గిరిజనుల సంక్షేమమే ధ్యేయం | Tribal Welfare Initiative | Sakshi
Sakshi News home page

గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

Published Sat, Dec 27 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM

గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

గిరిజనుల సంక్షేమమే ధ్యేయం

వారి అభివ ృద్ధి కోసం ‘వనబంధు’ పథకం
త్వరలో 10 రాష్ట్రాల్లో పథకం అమలు
కేంద్ర గిరిజన సంక్షేమశాఖా మంత్రి జయోల్ ఉరాం

 
కృష్ణరాజపురం :  అటవీ ప్రాంతాల్లోని గిరిజనుల సంక్షేమం కోసం దేశంలోని ఎంపిక చేసిన 10 రాష్ట్రాల్లో ‘వనబంధు’ పధకాన్ని అమలు చేస్తామని  కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జయోల్ ఉరాం వెల్లడించారు. ఈ పథకానికి సంబంధించిన పూర్తి విధివిధానాలను త్వరలోనే రూపొందిస్తామన్నారు.  వర్తూరు వాగ్దేవి పాఠశాలలో అఖిల భారతీయ వన వాసి క ళ్యాణ ఆశ్రమం ఆధ్వర్యంలో శుక్రవారం  ఏర్పాటు చేసిన 17 వ జాతీయ వనవాసి ఆర్చరీ పోటీలను ప్రారంభించిన ఆయన మాట్లాడారు. గెలుపు-ఓటములతో నిమిత్తం లేకుండా క్రీడల్లో పాల్గొనడం చాలా ముఖ్యమని, దీని ద్వారా ఏకాగ్రత సాధించడానికి సాధ్యమవుతుందని అన్నారు.

ఈ  పోటీల్లో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తిపుర తదితర రాష్ట్రాల క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు నిర్వహిస్తారు. కార్యక్రమంలో  అఖిల భారతీయ వనవాసి కళ్యాణ ఆశ్రమం సహ సంఘటనా కార్యదర్శి అతులజోగ్, ఉపాధ్యక్షుడు జలేశ్వరబ్రహ్మ, గ్లోబల్ ఇంక్ అధ్యక్షుడు సుహాస్ గోపీనాధ్, కిరణ్, వెంకటేశ్‌సాగర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement