రేపు కాంగ్రెస్‌ వ్యవసాయ ‘భేటీ’  | Congress Leaders To Discuss Agriculture Issues In Telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 9 2018 3:46 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Congress Leaders To Discuss Agriculture Issues In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో తీసుకురావాల్సిన మార్పులు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై చర్చించేందుకు ఈనెల 10న (బుధవారం) కాంగ్రెస్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది. కాంగ్రెస్‌ కిసాన్‌ సెల్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై ప్రజలు, మేధావులు, నిపుణులతో చర్చించనున్నట్లు సెల్‌ చైర్మన్‌ ఎం.కోదండరెడ్డి సోమవారం వెల్లడించారు. ఏఐసీసీ మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా ఉన్న పంజాబ్‌ మంత్రి మన్‌ప్రీత్‌ బాదల్, రజనీపాటిల్‌లు సమావేశానికి హాజరవుతారని ఆయన తెలిపారు. 10న ఉదయం 10:30 గంటలకు ఇందిరా భవన్‌లో జరిగే ఈ సమావేశానికి వ్యవసాయ రంగంపై ఆసక్తి ఉన్న వ్యక్తులు, సంఘాలు, ప్రతినిధులు హాజరై తమ సూచనలు తెలియజేయవచ్చని వెల్లడించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement