’’ అని మంత్రి రోజా డిమాండ్ చేశారు. చదవండి: ఎక్కడి దొంగలు.. అక్కడే! -
ఎస్వీ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు చెల్లింపు
రేణిగుంట(తిరుపతి జిల్లా): తిరుపతి జిల్లా గాజులమండ్యం ఎస్వీ సహకార చక్కెర కర్మాగారం కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం వేతన బకాయిలను చెల్లించింది. 368 మంది కార్మికులకు 9 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రూ.21.36 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల విడుదల చేశారు. బుధవారం ఫ్యాక్టరీ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్రెడ్డి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యంతో కలిసి మంత్రి రోజా.. కార్మికులకు చెక్కులు పంపిణీ చేశారు. రేణిగుంట మండలం గాజులమండ్యంలోని శ్రీ వెంకటేశ్వర సహకార చక్కెర కర్మాగారాన్ని చంద్రబాబు అధికారంలోకి రాగానే 2014లో మూసివేశారు. కానీ కార్మికులకు వేతన బకాయిలు చెల్లించలేదు. దీంతో కార్మికులు పని కోల్పోయి.. వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారి సమస్య తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 368 మంది కార్మికులకు అందాల్సిన బకాయిలు మొత్తం రూ.21.36 కోట్లను విడుదల చేశారు. వాటిని బుధవారం మంత్రి రోజా అందజేయగా.. కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. తమ సమస్య తెలియగానే నిధులు విడుదల చేసిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవితాల్లో సీఎం జగన్ వెలుగులు నింపారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ ఎండీ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
బాబు స్కిల్డ్ క్రిమినల్..
బాబుది అంతా చీకటి చరిత్ర: అమర్నాథ్ అసలు చంద్రబాబు రాజకీయ జీవితమంతా.. కుట్రలు, కుతంత్రాలు, అవినీతితో నిర్మితమైందని, ఆయనదంతా చీకటి చరిత్ర అని విశాఖలో మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. దేశంలోని ఏ రాజకీయ నాయకుడిపై లేనన్ని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు చంద్రబాబుపై ఉన్నాయని చెప్పారు. నేరుగా రాజకీయాల్లో ఎదగలేక, వెన్నుపోటు పొడిచి దొడ్డిదారిన ముఖ్యమంత్రి అయ్యాడన్నారు. తాను నిజాయితీపరుడిని అని రోజూ ప్రవచనాలు వల్లించే చంద్రబాబు రూ.118 కోట్లు ఎలా బొక్కేశాడని ప్రశ్నించారు. చంద్రబాబు తాజా ఆర్థిక నేరాలపై పత్రికలు, టీవీ చానళ్లు అనేక కథనాలు వెల్లడిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు స్పందించడంలేదని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ బాబు ఆర్థిక నేరాలను స్పష్టంగా ఐటీ అధికారులకు వివరించాడని ఆయన తెలిపారు. దుబాయ్ నుంచి కూడా అక్కడి కరెన్సీలో రూ.15 కోట్ల వరకు దండుకున్నారని మంత్రి ఆరోపించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు అధికారులను, మంత్రివర్గాన్ని తప్పుదోవ పట్టించి సుమారు రూ.350 కోట్లు కొట్టేశాడని ఆయన వివరించారు. చంద్రబాబు ఆర్థిక నేరాల విషయంలో ఈడీ జోక్యం చేసుకోవాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులను జైలుకు పంపాలి: రోజా చంద్రబాబు, లోకేశ్పై సీబీఐ విచారణ జరిపించి, జైలుకు పంపాలని మంత్రి ఆర్కే రోజా తిరుమలలో మీడియాతో అన్నారు. గతంలో 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డుగానీ, ఓటరు కార్డు గానీ, ఇల్లుగానీ లేకపోయినా హైదరాబాదు నుంచి అప్పుడప్పుడు వచ్చి వైఎస్సార్సీపీ నేతలపై విమర్శలు చేసి వెళ్లిపోతుంటారన్నారు. అలాగే, చంద్రబాబుకు ఐటీ నోటీసులిస్తే ఎందుకు ఎవరూ నోరు మెదపడంలేదని ఆమె ప్రశ్నించారు. కాంట్రాక్టు పనుల్లో కోట్లాది రూపాయల కమీషన్లు దండుకున్నారని రోజా ఆరోపించారు. చంద్రబాబుకు ఐటీ అధికారులు నోటీసులిస్తే ఆయన దత్తపుత్రుడు ఎందుకు ట్వీట్ చేయలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ను సైతం సీబీఐ అధికారులు విచారణ చేయాలని రోజా డిమాండ్ చేశారు. బాబు అత్యంత అవినీతిపరుడు: కొడాలి నాని చంద్రబాబు అత్యంత అవినీతిపరుడు, స్వార్థపరుడు, నమ్మక ద్రోహి అని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన మచిలీపట్నంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఇప్పుడు రికార్డులతో సహా దొరికిన దొంగని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థికి రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లయినా ఖర్చుపెడదామని ఆయన చెబుతున్నారన్నారు. చంద్రబాబు హయాంలో ఇప్పటివరకు నిర్వహించిన ఎన్నికల్లో రూ.10 వేల కోట్లు వరకు ఖర్చుచేశారని, ఈ డబ్బంతా ఇలా కమీషన్లు తీసుకోకపోతే ఎక్కడి నుంచి వచ్చిందని కొడాలి నాని ప్రశ్నించారు. ఇన్ని కోట్ల రూపాయల ఖర్చు ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసునన్నారు. చట్టాలు, రాజ్యాంగాలను అనుసరించి ఏ విధంగా డబ్బులు దోచుకోవాలో ఆయనకు బాగా తెలుసునన్నారు. ఇప్పుడు ఐటీ శాఖాధికారులు ఇచ్చిన నోటీసుల నుంచి తప్పించుకునేందుకు బీజేపీ నాయకుల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బాబు అవినీతి బాగోతం బయటపడిందని ఇప్పుడు తప్పించుకోలేరని నాని అన్నారు. బాబు, లోకేశ్ పెద్ద అవినీతిపరులు: ధర్మాన ప్రపంచంలోనే చంద్రబాబు, లోకేశ్లు పెద్ద అవినీతిపరులని, దోచుకుని పంచుకోవడమే పనిగా పెట్టుకున్నారని, రానున్న ఎన్నికల్లో వారికి ఓటు అడిగే అర్హత లేదని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 14 ఏళ్లు సీఎంగా ఉన్న బాబు ఒక్క పేదవాడికి సెంటు భూమి ఇవ్వలేదని, ఒక్క శాశ్వత పథకం కూడా తీసుకురాలేకపోయారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి గజదొంగలకు అధికారమిస్తే రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తారన్నారు. ఇక అచ్చెన్నాయుడు, ఎంపీ రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చేసిందేమీ లేదని, చంద్రబాబు ముందు చేతులు కట్టుకుని నిలబడడం తప్ప జిల్లాకు ఒక్క ప్రాజెక్టు కూడా వీరు తీసుకురాలేకపోయారన్నారు. -
రాకేష్ మరిన్ని సినిమాలు చేయాలి
‘జబర్దస్త్’ ఫేమ్ రాకింగ్ రాకేష్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ప్రారంభోత్సవం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. తొలి సన్నివేశానికి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి కెమెరా స్విచ్చాన్ చేయగా, తెలంగాణ ఎంపీ (రాజ్యసభ) సంతోష్ కుమార్ క్లాప్ ఇచ్చారు. నటుడు తనికెళ్ల భరణి గౌరవ దర్శకత్వం వహించగా, నటుడు సాయికుమార్ మేకర్స్కి స్క్రిప్ట్ అందజేశారు. గ్రీన్ ట్రీ ప్రోడక్షన్స్ పతాకంపై జయలక్ష్మీ సాయి కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ అంజి దర్శకత్వం వహిస్తుండగా, అనన్యా నాగళ్ల హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమాప్రా రంభోత్సవంలో రోజా మాట్లాడుతూ– ‘‘రాకేష్కి ఎప్పట్నుంచో లీడ్ రోల్ చేయాలని ఉంది. ఈ సినిమాతో అది నెరవేరడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా విజయం సాధించి, భవిష్యత్లో రాకేష్ మరిన్ని సినిమాలు చేసి, ప్రజలకు వినో దాన్ని పంచాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.‘‘నటుడిగా, నిర్మాతగా రాకేష్ మరెన్నో సినిమాలు చేసి, మంచి పేరు తెచ్చుకోవాలి’’ అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. ‘‘చిన్న సినిమాలు పెద్దగా అవుతున్నాయి. ఈ సినిమా కూడా పెద్ద విజయం సాధించి, రాకేష్ మరో పది సినిమాలు చేసే స్థాయికి రావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు తనికెళ్ల భరణి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ సినిమాకు సంగీతం: చరణ్ అర్జున్. -
ప్రతి ఒక్కరి గుండెల్ని తాకే దేశభక్తి పాటలు ఇవే
భారతదేశం తన 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నేడు (ఆగస్టు 15)న జరుపుకుంటుంది. భారతదేశం బ్రిటీష్ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొంది 76 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు వైభవంగా జరుపుకుంటున్నారు. దాదాపు రెండు శతాబ్దాల తర్వాత బ్రిటీష్ వారి నుంచి విముక్తిని సాధించిపెట్టిన నాయకులు, ఇందుకు తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు గుర్తు చేసుకుంటున్నారు. అలా కొన్ని పాటలు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 'తేరి మిట్టీ' -కేసరి కొన్ని పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి పాటల్లో తేరి మిట్టి మే మిల్ జవాన్ సాంగ్ ఒక్కటి. ఈ పాట విన్నప్పుడల్లా మనస్సు ఉప్పొంగుతుంది. గీత రచయిత మనోజ్ ముంతాషిర్ ఎంతో గొప్పగా రచించారు. ఈ పాట విన్న తర్వాత అందరిలో దేశభక్తి భావం రాకుండా ఉండదు. ఈ పాటను 1బిలియన్కు పైగా వీక్షించారు. 'మేమే ఇండియన్స్' - ఖడ్గం కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన దేశభక్తి మూవీ 'ఖడ్గం'. నేటి తరానికి దేశ భక్తి అంటే ఏంటో తెరపై చూపించిన సినిమా ఇది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన 'మేమే ఇండియన్స్' పాట ఎంత పాపులర్ అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాట ఎప్పుడు విన్నా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. చంద్రబోస్ రాసిన ఈ గీతాన్ని సింగర్ హనీ ఆలపించారు. 'ఎత్తరా జెండా' - RRR విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ నిజ జీవిత పాత్రల ఆధారంగా ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మూవీ 'ఆర్.ఆర్.ఆర్'. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఎండ్ క్రెడిట్స్ పడే సమయంలో 'నెత్తురు మరిగితే ఎత్తరా జెండా' అనే పాట వస్తుంది. దేశభక్తిని చాటిచెప్పే ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు పలువురు స్వాతంత్ర్య సమరయోధుల గెటప్స్లో కనిపిస్తారు. ఎమ్ఎమ్ కీరవాణి స్వరపరిచిన ఈ సెలబ్రేషన్ సాంగ్కు రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. విశాల్ మిశ్రా, పృథ్వీ చంద్ర, సాహితి చాగంటి, హారిక నారాయణ్ కలిసి ఆలపించారు. 'దేశం మనదే తేజం మనదే' - జై తేజ దర్శకత్వంలో నవదీప్ హీరోగా నటించిన చిత్రం 'జై'. ఈ సినిమాలో అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన 'దేశం మనదే తేజం మనదే' సాంగ్ ఎవర్ గ్రీన్ దేశభక్తి గీతంగా నిలిచింది. బేబీ ప్రెట్టీ, శ్రీనివాస్ కలిసి పాడిన ఈ పాటకు కులశేఖర్ సాహిత్యం సమకూర్చారు. 'పాడవోయి భారతీయుడా' -వెలుగు నీడలు 'పాడవోయి భారతీయుడా.. ఆడి పాడవోయి విజయ గీతికా' అంటూ మహాకవి శ్రీ శ్రీ రాసిన దేశభక్తి గీతం ప్రతి యేడాది స్వాతంత్ర్య దినోత్సవం రోజున మార్మోగుతూనే ఉంది. ఈ పాట వచ్చిన 13 ఏళ్ల తరువాత అక్కినేని నాగేశ్వరరావు 'వెలుగు నీడలు' చిత్రంలో పెండ్యాల నాగేశ్వరరావు స్వరపరిచిన ఈ పాటను పి.సుశీల , ఘంటసాల పాడారు. ఈ పాట వచ్చి 60 సంవత్సరాలు గడిచినా నేటికీ క్లాసిక్ దేశభక్తి గీతాల్లో ఎప్పటికీ ట్రెండింగ్లో ఉంటుంది. 'పుణ్యభూమి నాదేశం' -మేజర్ చంద్రకాంత్ ఇక ఎన్టీఆర్ క్లాసిక్ హిట్స్ అంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేపాట. మేజర్ చంద్రకాంత్ మూవీలోని 'పుణ్యభూమి నాదేశం నమో నమామి'. దేశం కోసం ప్రాణం అర్పించిన ఎందరో మహానుభావున త్యాగాలను గుర్తు చేస్తూ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన ఈపాటకు కీరవాణి స్వరాలను సమకూర్చారు. 'వినరా.. వినరా' రోజా ఏ.ఆర్ రెహమాన్ దేశభక్తి గీతాలు యూత్లో దేశభక్తిని రగిల్చాయి. రోజా చిత్రంలో వినరా.. వినరా.. దేశం మనదేరా అంటూ రాజశ్రీ రాసిన పాటతోపాటు.. మా తేఝే సలాం వందేమాతరం అంటూ రెహమాన్ పాడిన పాట సంచలనం అయ్యింది. -
పవన్వి అర్థం లేని మాటలు
మద్దిలపాలెం (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి/ఆరిలోవ (విశాఖ తూర్పు): రుషికొండ చూడడానికి వెళ్లి పవన్కళ్యాణ్ అక్కడ జరుగుతున్నవి అక్రమ నిర్మాణాలని, అక్కడ స్థలాలను కబ్జాచేశారని, ఈ నిర్మాణాలకు అనుమతులెవరు ఇచ్చారని అర్థంపర్థంలేని మాటలు మాట్లాడుతున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వ కట్టడాలు అధికారికంగా కడుతుంటే ఎవరి అనుమతి తీసుకుంటారని, ఈ మాత్రం జ్ఞానంలేకుండా పవన్కళ్యాణ్ అవివేకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజారంజకమైన పాలనతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సీఎం జగన్ చర్మిషాను చూసి పవన్ విద్వేషంతో రగిలిపోతున్నారన్నారు. విశాఖలోని సర్క్యూట్ హౌస్లో ఆదివారం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. రుషికొండ మీద నిర్మిస్తున్న భవనాలలో సీఎం కార్యాలయాన్ని గానీ, ప్రభుత్వ కార్యాలయాలను గాని వినియోగించే అవకాశాలున్నాయి. సీఎం విశాఖపట్నం రావడానికి ఎలాంటి బిల్లు అవసరంలేదు. విశాఖ నుంచి పాలన చేస్తాననే మాటకు ఆయన కట్టుబడి ఉన్నారు. త్వరలో సీఎం విశాఖకు రానున్నారు. ఇక రుషికొండలో షరతులను ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని అనుమతులతో చేపడుతున్నవే. రామానాయుడు స్టూడియో, వేంకటేశ్వరస్వామి ఆలయం, ఐటీ కంపెనీలు కొండలపైన కట్టినవే. ఇవన్ని అభివృద్ధిలో భాగమే. భూమి లభ్యత తక్కువున్న ప్రాంతాల్లో కొండలపై ఇటువంటి భవనాలను నిర్మించడం సర్వసాధారణం. ఈ విషయం పవన్కు తెలీకపోవడం దురదృష్టకరం. రామోజీ ఫిల్మ్సిటీ, మీ అన్నగారు చిరంజీవి ఇళ్లు కొండ మీద కట్టలేదా? వీటన్నింటికి లేని అభ్యంతరాలు రుషికొండపై ప్రభుత్వ భవనాలు కడితే వచ్చిందా? బాబు అజెండాను మోస్తున్న పవన్ చంద్రబాబు కోసం కోతిలా ఎగురుతున్న పవన్కళ్యాణ్ తెలుగుదేశం హయాంలో జరిగిన అక్రమాలను ఆ పార్టీ నాయకులే బయట పెట్టినప్పడు ఎందుకు నోరు విప్పలేదు? నది ఒడ్డున చంద్రబాబు ఇల్లు కట్టుకున్నప్పుడు పవన్ కళ్లు కనబడలేదా? నిజానికి.. పవన్ తన జెండాను పక్కనపెట్టి చంద్రబాబు అజెండాను మోస్తున్నారు. విశాఖ నగరంలో లక్షన్నర మంది పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడానికి సీఎం జగన్ ప్రయత్నిస్తే దానిని అడ్డుకునేందుకు చంద్రబాబు కేసులు వేశారు. దీనిపై పవన్ ఎందుకు చంద్రబాబుని ప్రశ్నించలేదు? అసలు ఆయనకు సరైన పొలిటకల్ స్టాండ్లేదు. మంత్రిగా వాస్తవాలను చెప్తే వేయరా?: రోజా మరోవైపు.. మంత్రి రోజా ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ భవనాలు కడుతుంటే.. మధ్యలో పవన్, చంద్రబాబుకు వచి్చన బాధేంటని ఆమె అందులో ప్రశ్నించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే.. రుషికొండ వద్ద ఏం నిర్మిస్తున్నామన్న విషయాన్ని శనివారం అధికారికంగా మీడియా సమావేశంలో వివరించా. కానీ, ఈనాడు సహా టీడీపీ అనుకూల పత్రికలు, టీవీలు ఈ నిజాలను ప్రజలకు చెప్పలేదు. అందుకే మరోసారి స్పష్టతనిస్తున్నాను. రుషికొండలోని భూమి ప్రభుత్వ భూమి. పర్యాటక శాఖకు సంబంధించిన భూమి అది. ఇక్కడ పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. ఇందులో 9.88 ఎకరాల్లో నిర్మాణాల కోసం ప్రభుత్వానికి అనుమతులిచ్చారు. ఇందులో కూడా మేం కడుతున్నది కేవలం 2.7 ఎకరాల్లోపే. ఏడు భవన నిర్మాణాలకు అనుమతులొస్తే కేవలం నాలుగు భవనాలు మాత్రమే నిర్మిస్తున్నారు. అదికూడా జీ ప్లస్ వన్ మాత్రమే. రుషికొండ నిర్మాణాలపై హైకోర్టు వేసిన కమిటీ అన్నింటినీ పరిశీలించి, తనిఖీచేసి రిపోర్టు కూడా ఇచ్చింది. హైకోర్టు ఏమైనా సూచనలు చేస్తే వాటిని కూడా పాటిస్తాం. ప్రజాప్రతినిధిగా ఏ హోదాలేని వాడు, కనీసం వార్డు మెంబర్ కూడా కాని పవన్ మాటలను పెద్దపెద్దగా ప్రచారం చేస్తారా? ఆయన ఊగుడు చూస్తుంటే త్వరగా మెంటల్ ఆస్పత్రిలో చేరేట్లు ఉన్నాడు. పవన్ ఓ ఫ్లవర్స్టార్: వరుదు కళ్యాణి విశాఖపట్నం రుషికొండ వద్ద ఉన్న గీతం వర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములు కనిపించడం లేదా? అని పవన్ను ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ప్రశ్నించారు. నగర పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ. రుషికొండపై ప్రభుత్వ కార్యాలయాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతింటుందని తప్పుపడుతున్నారని, అయితే దీనికి ఎదురుగా ప్రభుత్వ భూమిని ఎకరాలకొద్దీ ఆక్రమించిన లోకేశ్ తోడల్లుడు భరత్కు చెందిన గీతం వర్సిటీ గురించి, ఓ కొండపై పూర్తిగా పచ్చదనం నాశనం చేసి నిర్మించిన రామానాయుడు స్టూడియో గురించి పవన్ ఎందుకు మాట్లాడటంలేదో చెప్పాలన్నారు. తన పర్యటనల్లో పవన్ చెప్పిన అబద్ధాలనే మళ్లీ మళ్లీ చెబుతున్నారని ఆమె అన్నారు. పవన్ నడుపుతున్నది జనసేన కాదు.. చంద్రసేన అంటూ వరుదు కళ్యాణి ఎద్దేవా చేశారు. ఆయన సినిమాల్లో పవర్స్టారే కావచ్చు.. కానీ, రాజకీయాల్లో మాత్రం ఫ్లవర్స్టార్ అని వ్యాఖ్యానించారు. పెందుర్తిలో మరణించిన వరలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడారన్నారు. వలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ అని అనడానికి ఆయనకు నోరెలా వచ్చిందన్నారు. ఇక హిందూపురంలో జనసేన నేత ఓ వ్యక్తిపై దాడిచేసి 16 తులాల బంగారు ఆభరణాలు దోచేశాడని, ఈ ఘటనతో జనసేన నేతలు హత్యలు, దోపిడీలు చేస్తారని ఒప్పుకుంటావా? అని ఆమె ప్రశ్నించారు. -
'పవన్.. ముందు ఎమ్మెల్యేగా గెలువు..'
అమరావతి: జనసేన నేత పవన్ కల్యాన్పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం జగన్ను ఓడించాలన్న అతని కల నెరవేరదని అన్నారు. బీపీ వచ్చినట్లు ఊరికే ఊగిపోతూ కేకలు వేస్తే ప్రయోజనం ఉండదని చెప్పారు. బై బై బీపీ అంటూ పవన్కు ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ఓపిక, ప్రజలపై ప్రేమ ఉండాలని హితువు పలికారు. లోకేశ్, పవన్ ముందు ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో రాణించాలని సూచించారు. ప్రజలకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి కాబట్టే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తోందని చెప్పారు. గత ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడిస్తానంటూ పవన్ మాట్లాడి, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారని అన్నారు. ఇదీ చదవండి: ఢిల్లీలో సీఎం జగన్ పర్యటన అప్డేట్స్..కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం జగన్ భేటీ -
రోజా మేడం సార్ రోజా మేడం అంతే
-
వైభవంగా ‘గంగమ్మ’ భక్తి చైతన్య యాత్ర
సాక్షి, తిరుపతి/తిరుపతి కల్చరల్: తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతరలో ఐదో రోజైన ఆదివారం భక్తి చైతన్య యాత్ర అంగరంగ వైభవంగా సాగింది. డప్పు దరువుల నడుమ గంధం, కుంకుమ బొట్లు ధరించి, వేపాకు చేతపట్టిన జనం భక్తి పారవశ్యంతో చిందులేస్తూ గంగమ్మ తల్లి నామస్మరణ చేశారు. అమ్మవారు, దేవతామూర్తులతో పాటు వివిధ వేషధారణల్లో తమ భక్తిని చాటుకున్నారు. తొలుత ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, డిప్యుటీ మేయర్లు భూమన అభినయ్రెడ్డి, ముద్రనారాయణ, కార్పొరేటర్లు తదితరులు అనంతవీధికి చేరుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తి చైతన్య యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి అనంతవీధి, పరసాలవీధి, రామచంద్ర పుష్కరిణి, మహతి ఆడిటోరియం, ఎస్పీ కార్యాలయం, గాందీరోడ్డు, కృష్ణాపురం ఠాణా, గాంధీ రోడ్డు, బండ్ల వీధి మీదుగా భక్తి చైతన్య యాత్ర గంగమ్మ తల్లి గుడికి చేరుకుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 30 విగ్రహాలతో.. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి స్వయంగా పలువురికి గంధం పూసి, కుంకుమ బొట్లు పెట్టారు. మాతంగి వేషధారణలో ఉన్న ఎంపీ గురుమూర్తి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. డప్పు దరువులు, కోలాటాలు, జానపద నృత్యాలతో నగరమంతా సందడిగా మారింది. సారె సమర్పించిన మంత్రి రోజా తాతయ్యగుంట గంగమ్మ తల్లికి మంత్రి ఆర్కే రోజా ఆదివారం సారె సమర్పించారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆధ్వర్యంలో అర్చకులు ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం మంత్రి రోజా అమ్మవారికి సారె సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోజా మాట్లాడుతూ.. గంగమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. తల్లి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో వరి్ధల్లాలని ఆకాంక్షించారు. గంగమ్మతల్లి ఆలయానికి సీఎం జగన్ను తీసుకువచ్చి, ఆలయ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ భూమన అభినయ్రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపీయాదవ్, ఈఓ మునికృష్ణయ్య పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ పై రజినీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్
-
చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్..
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. మీ మేనిఫెస్టో తెచ్చుకో, మా మేనిఫెస్టో తెస్తాం.. ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలను అడుగుదామని ఛాలెంజ్ చేశారు. అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామని సెటైర్ వేశారు. ఈ సవాల్ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా? అని వ్యాఖ్యానించారు. 'మెగా సర్వే చేయటానికి దమ్ము ఉండాలి. సీఎం జగన్కు దమ్ముంది. తన పాలనపై నమ్మకం ఉంది. అందుకే ఏడు లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారు. ప్రజలంతా మాకు మద్దతు తెలుపుతున్నారు. వాలంటీర్లంతా జగన్ సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఆయన మీద నమ్మకంతో అన్ని వర్గాల వారు ఉన్నారు. గతంలో ఏ ఆఫీసు చుట్టూ తిరిగినా పని జరగలేదని జనం చెప్తున్నారు. ఇప్పుడు జగన్ పాలనలో ఇంట్లో నుంచి బయటకు రాకుండానే వాలంటీర్లు చేసి పెడుతున్నారని చెప్తున్నారు. అందుకే జగన్ సైన్యం అంటే ప్రజలకు అంత ప్రేమ. జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వాళ్లు దొంగతనంగా వెళ్లి పోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారు. ఒక పది ఇళ్లకు ఇలా చేసి తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టిట్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారు. అది సెల్ఫీ కాదు, సెల్ఫ్ గోల్. మా నగరిలో లేదా మీ కుప్పంలో ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా? ఇదే నా సవాల్. ఈ సవాల్ తీసుకుంటావా చంద్రబాబూ? రాజకీయాల్లో వంద శాతం సంతృప్తి చేయగలమా? అనే డౌట్ ఉండేది. కానీ జగన్ పాలనలో చేసి చూపించారు. ఈ రాష్ట్రాని పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు. ఓటు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు. ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని నాశనం చేశాడు. యువతకు నిరుద్యోగ భృతి అంటూ మోసం చేశారు. రైతులకు రుణమాఫీ పేరుతో మోసం చేశాడు. ఇలా ప్రతి వర్గాన్నీ మోసం చేశారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా మేము జనంలోకి వెళ్తున్నాం.' అని రోజా వ్యాఖ్యానించారు. చవదండి: జగనన్నే మా భవిష్యత్తు.. ఇది చారిత్రాత్మక ప్రజా మద్దతు -
శిల్పారామాలు కళకళ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని శిల్పారామాలు పర్యాటకులతో నిత్యం కళకళలాడుతున్నాయి. గత ఎనిమిదేళ్లతో పోలిస్తే 125 శాతం మేర సందర్శకుల తాకిడి పెరిగింది. కోవిడ్ సమయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న శిల్పారామం సొసైటీ ఏడాది కాలంలోనే అనూహ్యంగా వృద్ధిని సాధించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా మెరుగైన రాబడి లభించింది. గతంలో ఎప్పుడూ నష్టాల్లోనే నడిచిన శిల్పారామాలు 2022–23లో ఏకంగా రూ.2 కోట్ల వరకు లాభం గడించడం రాష్ట్రంలోని పర్యాటక అభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తోంది. రాష్ట్రంలో ఎనిమిది శిల్పారామాలు ఉండగా సగటున ప్రతినెల 1.25 లక్షల మంది సందర్శిస్తున్నారు. ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి గ్రామీణ వాతావరణానికి ప్రతీకలుగా నిలిచే శిల్పారామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడంతో పాటు ఆధునిక హంగులతో తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా తిరుపతి, కడప శిల్పారామాల్లో మల్టీపర్పస్ హాల్, డైనింగ్ హాల్, టాయిలెట్ల పునరుద్ధరణ పనులు పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. పర్యాటకుల భద్రత దృష్ట్యా శిల్పారామాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా బోటింగ్ (జలవిహారం) కార్యకలాపాల పనులను శరవేగంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే విశాఖపట్నంలో స్విమ్మింగ్ పూల్, వాటర్ గేమ్స్–జిమ్, సందర్శకులను ఆకట్టుకునేలా పెయింటింగ్ డిస్ప్లేలను ఏర్పాటు చేసింది. మిగిలిన శిల్పారామాల్లోను ఈ తరహా వినోదాన్ని అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. గుంటూరు శిల్పారామం పనులు దాదాపు పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి సిద్ధంగా ఉంది. పులివెందుల శిల్పారామంలో పునరుద్ధరణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. కొత్త శిల్పారామాల ఏర్పాటు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకాకుళం, చిత్తూరు, విజయనగరం, కర్నూలు, రాయచోటిల్లో అర్బన్ హట్స్ (శిల్పారామాల) నిర్మాణాన్ని ప్రతిపాదించింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రూ.8 కోట్లతో కర్నూలులో, రూ.9.20 కోట్లతో అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం బండపల్లిలో శిల్పారామాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం డీపీఆర్ తయారీ, భూ సేకరణపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరోవైపు విశాఖ, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరుల్లో ఒక్కోచోట రూ.1.50 కోట్లతో హస్తకళల మ్యూజియాల నిర్మాణానికి చర్యలు చేపడుతోంది. జిల్లాకో శిల్పారామం ప్రతి జిల్లాలో శిల్పారామం ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన వాటా స్కీమ్లను సది్వనియోగం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. శిల్పారామాల్లో పచ్చదనాన్ని కాపాడుతూనే ఆధునికీకరణ చేపడుతున్నాం. అందుకే రాష్ట్ర విభజన తర్వాత గణనీయమైన వృద్ధిని సాధించాయి. నెలకు 1.25 లక్షల మంది సందర్శకులు రావడం ఇందుకు నిదర్శనం. – ఆర్.కె.రోజా, పర్యాటక, సాంస్కృతిక, యువజన శాఖ మంత్రి చక్కని ఆటవిడుపు కేంద్రాలు గతంలో ఎన్నడూ లేనివిధంగా శిల్పారామాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాం. చక్కని ఆటవిడుపు కేంద్రాలుగా పిల్లలు, పెద్దలు కూడా సంతోషంగా గడిపే వాతావరణాన్ని సృష్టిస్తున్నాం. ముఖ్యంగా బోటింగ్ కార్యకలాపాలపై దృష్టిసారించాం. హస్తకళలు, కళాకారుల కోసం శిల్పారామాల్లో ఉచితంగా ప్రత్యేక స్టాల్స్, స్టేజ్లను అందిస్తున్నాం. – శ్యామ్ప్రసాద్రెడ్డి, సీఈవో, శిల్పారామం సొసైటీ -
చంద్రబాబు మహిళలను మభ్యపెట్టి మోసగించారు
-
ఆ ఎమ్మెల్యేలు చరిత్రహీనులుగా మిగిలిపోతారు
నగరి (చిత్తూరు జిల్లా)/సాక్షి, విశాఖపట్నం/రాజమహేంద్రవరం రూరల్/కార్వేటినగరం (చిత్తూరు జిల్లా): గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆదివారం చేసిన వ్యాఖ్యలపై పలువురు మంత్రులు మండిపడ్డారు. గతంలో అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన వారికీ పడుతుందన్నారు. ఆమె చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందన్నారు. మంత్రులు ఆర్కే రోజా, గుడివాడ అమర్నాథ్, ఆదిమూలపు సురేష్, తానేటి వనిత ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం వేర్వేరుచోట్ల మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ అది: తానేటి వనిత శ్రీదేవి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివినట్లు అనిపిస్తోందని హోంమంత్రి తానేటి వనిత రాజమహేంద్రవరంలో అన్నారు. శ్రీదేవి వ్యాఖ్యలను ఆమె ఖండించారు. శ్రీదేవికి వైఎస్సార్సీపీ చాలా గౌరవం, గుర్తింపు ఇచ్చిందని గుర్తుచేశారు. మొన్నటి వరకూ సోషల్ మీడియాలో ఆమెను తీవ్రంగా ట్రోల్ చేసిన వారి పక్షానే శ్రీదేవి చేరిందని ఎద్దేవా చేశారు. అమరావతిని రాజధానిగా ఉంచడానికి ప్రయత్నిస్తానని శ్రీదేవి చెప్పడం హాస్యాస్పదమన్నారు. ఆమె తెలంగాణ వెళ్లి ప్రెస్మీట్ పెట్టాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. శ్రీదేవి వ్యాఖ్యలు విడ్డూరం: ఆదిమూలపు మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చందంగా శ్రీదేవి వ్యవహరించారని విమర్శించారు. సీఎం జగన్ ప్రభుత్వం దళితులను అవమానిస్తోందని శ్రీదేవి వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. దళితులను అక్కున చేర్చుకున్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని, దళితులు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారన్నారు. చంద్రబాబు వాపును చూసి బలుపు అనుకుంటున్నాడని సురేష్ వ్యాఖ్యానించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయం తథ్యమన్నారు. వారికి పట్టిన గతే వీరికి: నారాయణస్వామి సీఎం జగన్ అండతో గెలిచి ఆయనకు వెన్నుపోటు పొడిచిన వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. గతంలో అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకు పట్టిన గతే ఇప్పుడు అమ్ముడుబోయిన ఎమ్మెల్యేలకూ పడుతుందన్నారు. ఇక స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఆధారాలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబుకు జైలు కూడు తప్పదన్నారు. వారికి రాజకీయంగా పుట్టగతులుండవు: రోజా సీఎం జగనన్న అండతో వైఎస్సార్సీపీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పక్కదారి పట్టిన నలుగురు ఎమ్మెల్యేలకు రాజకీయంగా పుట్టగతులు ఉండవని రోజా అన్నారు. నీచ రాజకీయాలతో నాలుగు సీట్లు గెలిచి ఏదో సాధించినట్లు చంద్రబాబు, ఎల్లో మీడియా చేసే తాటాకు చప్పుళ్లకు భయపడ్డానికి జగనన్న కుందేలు కాదు సింహమన్నారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నానని చెప్పుకునే చంద్రబాబునాయుడు ఏనాడు న్యాయంగా రాజకీయం చేయలేదన్నారు. ఆయన ఎమ్మెల్యేలను కొనగలడేమోగానీ.. కోట్లాదిమంది ప్రజల గుండెల్లో జగనన్నకు ఉన్న అభిమానాన్ని కొనలేడన్నారు. 2019 మాదిరిగానే 2024లో కూడా జగనన్న అదే రీతిలో సమాధానం చెప్పడం ఖాయమన్నారు. ఉండవల్లి శ్రీదేవి కాదు.. ఊసరవెల్లి శ్రీదేవి: అమర్నాథ్ ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉండవల్లి శ్రీదేవి వైఖరి తనకు మొదటి నుంచి అనుమానం కలిగిస్తూనే ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం విశాఖలో అన్నారు. పోలింగ్ సమయానికి ముందు శ్రీదేవి తన కూతురుతో వచ్చి సీఎం జగన్తో ఫొటో కూడా తీయించుకుని సినీనటి శ్రీదేవిని మైమరిపించేలా నటించారన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటువేసి.. ఇప్పుడు దళిత కులం కార్డు అడ్డుపెట్టుకుని అందరి మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నుంచి ముడుపులు తీసుకున్నప్పుడు కులం కార్డు గుర్తురాలేదా? అని అమర్నాథ్ ప్రశ్నించారు. ఇక నుంచి అందరూ ఆమెను ఉండవల్లి శ్రీదేవి అనేకన్నా.. ఊసరవెల్లి శ్రీదేవి అనడం బెటర్ అని ఆయన వ్యాఖ్యానించారు. -
బీసీ వ్యక్తి స్పీకర్ గా ఉంటె చూడలేక దాడి చేయించాడు చంద్రబాబు
-
ఆర్ఆర్ఆర్ టీమ్ కి మంత్రి రోజా అభినందనలు
-
కె విశ్వనాథ్ సేవలు వెలకట్టలేనివి: మంత్రి రోజా
దివంగత టాలీవుడ్ కళాతపస్వి కె విశ్వనాథ్ కుటుంబాన్ని ఏపీ మంత్రి ఆర్కే రోజా పరామర్శించారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివని ఆమె కొనియాడారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్బంగా వారికి ధైర్యం చెప్పారు. అనంతరం కె విశ్వనాథ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ..' విశ్వనాథ్ లేరంటే ఊహించుకోవడమే కష్టంగా ఉంది. ఆయన సినిమా పరిశ్రమకు చేసిన సేవలు వెలకట్టలేనివి. తెలుగు సినిమాల ద్వారా ఆయన సాహిత్యానికి చేసిన సేవ ఇంకెవరూ చేయలేరు. ఆయన సినిమాల్లో తెలుగుదనం, తెలుగు సాహిత్యం, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా చేశారు. ఆయన సినిమాలు ఓ మెసేజ్ అందిస్తాయి. ఒక దర్శకుడిగా, నటుడిగా ఆయన ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపారు. అందరూ ఆదర్శవంతంగా ఆయనను చూసి నేర్చుకునేలా జీవించారు.' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' ఆయనని చూసిన వెంటనే గురువును చూసినట్టే భయం వేస్తుంది. నిజంగా ఆయన జీవితం పరిపూర్ణం. ఈరోజు ఆయన ఆత్మకు శాంతి కలగాలని అందరూ కోరుకోవాలి. తెలుగు నెల ఉన్నంత వరకు తెలుగు వారంతా అభిమానించే విశ్వనాథ్ చిరస్థాయిగా నిలిచిపోతారు. ఆయన తెలుగు సినిమాకు చేసిన సేవను గుర్తించి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు కూడా ఇచ్చి సత్కరించింది. ఆయన కుటుంబానికి భగవంతుడు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నా.' అని అన్నారు. -
అదే ఆమె గొప్పతనం.. మంత్రి రోజాపై కిరణ్ ప్రశంసల వర్షం
