హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపింది.
ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 10వ తేదీతో పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. దానిని ప్రస్తుతం 17వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది.
ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు
Published Fri, Oct 10 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM
Advertisement
Advertisement