
అలరించిన ‘సాక్షి’ మెగా ఆటో షో
’సాక్షి’ మెగా ఆటో షో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ మురళీమోహన్ చెప్పారు.
లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ మురళీమోహన్, మేయర్ రజినీ శేషసారుు
సాక్షి, రాజమహేంద్రవరం: అన్ని కంపెనీల వాహనాలను ఒకే చోటుకు చేర్చి కొనుగోలుదారులకు సౌలభ్యంగా ఉండేలా ’సాక్షి’ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మెగా ఆటో షో శనివారం ప్రారంభమైంది. రెండు రోజులపాటు నిర్వహించే ఈ మెగా ఆటో షోను రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్, నగరపాలక సంస్థ మేయర్ పంతం రజినీ శేషసారుు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఇలాంటి మెగా ఆటో షోలు మరిన్ని ఏర్పాటు చేయాలన్నారు. ’సాక్షి’ మొదటిసారి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
కేవలం 30 నిమిషాల్లో తమకు కావాల్సిన వాహనాన్ని సందర్శకులు కొనుగోలు చేసుకునేలా ఈ ఆటో షో ఉందని మేయర్ రజినీ శేషసారుు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ షోలో నగరంలో ఉన్న అన్ని ఫోర్ వీలర్, టూవీలర్ డీలర్లు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన పలువురు వాహనాలను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమంలో ’సాక్షి’ అడ్వర్టరుుజింగ్ ఏజీఎం బి.రంగనాథ్, ఆర్.ఎం.వై.ఎస్.కొండలరావు, రాజమహేంద్రవరం యూనిట్ ఇన్ చార్జ్ వి.వి.శివుడు, అడ్వర్టరుుజింగ్ డిప్యూటీ మేనేజర్ ఎం.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.