130 కిలోల గంజాయి పట్టివేత
Published Tue, Jan 26 2016 10:50 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
డిచ్పల్లి: నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా 130 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఓ వాహనంలో తరలిస్తుండగా డిచ్పల్లి మండలం ఇందల్వాయి టోల్ప్లాజా సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Advertisement
Advertisement