రైతుకు కన్నీళ్లే! | Farmers Getting Tough Time | Sakshi
Sakshi News home page

రైతుకు కన్నీళ్లే!

Published Mon, Mar 18 2019 4:52 PM | Last Updated on Mon, Mar 18 2019 4:56 PM

Farmers Getting Tough Time - Sakshi

తాడూరు శివారులో పశువులకు మేతగా మారిన వరి పంట

సాక్షి, తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో కేఎల్‌ఐ కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు పొలాలను సిద్ధం చేసుకొని వరిని నాటుకున్నారు. కానీ సాగుచేసుకున్న వరి పంటలు తగినంత నీరు అందకపోవడంతో ఎండుముఖం పట్టాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్ర నీటిఎద్దడి ఏర్పడడం, పంటలు ఎండిపోవడంతో గత్యంతరం లేక పశువులకు మేతగా వదిలేస్తున్నారు.

మండల కేంద్రంలో రామస్వామి అనే రైతు కేఎల్‌ఐ నీటితో నిండిన కొత్త చెరువు కింద నీరు వస్తుందని ఆశతో రూ.వేలల్లో వెచ్చించి వరి పంట సాగుచేశాడు. కానీ కాల్వల ద్వారా నీరు రాకపోవడంతో పూర్తిగా ఎండిపోయింది.

దీంతో సాగు చేసిన వరి పంటలు బీటలు వారి ఎండిపోయింది. రెండు తడుల వరకు నీరు ఉంటే కాస్త పంట పండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఆకునెల్లికుదురు, గుంతకోడూరు, అల్లాపూర్‌ గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మరికొన్ని గ్రామాల్లో కాల్వల ద్వారా వస్తున్న నీటిని ఆశించి రైతులు సాగు చేసిన వరి పంట ఎండిపోవడంతో పశువులను మేత కోసం వదిలారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎండిన పంటలను పరిశీలించి నష్టపరిహారం అందించేలా చూడాలని రైతులు కోరుతున్నారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement