nagar kurnool
-
రోడ్డు ప్రమాదంలో ఐపీఎస్ అధికారి దుర్మరణం
నాగర్ కర్నూల్: జిల్లాలోని చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రకు ఐపీఎస్ అధికారి దుర్మరణం చెందారు. అమ్రాబాద్ మండలం శ్రీశైలం హైవేలో పగవరపల్లిదోమల పెంట మధ్యలో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది. అయితే ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, అందులో సుధాకర్ పటేల్ అనే ఐపీఎస్ అధికారి ఉన్నట్లు గుర్తించారు. వీరంతా కారులో మహారాష్ట్ర నుంచి బయల్దేరి శ్రీశైలం వెళుతున్నట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
SLBC: సొరంగంలో సరిగ్గా నెల కిందట..
నాగర్ కర్నూల్, సాక్షి: దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయిన సొరంగం పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనుల సన్నాహాకాల కోసం కార్మికులు, ఇంజినీర్ సిబ్బంది ఉత్సాహంగా లోపలికి వెళ్లారు. బోర్ టన్నెల్ మిషన్ను ఆన్ చేశారు. అంతే.. భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా కాళ్లకు బలం కూడదీసుకుని బయటకు పరుగులు తీశారు. కట్ చేస్తే.. టన్నెల్ ట్రాజెడీ జరిగి నెలకావస్తున్నా ఇంకా ఏడుగురి మృతదేహాల ఆనవాళ్లను కూడా బయటకు తీసుకురాలేకపోయారు... ఫిబ్రవరి 22వ తేదీన నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట శివారులో శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన చోటు చేసుకుంది. ఉదయం 8.30గం. ప్రాంతంలో ప్రమాదం జరగ్గా.. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. ఒక్కొక్కరిగా మొత్తం 42 మందిని సురక్షితంగా మధ్యాహ్నాంలోపు బయటకు తీసుకొచ్చారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది సిబ్బంది కోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఫిబ్రవరి 22వ తేదీన.. ప్రమాదం జరిగిన కొన్ని గంటలకే ఇటు సింగరేణి నుంచి అటు సైన్యం దాకా పలు రాష్ట్రాల నుంచి ప్రత్యేక సహాయక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా చర్యలు చేపట్టాయి. దేశంలోనే అత్యుత్తమ కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల బృందాలు దాదాపు వెయ్యి మందితో మూడు షిఫ్టుల్లో 24 గంటలూ పని చేస్తున్నాయి. అయినా పురోగతి కనిపించడం లేదు.మానవ అవశేషాలను గుర్తించడంలో దిట్ట అయిన కేరళ ప్రత్యేక జాగిలాలు రంగంలోకి దిగినా.. ప్రయోజనం లేకుండా పోయింది!మార్చి 9వ తేదీన ఒక్క మృతదేహాం మాత్రమే దొరికింది. అది గుర్ప్రీత్సింగ్ మృతదేహంగా నిర్ధారించారు. ఎస్ఎల్బీసీలో అనుమానిత ప్రాంతాలుగా D1-D2 మార్క్ చేసి.. విస్త్రతంగా తవ్వకాలు జరుపుతున్నారుమిగతా ఏడుగురి జాడ గుర్తించేందుకు దేశంలోని అత్యుత్తుమ ఏజెన్సీలతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నా పురోగతి కనిపించట్లేదు. ఈ సొరంగం ప్రమాదం దేశంలోనే అరుదైనదిగా నిపుణులు చెబుతున్నారు. భారీగా వస్తున్న ఊటనీరు,బురదతో సహయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. సొరంగంలో 13.85వ కి.మీ. వద్ద పైకప్పు కూలింది. మట్టి, రాళ్లు, బురద, సీసీ సెగ్మెంట్స్, నీరు, టీబీఎం శిథిలాలన్నీ సొరంగంలో 11వ కి.మీ. నుంచి 13.85 కి.మీ. వరకు పేరుకుపోయాయి. నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట వస్తుండటంతో మట్టి తడిసి చాలా గట్టిగా మారింది. తవ్వాల్సిన మట్టి గట్టిగా ఉండటం, పైకప్పు బలహీనంగా ఉండటంతో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సాంకేతికంగా చూసుకుంటే.. లోకో ట్రైన్స్, కన్వేయర్ బెల్టులు, హైకెపాసిటీ పంపులతో నీరు, బురదను బయటకు పంపిస్తున్నా లాభం కనిపించడం లేదు. అడ్వాన్స్డ్ సెంట్ డిటెక్షన్, టన్నెల్ బోరింగ్ మెషిన్.. భారీ ట్రాన్స్ఫార్మర్లను కత్తిరించేందుకు అల్ట్రా థర్మల్ కట్టర్లను ఉపయోగిస్తున్నారు. అయితే రోబో సహయక చర్యలు ప్రారంభం కాలేదు. తమవారు సురక్షితంగా బయటకు వస్తారని ఎదరు చూసిన కుటుంబ సభ్యులకు, బంధువులకు.. గుర్ప్రీత్ సింగ్ మృతదేహాం చూశాక ఆ ఆశలు ఆవిరైపోయాయి. నెల రోజుల తర్వాత కూడా మృతదేహాల కోసం బాధిత కుటుంబాలు టన్నెల్ వద్దే ఎదురుచూపులు చూస్తున్నాయి. -
SLBC: కాంక్రీట్లో కూరుకుపొయిన మృతదేహం గుర్తింపు
Slbc Tunnel Rescue Operation Updates:👉జీపీఆర్, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నేడు రెస్క్యూ ఆపరేషన్లో 130 మంది నిపుణుల బృందం పాల్గొంటున్నారు.👉ఎస్ఎల్బీసీ టన్నెల్లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా 8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్ ఎండ్ పాయింట్లో కీలక స్పాట్స్ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్లో ర్యాట్ హోల్ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.👉కాగా, ఎనిమిది మందిని గుర్తించేందుకు చేపడుతున్న సహాయక చర్యలకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు 13.50 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లిన రెస్క్యూ బృందాలు మిగిలిన 50 మీటర్ల ముందుకు వెళ్లడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. సొరంగంలోకి నీటి ఊట వేగంగా వస్తుండటంతో ప్రత్యేక మోటార్ల ద్వారా నీటిని బయటికి తోడేస్తున్నారు. 👉కన్వేయర్ బెల్ట్ పూర్తిగా మరమ్మతు జరగడంతో.. పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సొరంగంలో పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లు, టీబీఎం విడిభాగాలు (ఇనుము), ఊడిపోయిన కాంక్రీట్ సెగ్మెంట్లను తొలగించే రోబోలు తయారు చేసేందుకు కనీసం వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే రోబోలు సాయం వారం రోజుల తర్వాతే వినియోగంలోకి వస్తోంది. 👉ప్రమాదం జరిగిన సొరంగంలో పరిశోధన చేసేందుకు కేరళ నుంచి వచ్చిన కాడవర్ డాగ్స్ కూడా ఇది వరకు గుర్తించిన డాగ్స్ స్థానాల్లోనే గుర్తించాయి. 13.500 కి.మీ., అవుతల ఒకే దగ్గర ముగ్గురు వ్యక్తుల అవశేషాలు ఉన్నట్లు నిర్ధారించాయి. కారి్మకులు చిక్కుకున్నట్లు డాగ్స్ చూపించిన ప్రదేశాల్లో శనివారం రెస్క్యూ బృందాలు తవ్వకాలు ప్రారంభించాయి. టీబీఎం పరికరాలు గ్యాస్ కట్టర్తో కత్తిరించి లోకో ట్రైన్ ద్వారా సొరంగం బయటికి పంపించారు. కూలిపడిన పైకప్పు మట్టి దిబ్బలను హిటాచీతో ఒకవైపు తరలిస్తున్నారు. రోజుకో బృందాన్ని సింగరేణి నుంచి రప్పించి సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు. సొరంగంలో వస్తున్న దుర్వాసన సహాయక చర్యలకు ఇబ్బంది కలిగిస్తోంది.👉టన్నెల్లో జరిగిన ప్రమాదం జాతీయ విపత్తు అని, అందులో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత ఉపయోగిస్తున్నామని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. శనివారం టన్నెల్ను సందర్శించిన ఆయన రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.👉సొరంగంలో చిక్కుకున్న కార్మికులను గుర్తించేందుకు ఇప్పటి వరకు జరిగిన పురోభివృద్ధి గురించి రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్కుమార్, ఆర్మీ కమాండెంట్ పరీక్షిత్ మెహ్రా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సహాయక చర్యల్లో అవంతరాలను అధిగమిస్తూ వేగంగా ముందుకెళ్తున్నామని, సొరంగం లోపల ఆక్సిజన్ సరిగా లేకపోవడం, నీటి ఊట అధికంగా రావడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. 👉టీబీఎం దృఢమైన లోహ శకలాలు, రాళ్లు, మట్టితో కూరుకుపోయి ఇబ్బందులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగించేందుకు ప్రభుత్వం కృతనిత్చయంతో ఉందన్నారు. రెస్క్యూ ఆపరేషన్లో పనిచేసే కారి్మకులకు, అధికారులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘనాథ్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, మిలటరీ ఇంజినీర్ వికాస్సింగ్, ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్, ఎస్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రభాకర్, సింగరేణి, రైల్వే, ఎన్జీఆర్ఐ, హైడ్రా తదితర బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
SLBC: ఆ ప్రదేశంలో ఆగిన క్యాడవర్ డాగ్స్.. రెస్క్యూ ఆపరేషన్లో కీలక పరిణామం
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో మూడు మృతదేహాల స్పాట్స్ను క్యాడవర్ డాగ్స్ గుర్తించాయి. జీపీఆర్ ద్వారా మార్క్ చేసిన ప్రదేశంలోనే క్యాడవర్ డాగ్స్ ఆగాయి. ఎస్ఎల్బీసీ సొరంగ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల జాడ రెండు వారాలైనా లభించకపోవడంతో రెస్క్యూ ఆపరేషన్లో సాయం చేసేందుకు కేరళ పోలీసు శాఖకు చెందిన కడావర్ డాగ్స్ను రాష్ట్ర ప్రభు త్వం రంగంలోకి దించిన సంగతి తెలిసిందే. కేరళలోని త్రిసూర్ నుంచి రెండు కడావర్ జాగిలాలతోపాటు వాటి శిక్షకులను దోమలపెంటకు రప్పించింది.నేషనల్ డిజా స్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ఎన్డీఎంఏ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి కల్నల్ కీర్తిప్రకాశ్ సింగ్ ఆధ్వర్యంలో రెండు సైనిక హెలికాప్టర్లలో ఆ శునకాలు, శిక్షకులు వచ్చారు. ముందుగా ప్రమాదస్థలం వద్ద పరిస్థితులను పరిశీలించేందుకు కల్నల్ కీర్తి ప్రకాశ్సింగ్తోపాటు కేరళ పోలీసు అధికారి ప్రభాత్ నేతృత్వంలో కడావర్ డాగ్స్ రెస్క్యూ బృందం సొరంగంలోకి వెళ్లింది.శుక్రవారం ఉదయం 7 గంటలకు రెండు కడావర్ డాగ్స్తో కలసి సొరంగంలోని ప్రమాదస్థలం వద్ద కార్మికుల జాడ కోసం సహాయ బృందం గాలింపు చర్యలు చేపట్టింది. గతేడాది కేరళలోని మున్నార్ సమీపంలో పెట్టిముడి వద్ద కొండచరియలు విరిగి మట్టిలో కూరుకుపోయిన నలుగురిని కడావర్ డాగ్స్ గుర్తించగలిగాయి. మట్టిలో 10–15 అడుగుల లోతులో కూరుకు పోయిన మానవ అవశేషాలను ఈ శునకాలు పసిగడతాయి.8 మంది కార్మికుల ఆచూకీ కోసం 14 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అయినా ఇప్పటి వరకు గల్లంతైన వారి జాడ దొరకలేదు.12 విభాగాలకు చెందిన దాదాపు 650 మంది సభ్యులు నిరంతం షిఫ్టుల వారిగా సహయక చర్యల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఇవాళ టన్నెల్లో చిక్కుకున్న వారి అచూకీ కనుగొనేందుకు కేరళ రాష్ట్రం నుంచి ప్రత్యేక శిక్షణ పొందిన రెండు క్యాడవర్ డాగ్స్ను సొరంగంలోకి పంపించారు. ఉదయం ఏడున్నర గంటలకు లోకో ట్రైన్లో వాటిని లోపలికి తీసుకెళ్లారు. తిరిగి మధ్యాహ్నం రెండున్నరకు బయటకు తీసుకొచ్చారు. తప్పిపోయిన వారి ఆనవాళ్లకు సంబంధించి పలు అనుమానిత ప్రాంతాలను డాగ్స్ గుర్తించినట్టు చెబుతున్నారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలపై అధికారులు సమీక్ష చేస్తున్నారు.టన్నెల్లోకి నలుగురు సభ్యులతో కూడిన ఎన్వీ రోబోటిక్ నిపుణుల బృందం వెళ్లింది. వారితో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ కూడా వెళ్లి అందులో అధ్యయనం చేశారు. మరో వైపు కన్వేయర్ బెల్ట్ కూడ పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావటంతో సహయచర్యలు వేగవంతమయ్యాయి. సొరంగంలో కూరుకుపోయిన మట్టి, బురదను తొలగిస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే నిపుణులతో ప్లాస్మాకట్టర్స్ ద్వారా టీబీఎం మిషన్ భాగాలు కట్ చేస్తూ వాటిని లోకో ట్రైన్ ద్వారా బయటికి తీసుకొస్తున్నారు.టీబీఎంపై ఉన్న మట్టిని వాటర్గన్తో తొలగిస్తున్నారు. కాని జీపీఆర్ అనుమానిత ప్రాంతాల్లో జరుపుతున్న తవ్వకాల్లో పెద్దఎత్తున సీఫేజ్ వాటర్ వస్తుండటంతో సహయక చర్యలకు కొంత అవరోధం ఏర్పడుతుంది. మరోవైపు అదనపు మోటార్లు ఏర్పాటు చేసి సీఫేజ్ వాటర్ను త్వరిత గతిన బయటికి పంపే ప్రక్రియను చేపడుతున్నారు. మొత్తంగా టన్నెల్లో ఇరుకున్న వారి ఆచూకీని కనుగొనేందుకు అనేక చర్యలు చేపడుతున్నా ఇప్పటికీ 8 మంది ఆచూకీ దొరకపోవటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. గడచిన 14 రోజులుగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన బాధిత కుటుంబ సభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. -
SLBC టన్నెల్ ప్రమాదం: వీడని ఉత్కంఠ.. 13 రోజులైనా జాడే లేదు
సాక్షి, నాగర్ కర్నూల్/మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికుల వెలికితీతపై ఉత్కంఠ వీడటం లేదు. 13 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా కార్మికుల ఆచూకీ లభించలేదు. మూడు షిప్టుల్లో 24 గంటలూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 13 రోజులు గడుస్తున్నా 8 మంది కార్మికుల ఆచూకీ ఇంకా దొరకలేదు. అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా తవ్వకాలు చేపట్టారు. టీబీఎం మిషన్పై బుర తొలగింపునకు వాటర్ గన్స్ ఉపయోగిస్తున్నారు. రోబోల వినియోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.కాగా, కొన్ని రోజులుగా కష్టపడి పునరుద్ధరించిన కన్వేయర్ బెల్టు మళ్లీ తెగిపోయింది. సొరంగంలోని మట్టి, ఇతర వ్యర్థాలను లోకో ట్రైన్ ద్వారానే తరలిస్తున్నారు. సొరంగం పైకప్పు కూలిన ప్రదేశంలో నీటి ఊట ఏ మాత్రం తగ్గలేదు. టన్నెల్లో ఉబికి వస్తున్న నీటి ఊటతో డ్రిల్లింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, ఇతర సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి. జీపీఆర్ ద్వారా మానవ అవశేషాలను గుర్తించిన ప్రాంతాల్లో బురద, మట్టి ఇతర వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపడుతున్నారు.అయితే సహాయక బృందాల మధ్య సమన్వయం కొరవడటంతో, ఎవరికి వారు ఇక్కడ.. అక్కడ అన్నట్టుగా పనులు చేస్తున్నట్లు తెలుస్తోంది. సహాయక చర్యలు ఇలాగే కొనసాగితే మరో 10 రోజులైనా సొరంగంలో చిక్కుకున్న వారిని బయటికి తెచ్చే పరిస్థితి కనిపించడం లేదు. లోకో ట్రైన్ 13.5 కిలోమీటర్ల వరకు వెళ్తుండటంతో మట్టి, రాళ్లతో పాటు కట్చేసిన టీబీఎం మెషీన్ విడి భాగాలను బయటకు తరలిస్తున్నారు. కాగా, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు వచ్చి వెళ్లిన నాటి నుంచి అధికారుల హడావుడి అంతగా కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను బయటికి తీసుకు రావడం కష్టతరంగా మారుతోంది. టన్నెల్లో దుర్వాసన వస్తుండటంతో సహాయక చర్యలు చేపట్టలేని పరిస్థితిలో సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పేరుకుపోయిన మట్టి, శిథిలాలకు తోడు నీటి ఊట ప్రధాన అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో ఒక అడుగు ముందుకు పడితే.. రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయని రెస్క్యూ బృందాలు వాపోతున్నాయి. గతనెల 22 నుంచి వివిధ విభాగాలకు చెందిన సహాయక బృందాలు సొరంగంలో జల్లెడ పడుతున్నా కార్మికుల ఆనవాళ్లు లభించడం లేదు. సొరంగం కూలిన ప్రాంతంలో భూ ప్రకంపనలకు గల అవకాశాలను నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం పరిశీలించింది. -
SLBC టన్నెల్ నుంచి కొనసాగుతున్న మృతదేహాల వెలికితీత
నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(SLBC) సొరంగం ప్రమాదంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీగా పేరుకుపోయిన బురద నుంచి మృతదేహాలను సహాయక బృందాలు బయటకు తీస్తున్నాయి. ఘటనా స్థలానికి మృతుల కుటుంబ సభ్యులు చేరుకోగా.. వాళ్ల రోదనలతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక.. నాగర్ కర్నూల్ నుంచి ఎనిమిది ఆంబులెన్స్లు టన్నెల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను నేరుగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించనున్నట్లు సమాచారం. అక్కడి గుర్తింపు పరీక్షలు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తయ్యాకే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.మరోవైపు టన్నెల్ వద్దకు ఉస్మానియా ఫోరెన్సిక్ బృందం చేరుకుంది. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్ శ్రీధర్ చారితో పాటు ఇద్దరు సిబ్బంది, మరో ఇద్దరు పీజీ వైద్యులు, నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో ప్రమాద స్థలంలో ఉన్నారు. ఇవాళ ఎలాగైనా మృతదేహాలను వెలికి తీసి.. బంధువులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 22వ తేదీన ఉదయం 8.30గం. ప్రాంతంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి ఆచూకీ లేకుండా పోయిన ఎనిమిది మంది ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం ప్రమాదం జరిగిన స్థలంలో మృతదేహాల అవశేషాలను గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రమాదం జరిగిన స్థలంలో(Zero Spot)లో 200 మీటర్ల పొడవు, 9.2 మీటర్ల ఎత్తులో బురద, మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. జీపీఆర్, అక్వాఐతో బురదలో ఊరుకుపోయిన మృతదేహాల అవశేషాలు బయటపడ్డాయి. దీంతో జేపీ కంపెనీ ఏర్పాటు చేసిన లోకో ట్రైన్ను 13.5 కిలోమీటర్ వరకు తీసుకొచ్చి.. మృతదేహాలను బయటకు తెస్తున్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఎనిమిదో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, ఆర్మీ, నేవీ, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్స్, రైల్వే రెస్క్యూ టీంలు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచి టన్నెల్ నుంచి.. పైపుల ద్వారా భారీగా నీటిని, బురదను డబ్బాల్లో బయటకు పంపుతూనే ఉన్నారు. -
SLBC టన్నెల్ సహాయక చర్యల్లో పురోగతి
నాగర్ కర్నూల్, మహబూబ్నగర్: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో భాగంగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపించినట్లు తెలుస్తోంది.. ఈరోజు(శుక్రవారం) SLBC టన్నెల్లో తప్పిపోయిన 8 మంది కార్మికులు ఆచూకీ కోసం ఆపరేషన్ చేపట్టారు.. ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఆపరేషన్ చేపట్టగా.. కొన్ని మీటర్ల లోతులో శకలాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు.టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్టింగ్ చేశారు. బురద, శిథిలాల తొలగింపు చర్యలు చేపట్టి జీపీఆర్ టెక్నాలజీ ద్వారా కొన్ని శకలాలను గుర్తించారు. అవి మృతదేహాలుగా అనుమానిస్తున్నారు..ఈరోజు కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలించారు. ఈ క్రమంలోనే కొన్ని శకలాలు ఆచూకీ లభించింది. దాదాపు మూడు మీటర్ల లోతు మట్టిలో మెత్తని భాగాలు ఉన్నట్లు గుర్తించారు.జీపీఆర్ టెక్నాలజీ ద్వారా..టన్నెల్ ప్రమాద స్థలంలో రక్షణ చర్యలను వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) ఆపరేషన్ ఆరంభించింది. దీనిలో భాగంగా భూమిలో కూరుకుపోయి ఉంటే వారి స్థితిని తెలుసుకునేందుకు ఆధునాతన టెక్నాలజీ జీరో గ్రావిటీ పెనట్రేటింగ్ రాడార్(జీపీఆర్) టెక్నాలజీ ద్వారా వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు చేసింది. ఈ మిషన్ ఆధారంగా ఎన్జీఆర్ఐ బృందం టన్నెల్ ను పూర్తిగా స్కాన్ చేశారు.మరో రెండు రోజుల్లో పడుతుంది..ఈ టన్నెల్ చిక్కుకున్న వారి సమాచారం కావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి సీఎండీ బలరాం. ఎస్ ఎల్ బి సి టన్నెల్లో చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో రెండు రోజుల సమయం పడుతుంది సీఎం సింగరేణి సిఎండి బలరాం. ఎన్జిఆర్ఐ ద్వారా తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలను దరిదాపుగా గుర్తించారు, కానీ కచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరామన్నారు. అప్పటివరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. -
ఎస్ఎల్బీసీ టన్నెల్ ఆపరేషన్లో ఈరోజు ఏం చేస్తారంటే?
సాక్షి, నాగర్ కర్నూల్, మహబూబ్నగర్: శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడానికి ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికీ 8 మంది ఆచూకీ లభించలేదు. 12 వేర్వేరు విభాగాలతో 600 మంది సహయక చర్యలు చేపట్టారు. టీబీఎం మిషన్ను దక్షిణ మద్య రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్స్తో కట్టింగ్ చేస్తున్నారు. బురద, శిథిలాల తొలగింపు జటిలంగా మారింది. రెండు, మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు.కార్మికుల జాడ కోసం అత్యాధునిక ‘గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ (జీపీఆర్)’ టెస్టులను ప్రభుత్వం చేపట్టింది. ఇందుకోసం జీపీఆర్ పరికరాన్ని గురువారం సొరంగం లోపలికి పంపింది. పైకప్పు కూలిపడ్డ చోట మట్టి, శిథిలాల కింద ఏముందనేది పరిశీలిస్తున్నారు. ఈ సాంకేతికతతో భూమిలో కొంత దూరం వరకు ఏమేం ఉన్నాయో గమనించవచ్చుజీపీఆర్ పరికరం విడుదల చేసే విద్యుదయస్కాంత రేడియో తరంగాలు భూగర్భంలోకి ప్రసరించి... అక్కడున్న వివిధ రకాల రాళ్లు, వస్తువులను తాకి ప్రతిబింబిస్తాయి. ఇలా తిరిగి వచ్చే తరంగాల్లో ఉండే వైవిధ్యాన్ని జీపీఆర్ పరికరానికి ఉండే యాంటెన్నా రికార్డు చేస్తుంది. దీని ఆధారంగా భూగర్భంలో ఉన్న వస్తువుల నమూనా చిత్రాలను జీపీఆర్ పరికరం రూపొందిస్తుంది. అందులో మనిషి ఆకారాన్ని పోలిన చిత్రాలు ఉంటే.. గల్లంతైన కార్మికుల జాడ తెలుసుకోవడం సులువు కానుంది. అదే చోట తవ్వకాలు జరపడం ద్వారా దేహాలను బయటికి తీసుకురావడానికి వీలవుతుంది. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్ పరికరంతో సేకరిస్తున్న చిత్రాలను నిపుణులు నేడు (శుక్రవారం) విశ్లేషించనున్నారు.బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) నిపుణుల పర్యవేక్షణలో.. సొరంగంలోపల మట్టి, బురద, కాంక్రీట్ శిథిలాల తొలగింపు, విరిగిపడిన పరికరాలను గ్యాస్ కట్టర్లతో కట్ చేసే పనులు ప్రారంభమయ్యాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో రెస్క్యూ బృందాలు, కార్మికుల సహాయంతో లోకో ట్రైన్లోని మూడు కోచుల్లో మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తీసుకొచ్చారు. సింగరేణి రెస్క్యూ టీం ఆధ్వర్యంలో సొరంగం పైకప్పునకు రీయిన్ఫోర్స్మెంట్ చేస్తూ మళ్లీ కూలకుండా చర్యలు చేపడుతున్నారు.సింగరేణి మైన్స్ రెస్క్యూ టీం, ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్స్ బృందాలతో మూడు షిఫ్టుల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. మూడు రోజుల్లోగా రెస్క్యూ ఆపరేషన్ను పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇక టన్నెల్లో ఊట నీటిని తొలగించేందుకు డీవాటరింగ్ నిరంతరం కొనసాగుతోంది. ఇప్పటివరకు నాలుగు పంపులతో నీటిని తోడేస్తుండగా, శుక్రవారం మరో రెండు మోటార్లు రానున్నాయి.సొరంగం ఇన్లెట్ నుంచి 13.9 కిలోమీటర్ల లోపల ప్రమాద స్థలానికి రెస్క్యూ టీంలు చేరుకుని, బయటకు వచ్చేందుకు... లోపల ఉన్న శిథిలాలు, మట్టిని బయటికి తెచ్చేందుకు లోకో ట్రైన్ మాత్రమే అందుబాటులో ఉంది. ప్రమాదస్థలం నుంచి శిథిలాలను లోకో ట్రైన్ వరకు చేర్చేందుకు 300 మీటర్ల మేర రెస్క్యూ సిబ్బంది మోసుకెళ్లాల్సి వస్తుండటం కష్టంగా మారింది. కన్వేయర్ పనిచేయకపోవడంతో లోకో ట్రైన్పైనే ఆధారపడాల్సి వస్తోంది. వాస్తవానికి టీబీఎం మెషీన్తోపాటే కన్వేయర్ బెల్టు కూడా పనిచేస్తుంది. టీబీఎం సొరంగాన్ని తొలుస్తూ ఉండగా.. రాళ్లు, మట్టి అంతా ఆ కన్వేయర్ బెల్టు ద్వారా టన్నెల్ నుంచి బయటికి వస్తాయి. ఇప్పుడు టీబీఎం లేకుండా కన్వేయర్ బెల్టును వినియోగంలోకి తేవడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.సొరంగం పైకప్పును పటిష్టం చేయడంతోపాటు సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సింగరేణి గనులకు చెందిన మరో 200 మంది రెస్క్యూ సిబ్బంది శుక్రవారం ప్రమాదస్థలానికి చేరుకోనున్నారు. ఇప్పటికే టన్నెల్ వద్ద వంద మంది వరకు సింగరేణి రెస్క్యూ సిబ్బంది పనిచేస్తున్నారు. వీరికి అదనంగా భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సుశిక్షితులైన సిబ్బందిని రప్పిస్తున్నామని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు. -
టన్నెల్ ప్రమాదం.. వారి పరిస్థితి ఆశాజనకంగా లేదు: మంత్రి జూపల్లి
సాక్షి, నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ సొరంగంలోకి మంత్రి జూపల్లి కృష్ణారావు వెళ్లారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రి.. దాదాపు ఐదు గంటల పాటు సొరంగంలోనే గడిపారు. స్వయంగా సహాయక చర్యల్లో పాలు పంచుకుని తిరిగి బయటికి వచ్చారు. ప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్లో మంత్రి జూపల్లి మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను ఆయన పర్యవేక్షించారు.ప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. ఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్దేశం చేశారు. బయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీ. సొరంగం నుంచి బయటకు వచ్చిన తర్వాత మంత్రి జూపల్లి మీడియాతో మాట్లాడుతూ.. 8 మంది కార్మికుల పరిస్థితి ఆశాజనకంగా లేదన్నారు. కార్మికుల ఆచూకీ లభ్యం కావడానికి మరో రెండు మూడు గంటల సమయం పడుతుందన్నారు.. ‘‘100 మిటర్లలోనే సమస్య ఉంది. నీరు, బురద ఎక్కువగా ఉంది. రాత్రి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది’’ అని మంత్రి పేర్కొన్నారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద 33 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వెళ్లగలిగాయి. 50 మీటర్లకు మించి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది వెళ్లలేకపోతున్నాయి. భారీగా మట్టి, బురద పేరుకోవడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉన్నాయి. ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో నేవీ సిబ్బంది కూడా పాల్గొనున్నారు. రాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు నేవీ బృందం చేరుకోనున్నారు.శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. -
ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బంది
