వ్యవసాయ బావిలో పూడిక తీత పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. డిటోనేటర్ పేలిపోవడంతో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. కరీంనగర్ జిల్లా బోయిన్పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ రైతు పొలంలోని బావిలో పూడికతీత కోసం వలస కూలీ శివరాత్రి శ్రీకాంత్ (20) డిటోనేటర్ అమర్చే క్రమంలో అది చేతిలోనే పేలిపోయింది. తీవ్ర గాయాలతో అతడు మృతి చెందాడు. మృతుడు వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన వ్యక్తిగా తెలిసింది.
డిటోనేటర్ పేలి యువకుడి దుర్మరణం
Published Tue, Apr 12 2016 3:44 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
Advertisement
Advertisement