బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్ | 1 arrested over secunderabad bay kidnap | Sakshi
Sakshi News home page

బాలుడి కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్ట్

Published Wed, Nov 4 2015 1:37 PM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

1 arrested over secunderabad bay kidnap

సికింద్రాబాద్: నగరంలో కలకలం సృష్టించిన బాలుడి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. కిడ్నాప్‌కు పాల్పడిన నిందితుడు వీరాచారిని బుధవారం అరెస్ట్ చేశారు. వివరాలు.. సికింద్రాబాద్ జనరల్ బజార్‌లో మంగళవారం 14 నెలల బాలుడు పృథ్వి కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ విషయం పై కేసు నమోదు చేసుకున్న మహంకాళి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి ఈ రోజు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

కాగా.. బాలుడి దూరపు బంధువు బాలాచారే ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు అతన్ని విచారించగా రూ. 5 వేలకు బాబును అమ్మేసినట్లు తెలిపాడు. బాబు మెడలో ఉన్న బంగారు గొలుసును కూడా అమ్ముకున్నట్లు చెప్పాడు. మరింత సమాచారం కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement