తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారి దర్శించుకున్న ప్రముఖులు
Published Sat, Mar 4 2017 10:32 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమమంలో అపోలో ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిలాండం వద్ద ఉన్న బేడీ ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
Advertisement
Advertisement