సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర శాసనసభ శుక్రవారం ఆమోదించిన ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఆమోద ముద్ర వేశారు. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదానికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. కాగా, శాసనసభ బడ్జెట్ను ఆమోదించినందున, కేటాయింపులకు అనుగుణంగా సంబంధిత శాఖలు వ్యయం చేయాలని పేర్కొంటూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
ద్రవ్య బిల్లుకు గవర్నర్ ఆమోదం
Published Sun, Nov 30 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM
Advertisement
Advertisement