SLBC Tunnel Rescue Operation Updates..👉శ్రీశైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్ఎల్బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 36 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్ప్రమాద స్థలానికి 50 మీటర్ల చేరువగా వెళ్లగలిగిన ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్50 మీటర్లకు మించి ెవెళ్లలేకపోతున్న ఆర్మీ, ఎన్డీఆర్ఎప్, ైహైడ్రా సిబ్బందిాభారీగా మట్టి, బురద ేపేరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకంప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లోకి నేవీ సిబ్బందిరాత్రికి ఎస్ఎల్బీసీ టన్నెల్కు చేరుకోనున్న నేవీ సిబ్బందిసహాయక చర్యలు కొనసాగించాలని సీఎం రేవంత్ ఆదేశం ఎస్ఎల్బీసీ సొరంగంలో మంత్రి జూపల్లి కృష్ణారావుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో కలిసి లోకో ట్రైన్ లో టన్నెల్ లోకి వెళ్లిన మంత్రిమధ్యాహ్నం 1 గంట నుంచి ఆరు గంటలుగా సొరంగంలోనే జూపల్లిప్రమాద స్థలం దగ్గర నుంచి ఇంజనీరింగ్ అధికారులు, ఎజెన్నీ ప్రతినిధులతో ఇంటర్ కాం ఫోన్ లో మాట్లాడిన మంత్రి జూపల్లిస్వయంగా సహాయక చర్యల్లో పాలుపంచుకున్న మంత్రిసోరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు లోపల జరుగుతున్న పనులను పర్యవేక్షిస్తున్న మంత్రిప్రమాదం జరిగిన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రిఇంజనీరింగ్, సహాయక బృందాలకు మంత్రి దిశానిర్ధేశంబయట నుంచి ప్రమాదస్థలికి సొరంగంలో మధ్య దూరం 13.5 కి.మీరెస్క్యూ బృందంలో ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి బృందాలుటన్నెల్ సైట్ దగ్గర 23 మంది ఆర్మీ నిపుణులుఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఆర్మీ బృందాలుప్రమాద స్థలిలో మట్టి, బురద నీరు ఎక్కువగా ఉంది: కలెక్టర్ సంతోష్రెస్క్యూ టీమ్ లోపలికి వెళ్లేందుకు ఆటంకం ఏర్పడిందిభారీ మోటార్ల ద్వారా నీటిని బయటకి పంపుతున్నాంప్రమాదంలో చిక్కుకున్న వారి కనెక్టివిటీ కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ావాడుతున్నాం రేవంత్కు రాహుల్ ఫోన్..SLBC ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన రాహుల్ గాంధీసొరంగం వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి ఆరాదాదాపు 20 నిమిషాలు వివరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివెంటనే ప్రభుత్వం ఎంత త్వరగా స్పందించిందో తెలిపిన సీఎంమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని సంఘటన స్థలానికి చేరుకొని తరలించడం, NRDF, SRDF రెస్క్యూ స్క్వాడ్లను మోహరించామన్న రేవంత్గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం, లోపల చిక్కుకున్న వారి కుటుంబాలకు సహాయ సహకారాలు అందిస్తున్నామన్న సీఎంప్రభుత్వం తీసుకున్న చర్యలు, నిరంతర పర్యవేక్షణను అభినందించిన రాహుల్ గాంధీ మంత్రి ఉత్తమ్ కామెంట్స్.. టన్నెల్ చిక్కుకున్న ఎనిమిది మంది ప్రాణాలు కాపాడేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం. రాత్రి నుంచి కేంద్ర బృందాలు రాష్ట్ర బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. 14 కిలోమీటర్ల మేర లోపలికి వెళ్ళగలిగాం. టెన్నెల్ బోర్ మెషిన్ లోపలి పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు. టన్నెల్ నీటిమయం..ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ సంతోష్, సీనియర్ ఐఏఎస్ శ్రీధర్.మరోసారి తన లోపలికి వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్ బృందం.12వ కిలోమీటర్ నుంచి పూర్తిగా బురదమయం.నీటితో కూడుకున్న టన్నెల్.నీటిని బయటికి తీసేందుకే సమాలోచనలు.నీరంతా బయటకి తోడిన తర్వాతే భవిష్యత్తు సహాయక చర్యలు చేపట్టే అవకాశం.వారంతా ప్రాణాలతో ఉన్నారా? లేదా?లోపలికి ఆక్సిజన్ అందుతోందా?.అనే అనుమానాలు వ్యక్తమువుతున్నాయి. రాత్రి పరిస్థితి ఇది..👉ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిన్న రాత్రి 12 గంటలకు వరకు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 12 కిలోమీటర్ల లోపలికి వెళ్లి పరిస్థితిని అంచనా వేశారు. ఈ సందర్బంగా మోకాళ్ల లోతు బురద ఉన్నట్టు వారు గుర్తించారు. 👉ఇక, ఈ సొరంగానికి ఇన్లెట్ తప్ప ఎక్కడా ఆడిట్ టన్నెళ్లు, ఎస్కేప్ టన్నెళ్లు లేవు. దీనితో ఒక్క మార్గం నుంచే లోపలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. శనివారం సాయంత్రానికి సుమారు 150 మంది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయానికి ఆర్మీ బృందాలు సైతం చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి. చిక్కుకున్నది వీరే.. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న వారి వివరాలు ఇలా ఉన్నాయి. జేపీ సంస్థకు చెందిన మనోజ్కుమార్ (పీఈ), శ్రీనివాస్ (ఎస్ఈ), రోజువారీ కార్మికులు సందీప్సాహు (28), జక్తాజెస్ (37), సంతోష్సాహు (37), అనూజ్ సాహు (25) ఉన్నారు. రాబిన్సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్ (35), గురుదీప్ సింగ్ (40) సొరంగం లోపల విధుల్లో ఉన్నారు. జమ్మూ, పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. బయటపడిన వారు కూడా ఆయా ప్రాంతాలకు చెందిన వారే.మంత్రుల పర్యవేక్షణ..👉మరోవైపు.. దోమలపెంట వద్దకు నేడు మంత్రులు ఉత్తమ్, జూపల్లి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా సహాయక చర్యలను మంత్రులు పర్యవేక్షించనున్నారు.ఇటీవలే పనులు పునః ప్రారంభమై... 👉శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించే ‘ఎస్ఎల్బీసీ’ ప్రాజెక్టులో భాగంగా భారీ సొరంగం నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వైపు (టన్నెల్ ఇన్లెట్) నుంచి టీబీఎం (టన్నెల్ బోరింగ్ మెషీన్)తో ఈ తవ్వకం కొనసాగుతోంది. కొంతకాలం కింద టీబీఎం బేరింగ్ చెడిపోగా పనులు నిలిచిపోయాయి. 👉ఇటీవలే అమెరికా నుంచి పరికరాలు తెప్పించి మరమ్మతు చేశారు. నాలుగైదు రోజుల కిందే పనులను పునః ప్రారంభించారు. ప్రస్తుతం సొరంగం లోపల 14వ కిలోమీటర్ వద్ద పనులు జరుగుతున్నాయి. శనివారం ఉదయం టన్నెల్ ఇన్లెట్ నుంచి 14 కిలోమీటర్ పాయింట్ వద్దకు ప్రాజెక్టు ఇంజనీర్లు, మెషీన్ ఆపరేటర్లు, కార్మీకులు చేరుకున్నారు. నీటి ఊట పెరిగి.. కాంక్రీట్ సెగ్మెంట్ ఊడిపోయి.. 👉శనివారం ఉదయం 8.30 గంటల సమయంలో టన్నెల్లో నీటి ఊట పెరిగింది. దీనితో మట్టి వదులుగా మారి.. సొరంగం గోడలకు రక్షణగా లేర్పాటు చేసిన రాక్బోల్ట్, కాంక్రీట్ సెగ్మెంట్లు ఊడిపోయాయి. పైకప్పు నుంచి మట్టి, రాళ్లు కుప్పకూలాయి. ఒక్కసారిగా భారీ శబ్ధం వినిపించడంతో.. టీబీఎం మెషీన్కు ఇవతలి వైపున్న 50 మంది వరకు కార్మీకులు సొరంగం నుంచి బయటికి పరుగులు తీశారు. మెషీన్కు అవతలి వైపున్న 8 మంది మాత్రం మట్టి, రాళ్లు, శిథిలాల వెనుక చిక్కుకుపోయారు. టన్నెల్లో సుమారు 200 మీటర్ల వరకు పైకప్పు శిథిలాలు కూలినట్టు సమాచారం. వేగంగా సహాయక చర్యలు చేపట్టినా..👉సొరంగం పైకప్పు కూలిన విషయం తెలిసిన వెంటనే.. లోపల చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పైకప్పు కూలిపడటంతో జనరేటర్ వైర్లు తెగిపోవడంతో సొరంగం మొత్తం అంధకారం ఆవహించింది. పైగా 14 కిలోమీటర్ల లోపల ఘటన జరగడం, నీటి ఊట ఉధృతి పెరగడం, శిథిలాలు, బురదతో నిండిపోవడంతో రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందిగా మారింది. -
SLBC టన్నెల్ ప్రమాదం: ఆర్మీని సంప్రదించాం-మంత్రి ఉత్తమ్
నల్లగొండ/నాగర్ కర్నూల్, సాక్షి: శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగ పనుల సన్నాహకాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. బోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన వెంటనే టన్నెల్ పైభాగం ఒక్కసారిగా కుప్పకూలింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో.. ఎడమవైపు సొరంగం 14 కిలోమీటర్ వద్ద శనివారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోపల చిక్కుకుపోయిన సుమారు 40 మంది కార్మికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మరికొందరిని బయటకు తీసుచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.👉సీఎం రేవంత్కు ప్రధాని మోదీఫోన్👉ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా👉అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఆర్మీని సంప్రదించాం: మంత్రి ఉత్తమ్ టన్నెల్ ప్రమాద ఘటన దురదృష్టకరంబోరింగ్ మిషన్ పని మొదలుపెట్టిన తర్వాత ప్రకంపనలు వచ్చాయిటన్నెల్ పూర్తిగా బ్లాక్ అయినట్లు కనిపిస్తోందిటన్నెల్లో 8 మంది చిక్కుకుపోయారుఆ ఎనిమిది మందిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాంఇప్పటికే రెస్క్యూ టీంలు రంగంలోకి దిగాయిఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రప్పిస్తున్నాంఇండియన్ ఆర్మీతో కూడా మాట్లాడాం.. రాత్రికల్లా ఆర్మీ బృందాలు చేరుకుంటాయిటన్నెల్లో ప్రమాదం చోటుచేసుకున్నప్పుడు రంగంలోకి దిగే రెస్క్యూ టీంలతో సంప్రదింపులు జరిపాంఉత్తరాఖండ్లో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు పాల్గొన్న బృందాన్ని కూడా ఇక్కడికి రప్పిస్తున్నాంలోపల చిక్కుకున్నవారిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు మరో ఆరుగురు ఉన్నారుటన్నెల్ ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజినీర్లు, ఆరుగురు జయప్రకాశ్ అసోషియేట్స్ఉద్యోగులు చిక్కుకుపోయారు. 👉సుధీర్ఘ విరామానంతరం తిరిగి ఈ మధ్యే ప్రాజెక్టు పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. నాలుగు రోజుల కిందటే ఈ ప్రాంతంలో పనులు చేపట్టారు. అయితే ఈ ఉదయం 8.20గం. ప్రాంతంలో బోరింగ్ మెషిన్ మొదలుపెట్టగానే.. సొరంగం ఊగిపోయింది. సొరంగ మార్గం వద్ద ఉన్నట్లుండి సుమారు మూడు మీటర్ల మేర సిమెంట్ సెగ్మెంట్స్ కుంగిపోయాయి. దీంతో కార్మికులు, సిబ్బంది లోపలే చిక్కుకుపోయారు.👉నల్లగొండ జిల్లా దేవరకొండ నుంచి SLBC సొరంగ ప్రమాద స్థలానికి బయలుదేరిన ఆరు 108 అంబులెన్సులు. 👉ఎస్ఎల్బీసీ టన్నెల్ సహాయక చర్యలను మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. టన్నెల్ వద్దకు చేరుకున్న సింగరేణి రిస్క్యూ టీం చేరుకోగా.. ప్రత్యేక ఆక్సిజన్ ద్వారా టన్నెల్ లోకి వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. లోపల ఉన్న మరో 8 మందిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అంతకు ముందు.. 👉అధికారులతో మంత్రులు ఘటనపై సమీక్ష జరిపారు. ప్రమాదం జరిగిన దృశ్యం భయంకరంగా ఉందని అధికారులు వాళ్లకు వివరించారు. ఇదీ చదవండి: భూకంపం వచ్చిందన్నట్టుగా ఊగిపోయిన టన్నెల్ప్రమాదంపై కేటీఆర్ స్పందనటన్నెల్ ప్రమాదానికి రేవంత్దే పూర్తి బాధ్యత. సుంకిశాల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే. ఈ ఘటనపై పారదర్శకంగా విచారణ జరిపించాలి.గుత్తా దిగ్భ్రాంతి ఎస్సెల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతిక్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని సూచనతుమ్మల ఆరాSLBC టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సంఘటనపై ఆరాతీసిన మంత్రి తుమ్మలక్షతగాత్రులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరిన మంత్రి తుమ్మలటన్నెల్లోకి నీరు టన్నెల్లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచి పోగా అధికారులు దానిని పునరుద్ధరించారు. అయితే.. ఎస్ఎల్బీసీ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద నాలుగు అడుగుల మేర నీరు చేరింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. సింగరేణి నుంచి రెస్క్యూ టీంను రప్పించే పనిలో అధికారులు ఉన్నారు. బయటకు 42 మంది: మంత్రి జూపల్లిటన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) సాక్షితో చెప్పారు. ఇప్పటిదాకా 42 మంది బయటకు వచ్చారని, ఇంకా ఏడుగురు టన్నెల్లో ఉన్నారని, వాళ్లనూ బయటకు రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారాయన. టన్నెల్ చిక్కుకున్న వాళ్లుపంజాబ్-గురువీర్ సింగ్జమ్ము కశ్మీర్- సన్నీసింగ్జార్ఖండ్- సందీప్, సంతోష్, జట్కా ఇరాన్ఇద్దరు ఏఈలు.. శ్రీనివాసులు, మనోజ్ రూపేణామరొకరి వివరాలు తెలియాల్సి ఉందిమంత్రి ఉత్తమ్ ఏమన్నారంటే..అంతకు ముందు మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. నా దగ్గర ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. ఒక్కసారిగా టన్నెల్లో మట్టి, నీరు వచ్చాయి. లోపల ఇంకా ఎంత మంది ఉన్నారో తెలియదు. మెజారిటీ కార్మికులను మాత్రం బయటకు తీసుకొచ్చాం అని అన్నారు.ప్రమాద సమయంలో టన్నెల్లో ఎంత మంది కార్మికులు ఉన్నారనే దానిపై స్పష్టత కొరవడింది. అధికారులు, మంత్రులు ఒక్కో లెక్క చెబుతున్నారు. అయితే ఆ కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందినవారే!. తొలుత ముగ్గురు కార్మికులను బయటకు తీసుకొచ్చారు. మిలిగిన వాళ్లను ఒక్కొక్కరిగా బయటకు తీసుకొచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వాళ్లలో అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.ఉదయం షిఫ్ట్ కోసం కార్మికులు టన్నెల్లోకి వెళ్లారు. ఉదయం 8.20గం. ప్రాంతంలో ప్రమాదం జరిగింది. కార్మికులను బయటకు తీసుకొచ్చి జెన్కో ఆస్పత్రికి తరలించాం. మిగతావాళ్లనూ బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. :::మీడియాతో ఎస్పీ వైభవ్సీఎం రేవంత్ ఆరాఎస్ఎల్బీసీ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లాలని మంత్రులకు సూచించారు. దీంతో మంత్రి ఉత్తమ్ హెలికాఫ్టర్లో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరో మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి పర్యటన రద్దు చేసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ లక్ష్యంతోనే..నల్లగొండ జిల్లాకు సాగు, తాగు నీరందించేందుకు శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రాజెక్టును రూపొందించారు. 2005లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నాటి వైఎస్సార్ ప్రభుత్వం రూ. 2,200 కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో సుమారు 60 నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. మూలన పడ్డ పనులుఅయితే టన్నెల్ బోరింగ్ మిషన్తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతూ సాగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్ మరమ్మతులకు గురవ్వడం.. నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019 డిసెంబర్ నుంచి మూలపడ్డాయి. అయితే నల్లగొండ మంత్రుల చొరవతో ఈ మధ్యే పనులు మళ్లీ మొదలయ్యాయి. అయితే సుదీర్ఘ విరామానంతరం పనులు జరపడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.ఇప్పటిదాకా ప్రభుత్వాలు ఆరుసార్లు ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాజెక్టు పనుల గడువును పొడిగించాయి. తాజా గడువు కూడా జూన్ 2026 వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచగా.. ఈ మధ్యే మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2,646కోట్లు ఖర్చు చేశారు. -
హైటెక్ కుర్రాడు..! 14 ఏళ్లకే ఆవిష్కరణలు..
ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ఆసక్తి చిన్న వయసులోనే గగన్చంద్రలో మొదలైంది. ఆ ఆసక్తే గగన్ను ఆవిష్కరణల బాటలో నడిపిస్తోంది. ‘హైబ్రీడ్ త్రీ ఇన్ వన్’ సైకిల్ రూపకల్పనతో ప్రశంసలు అందుకుంటున్నాడు....సోలార్ విద్యుత్తు, బ్యాటరీ, అవసరమైనప్పుడు పెట్రోల్తోనూ నడిచే హైబ్రీడ్ త్రీ ఇన్ వన్ సైకిల్కు రూపకల్పన చేశాడు 14 ఏళ్ల గగన్ చంద్ర. ఎలాంటి ఖర్చు లేకుండా బ్యాటరీతో 35 కి.మీ దూరం వరకు ప్రయాణించడంతో పాటు సోలార్ విద్యుత్ సాయంతో రోజంతా ప్రయాణించేలా సైకిల్ను రూపొందించాడు.సాధారణ సైకిల్కు ఎలక్ట్రికల్ బ్యాటరీ, సోలార్ ప్యానెల్, హబ్ మోటారును అమర్చి హైబ్రీడ్ సైకిల్ను తయారుచేశాడు. ఈ సైకిల్కు డిజిటల్ స్పీడో మీటర్, సెంట్రల్ లాక్ సిస్టమ్ తోపాటు నావిగేషన్, జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశాడు. అధునాతన వాహనాల మాదిరిగానే ఈ సైకిల్కు ఉన్న జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచైనా ట్రాకింగ్ చేయవచ్చు. మొబైల్ వాయిస్ కమాండ్, అలెక్సా ద్వారా మ్యూజిక్, కాల్స్ ఆపరేట్ చేసేలా సైకిల్ను రూపొందించాడు. సైకిల్లో కంట్రోల్ బాక్స్ను గగన్ సొంతంగా తయారుచేశాడు. అవసరమైన సామాగ్రిని ఆన్లైన్లో కొనుగోలు చేశాడు. మొత్తం రూ. 20వేల వరకు ఖర్చయిందని, భవిష్యత్తులో ఈ ఖర్చును మరింత తగ్గిస్తాను అంటున్నాడు గగన్.నల్లమల అటవీ ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లాలోని బల్మూరు మండల కేంద్రానికి చెందిన గౌరమోని గగన్ చంద్ర 9వ తరగతి విద్యార్థి. ఇటీవల పుదుచ్చేరిలో నిర్వహించిన ‘సదర్న్ ఇండియా సైన్స్ ఫేర్’లో మూడో బహుమతి అందుకున్నాడు. వివిధ రాష్ట్రాల నుంచి 250 మంది ఈ సైన్స్ ఫేర్లో పాల్గొన్నారు. ఫిబ్రవరిలో నిర్వహించనున్న జాతీయస్థాయి సైన్స్ ఫేర్కు ఎంపికయ్యాడు.‘నా కొడుకు రెండో తరగతి నుంచే పాత వస్తువులతో ప్రయోగాలు చేసేవాడు. వాడి పడేసిన వస్తువులతో లైట్లు, మోటార్లు, కూలర్లు తయారు చేసేవాడు. ఇల్లు చిన్నగా ఉండటంతో వాటిని పడేసేదాన్ని. అప్పుడప్పుడూ కోపడ్డాను. ఇప్పుడు అందరూ మెచ్చుకుంటుంటే సంతోషంగా ఉంది’ అంటుంది గగన్ తల్లి నాగరాణి.ఇక ఎలక్ట్రికల్ కారు ఎలక్ట్రికల్ సైకిల్ కొనేందుకు వెళ్తే అరవై వేలు చెప్పారు. దాంతో నేనే ఇరవై వేలతో సొంతంగా తయారుచేసుకున్నాను. విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంకా తక్కువ ఖర్చులో అయ్యేలా చూస్తాను. భవిష్యత్తులో ఎక్కువ మంది ప్రయాణించేలా, తక్కువ ఖర్చులో ఎలక్ట్రికల్ కారును రూపొందించాలనుకుంటున్నాని చెబుతున్నాడు గగన్ చంద్ర.–పాదం వెంకటేశ్, సాక్షి, నాగర్కర్నూల్ (చదవండి: ఊబకాయం సమస్యకి వంటనూనె కారణమా..? మోదీ అందుకే అలా ..) -
‘మైనింగ్’ అనుమతులు రద్దు చేయండి
బల్మూర్/వెల్దండ: మైనింగ్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని మైలారం గ్రామస్తులు పురుగుమందు డబ్బాలతో రోడ్డెక్కారు. వివరాల్లోకి వెళితే.. మైలారం గుట్టపై సర్వే నంబర్ 121లోని 35 ఎకరాల్లో మైనింగ్ తవ్వకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ సోమవారం నుంచి గ్రామంలో రిలే దీక్షలు చేపట్టేందుకు గ్రామస్తులు సిద్ధమయ్యారు. అయితే దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు కొందరిని ముందస్తుగా అరెస్టు చేశారు. మరోవైపు గ్రామస్తుల ఆందో ళనకు మద్దతు ప్రకటించేందుకు, మైలారం గుట్టను పరిశీలించడానికి ప్రొఫెసర్ హరగోపాల్, పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వస్తుండగా.. వెల్దండలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించారు.దాదాపు గంటసేపు వారిని స్టేషన్లోనే ఉంచారు. విషయం తెలియగానే కోపోద్రిక్తులైన గ్రామస్తులు ప్రధాన రహదారిపై ముళ్ల కంచె వేసి పురుగుమందు డబ్బాలతో ఆందోళనకు దిగారు. అక్రమంగా అరెస్టు చేసిన తమ గ్రామస్తులను విడుదల చేయడంతోపాటు గ్రామానికి ఎమ్మెల్యే వచ్చి..మైనింగ్ అనుమతులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించాలని డిమాండ్ చేశారు. గుట్టపై ప్రజాభిప్రాయం లేకుండానే మైనింగ్ తవ్వకాలకు అధికారులు ఎలా అనుమతులు ఇస్తారని నిలదీశారు. ఆరు గంటలపాటు ఉద్రిక్తత ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. సీఐ రవీందర్, ఎస్ఐ రమాదేవి ఆధ్వర్యంలో లింగాల, ఉప్పునుంతల, అమ్రాబాద్, అచ్చంపేట, సిద్దాపూర్ పోలీసులు అక్కడకు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. గ్రామస్తులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. మైలారం గ్రామం మీదుగా అప్పాయిపల్లి, అంబగిరి, చెన్నంపల్లి గ్రామాలకు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. మధ్యాహ్నం తర్వాత గ్రామానికి చెందిన మైలారం గుట్ట పోరాట సమితి అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, లింగయ్యగౌడ్, లక్ష్మయ్య, సుమిత్ర తదితరులను పోలీసులు విడుదల చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.ఖనిజ లవణాలపై గద్దల్లా వాలుతున్నారు: ప్రొఫెసర్ హరగోపాల్దేశవ్యాప్తంగా ఖనిజ, లవణాలను తవ్వేందుకు గద్దల్లా వాలిపోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ప్రకృతిని నాశనం చేసే మైనింగ్ తవ్వకాలను ప్రభుత్వాలు నిలిపివేయకుండా వ్యాపారులకు మద్దతు తెలపడం ఏమిటని ప్రశ్నించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చి అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ ప్రకృతిని నాశనం చేయడం వల్ల భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందడం కష్టంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం పునరాలోచించి మైలారంలో మైనింగ్ తవ్వకాలను నిలిపివేయాలన్నారు. ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం తగదని చెప్పారు. -
కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. -
సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి.. అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
సాక్షి నాగర్ కర్నూలు: కొండాపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పర్యటించారు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామానికి వచ్చారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామపంచాయితీ కార్యాలయం, గ్రంథాలయం, పశువైద్యశాల, బీసీ కమ్యూనిటీ హాల్ను ఆయన ప్రారంభించారు. నాలుగు వరుసల బీటీ రోడ్డు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మిల్క్ బల్క్ కూలింగ్ సెంటర్ పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు.కాగా, సీఎం రేవంత్రెడ్డి గత 20 ఏళ్లుగా దసరా పండుగ రోజు స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలో గ్రామస్తులతో కలిసి జమ్మికి వెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి వేడుకలకు ముఖ్యమంత్రి హోదాలో రావడం విశేషం. సీఎం సొంత ఇంటి నుంచి జమ్మి చెట్టు వరకు రోడ్డును ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ లైట్లను అమర్చారు. -
శ్రీశైలం వెళ్తున్నారా.. ఎస్పీ విజ్ఞప్తి ఇదే
నాగర్ కర్నూలు, సాక్షి: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం వెళ్లే ప్రధాన రహదారి నల్లమల అటవీ ప్రాంతంలో అక్కడక్కడ డ్యామేజ్ అయింది. దీంతో వాహనాలు వెళ్ళడానికి అవకాశం లేకుండా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, వివిధ జిల్లాల నుంచి వయా కల్వకుర్తి, అచ్చంపేట మీదుగా శ్రీశైలం వెళ్లే భక్తులు కొన్ని రోజులపాటు తాత్కాలికంగా తమ దర్శన కార్యక్రమాలను వాయిదా వేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సూచించారు. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను వెళ్దండ మండలం కోట్రా జంక్షన్ వద్ద, వంగూరు మండలం కొనేటిపురం టోల్ ప్లాజా దగ్గర ఆపివేయడం జగురుతుందని తెలిపారు. కాబట్టి శ్రీశైలం వెళ్లే భక్తులు, వాహనదారులు ఈ విషయంలో పోలీసువారికి సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.మరోవైపు.. భారీ వర్షాలతో నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనులు కల్వర్ట్ దగ్గర వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. నీళ్లలో కొట్టుకుపోతున్న వ్యక్తిని పోలీస్ కానిస్టేబుల్స్ తకిఖాన్, రాము కాపాడారు. జిల్లాలోని కోడెర్లో భారీ వర్షానికి ఇంటి మిద్దె కూలిపోయింది. ఇంటిలో ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బిజినపల్లి మండలం లట్టుపల్లి సమీపంలో కేఎల్ఐ కాలువ తెగటంతో వందలాది ఎకరాల పంటలు నీట మునిగింది. -
'కల్కి' దర్శకుడి భారీ సాయం.. ఏకంగా రూ.66 లక్షలు!
'కల్కి' సినిమాతో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ భారీ సాయం చేశాడు. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కిలో ఆఫర్.. రిజెక్ట్ చేశా: కీర్తి సురేశ్)ఈ క్రమంలోనే అదనపు గదులు నిర్మించేందుకు దాదాపు రూ.66 లక్షల మేర ఖర్చయినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ మరింత సహాయం చేయడానికి తమ కుటుంబం ఎప్పుడు ముందుంటుందని నాగ్ అశ్విన్ చెప్పాడు. తాజాగా ఈ గదుల ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో కలిసి నాగ్ అశ్విన్ హాజరయ్యాడు.'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్.. 'మహానటి' మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఈ మధ్య 'కల్కి'తో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. (ఇదీ చదవండి: హాలీవుడ్ సినిమాకు షారూఖ్ ఫ్యామిలీ మాట సాయం) -
నాగర్ కర్నూల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
నాగర్ కర్నూలు, సాక్షి:నాగర్ కర్నూలు జిల్లా ఘోర రోడ్డ ప్రమాదం చోటచేసుంది. ఆదివారం ఉదయం అమ్రాబాద్ మండలం మన్నునూర్ సమీపంలో అదుపుతప్పిన కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలు కాగా, అచ్చంపేట ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించారు. అనతతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. -
మేడి పండే కాదు, మేడి కల్లు కూడా సూపర్
-
TG: ‘ఘంటసాల’ విగ్రహాన్ని ఆవిష్కరించిన డీఆర్డీవో మాజీ చైర్మన్
సాక్షి,మహబూబ్నగర్:డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీవో) మాజీ చైర్మన్ డాక్టర్.జిసతీష్రెడ్డి బుధవారం(మే29) తెలంగాణలోని నాగర్కర్నూల్ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత జిల్లాలోని దిండి చింతపల్లి గ్రామంలో ప్రముఖ సంగీత దర్శకులు, నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర్రావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం అదే గ్రామంలో శంకర నేత్రాలయ ఐ సర్జరీ క్యాంపులో జరిగిన ఫేర్వెల్ వేడుకలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. -
నాగర్ కర్నూల్: ఈదురుగాలుల బీభత్సం.. గోడ కూలి నలుగురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: తాడూరు మండలం ఇంద్రకల్లో విషాదం చోటుచేసుకుంది. అకాల వర్షం కూలీ కుటుంబాల బతుకులను చేసింది. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఆదివారం సాయంత్రం అకాలంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలుల తాకిడికి గ్రామంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల షెడ్డు కూలి నలుగురు మృత్యువాత పడగా మరో ఇద్దరి కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.ఇంద్రకల్ గ్రామంలో కోళ్ల ఫారం నిర్మాణానికి 6 మంది కూలీలు వెళ్లారు. గోడలు కడుతుండగా ఈదురుగాలతో కూడిన వర్షం కురిసింది పని ముగించుకొని నిర్మాణంలో ఉన్న గోడ పక్కనే కూర్చున్నారు. తీవ్రమైన ఈదురుగాలులతో ఒక్కసారిగా గోడకూలి కూలీలపై పడింది. దీంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే మృత్యువాత పడగా మరో ఇద్దరు కూలీలకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
ఆ నాలుగు ఎంపీ స్థానాల్లో విజయంపై బీఆర్ఎస్ ధీమా..
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఎన్ని స్థానాలు గెలుస్తుంది? ఏయే అంశాలు ఆ పార్టీకి కలిసొస్తాయని భావిస్తున్నారు? అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి మారిన తర్వాత బీఆర్ఎస్ బలం పెరిగిందా? మరింత తగ్గిందా? అసలు గులాబీ శ్రేణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ఇవన్నీ ఈ స్టోరీలో తెలుసుకుందాం..అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలపై మాత్రం చాలా ఆశలే పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను లోక్ సభకు చేయకుండా చర్యలు తీసుకుంది. పోటీ చేసే అభ్యర్థులను దాదాపు మెజార్టీ స్థానాల్లో మార్చింది. ముఖ్యంగా నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్, సికింద్రాబాద్ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తోంది. అసలెందుకు ఈ స్థానాల్లో ఆ పార్టీ ఆశలు పెట్టుకుందంటే అందుకు రకరకాల ఈక్వేషన్స్ ఉన్నాయంటోంది ఆపార్టీ. నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో కాస్ట్ ఈక్వేషన్ ఎక్కువగా పనిచేస్తుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆర్ ఎస్ ప్రవీణ్ మాజీ పోలీస్ అధికారి స్థానికంగా బలం ఉంది. అదీకాక నియోజకవర్గంపై పట్టుకుంది. ఇక కాంగ్రెస్ నుంచి పోటీ చేసే వ్యక్తి మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ గెలిచే అవకాశం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. సికింద్రాబాద్ విషయానికి వస్తే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు స్థానికంగా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి పద్మారావు గౌడ్. అంతే కాకుండా బీజేపీఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి స్థానికంగా అందుబాటులో ఉండకపోవడం, అభివృద్ది సరిగా చేయలేదన్న విమర్శలు బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలని ఆపార్టీ అంచనా వేస్తోంది.పెద్దపల్లి లో కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని గులాబీ పార్టీ అంచనాలు వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుండి పోటీ చేసి ఓడిన కొప్పుల ఈశ్వర్ కచ్చితంగా ఇక్కడ గెలుస్తారని భావిస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మూడో వ్యక్తికి అవకాశం ఇవ్వడం పై కొంత జనంలో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అందుకే పెద్దపల్లిలో పార్టీ గెలుస్తుందని ఆశలు పెట్టుకుంది. మెదక్పాలో ర్టీ సంస్థాగతంగా బలంగా ఉండటం తో పాటు, ఇక్కడ కొన్ని సిట్టింగ్ స్థానాలు ఉండటం పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిద్దిపేట గజ్వేల్ లో భారీగా ఓట్లు పడి మెజారిటీ ఎక్కువ వస్తుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. ఇవి కాకుండా మరికొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చి అవకాశం కూడా ఉందని అంచనా వేస్తోంది. గెలవక పోయిన వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మల్కాజ్ గిరిలో రెండో స్థానంలో ఉండే అవకాశాలున్నాయని బీఆర్ఎస్ పార్టీ అంచనా వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలపై ఇలానే లెక్కలేసుకున్న బీఆర్ ఎస్ పార్టీకి ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు తెలంగాణ ప్రజలు కట్టబెడతారన్నది జూన్ 4న తేలనుంది. -
డీకే అరుణతో నాకు పోటీ ఏంటి? పొంతనేంటి?: సీఎం రేవంత్
సాక్షి, నాగర్ కర్నూల్: లోక్సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కొడంగల్ను దొంగ దెబ్బ తీయాలని బీజేపీ, బీఆరెస్ నాయకులు కుట్ర చేస్తున్నారని.. ఈ కుట్రలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. నారాయణ పేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీజేపీ నేత, మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్ధి డీకే అరుణపై సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మంత్రిగా ఉండి నారాయణపేట ఎత్తిపోతల రాకుండా అడ్డుకున్న డీకే అరుణ.. నేడు మళ్లీ ఓట్లు అడగడానికి వస్తున్నారని మండిపడ్డారు. తనను అవమానించానని డీకే అరుణ మాట్లాడుతున్నారని.. శత్రువు చేతిలో చుర కత్తిగా మారి పాలమూరు కడుపులో ఎందుకు పొడుస్తున్నవని మాత్రమే తాను ప్రశ్నించినట్లు పేర్కొన్నారు. నరేంద్రమోదీ చేతిలో కత్తిగా మారి పాలమూరు కడుపులో పొడవద్దని అన్నారు. ‘కొడంగల్ నియోజకవర్గంలో మీరు నాటిన మొక్క ఇవాళ మీ ఆశీర్వాదంతో తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయికి చేరుకుంది. కొడంగల్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి, ముఖ్యమంత్రి పదవి ఏక కాలంలో ఇచ్చిన ఘనత సోనియమ్మది. చేయి చాచి అడిగే పరిస్థితి నుంచి ఇవాళ ఎవరికి ఏం కావాలో ఇచ్చే స్థాయికి కొడంగల్కు కాంగ్రెస్ అవకాశం ఇచ్చింది. మీరే కథానాయకులై నన్ను 33 వేల మెజారిటీతో గెలిపించారు. పాలమూరు బిడ్డలు నూటికి నూరు శాతం నాకు అండగా నిలబడ్డారు. అలాంటి నాకు నీ మీద అసూయ ఎందుకుంటుంది.? ఎందుకు కోపం ఉంటుంది.? నాకు నీకు పోటీ ఏంటి..? పొంతనేంటి..? ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు. ప్రత్యర్ధులు లేరు. పాలమూరు అభివృద్ధి కోసమే నా తపనంతా. 70ఏళ్ల తరువాత పాలమూరుకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నాకు అండగా నిలబడండి. పాలమూరును రాబోయే వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేసి చూపిస్తా. పార్టీలకు అతీతంగా ముందుకు రండి.పాలమూరు అభివృద్ధి చేసి చూపిస్తా. వందరోజుల్లోనే మమ్మల్ని కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. పదేళ్లు ప్రజలను మోసం చేసిన నిన్ను చెంపలు వాయించాలి. తాగుబోతు కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. రూ. 3,900 కోట్ల లోటు బడ్జెట్తో నేను సీఎంగా బాధ్యత తీసుకున్నా. నేను వచ్చాక నాలుగు నెలలల్లో 26వేల కోట్లు వడ్డీలు కట్టా. అసెంబ్లీకి రా నేను లెక్కలు చూపిస్తా. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. రూ.10లక్షల వరకు ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం అందిస్తున్నాం. రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తూ... 45 లక్షల ఇళ్లల్లో వెలుగు నింపుతున్నాం. సేవాలాల్ సాక్షిగా పంద్రాగస్టులోగా రూ.2లక్షలు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అని హరీష్ మాట్లాడుతున్నాడు. ఈ వేదికగా నేను హరీష్ రావుకు సవాల్ విసురుతున్నా. పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తే నీ పార్టీని రద్దు చేసుకుంటావా? ఈ సవాల్కు హరీష్ సిద్ధమా.? నేను మాట ఇస్తే ఎలా ఉంటుందో పోయి మీ మామను అడుగున. బీజేపీ నేతలకు పిచ్చి ముదిరి మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. వారి మాయలో పడొద్దు. కొడంగల్ నుంచి వంశీచంద్ రెడ్డికి 50వేల మెజారిటీ ఇవ్వండి’ అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. -
తెలంగాణకు ప్రధాని రాక.. నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలు నేపథ్యంలో... తెలంగాణలో బీజేపీ తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో వరుసగా శుక్ర, శని, సోమవారాల్లో వివిధ చోట్ల బహిరంగసభలు, రోడ్షోల్లో పాల్గొంటారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్కు రానున్న మోదీ రాత్రికి రాజ్భవన్లో బసచేయనున్నారు. శనివారం ఉదయం నాగర్కర్నూల్లో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. మళ్లీ 18న జగిత్యాలలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శుక్ర, శనివారాల్లో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడవచ్చనే అంచనాల మధ్య ప్రధాని పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. మోదీ ఇప్పటికే ఈ నెల 4న ఆదిలాబాద్లో, 5న పటాన్చెరువులో రూ.15వేల కోట్ల పైచిలుకు విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందా లేదా అన్న దానితో నిమిత్తం లేకుండా మోదీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు కొనసాగుతాయని పార్టీ వర్గాల సమాచారం. ఇదీ మోదీ షెడ్యూల్... ► శుక్రవారం సాయంత్రం 4.50 గంటలకు కేరళ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకు... ► రోడ్డుమార్గాన మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలోని రోడ్డుషో స్టార్టింగ్ పాయింట్కు... ► సాయంత్రం 5.15 గంటల నుంచి 6.15 గంటల వరకు మల్కాజిగిరిలో రోడ్డుషో ► రోడ్డుమార్గాన 6.40 గంటలకు రాజ్భవన్కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస ► శనివారం ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 11.50 గంటలకు నాగర్కర్నూల్కు చేరుకుంటారు ► మధ్యాహ్నం 12 నుంచి 12.45 గంటల దాకా అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు ► ఒంటిగంటకు నాగర్కర్నూల్ నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 2.05 గంటలకు కర్ణాటకలోని గుల్బర్గాకు బయలుదేరుతారు. ► తిరిగి 18వ తేదీ రాష్ట్రానికి వస్తారు. ఆ రోజు షెడ్యూల్ అధికారికంగా విడుదల కావాల్సి ఉంది. ఔ నేడు, రేపు ట్రాఫిక్ ఆంక్షలు ప్రధాని మోదీ రెండు రోజుల నగర పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ విభాగం తెలిపింది. శుక్రవారం సాయంత్రం 4.40 నుంచి 7 గంటల మధ్య బేగంపేట, పీఎన్టీ జంక్షన్, రసూల్పురా, సీటీఓ, ప్లాజా, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ఎక్స్రోడ్డు, ఆలుగడ్డ బావి, మెట్టుగూడ, రైల్వే హాస్పిటల్, మెట్టుగూడ రోటరీ, మీర్జాలగూడ టి–జంక్షన్, మల్కాజిగిరి ఆర్చి, లాలాపేట్, తార్నాక, గ్రీన్ల్యాండ్స్, మోనప్ప జంక్షన్, రాజ్భవన్, ఎంఎంటీఎస్ జంక్షన్, వీవీ విగ్రహం మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని పేర్కొంది. ఆయా మార్గాల్లో వెళ్లేవారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించింది. అదేవిధంగా శనివారం ఉదయం 10.40 నుంచి 11.15 గంటల మధ్య ప్రధానమంత్రి రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి వెళ్తారు. ఆ సమయంలో వీవీ విగ్రహం, మెట్రో రెసిడెన్షీ లేన్, ఎంఎంటీఎస్ రాజ్భవన్, పంజగుట్ట, గ్రీన్ల్యాండ్స్, హెచ్పీఎస్ ఔట్ గేట్, బేగంపేట ఫ్లైఓవర్, పీఎన్టీ ఫ్లైఓవర్, ఎయిర్పోర్ట్ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వివరించింది. మోదీ రాక.. భద్రత కట్టుదిట్టం ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశా రు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆ«దీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. ప్రధాని పయనించే మార్గాల్లో పోలీసులు గురువారం ట్రయల్ రన్ నిర్వహించారు. నేడే మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్భవన్కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. సాక్షి, సిటీబ్యూరో, మల్కాజిగిరి/ సనత్నగర్: మల్కాజిగిరిలో నేడు సాయంత్రం 5.15 గంటలకు జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోడ్షోకు సర్వం సిద్ధమైంది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ మరి కొద్దిరోజుల్లో వెలువడనున్న తరుణంలో ప్రధానమంత్రి రోడ్ షో బీజేపీ శ్రేణుల్లో జోష్ నింపనుంది. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని పార్టీ నేతలు మల్కాజిగిరిలో రోడ్షో ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేసేందుకు సన్నాహాక సమావేశాలు ఇ ప్పటికే ఏర్పాటు చేశారు. రోడ్ షో ఇలా... ► ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి సాయంత్రం 5.15 గంటలకు ప్రారంభం కానున్నది. ► సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్షో జరుగుతుంది. ► మల్కాజిగిరి చౌరస్తాలో కార్నర్ మీటింగ్కు ఏర్పాటు చేశారు. అక్కడ మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ► దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ► ప్రజలతోపాటు పార్టీ నాయకులు స్వాగతం పలికేందుకు రోడ్డుకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ► రోడ్షోలో భాగంగా సుమారు ముప్ఫై కార్లతో కాన్వాయి ట్రయల్ రన్ నిర్వహించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన భద్రతాచర్యల్లో భాగంగా రోడ్ షో జరిగే ప్రాంతం చుట్టూ నిషేధాజ్ఞలు విధిస్తూ కమిషనర్ తరుణ్ జోషి ఉత్తర్వులు జారీ చేశారు. ఎయిర్ బెలూన్లు, రిమోట్ కంట్రోల్ డ్రోన్లు, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, ప్యారా గ్లైడింగ్లను నిషేధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రోడ్ షో ముగిసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. రహదారి మళ్లింపులు ఇలా.. ► మెట్టుగూడ నుంచి మీర్జాలగూడ క్రాస్ రోడ్, నేరేడ్మెట్ వైపునకు వచ్చే ప్రయాణికులు శాంతినగర్ టీ జంక్షన్ వద్ద మళ్లించి, లాలాపేట మీదుగా జెడ్టీసీ, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్ మీదుగా నేరేడ్మెట్కు చేరుకోవాలి. ► నేరేడ్మెట్, వినాయక్నగర్, సఫిల్గూడ జంక్షన్ మీదుగా మల్కాజ్గిరి క్రాస్ రోడ్స్కు వచ్చే వాహనదారులు ఆనంద్బాగ్ క్రాస్ రోడ్స్ వద్ద మలుపు తీసుకొని ఉత్తమ్ ఆర్యూబీ మీదుగా ఉత్తమ్ నగర్, ఏఓసీ రూట్, సికింద్రాబాద్ మీదుగా వెళ్లిపోవాలి. ► జెడ్టీసీ జంక్షన్ నుంచి ఆనంద్బాగ్కు వచ్చే వాహనాలు జెడ్టీసీ వద్ద మళ్లించి, మౌలాలి, రమాదేవి, ఈసీఐఎల్, నేరేడ్మెట్, వినాయక్నగర్ మీదుగా వెళ్లిపోవాలి. పార్కింగ్లు ఇక్కడే.. రోడ్ షోకు హాజరయ్యేవారు తమ వాహనాలను అనుటెక్స్ పెట్రోల్ బంక్, అషూర్ఖానా మైదానం, ప్రశాంత్ నగర్, జైన్ కన్స్ట్రక్షన్, సఫిల్గూడ ప్రాంతాలలో మధ్యాహ్నం 2 గంటల లోపు పార్కింగ్ చేయాలి. ఆ సమయం తర్వాత పార్కింగ్ చేయడానికి అనుమతి లేదు. -
వీడిన సస్పెన్స్..! లోక్సభ అభ్యర్థిగా డీకే అరుణ..
మహబూబ్నగర్: మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై సస్పెన్స్ వీడింది. మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు ఖరారైంది. ఈ లోక్సభకు సంబంధించి డీకే అరుణతో పాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్రెడ్డి, రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ మధ్య టికెట్ పోరు కొనసాగడంతో అధిష్టానం పెండింగ్లో పెట్టిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు బుధవారం రెండో జాబితాను ప్రకటించగా.. మహబూబ్నగర్ నుంచి డీకే అరుణకు చోటు దక్కింది. నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీ రాములు కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ సభ్యుడు భరత్ ప్రసాద్ పేరును తొలి జాబితాలోనే ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలో రెండు లోక్సభ స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఖరారుకావడంతో ప్రచారం జోరందుకోనున్నట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: 'బీజేపీ టికెట్' నగేశ్కే.. -
లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో తెలుసు: కేటీఆర్
సాక్షి, నాగర్ కర్నూల్: కుడితిలో పడ్డ ఎలుకల పరిస్థితిగా కాంగ్రెస్ స్థితి ఉందని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన అచ్చంపేటలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారో మీకే తెలుసు. రేవంత్రెడ్డి తిరిగి పాతమూలాలకు పోతున్నట్టు ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయి’’ అంటూ ప్రశ్నించారు. ‘‘పథకాలు అమలు కోసం కొత్త కొర్రీలు పెడుతున్నారు. మార్చి 17 వరకు వేచి చూద్దాం.. అవసరమైతే 6 నెలలు ఆగుదాం. ఇంకా రైతు బంధు ఎప్పటికీ వస్తుందో తెలియని దుస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగంలో కేసీఆర్ పాలనపై తప్పుడు ప్రకటన చేయించారు. మోదీ హవా లేదు.. బోడీ లేదు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వని పార్టీ బీజేపీ. కృష్ణా ప్రాజెక్ట్లను కేఆర్ఎంబీకి అప్పగించిన చరిత్ర కాంగ్రెస్ది. మనం ప్రతిఘటిస్తే తిరిగి తీర్మానం చేశారు’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా అప్పర్ భద్రాకు మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘కారు సర్వీసింగ్కు పోయింది.. తిరిగి మంచి స్పీడుతో వస్తుంది. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచి కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా అండగా ఉంటాం. తెలంగాణ కోసం కొట్లాడే పార్టీ బీఆర్ఎస్ మాత్రమే. జైత్రయాత్ర పార్లమెంట్ ఎన్నికల నుంచే కొనసాగించాలి. ఎవరికి ఎక్కడ ఆపద వచ్చినా తామంతా గంటలో వచ్చి అండగా ఉంటాం’’ అంటూ కార్యకర్తలకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఇదీ చదవండి: Hyderabad: ‘గ్యాస్’ బెనిఫిట్.. 10 లక్షల మందికే.. -
బీఆర్ఎస్కు బిగ్ షాక్.. పార్టీని వీడనున్న మర్రి జనార్దన్రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: బీఆర్ఎస్కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి షాక్ ఇవ్వనున్నారా?. ఆయన బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో ఓటమి చవి చూసిన జనార్దన్ రెడ్డి.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసేందుకు ఢిల్లి పెద్దలలో మర్రి మంతనాలు జరిపారు. దీంతో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆయోమయంలో పడ్డారు. నేడు పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి 87,161 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన.. రానున్న లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇదీ చదవండి: హైదరాబాద్ వేదికగా ఆపరేషన్ జార్ఖండ్.. టీపీసీసీ భారీ ప్లాన్! -
తుమ్మంపేటలో టీటీఏ సేవాడేస్ కార్యక్రమాలు
-
నాగర్ కర్నూల్ , తుమ్మంపేట గ్రామంలో టీటీఏ సేవా డేస్!
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించింది టీటీఏ టీమ్. తుమ్మంపేట గ్రామంలో పలు సేవాకార్యక్రమాలు చేపట్టారు. టీటీఏ నాయకులు సైదులు స్వగ్రామంలో ప్రభుత్వ స్కూల్కు స్టేజ్ నిర్మాణం పూర్తి చేసి పాఠశాలకు అందించారు. టీటీఏ నాయకులను ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సన్మానించారు. స్కూల్ అభివృద్ధిలో సహాయసహాకారాలు అందిస్తున్న టీటీఏ బృందానికి టీచర్లతో పాటు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ వల్ల విద్యార్థులకు ఇన్స్పిరేషన్ గా ఉన్నటీటీఏ సంస్థను గ్రామస్థులు, పలువురు నాయకులు ప్రసంశించారు. రానున్న రోజుల్లో ఈ స్కూల్ ను దత్తత తీసుకోనున్నామని టీటీఏ సభ్యులు తెలిపారు. ప్రిన్సిపాల్ అడిగిన గ్రీన్ బోర్డ్ త్వరలో అందిస్తామని ప్రామిస్ చేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులతో పాటు ధైర్య ప్రదర్శన చేసిన పిల్లలకు మోమొంటోలు, ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. చదువులో ప్రతిభ కనబరిచిన ప్రతి క్లాస్ లో ముగ్గురు విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లు పంపిణీ చేసారు. ఇక కార్యక్రమానికి సహకరించిన ప్రతిఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. గణిత శాస్త్ర నిపుణులు రామానుజం జయంతి సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రయోగాలను టీటీఏ నాయకులు మనోహర్, నరసింహ పేరుక తిలకించారు. ఇక విద్యార్థుల ప్రతిభకు అబ్బురపడి పిల్లలను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. (చదవండి: 'టీటీఏ' ఆధ్వర్యంలో దివ్యాంగులకు వీల్చైర్స్ పంపిణీ) -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఆటా సేవా కార్యక్రమాలు
పేదలకు సహాయం చేయడంలో ఆనందం ఉంటుందని ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా అన్నారు. తెలంగాణ లో నల్లమల అడవుల సమీపంలో గల నాగర్ కర్నూల్ జిల్లాలో గిరిజన ప్రాంతం దోమలపెంట హై స్కూల్ లో బ్రహ్మగిరి సేవా సొసైటీ వారి సంవంట సహకారంతో స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ సిస్టమ్, స్మార్ట్ టీవీ, స్కూల్ పెయింటింగ్కు మొత్తం రూ. 25 వేలు ఆర్థిక సహాయం, అలాగే వారికి వైద్య సేవలు అందేలా గోర్సేవా(Gorseva)తో సమన్వయం చేశారు. అలాగే మన్ననురు రేంజుకు చెందిన భోగాపుర్ గ్రామంలో చెంచు గిరిజనులను ఆటా టీమ్ సందర్శించి, వారితో మాట్లాడి వారికి నిత్యావసర సరుకులు, బట్టలు, దుప్పట్లు, చెప్పులు, కొంత ఆర్థిక సహాయం లాంటి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా జయంత్ చల్లా మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకుంటుంది అన్నారు. ఇక్కడి గిరిజనులకు సేవ కార్యక్రమాలు చేపట్టడం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది అన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తో చర్చించామని తెలిపారు. ప్రభుత్వం తరుపున ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని అభ్యర్థించామని అన్నారు. గిరిజనులు మమ్మల్ని స్వాగతించిన తీరు నిజంగా అధ్బుతమన్నారు. ఇక్కడి వారికి ఇంకేమైనా సహాయం కావాలన్నా ఆటా తరుపున చేయడానికి తాము సిద్దంగా ఉన్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్ వేణు సంకినేని, ఆటా సెక్రెటరీ రామకృష్ణారెడ్డి అల, ఆటా కోశాధికారి సతీష్ రెడ్డి, 18వ ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో ఆర్డినేటర్ సాయి సుధిని, ఆటా జాయింట్ సెక్రటరీ రవీందర్ గూడూరు, మీడియా కో ఆర్డినేటర్ ఈశ్వర్ బండా, పాస్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్ మాధవరం, ఆటా బోర్డు ఆఫ్ ట్రస్టీస్ నరసింహారెడ్డి ద్యాసాని, కాశీ కొత్త, రాజ్ కక్కర్ల, ఆటా ఇండియా కో ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, స్థానిక కో ఆర్డినేటర్ శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ఆటా ఆధ్వర్యంలో 20 రోజుల పాటు ఘనంగా సేవ కార్యక్రమాలు!) -
మాయలు, మంత్రాలు.. ఆనక హత్యలు!
సాక్షి, మహబూబ్నగర్/నాగర్కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ, బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానంటూ, విడిపోయిన భార్యభర్తలను కలుపుతానంటూ.. 11 మంది అమాయకపు ప్రాణాలను తీసిన రాక్షసుడ్ని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి.. మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ జిల్లా ఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన రామాటి సత్యనారాయణ యాదవ్(47) గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి. తన తండ్రి, ముత్తాతల నుంచి వారసత్వంగా వస్తున్నటువంటి నాటువైద్యం ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించాడు. ఆపై మంత్రతంత్రాలతో గుప్త నిధులు వెలికి తీసిస్తానంటూ, బ్యాంకుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ప్రజల్ని నమ్మబలికాడు. వారి ఆస్తులను, ఇంటి స్థలాలను కాజేశాడు. అదే తన వృత్తిగా కొనసాగిస్తూ.. ప్రజల్ని మభ్యపెడుతూ, చివరికి ప్రశ్నించిన వారి ప్రాణాలను తీస్తూ వచ్చాడు. ఈ మధ్య కాలంలో ఇద్దరు భార్యాభర్తలు విడిపోయిన వారిని కలుపుతానంటూ, వారి ఇంటి స్థలం తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. ఆపై ఆ మహిళా కనిపించకుండా పోవడంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారిచ్చిన వివరాలను సేకరించి, పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. చివరికి గత కొన్ని రోజులుగా ఎవరి కంట పడకుండా తప్పించుకుంటున్న నిందితుడిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. అయినా ఆ టైంలో పోలీసుల్లో కదలిక లేకపోవడం గమనార్హం. ఇవి కూడా చదవండి: మిస్టరీగా మారిన 'కాంగో జాతీయుడి లాకప్ డెత్!' ఆరోజు ఏం జరిగింది? -
‘పారాచూట్లా వచ్చి కాంగ్రెస్లో చేరాడు, అప్పుడు నాకు అన్యాయం జరగలేదా?’
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆదేశిస్తే ఎమ్మెల్సీ పదవి వదులుకుంటానని కూచకుళ్ళ దామోదర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన కూచుకుళ్ల ఇటీవల కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ పరంగా సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యలను పట్టించుకోవడంతోనే బీఆర్ఎస్కు రాజీనామా చేస్తున్నట్లు కూచుకున్న ప్రకటించారు. మరోవైపు ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డికే కాంగ్రెస్ నాగర్ కర్నూల్ టికెట్ ఖరారు చేయడంతో నాగం జనార్ధన్ రెడ్డి హస్తం పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కూచుకుళ్ల ఆదివారం మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్లో గెలుపు సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టికెట్ తన కుమారుడు రాజేష్ రెడ్డికి ఇచ్చారని తెలిపారు. 1998-2018 వరకు 20 ఏళ్లపాటు తాను కాంగ్రెస్లోనే ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డానని తెలిపారు. 2018లో అధికారం కోసం ఆశపడి పారాచూట్లా వచ్చి కాంగ్రెస్లో చేరాడని నాగంను ఉద్ధేశించి విమర్శలు గుప్పించారు. ఆ రోజు తనకు అన్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. నాగం నడవలేడు, మెట్ల ఎక్కలేడ కానీటికెట్ కావాలని పట్టుబట్టాడని మండిపడ్డారు. నిన్నటి వరకు నాగం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్, కేటీఆర్, ప్రాజెక్టులపై కేసులు వేశాడని, ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నిత్యం తిట్టిన పార్టీలోనే నేడు చేరుతున్నాడని విమర్శించారు. -
కాంగ్రెస్కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా
హైదరాబాద్: కాంగ్రెస్కు మాజీమంత్రి నాగం జనార్ధన్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం బీఆర్ఎస్లో చేరనున్నారని సమాచారం. నాగం జనార్ధన్ రెడ్డిని మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 5:00 గంటలకు నాగం నివాసానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డికి నిరాశ ఎదురవ్వడంతో ఆయన ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం ఇటీవల జోరుగా సాగింది. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని నాగం జనార్దన్రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను నాశనం చేశారన్నారు. ఇదీ చదవండి: వివేక్తో రేవంత్రెడ్డి భేటీ -
కాంగ్రెస్ను వీడనున్న నాగం జనార్దన్రెడ్డి?
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీమంత్రి నాగం జనార్దన్రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇటీవల పార్టీలో చేరిన ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి తనయుడు రాజేశ్రెడ్డికే పార్టీ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో పార్టీ పెద్దల తీరుపై ఆయన ఆగ్రహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరుతారన్న ప్రచారం సాగుతోంది. ఆదివారం సాయంత్రం నాగం ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏళ్లుగా కష్టపడుతున్నవారిని మోసం చేసి, అవసరం కోసం పార్టీలో చేరిన పారాచూట్ నేతలకే టికెట్లు ఇచ్చిందని మాజీమంత్రి, పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను నాశనం చేశారన్నారు. తనకు పార్టీ టికెట్ ఇవ్వకపోవడానికి కారణం కూడా చెప్పలేదని విచారం వ్యక్తం చేశారు. 2018 నుంచి నాగర్కర్నూల్లో పార్టీ బలోపేతం కోసం అన్ని కార్యక్రమాలు చేపట్టానని, కానీ బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్రెడ్డి కుమారుడికి పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. బోగస్ సర్వేల పేరుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తనకు మోసం చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీల నేతలెవరైనా తనను సంప్రదిస్తే, కార్యకర్తల నిర్ణయం ప్రకారం నడుచుకుంటానని పేర్కొన్నారు. చదవండి: అధిష్ఠానం ఆదేశిస్తే అందుకు రెడీ: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి -
అందుకే నా రాజీనామా.. బీఆర్ఎస్కు కూచుకుళ్ల గుడ్బై
సాక్షి, నాగర్కర్నూల్: ఎన్నికల వేళ జిల్లాలో భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి గురువారం బీఆర్ఎస్కు రాజీనామా ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు పంపారాయన. పార్టీలో సముచిత స్థానం దక్కినప్పటికీ.. స్థానిక సమస్యల కారణంగానే బయటకు రావాల్సి వచ్చిందంటూ లేఖలో ప్రస్తావించారాయన. ‘‘వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 15 రోజులకు ఒకసారి వెళ్లి కలిసేవాడ్ని. కానీ, కేసీఆర్ ఈ నాలుగున్నర సంవత్సరాలలో కనీసం ఒక్కసారి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పదిసార్లు వెళ్లినా.. కనీసం కలవలేదు. పార్టీ పరంగా నాకు సముచిత స్థానం కల్పించినప్పటికీ.. స్థానికంగా ఉండే సమస్యల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా అని లేఖలో పేర్కొన్నారాయన. స్థానికంగా ఎటువంటి ప్రయారిటీ లేదని.. ఎమ్మెల్సీ అంటే ఒక స్టిక్కర్ వేసి మీరు పడి ఉండండి అని కేసీఆర్ అంటున్నారని ఆరోపించారాయన. కేటీఆర్ని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నా పట్టించుకోలేదని లేఖలో విమర్శించారు కూచుకుళ్ల. మరోవైపు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో పొసగకపోవడమే కూచుకుళ్ల రాజీనామాకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారతారనే ప్రచారం గత నాలుగైదు నెలలుగా నడుస్తోంది కూడా. కూచుకుళ్ల దామోదర్రెడ్డి రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్తోనే మొదలైంది. కాంగ్రెస్ తరపునే తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, ఎంపీపీగా, 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ జెడ్పీటీసీగా గెలిచి మహబూబ్ నగర్ జిల్లా ఛైర్మన్గా పనిచేశాడు. ఐదుసార్లు నాగర్ కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి నాగం జనార్ధన్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే ఆ తర్వాత టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్)లో చేరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి రెండుసార్లు ఎమ్మెల్సీగా ప్రమాణం చేశారాయన. బీఆర్ఎస్కు రాజీనామా నేపథ్యంలో.. ఆయన కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం వినిపిస్తోంది. ఈ నెల చివర్లో ప్రియాంక గాంధీ వాద్రా పాల్గొనే బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. -
నాగర్కర్నూల్లో కేసీఆర్ కాన్వాయ్ను అడ్డుకునేందుకు యత్నం
-
నాగర్ కర్నూల్: అభివృద్ధి మంత్రం ‘ఉత్త’ ముచ్చటేనా?
నాగర్ కర్నూల్ అసెంబ్లీ స్దానం వచ్చే ఎన్నికల్లో చాలా కీలకంగా మారుతుంది. ఇక్కడ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి నాగం జనార్థన్రెడ్డి ఉండటంతో కొంత రాజకీయంగా ప్రాధాన్యత ఉంటుంది. గత ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన నాగం వచ్చే ఎన్నికల్లో గెలువాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. కానీ ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి కాంగ్రెస్లో తిరిగి చేరుతుండటంతో కాంగ్రెస్ సీట్ల పంచాయితీ మొదలయ్యింది. దీంతో వచ్చే ఎన్నికలు ఇక్కడ పోటీ రసవత్తరంగా మారనుంది. జిల్లాను అభివృద్ధి చేసినా.. ఎమ్మెల్యేకు వ్యతిరేకత! 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పారిశ్రామికవేత్త మర్రి జనార్దన్రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన పోటీ ఖరారైంది. రీసెంట్గా విడుదల చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో మర్రికి టికెట్ దక్కింది. కాగా మర్రి జనార్దన్రెడ్డి నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంజేఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవకార్యక్రమాలు చేపట్టారు. వందలాది మంది నిరుపేదలకు సామూహిక వివాహాలు చేయించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాగర్ కర్నూల్ను జిల్లాగా మార్చారు. జిల్లాకు మెడికల్ కళాశాల అగ్రికల్చర్ డిగ్రీ కళాశాల మంజూరు చేయించి ప్రారంభించారు. సొంత నిధులతో మూడు ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేటు స్దాయిలో తీర్చిదిద్దారు. దీంతో అభివృద్ది విషయంలో మిగిలిన నియోజకవర్గాల కంటే ఎక్కువ నిధులు తీసుకురావటంలో సఫలీకృతులవుతున్నారు. నల్లమట్టి అక్రమ వ్యాపారం ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతుందనే ప్రచారం జోరుగా సాగుతుంది. నల్లమట్టిలో వందల కోట్ల రూపాయల దందా సాగిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. గ్రామాల్లో తన అనుచరులు ముఖ్యులకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న వట్టెం రిజర్వాయర్లో నిర్వాసితులకు సకాలంలో సరైన పరిహారం ఇవ్వలేదనే అసంతృప్తితో నిర్వాసితులు ఉన్నారు. మాదిగ సామాజిక ఓట్లు ఇక్కడ అధికంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వారి ప్రభావం ఉండనుంది. భూ నిర్వాసితుల ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత కూడ తలనొప్పికానుంది. డబుల్బెడ్రూం ఇళ్లు, రుణమాఫి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. పైకి బాగానే ఉన్నా.. నేతల మధ్య అంతర్గత విభేధాలు ఎమ్మెల్యేకు, ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మధ్య అంతర్గత విభేదాలు ఉండటంతో ఆయన పార్టీని వీడుతుండటం కొంతమైనస్గా మారే ప్రమాదం ఉంది. నియోజకవర్గంలో తన క్యాడర్ను ఎమ్మెల్యే నిర్లక్ష్యం చేయటంతో పాటు పోలీసుల సహయంతో కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఎమ్మెల్సీ మీడియా ముందే ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన దామోధర్రెడ్డి 2018లో ఎమ్మెల్యేగా సీటు ఆశించి భంగపడ్డారు. ఆయనను సంప్రదించకుండానే నాగం జనార్దర్రెడ్డిని బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని సీటు ఖరారు చేయటంతో ఆగ్రహించిన దామోధర్రెడ్డి పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరారు. ఆ ఎన్నికల్లో నాగం ఓడిపోయారు. ఇటీవల రెండవ సారి దామోధర్రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని ఎమ్మెల్సీ ప్రస్తావిస్తే దాన్ని ఎమ్మెల్యే వ్యతిరేకించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ బయటికి బాగానే ఉన్నట్టు కనిపించినా లోలోపల వారి మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇది ఎమ్మెల్యేకు మైనస్గా మారే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ దామోధర్రెడ్డి కుమారుడు డాక్టర్ రాజేష్రెడ్డి హైదరాబాద్లో డెంటల్ డాక్టర్గా పనిచేస్తూ తెలంగాణ డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన కూడా నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ నుంచి సీటు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్దికంగా బలంగా ఉన్నానని, అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తున్న తనని ప్రజలు మరోసారి గెలిపిస్తారని ఎమ్మెల్యే ధీమాగా ఉన్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తనకు సన్నిహితంగా ఉండే ముఖ్య నేతలను లోక్సభకు పోటీ చేయించాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ ఉన్నారట.. ఆ లిస్టులో మర్రి జనార్దన్ రెడ్డి పేరు కూడ ఉందనే ప్రచారం జరుగుతుంది. ఆయన మల్కాజిగిరి నుంచి లోక్సభకు పోటీ చేస్తారనే గుసగసలు సైతం వినిపిస్తున్నాయి. ప్రతి పక్షాలు ఇక్కడ బలహీనంగా ఉండటం ఎమ్మెల్యే ఆర్దికంగా బలంగా ఉండటం కలిసివచ్చే అంశంగా కనిపిస్తోంది. ఇటీవల వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మర్రి ప్రకటించటం చూస్తే గెలుపుపై ఆయన ఎంత ధీమాగా ఉన్నారో అర్దం అవుతుంది. కాగా అప్పుడే మర్రి జనార్దన్రెడ్డి తన నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ పేరిట పర్యటిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. ఇబ్బందికరంగా కాంగ్రెస్ సీట్ల పంచాయతి.. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ముఖ్యంగా నాగం జనార్దన్రెడ్డి వయస్సు మీదపడటం.. కాంగ్రెస్ క్యాడర్లో చాలా మంది బీఆర్ఎస్ గూటికి చేరటం ఆయనకు సమస్యగా మారింది. ఎమ్మెల్సీ దామోధర్రెడ్డి ఆయన కుమారుడు డాక్టర్ రాజేష్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అయితే రాజేష్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఈసారి తనకే టికెట్ ఇవ్వాలని నాగం పట్టుబడుతుండటంతో సమస్య జఠిలమవుతుంది. నియోజకవర్గంలో కాంగ్రెస్కు కొంతసానుకూల వాతావరణం వస్తుందన్న తరుణంలో సీట్ల పంచాయితీ కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. మరి అధిష్టానం నాగం జనార్థన్రెడ్డి, ఎమ్మెల్సీ దామోధర్రెడ్డి మధ్య సయోధ్య కుదుర్చితే తప్పా కుమ్మలాటలు ఉంటే అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. బీజేపీకి ఇక్కడ పెద్ద క్యాడర్ కూడ లేదు. ఆ పార్టీలో దిలీపాచారి, కొండమణేమ్మలు పనిచేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన దిలీపా చారికి డిపాజిట్ కూడ దక్కలేదు. కాంగ్రెస్ పార్టీలో జడ్పీటీసీగా పనిచేసిన కొండ మణేమ్మకు నాగం జనార్దన్రెడ్డితో పొసగక పోవటంతో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఆమె కూడ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని యోచిస్తుంది. ఆపార్టీ తన ప్రయత్నాలు సైతం మొదలుపెట్టింది. భౌగోళిక పరిస్థితులు: కూలీపనులు,వ్యవసాయంమే ప్రధానంగా జీవనం సాగించే జనం ఉన్నారు.ఎలాంటి పరిశ్రమలు లేవు. ఉపాధి అవకాశాలు చాలా తక్కువ ఆలయాలు: వట్టెం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం -
కాంగ్రెస్లో టికెట్ల పోరు.. నీదా..! నాదా..! ఎవరరిది..?
