అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Farmer commits Suicide | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Sat, Jul 4 2015 6:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

Farmer commits Suicide

ఉప్పునూతల (మహబూబ్‌నగర్ జిల్లా) : అప్పుల బాధతో ఒక రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా ఉప్పునూతల మండలం సదగోడు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మల్లారెడ్డి(38) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాది తన మూడు ఎకరాల పొలంతో పాటు, మరో 5 ఎకరాలు కౌలుకు తీసుకొని సేద్యం చేశాడు. ఈ పొలంలో పత్తి, వేరుశనగ పంటలను వేశాడు.

అయితే పంటలు పండక పెట్టుబడులు కూడా రాకపోవడంతో రూ.3లక్షల అప్పు పెరిగిపోయింది. అంతేకాకుండా వర్షాలు లేకపోవడంతో ఈ ఏడాది వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. ఈ క్రమంలోనే మనస్తాపం చెందిన రైతు తన పొలం దగ్గర శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య సువర్ణ, ముగ్గరు కుమార్తెలు ఉన్నట్లు సమాచారం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement