హైదరాబాద్, న్యూస్లైన్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం డిగ్రీ కోర్సులో ప్రవేశాలు మంగళవారం నుంచి మొదలవుతాయని విశ్వ విద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులో చేరదలిచిన అభ్యర్థులు ఆన్లైన్లో అడ్మిషన్లు పొందాల్సి ఉంటుందనీ, 2010 నుంచి 2013 వరకు విశ్వ విద్యాలయాలు నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు కూడా 2014-15 విద్యాసంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశాలు పొందవచ్చని తెలిపారు. దీంతో పాటుగా ఇంటర్మీడియెట్, సమానమైన విద్యార్హత గలవారు నేషనల్ ఓపెన్ స్కూలు, ఏపీ ఓపెన్ స్కూలు సొసైటీ కోర్సులో పాస్ అయిన విద్యార్థులు కూడా డిగ్రీ కోర్సులో అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఉన్న ఏదైనా ఏపీ ఆన్లైన్ కేంద్రాల్లో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని సమస్యలు ఎదురైనా 7382929570, 7382929580 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.