ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్యాయత్నం
Published Thu, Nov 24 2016 2:59 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
చీరాల: ఇద్దరు పిల్లలు సహా తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటనలో తల్లి మృతి చెందగా.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేట రైల్వేస్టేషన్ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్షతగాత్రులను చీరాల ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.
Advertisement
Advertisement