ఏపీ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు లలితా జువెలరీస్ ఎండీ కిరణ్. చిత్తూరు జిల్లాలో నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి రోజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశవ్యాప్తంగా బ్రాంచ్లు కలిగిన లలితా జువెలరీస్ తాజాగా 46వ షోరూంను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. 'డబ్బులు ఊరికే రావు' అనే డైలాగ్తో ఫేమస్ అయ్యారు కిరణ్. ఈ సందర్భంగా హాజరైన మంత్రి రోజాను కిరణ్ కొనియాడారు. పిలవగానే వచ్చినందుకు రోజాకు ధన్యవాదాలు తెలిపారు. కిరణ్ మాట్లాడుతూ.. 'మా ఆహ్వానం అందగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఇటీవలే రోజా ఇంటికి వెళ్లి షోరూం ప్రారంభోత్సవానికి పిలిచాం. ఎంతో ఆప్యాయంగా పలకరించారు. మాకు చాలా బాగా మర్యాదలు చేశారు. చాలా సంతోషంగా ఉంది. అది ఆమె గొప్పతనం. మనం పిలిచిన వ్యక్తి గెస్ట్గా వస్తే ఆనందం మాటల్లో వర్ణించలేం.' అంటూ మంత్రి రోజాపై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం రోజా కూడా లలితా జువెలరీస్తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
బాలకృష్ణపై మంత్రి రోజా ఫైర్
-
చంద్రబాబు, పవన్ భేటీపై మంత్రి రోజా ట్వీట్
-
కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలి : మంత్రి రోజా
-
ప్రతిపక్షాలు పసలేని ఆరోపణలు చేస్తున్నాయి : మంత్రి రోజా
-
ప్రతిభ వెలికితీసేందుకు జగనన్న సాంస్కృతిక సంబరాలు
-
నగరి నియోజకవర్గంలో నెరవేరిన పేదల సొంతింటి కల
-
పవన్ వాహనం వారాహి కాదు..అది నారాహి : మంత్రి రోజా
-
రాయలసీమ ద్రోహి..చంద్రబాబు
-
వచ్చే ఎన్నికల్లో టీడీపీకి వచ్చే సీట్లు సున్నా : మంత్రి రోజా
-
‘'శాసనసభ’' విజయం సాధించాలి – మంత్రి రోజా
‘‘శాసనసభ’ టైటిల్ ఆసక్తిగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, నటి రోజా అన్నారు. ఇంద్రసేన, ఐశ్వర్యారాజ్ జంటగా వేణు మడికంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శాసనసభ’. తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 16న రిలీజ్ కానుంది. హైదరాబాద్లో జరిగిన వేడుకలో ఈ సినిమా తెలుగు ట్రైలర్ను రోజా, కన్నడ ట్రైలర్ను తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్కుమార్, మలయాళ ట్రైలర్ను దర్శక– నటుడు చిన్నికృష, తమిళ ట్రైలర్ను నిర్మాత సతీష్ వర్మ విడుదల చేశారు. ఈ సినిమా టైటిల్ సాంగ్ను వైజాగ్ ఎమ్మెల్సీ వంశీకృష యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ– ‘‘నా బ్రదర్లాంటి షణ్ముంగంపై అభిమానం, సంగీత దర్శకుడు రవిబస్రర్ వల్లే నేను ఈ వేడుకకు వచ్చాను. ఈ సినివ హిట్ సాధించి నిర్మాతలు మరిన్ని సినిమాలు తీయాలి’’ అన్నారు. ‘‘ఈ సినివ యూనివర్సల్ సబ్జెక్ట్’’ అన్నారు తుంగతుర్తి ఎమ్మెల్యే గాధరి కిశోర్ కుమార్. ‘‘శాసనసభ’ చాలా స్ట్రాంగ్ టైటిల్’’ అన్నారు ఇంద్రసేన. ‘‘ సురేష్ వర్మ, చిన్నికృష్ణగార్ల ద్వారా ఈ సినిమా చేసే అవకాశం వచ్చింది. అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు’’ అన్నారు వేణు మడికంటి. ‘‘మంచి సబ్జెక్ట్, మంచి కమిట్మెంట్తో ఈ సినిమా తీశాం’’ అన్నారు తులసీరామ్. ‘‘నిర్మాతగా నా లాంంగ్కు ఇంతమం ప్రాజెక్ట్ ఇచ్చిన ఇంద్రసేన, జగదీశ్వర్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డిలకు రుణపడి ఉంటాను’’ అన్నారు షణ్ముగం సాప్పని. సంగీత దర్శకుడు రవి బస్రర్, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రైటర్ రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, యాదవ కార్పొరేషన్ చైర్మన్ హరీష్, నిర్మాత సురేష్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
కూతురి సినీ ఎంట్రీపై స్పందించిన రోజా
ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి, సీనియర్ నటి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే! త్వరలో ఆమె ఓ హీరో తనయుడి సరసన నటించనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఎట్టకేలకు ఈ రూమర్స్పై రోజా నోరు విప్పారు. గురువారం నాడు రోజా బర్త్డే కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'యాక్టింగ్ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్గా ఆశీర్వదిస్తాను. తనకు అండగా నిలబడతాను' అని చెప్పుకొచ్చారు. చదవండి: నా పేరు సూర్య.. ఫస్ట్ చాయిస్ ఎవరో తెలుసా? రాజ్ తరుణ్కు అహ నా పెళ్లంట వెబ్సిరీస్తో అయినా హిట్ దక్కేనా? -
కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించిన మంత్రి రోజా
-
మహేశ్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు దురదృష్టకరం : మంత్రి రోజా
-
పవన్ రోజుకొక స్టేట్మెంట్ తో తెగిన గాలిపటంలా వ్యవహరిస్తున్నాడు : మంత్రి రోజా
-
మేము కన్నెర్ర చేస్తే జనసైనికులు రోడ్లపై తిరగలేరు : మంత్రి రోజా
-
విశాఖ ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తల వీరంగం..
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం ఎయిర్పోర్టు వద్ద జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. కర్రలు, రాళ్లతో దాడులకు తెగబడ్డారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు రోజా, జోగి రమేష్ కార్లపై దాడులకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన కార్యకర్తల తీరుతో ఎయిర్పోర్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గర్జన సభ నుంచి ఎయిర్పోర్ట్కు వెళ్తుండగా జనసేన కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. మంత్రి రోజా సహాయకుడికి గాయాలయ్యాయి. జనసేన కార్యకర్తలు తనపై రాళ్లు, కర్రలతో దాడి చేశారని, ఈ ఘటనలో తమవారికి గాయాలయ్యాయని జోగి రమేశ్ పేర్కొన్నారు. తన కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. గర్జనను పక్కదారి పట్టించేందుకే తాగుబోతులతో తమపై దాడులు చేయించారని ధ్వజమెత్తారు. మాతో పెట్టుకుంటే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో తిరగలేరని హెచ్చరించారు. చదవండి: జన సంద్రాన్ని తలపించిన ‘ విశాఖ గర్జన’ -
పవన్ కుప్పిగంతులు ,పిచ్చి కూతలు ఎవరూ పట్టించుకోరు : మంత్రి రోజా
-
ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదు : మంత్రి రోజా
-
బైక్ నడుపుతూ సందడి చేసిన మంత్రి రోజా
-
2024 జగనన్న వన్స్మోర్ : మంత్రి రోజా
-
కుప్పంలో చంద్రబాబు కోట కూలిపోతోంది
-
భర్త దగ్గరకు వెళ్లొద్దని చెప్పినా వినకుండా వెళ్లి..
చిత్తూరు రూరల్: చిత్తూరు మండలంలోని బీఎన్ఆర్ పేట చెరువులో గుర్తు తెలియని మహిళ శవం ఐదు రోజుల క్రితం లభ్యమైంది. ఆ శవం వీఎన్ఆర్ పురం గ్రామానికి చెందిన మోహన అలియాస్ రోజా(23)గా మంగళవారం తేలింది. దీంతో తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఆర్ పేట పోలీసులు కేసు నమోదు చేశారు. రోజా తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఆమె భర్త ప్రకాష్, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇక మృతదేహాన్ని బుధవారం మధ్యాహ్నం ఆ మహిళ తల్లిదండ్రులకు అప్పగించారు. సాయంత్రానికి జీడీ నెల్లూరు మండలం నల్లరాళ్ల పల్లెలో కుటుంబీకులు అంత్యక్రియలు పూర్తి చేశారు. వద్దన్నా వెళ్లింది రోజా ఇంటినుంచి వెళ్లిన తరువాత జరిగిన సంఘటనలను ఆమె తండ్రి చిన్నబ్బ మందడి మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు, భర్త దగ్గరకు వెళ్లొద్దని తండ్రి చెప్పినా, గత శుక్రవారం ఇంటి నుంచి వీఎన్పురానికి రోజా వెళ్లింది. శుక్రవారం సాయంత్రం నుంచి రోజా కోసం ఆమె భర్తకు ఫోన్ చేస్తే తీయలేదు. మళ్లీ శనివారం ఉదయం ఫోన్ చేస్తే, పనిమీద బయట ఉన్నానని, ఇంటికెళ్లి ఫోన్ చేస్తానని బదులిచ్చాడు. చదవండి: (కులాంతర వివాహంతోనే హత్య) సాయంత్రానికి కూడా ఫోన్ చేయకపోవడంతో ప్రకాష్ తండ్రికి ఫోన్ చేయడంతో అక్కడికి రాలేదని చెప్పాడు. దీంతో బంధువుల ఊర్లలో వెతికినా రోజా ఆచూకీ తెలియలేదు. ఇంటికి తిరిగి వచ్చాక, పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని గ్రామస్తులు తెలపడంతో, బీఎన్ఆర్ పేట స్టేషన్కు వెళ్లారు. అక్కడ వారు చూపించిన టవల్, ఎరుపు రంగు చున్నీ, తాళి బొట్టు, చేతికి ధరించిన దేవుడి దారం, మెడలోని నల్ల పూసల దారంతో రోజాగా గుర్తించారు. ఆమె భర్త చంపేశాడని ఫిర్యాదు చేసినట్లు తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణను కొనసాగిస్తున్న పోలీసులు మరణానికి గల కారణాలను గురువారం వెల్లడించనున్నట్లు తెలిసింది. -
గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని చూసి బోరున ఏడ్చేసిన ఎమ్మెల్యే రోజా
-
కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబుకు మైండ్ పోయింది
-
ప్లేయర్లతో కలిసి సరదాగా వాలీబాల్ ఆడిన రోజా
-
డప్పు వాయించి ఆకట్టుకున్న ఎమ్మెల్యే రోజా
-
ప్రభుత్వంపై చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
-
బద్వేలు ఉప ఎన్నికల్లో వార్ వన్సైడే: ఎమ్మెల్యే రోజా
-
బద్వేలు ఉపఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం
-
అడవికి సింహం రారాజు ఆంధ్రాకి జగనన్న మహారాజు
-
దాసరి సుధను భారీ మెజార్టీతో గెలిపించాలి
-
ప్రజలకు ఎమ్మెల్యే రోజా వినతి
-
ఎమ్మెల్యే రోజా భర్త సెల్వమణి బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు
-
ఘనంగా రోజా భర్త సెల్వమణి బర్త్డే వేడుకలు
Roja Husband Rk Selvamani Birthday Celebrations: నగరి ఎమ్మెల్యే , సినీ నటి రోజా ప్రొఫెషనల్ లైప్లో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ లైఫ్కు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. పండుగలు, ఫంక్షన్లు, కుటుంబ సభ్యుల బర్త్డే వేడుకలకు మిస్ అవ్వకుండా ప్లాన్ చేసుకుంటారు. తాజాగా రోజా భర్త, డైరెక్టర్ ఆర్. కె. సెల్వమణి పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే మై లవ్ అంటూ రోజా ఇన్స్టాగ్రామ్లో ఫోటోలను షేర్ చేసింది. చదవండి: 'రకుల్ పెళ్లి ఆగిపోతుంది.. జైలుకు వెళ్లే అవకాశం'! (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇక కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితుల సమక్షంలో సెల్వమణి బర్త్డే వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. ఈ సందర్భంగా సెల్వమణికి పలువురు సినీ ప్రముఖులు సహా నెటిజన్లు బర్త్డే విషెస్ను తెలియజేస్తున్నారు. చదవండి: నేను అనుకున్నది నిజమైంది.. నా కల నెరవేరింది: సమంత చార్ ధామ్ యాత్ర: ప్రత్యేక పూజలు నిర్వహించిన సామ్ View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) View this post on Instagram A post shared by Roja Selvamani (@rojaselvamani) -
లోకేష్,చంద్రబాబులపై పంచ్ డైలాగ్స్ తో ఫైర్ అయిన రోజా
-
కార్యకర్తలతో కలిసి బైక్ నడిపిన ఎమ్మెల్యే రోజా
-
ప్రజలు టీడీపీ జెండాను పీకిపడేశారు
-
అయ్యన్నపై ఆగ్రహం
-
నేతన్న ల కోసం కొత్త టెక్నాలజీని ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా
-
రోజా ఇంట్లో వినాయకచవితి ఉత్సవాలు
-
మట్టి విగ్రహాలను పూజించండి
-
టీచర్గా మారిన ఎమ్మెల్యే రోజా
-
పిల్లలకు ‘ఆల్ ద బెస్ట్’ చెప్పిన ఎమ్మెల్యే రోజా
-
రాఖీ స్పెషల్ : సెలబ్రిటీల అన్నాచెల్లెళ్లు, అక్కా-తమ్ముళ్లను చూశారా?
-
కార్పొరేట్ విద్యను కామన్ మ్యాన్ దగ్గరకి తెచ్చిన చరిత్ర కారుడు జగన్
-
అమరరాజాది రాజకీయ సమస్య కాదు.. పొల్యూషన్ సమస్య