ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం చోటుచేసుకుంది.
ఇల్లందు(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా):
ఇల్లందు మండలం మాణిక్యారంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు కారులో ఆడుకుంటుండగా డోర్లు లాక్ అయ్యాయి. దగ్గరలో ఎవరూ లేకపోవడంతో ఈ విషయం ఎవరూ గమనించలేదు.
కాసేపైన తర్వాత కుటుంబసభ్యులు గమనించారు. ఈ ఘటనలో విజ్ఞేశ్వరి(5) అనే చిన్నారి మృతి చెందగా..అబిదిక(3) అనే మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.