హిందువులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం : బీజేపీ | Bjp Alleges Congress Opposing Rammandir | Sakshi
Sakshi News home page

హిందువులకు కాంగ్రెస్‌ వ్యతిరేకం : బీజేపీ

Published Tue, Oct 16 2018 1:44 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Bjp Alleges Congress Opposing Rammandir - Sakshi

బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు (ఫైల్‌ఫోటో)

సాక్షి, హైదరాబాద్‌ : హిందువులకు కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకమని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్‌ రావు ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ నిజస్వరూపం బయటపడిందని, ఆ పార్టీ రామమందిర నిర్మాణానికి వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. పంజాబ్‌ మంత్రి సిద్ధూ దక్షిణ భారతదేశం కంటే పాకిస్తాన్‌ మేలని చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

హిందువులను అవమానించేలా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతుంటే ఆ పార్టీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఆలయాల చుట్టూ తిరిగితే ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు హిందువులు చులకనగా కనిపిస్తున్నారని మండిపడ్డారు.

రామమందిరంపై కాంగ్రెస్‌ వైఖరి ఏంటో వెల్లడించాలని కృష్ణసాగర్‌ రావు డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేతలు దక్షిణ భారతీయులను అవమానించేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. డిసెంబర్‌ ఏడు తర్వాత దక్షిణాదిలో కాంగ్రెస్‌ కనుమరుగవుతుందని చెప్పారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ దమననీతిని గుర్తించి వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement