పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఏఈ మహెమూద్ అలీమండలానికి చెందిన ఓ రైతు నుంచి గురువారం ఉదయం 11గంటల సమయంలో రూ.16,000 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు అతనిని పట్టుకున్నారు.
ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.