సాక్షి, నాగర్కర్నూల్: ఉమ్మడి జిల్లాలోని సీనియర్ నేతలు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి కాంగ్రెస్లో చేరనుండటంతో ఆ పార్టీలో జోష్ కనిపిస్తుండగా.. మరోవైపు వారి చేరికకు ముందే చోటుచేసుకుంటున్న పరిణామాలు పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేస్తున్నాయి. త్వరలో ఇరువురు నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్నవారు వ్యవహరిస్తున్న తీరు భవిష్యత్లో అంతర్గత పోరు తప్పదన్న సంకేతాలను చూపుతోంది. జిల్లాలోని నాగర్కర్నూల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు ఎవరికి వారు వేర్వేరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. త్వరలో కొల్లాపూర్ వేదికగా నిర్వహించేందుకు తలపెట్టిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగ సభ ఏర్పాట్లను సైతం ఇరువర్గాలుగా నేతలు తమ బలప్రదర్శనను చాటేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త, పాత నేతలు సర్దుకుంటారా..! కాంగ్రెస్లోకి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావు చేరిక నేపథ్యంలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఈసారి పార్టీ టికెట్ కోసం అంతర్గత పోరు తప్పేలా కనిపించడం లేదు. జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సన్నద్ధం అవుతుండగా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ నేత చింతలపల్లి జగదీశ్వర్రావు భారీ ర్యాలీతో బలప్రదర్శన చేపట్టారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధంగా ఉండాల ని పిలుపునిచ్చారు. ఏళ్లుగా నియోజకవర్గంలో భారీ బహిరంగ సభల నిర్వహణ, సభ్యత్వాలను పెంచి పార్టీ బలాన్ని పెంచానని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈసారి ఎన్నికల్లో తాను పోటీలో ఉండటం ఖాయమని ప్రకటించడంతో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న జూపల్లికి పార్టీలో అంతర్గత పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలకు నెలలు మాత్రమే సమయం మిగిలి ఉన్న తరుణంలో ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయోనన్న ఆందోళన కేడర్లో నెలకొంది. సర్వేల చుట్టూ రాజకీయాలు.. నాగర్కర్నూల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన కుమారుడు రాజేశ్రెడ్డి కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధం కాగా.. వచ్చే ఎన్నికల్లో వీరు కాంగ్రెస్ నుంచి టికెట్ను ఆశిస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో తాను బరిలో ఉంటానని నాగం చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరును కట్టడి చేసేందు కు సర్వేల ద్వారా టికెట్లను ఖరారు చేస్తామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సర్వే మొదలైందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అ యితే సర్వేలతో పనిలేకుండా ఇన్నాళ్లు పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి అవకాశం ఇవ్వాలని నాగం, జగదీశ్వర్రావులు డిమాండ్ చేస్తున్నారు. సమీకరణాలపై ఉత్కంఠ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీలోకి నేతల చేరికలతోపాటు పాలమూరు జిల్లాలో దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న నాయకుల చేరికలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే వారి చేరికకు ముందే కొత్త, పాత నేతల మధ్య వైరం పెరుగుతుండటం పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేస్తోంది. ఆదివారం కొల్లాపూర్లో నిర్వహించిన సమావేశానికి హాజరైన నాగం జనార్దన్రెడ్డి వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కకుండా చేస్తే వారిని ఓడిస్తామనే సంకేతాలు ఇచ్చారు. అవసరమైతే ఇందుకోసం వ్యతిరేకులను అంతా ఏకం చేసే యోచనలో సైతం ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీలో టికెట్ కోసం ఇరువర్గాల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు, వారి పట్టింపుల నడుమ చివరికి టికెట్ ఎవరికి దక్కుతుందోనన్న ఆసక్తి నెలకొంది. పార్టీ ఆదేశించిన విధంగా కొత్త, పాత నేతలు నడుచుకుంటారా.. అంతర్గత కుమ్ములాటలు ఎటువైపు దారితీస్తాయోనన్నది ఉత్కంఠగా మారింది. -
మోదీ ది బాస్ అని ప్రపంచ దేశాల నేతలే కొనియాడుతున్నారు: నడ్డా
-
నాగర్ కర్నూల్ జిల్లాలో బీజేపీ బహిరంగ సభ
-
బంగాళాఖాతం చుట్టు తిరిగిన కేసీఆర్
-
నాగర్ కర్నూలులో పర్యటించిన సీఎం కేసీఆర్
-
నాగర్ కర్నూల్లో విషాదం: పిడుగుపాటుకు తండ్రి, కొడుకు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ బిజినేపల్లి మండలంలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి తండ్రి కొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. వారు ఫోన్ మాట్లాడుతుండగా సరిగ్గా అదే సమయంలో భారీ వర్షం రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మృతులు పాపగంటి నాగయ్య, రమేష్గా గుర్తించారు అధికారులు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో ఆ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయాలు అలుముకున్నాయి. (చదవండి: దిద్దుబాటు చర్యలు) -
నగర్ కర్నూల్: కొల్హాపూర్ ప్రభుత్వాస్పత్రిలో కొరవడిన వైద్యం
-
సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం.. ముగ్గురు మృతి
సాక్షి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల సలేశ్వరం లింగమయ్య జాతరలో విషాదం చోటుచేసుకుంది. జాతరకు భక్తులు పోటెత్తడంతో.. గుండెపోటుతో అమన్గల్కు చెందిన విజయ అనే మహిళ మృతిచెందింది. దీంతో సలేశ్వరం జాతరలో మరణించిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఉదయం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో తొక్కసలాట జరిగి ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. మృతులను నాగర్ కర్నూల్ జిల్లాకే చెందిన గొడుగు చంద్రయ్య (55), వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు అభిషేక్గా (32) గుర్తించారు. కాగా నల్లమల్ల అడవుల్లోని సలేశ్వరంలో కొలువై ఉన్న శివుడిని (లింగమయ్య) దర్శించుకోవాలంటే దట్టమైన అడవీ, కొండలు, లోయల మార్గంలో రాళ్లు, రప్పలను దాటుకుంటూ సుమారు 4 కి.మీ. దూరం కాలినడకన నడవాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది సలేశ్వరం యాత్రకు భక్తులు పోటెత్తారు. లింగమయ్య నామస్మరణతో నల్లమల కొండలు మార్మోగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఈ యాత్ర కేవలం 3 రోజులు మాత్రమే కొనసాగనుండటం, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో సలేశ్వరంలో పరిస్థితి అదుపుతప్పింది. అక్కడి లోయల్లో భక్తులు ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నారు. రాకపోకలు స్తంభించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భక్తుల అసంతృప్తి సలేశ్వరం యాత్ర ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కనీసం వారం పది రోజులపాటు నిర్వహించవలసిన జాతరను కేవలం మూడు రోజులపాటు మాత్రమే నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాత్ర ఏర్పాట్లపై అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు. శుక్ర, శని, ఆదివారాలు సెలవు రోజులు కావడంతో భక్తులు మరింత పెరిగే అవకాశం ఉన్న కారణంగా అధికారులు ఇప్పటికైనా స్పందించి తగిన చర్యలను చేపట్టాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. సలేశ్వరం జాతర ఈ నెల 5వ తేదీన ప్రారంభమవ్వగా శుక్రవారం వరకు జాతర కొనసాగనుంది. ఉగాది తరువాత తొలి పౌర్ణమికి జాతర మొదలవుతుంది. సలేశ్వరం లింగమయ్య దర్శనానికి ఉమ్మడి జిల్లాతోపాటు తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భక్తులకు అడవిలోకి అనుమస్తారు. -
గురుకుల విద్యార్థిని ఆత్మహత్య.. మన్ననూరులో ఉద్రిక్తత
సాక్షి, నాగర్ కర్నూలు జిల్లా: జిల్లాలోని మన్ననూరు గురుకులంలో దారుణం జరిగింది. విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. క్లాస్రూమ్లో ఫ్యాన్కు ఉరివేసుకుని నిఖిత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం తోటి విద్యార్థులతో నిఖిత ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో విద్యార్థిని మానసిక వేదనకు గురైనట్లు తెలుస్తోంది. మానసిక వేదనే నిఖిత సూసైడ్కు కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొట్టి చంపారని నిఖిత తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థిని తల్లిదండ్రులు నిరసనకు దిగడంతో మన్ననూరు గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చదవండి: రంగారెడ్డి: ఉసురు తీసిన కంత్రీగాళ్లు -
లాభాల గాడిద పాలు.. రోజూ లీటరున్నర వరకు.. ధర తెలిస్తే షాకవ్వాల్సిందే!
‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు.. కడివెడైననేమి ఖరము పాలు’.. అంటూ వేమన అప్పట్లో గాడిదపాలను విలువలేనివిగా భావించి అలా పద్యం రాశాడేమోగానీ వాటి పాల వల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించి తెలిసుంటే రూ. కోట్లిచ్చును ఖరము పాలు అని రాసేవాడేమో.. ఎందుకిదంతా చెప్పడమంటే.. నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన ఓ యువరైతు రాష్ట్రంలోనే మొదటి గాడిద డెయిరీ ఫాంను ఏర్పాటు చేసుకొని భారీ లాభాలు ఆర్జిస్తున్నాడు మరి! ఆ యువరైతు విజయ ప్రస్థానంపై ‘సాక్షి’ప్రత్యేక కథనం. లీటర్ రూ. 4– 5 వేలు రోజుకు ఒక గాడిద గరిష్టంగా లీటర్ వరకు పాలు ఇస్తుంది. ఉదయం, సాయంత్రం రెండుసార్లు పితికితే లీటరున్నర వరకు పాలు వస్తాయి. ఈ పాలను ఎక్కువగా ఆయుర్వేద మందులు, కాస్మొటిక్స్ తయారీకి వినియోగిస్తున్నారు. ఈ మేరకు కంపెనీలు పలు ఏజెన్సీల ద్వారా అంతర్జాతీయంగా కొనుగోలు చేస్తున్నాయి. లీటర్ గాడిద పాలకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేల వరకు ధర పలుకుతోంది. పాల ఉత్పత్తి, గాడిదల ఆరోగ్యంపై ఏజెన్సీలు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తుండగా.. ఫామ్ నిర్వాహకులు స్థానిక పశు వైద్యాధికారి సాయంతో రక్షణ చర్యలు తీసుకుంటున్నారు. పెద్దమొత్తంలో పాలు ఉత్పత్తి అయితే ఇంకా అధిక ధరతో నేరుగా విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం ఉంది. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండకు చెందిన పులిదండ నగేష్ కుటుంబం వినూత్న వ్యాపార ఆలోచనను ఆచరణలోపెట్టి అందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. సంప్రదాయ ఆవు, గేదె పాల డెయిరీలకు పూర్తి భిన్నంగా గాడిద పాల డెయిరీని ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతోంది. వ్యవసాయ కుటుంబానికి చెందిన నగే‹Ùకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు అఖిల్ డిగ్రీ చేయగా చిన్నకొడుకు వంశీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నగేష్ తల్లిదండ్రులు నర్సోజీ, లలితమ్మ. వారి కులవృత్తి (మాంసం విక్రయించడం) కూడా చేసేవారు. పలు రకాల పంటల సాగుతోపాటు పలు వ్యాపారాలు చేసినా ఆర్థికంగా ఉన్నతస్థితికి చేరుకోకపోవడంతో ఏదైనా కొత్తగా చేయాలనే ఆలోచనతో అఖిల్ యూట్యూబ్లో అన్వేíÙస్తుండగా డాంకీ ఫామ్పట్ల ఆసక్తి కలిగింది. యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న క్రమంలో అఖిల్ రాజస్తాన్లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్లో గుర్రాలు, గాడిదల పెంపకం, పాల ఉత్పత్తుల గురించి శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని అక్కడికి వెళ్లాడు. నెలకు వారం చొప్పున మూడు నెలలు శిక్షణ తీసుకున్నాడు. అనంతరం గుజరాత్లోని ఖతియవాడి, హలరీతోపాటు ఫ్రాన్స్ (పోటియో రకం) నుంచి గాడిదలను దిగుమతి చేసుకున్నాడు. ఒక్కోదానికి రూ.50 వేల నుంచి రూ.70 వేలు వెచ్చించి మొత్తం 60 గాడిదలు తెచ్చుకున్నాడు. ఇందులో 57 ఆడ.. మూడు మగవి. ఈ నెలలో మరో 20 గాడిదలను (ఆడ 16, మగ 4)ను తీసుకురావడంతో వాటి సంఖ్య 80కి చేరింది. ఫామ్తోపాటు గాడిదలకు దాణా కోసం వివిధ రకాల గడ్డి పెంచేందుకు బిజినేపల్లి మండల కేంద్రంలోని వృద్ధాశ్రమం సమీపంలో దాదాపు 20 ఎకరాలు లీజుకు తీసుకున్నాడు. అందులో ఒక పెద్ద షెడ్ (ఐదు భాగాలు), మరో 3 చిన్న షెడ్లు ఏర్పాటు చేసి గాడిదలను వేర్వేరుగా పెట్టాడు. వాటికి కావాల్సిన దాణా కోసం దాదాపు 15 ఎకరాల్లో సీఎస్వీ 33 ఎంఎఫ్ (జొన్న రకం), దశరథ గడ్డి, 4జీ బులెట్ (సూపర్ నేపియర్ రకం), మొర్ర గడ్డి తీగ పెంచుతున్నాడు. వీటితోపాటు ఎండు వరి గడ్డి, మక్కసొప్ప, బుడ్డ (పల్లి) పొల్లు, మక్క, గోధుమ, బార్లీ, పిండిని గాడిదలకు ఆహారంగా ఇస్తున్నాడు. గాడిదలను చూసుకునేందుకు రెండు కుటుంబాలను తమిళనాడు నుంచి రప్పించి వారికి వసతి కల్పిస్తున్నాడు. మంచి బ్రీడ్, ఎజెన్సీ చూసుకోవాలి గతేడాది నవంబర్ 13న ఫామ్ అందుబాటులోకి వచి్చంది. ప్రస్తుతం 23 గాడిదలు పాలు ఇస్తున్నాయి. పోటియో (ఫ్రాన్స్) గాడిదలు రోజుకు 2 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. గాడిద పాలు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఏజెన్సీ వాళ్లు ప్రస్తుతం 15 రోజులకు లేదా నెలకోసారి వచ్చి పాలు తీసుకెళ్తున్నారు. గాడిద పాల వ్యాపారం లాభదాయకమే. అయితే మంచి బ్రీడ్, ఏజెన్సీని ఎంచుకోవాలి. – పులిదండ నగేష్, గాడిద ఫాం నిర్వాహకుడు -
70 ఎకరాలు 30 పంటలు.. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా
ప్రకృతి వ్యవసాయదారుడిగా మారిన బ్యాంకింగ్ నిపుణుడు ఇమ్మానేని రంగప్రసాద్ తన పొలాన్ని ఉద్యాన పంటల జీవవైవిధ్య క్షేత్రంగా మార్చేశారు. నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మస్’ పేరుతో అభివృద్ధి చేశారు. 30 రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల చెట్లతో పాటు నాటుకోళ్లు, ఆవుల పెంపకం చేపట్టారు. పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లోనే సాగు చేస్తున్నారు. హైదరాబాద్ నగరానికి ఏడాది పొడవునా అమృతాహారాన్ని అందించడమే లక్ష్యమంటున్న రంగప్రసాద్ కృషిపై కథనం. హైదరాబాద్కు చెందిన ఇమ్మనేని రంగప్రసాద్ బ్యాంకింగ్ నిపుణుడు. డా. కిరణ్మయి మైక్రోబయాలజిస్టు. ఈ దంపతులకు సేంద్రియ/ప్రకృతి సేద్యం అంటే మక్కువ. ఈ మక్కువతోనే హైదరాబాద్కు వంద కిలోమీటర్ల దూరంలో సమీకృత సేంద్రియ ఉద్యాన పంటల క్షేత్రానికి ఎంతో శ్రమించి రూపుకల్పన చేశారు. ఏడాది పొ డవునా రసాయనిక అవశేషాల్లేని చాలా రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, నాటు కోడిగుడ్లను నగరవాసులకు అందించాలని సంకల్పించారు. నాగర్కర్నూల్ జిల్లా చారగొండ మండలం జూపల్లె గ్రామపరిసరాల్లో 70 ఎకరాల భూమిని నాలుగేళ్ల క్రితం కొనుగోలు చేసి ‘ఐఫార్మ్స్’ పేరుతో జీవవైవిధ్య ఉద్యాన క్షేత్రంగా అభివృద్ధి చేశారు. కల్వకుర్తి ఎత్తిపోతల కాలువను అనుకొని ఉండటంతో ఈ క్షేత్రానికి సాగు నీటి కొరత లేదు. తెలంగాణ గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం నేత ఎమ్మెస్ సుబ్రహ్మణ్యం రాజు సూచనలు, సలహాలతో ఈ క్షేత్రం మెరుగైన ఉత్పాదకత సాధిస్తుండటం విశేషం. దేశ విదేశీ రకాలెన్నో... అనేక రకాల నేలలు, ఎత్తుపల్లాలతో కూడిన ఈ పొ లాన్ని అనేక విభాగాలుగా విభజించి, ఒక్కో విభాగంలో ఒక్కో రకం ప్రధాన పంటలను, వాటి మధ్య అనేక అంతర పంటలను సాగు చేస్తున్నారు. ఏడాది పొ డవునా దిగుబడులు తీసుకునేందుకు వీలుగా వారానికోసారి ఆకుకూరలు, 15 రోజులకోసారి కూరగాయ మొక్కలు నాటుతూ (స్టాగ్గర్డ్ ప్లాం టేషన్ చేస్తూ) ప్రణాళికాబద్ధంగా సాగు చేస్తున్నారు. క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, క్యాబేజి, కాళీఫ్లవర్ వంటి పంటలు 15 రోజులకోసారి విత్తుతున్నారు. కాకర, బీర, సొర, టమాటో, బెండ వంటి పంటలను నెలకోసారి విత్తుతున్నారు. ఐఫార్మ్స్లో ఆరుబయట ఎత్తు మడులపై పెరుగుతున్న కసూరి మేతి, ఎర్ర ముల్లంగి, దిల్, గ్రీన్ లెట్యూస్, రెడ్ లెట్యూస్, పర్పుల్ కార్న్, బేబీ కార్న్, మిక్స్డ్ కలర్ కార్న్.. వంటి విదేశీ జాతుల కూరగాయలు వినియోగదారులను, సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. రోగనిరోధక శక్తిని పెంచే నల్ల కంది, సుగంధ పసుపు, మామిడి అల్లం వంటి పంటలు కూడా ఈ క్షేత్రంలో సాగవుతున్నాయి. అంతర పంటలు.. మొరంగడ్డ తీగతో మల్చింగ్... మామిడి, జామ, సీతాఫలం, బొ΄్పాయి తదితర పండ్ల మొక్కల మొదళ్లలో మొరంగడ్డ (చిలగడదుంప) తీగ ముక్కలను నాటడం ద్వారా కలుపును నివారించడమే కాకుండా సజీవ ఆచ్ఛాదన కల్పిస్తుండటం మరో విశేషం. తీగ ముక్క నాటిన ఆరు నెలల్లో చిలగడదుంపలను తవ్వి వినియోగదారులకు అందిస్తూ ఆదాయం కూడా పొ ందుతున్నారు. పండ్ల తోటల్లో ఖరీఫ్లో, రబీలో కూడా అంతర పంటలను సాగు చేస్తున్నారు సజీవ ఆచ్ఛాదన, కలుపు నివారణ, అదనపు ఆదాయం.. అంతర పంటల ద్వారా ఈ మూడు ప్రయోజనాలు సాధిస్తున్నారు. జామ తోటలో మొక్కల మధ్య చిలగడదుంప, సాళ్ల మధ్య వేరుశనగ వేశారు. వేరుశనగలతో వంట నూనె ఉత్పత్తి చేయడానికి ఎద్దు గానుగను ఏర్పాటు చేసుకుంటున్నామని రంగప్రసాద్ తెలిపారు. శాశ్వత పందిరికి దొండ తీగలు పాకించి.. పందిరి కింద సాళ్ల మధ్య ఖాళీలో వెల్లుల్లి, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. బొ΄్పాయి తోట మధ్యలో 9 రకాల తులసి రకాలను పెంచుతున్నారు. సీతాఫలంలో బాలానగర్, ఎన్ఎంకె గోల్డ్, రామాఫలం, లక్ష్మణఫలం రకాలు నాటారు. ఈ నాలుగూ ఒకేసారి కాపునకు రావు. ఒకటి పూర్తయ్యాక మరొకటి ఫలాలనిస్తాయి. ఎటు చూసినా 10 అడుగుల దూరంలో మామిడి మొక్కలు నాటారు. మధ్యలో ఖరీఫ్లో కంది, రబీలో చిలగడదుంప సాగు చేస్తున్నారు. అందరూ ఎక్కువగా ఇష్టపడే బేనిషాన్, హిమాయత్ మొక్కలు పెట్టాం. ఎక్కడెక్కడి నుంచో అరుదైన రకాలను సైతం తెచ్చి అన్నీ కలిపి 70 రకాలను నాటామని రంగప్రసాద్ తెలిపారు. భవిఫ్యత్తులో అన్ని రకాల మామిడి పండ్లతో కూడిన బుట్టలను ప్రజలకు సరఫరా చేయనున్నట్లు సుబ్రమణ్యరాజు తెలిపారు. ఒకసారి విత్తితే.. వరుసగా రెండు పంటలు! ఆకుపచ్చ క్యాబేజీ, ఎరుపు బ్రోకలీ వంటి కొత్తరకం పంటలను ఐఫార్మ్స్లో పండిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఒకే మొక్కకు రెండు సార్లు దిగుబడి తీస్తున్నారు. ఒక పంట తీసుకున్న తర్వాత అదే మొక్క నుంచే 50 రోజుల్లో కార్శి(రటూన్ క్రాప్) పంట తీస్తున్నారు. గో ఆధారిత ప్రకృతి సేద్య నిపుణులు సుబ్రహ్మణ్యం రాజు పర్యవేక్షణలో ఈ ప్రయోగాత్మక సాగు జరుగుతోంది. ఆయన ఏమంటున్నారంటే.. మొదటి పంటగా క్యాబేజీ, బ్రోకలీ కోసిన తర్వాత మొక్కలను అలాగే ఉంచి, ఎప్పటిలాగే క్రమం తప్పకుండా నీరు ఇవ్వాలి. 2 వారాల్లో కొత్త పిలకలు వస్తాయి. పెద్దదాన్ని ఉంచి, మిగిలినవన్నీ తీసివేయండి. 400–500 గ్రాముల క్యాబేజీ, బ్రోకలీ కావాలంటే రెండు రెమ్మలు ఉంచండి. ప్రతి పది రోజులకు పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్, ఆవు మూత్రం పిచికారీ చేయడం ద్వారా పోషకాహారం ఇవ్వండి. పంట కాలంలో మూడు సార్లు పిచికారీ చేయాలి. రెండో పంట కోసం 40–50 రోజుల వరకు వేచి ఉండండి. ఈ కార్శి పంట వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. రెండో పంటకు బెడ్ తయారీ అవసరం లేదు. అదనపు శ్రమ లేదు. తక్కువ కలుపు. తక్కువ వ్యవధి. కాబట్టి చాలా తక్కువ ఖర్చు. సీజన్ లో కన్నా ధర ఎక్కువగా వస్తుంది. నాటు కోళ్లు సమీకృత సేద్యం ద్వారానే ఉత్తమ ఫలితలు వస్తాయని రంగప్రసాద్ నమ్మిక. 35 దేశీ ఆవులతో కూడిన గోశాల ఈ క్షేత్రంలో ఉంది. సుమారు 400 నాటుకోళ్ల ఫారాన్ని నెలకొల్పారు. నాటు కోళ్లతో పాటు గిన్నెకోళ్లు, టర్కీ కోళ్లు, అసీల్ తదితర జాతుల కోళ్లు కూడా ఇక్కడ ఉన్నాయి. ఆరోగ్యదాయకన రీతిలో ఆరుబయట తిరుగుతూ పెరిగేలా కోళ్లకు ఏర్పాట్లు చేశారు. నాటు కోడి గుడ్లను కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు అందించాలన్నదే రంగప్రసాద్ లక్ష్యం. సంతృప్తికర∙ఉత్పాదకత పశువుల ఎరువు, కోళ్ల ఎరువు, జీవన ఎరువులు, జీవన పురుగుమందులను అవసరాన్ని బట్టి వాడుతున్నారు. తద్వారా పోషకలోపాలు లేకుండా, చీడపీడల బెడద లేకుండా.. సంతృప్తికరమైన రీతిలో పంటల ఉత్పాదకత సాధిస్తున్నట్లు సుబ్రహ్మణ్య రాజు(76598 55588) వివరించారు. హైదరాబాద్లోని ఆర్గానిక్ షాపులకు అందించడంతో పాటు ఎంపికచేసుకున్న గేటెడ్ కమ్యూనిటీలకు స్వయంగా తీసుకెళ్లి వారానికోసారి తమ సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు రంగప్రసాద్. సేంద్రియ ఆహారోత్పత్తులను నేరుగా పొ లం నుంచి పొ ందగోరే గేటెడ్ కమ్యూనిటీలు, నివాస సముదాయాల సంక్షేమ సంఘాలు ఉచితంగా తమ క్షేత్రాన్ని సందర్శించవచ్చని సమీకృత సేంద్రియ సాగుదారుడు రంగప్రసాద్(98851 22544) ఆహ్వానిస్తున్నారు. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
రజాకార్లను తరిమినోళ్లం.. కేసీఆర్ను ఓడించలేమా?
సాక్షి, నాగర్కర్నూల్: సీఎం కేసీఆర్ ఇచ్చిన ధైర్యంతోనే బీఆర్ఎస్ శ్రేణులు అరాచకాలకు పాల్పడుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి ఆరోపించారు. మార్కండేయ ప్రాజెక్టు కట్టాలని డిమాండ్ చేసిన దళితులు, గిరిజనులపై బీఆర్ఎస్ నేతలు దాడులు చేయడం దారుణమని మండిపడ్డారు. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకోదన్నారు. రజాకార్లను తరిమికొట్టిన, ఆంధ్రా నాయకులను పొలిమేర దాటించిన వాళ్లం రేపు కేసీఆర్ను ఓడించలేమా? అని ప్రశ్నించారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కాంగ్రెస్ నిర్వహించిన ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ’లో రేవంత్ మాట్లాడారు. దళితులకు కాంగ్రెస్తోనే అండతెలంగాణకు తొలి సీఎం దళితుడేనని చెప్పి దరిద్రపు సీఎం వచ్చారని.. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి జరపని వ్యక్తి దళితుల పేరుచెప్పి సీఎం కుర్చీలో కూర్చున్నారని రేవంత్ విమర్శించారు. సీఎం కేసీఆర్ పాలమూరు బిడ్డ, ఐపీఎస్ ప్రవీణ్కుమార్ను గొంతుమీద కాలుపెట్టి తొక్కడానికి ప్రయత్నిస్తే.. ఆయన బయటికొచ్చి దళిత బిడ్డల పౌరుషాన్ని చూపుతున్నారన్నారు. దొరలకు బీఆర్ఎస్, పెట్టుబడిదారులకు బీజేపీ అండగా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల వారికి అండగా ఉంటుందని చెప్పారు. తమ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా దళితుడికి అవకాశం ఇచ్చామని, పంజాబ్కు దళితుడిని సీఎం చేశామని పేర్కొన్నారు. మేం నెత్తిమీద కాలుపెట్టి తొక్కుతాం 2018 ఎన్నికల సమయంలో కుర్చీ వేసుకుని మార్కండేయ ప్రాజెక్టును పూర్తి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారని.. ఇప్పటివరకు తట్టెడు మట్టికూడా తీయలేదని రేవంత్ చెప్పారు. ‘‘ప్రాజెక్టు కట్టకుండా ఫాంహౌస్లో పడుకున్న సీఎంను ఈడ్చుకురావడానికే నాగం జనార్దన్రెడ్డి అక్కడికి పోయిండు. చేతనైతే ప్రాజెక్టు కట్టాలి్సందే. చేతకాకపోతే మీరు వచ్చాక కట్టుకోండి అని చెప్పి ఉండాల్సింది. కానీ ప్రాజెక్టుపై ప్రశ్నించిన గిరిజనుడు వాల్యానాయక్, దళితుడు రాములుపై దాడి చేస్తారా? వారి గొంతుపై కాలు పెట్టి తొక్కుతారా? దాడి చేసినవారికి ఈ ధైర్యం ఎక్కడిది. కేసీఆర్ నుంచే వచ్చింది. భూస్వాములు, దొరలను నిలువరించిన ఈ గడ్డ దళితులపై దాడులను చూస్తూ ఊరుకుంటుందా? 1,200 మంది శవాల పునాదుల మీద గద్దెనెక్కి ఇప్పుడు కాలుపెట్టి తొక్కుతారా? ఎన్నికలప్పుడు మా ఊరు, వాడ, బస్తీ, చెంచుపెంటలు, గూడెలకు వస్తావు కదా.. అప్పుడు నీ నెత్తిమీద కాలు పెట్టి తొక్కుతాం..’’ అని రేవంత్ పేర్కొన్నారు. మేం కడితే.. మీరు ఫొటోలు దిగుతారా? పాలమూరులో జూరాల, బీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని రేవంత్ చెప్పారు. ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తిచేస్తే.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాల్వల దగ్గర ఫొటోలు దిగుతున్నారని విమర్శించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఉద్యోగాలు, మూడెకరాల భూమి, మాదిగ వర్గీకరణ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలపై సర్కారు దౌర్జన్యం: మాణిక్రావు ఠాక్రే రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గమని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే మండిపడ్డారు. వాల్యానాయక్, రాములుపై జరిగిన దాడిని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. తెలంగాణ ప్రజల వికాసం, పేదలు, గిరిజనులు, దళితుల అభివృద్ధి కోసం సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని.. కానీ ఇప్పుడు అన్నీ అరాచకాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ తోడ్పాటుతోనే బీఆర్ఎస్ శ్రేణుల దుర్మార్గాలు: భట్టి రాష్ట్రం వచ్చాక దళితులు, గిరిజనులపై దాడులు పెరిగాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత నాగం జనార్దనరెడ్డి కళ్ల ముందే దౌర్జన్యం జరిగిందని.. బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల దుర్మార్గాలకు ప్రభుత్వ సహకారమే దీనికి కారణమని మండిపడ్డారు. కాగా.. నాగర్కర్నూల్ సభలో ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరి, నదీమ్ జావేద్, నేతలు మల్లు రవి, షబ్బీర్అలీ, నాగం జనార్దనరెడ్డి, చిన్నారెడ్డి, సంపత్కుమార్, రా>ములు నాయక్, శివసేనరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రీతం, ఎస్టీ సెల్ అధ్యక్షుడు జగన్లాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ
-
యువకుడి దారుణ హత్య.. ప్రేమ వ్యవహారమే కారణమా?
మన్ననూర్: గుర్తుతెలియని దుండగుల చేతిలో ఓ చెంచు యువకుడు హత్యకు గురయ్యాడు. శుక్రవారం రాత్రి నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలోని మాచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాచారానికి చెందిన దాసరి లింగస్వామి (24) అచ్చంపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాడు. లింగస్వామి అచ్చంపేట నుంచి స్వగ్రామం మాచారం కాలనీకి రాత్రి 10.30 గంటల ప్రాంతంలో వచ్చి ఇంటి ముందు బైక్ నిలిపే క్రమంలో అకస్మాత్తుగా కొందరు దుండగులు దాడి చేశారు. కత్తులతో విచక్షణారహితంగా లింగస్వామిని పొడిచారు. ఈ ఘటనలో అతనిపై 34 కత్తిపోట్లు పడగా.. గుండెపై 3 అంగుళాల మేరకు గాయం కావడంతో లింగస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అమ్రాబాద్ సీఐ ఆదిరెడ్డి, ఎస్ఐ వీరబాబు పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. పోలీసు జాగిలాన్ని రప్పించగా.. హత్య జరిగిన ప్రదేశం నుంచి అమ్రాబాద్ వైపు రోడ్డు మార్గంలో కొంతదూరం వెళ్లి వెనుదిరిగింది. మృతదేహాన్ని అమ్రాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడికి తల్లి, నలుగురు అక్కలు ఉన్నారు. లింగస్వామి హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రేమ వ్యవహారమే కారణమా..? లింగస్వామి హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతనికి గతంలో ఓ యువతితో పెళ్లి కుదిరింది. అయితే ఇదివరకే మరో వ్యక్తితో నిశ్చితార్థం అయిన అమ్రాబాద్ మండలానికి చెందిన ఓ యువతితో లింగస్వామి కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ క్రమంలో యువతితో నిశ్చితార్థం జరిగిన యువకుడు, లింగస్వామి గతంలో ఒకసారి సెల్ఫోన్లో వాదులాడుకున్నట్లు బంధువులు తెలిపారు. మృతుడికి ఎవరితో శత్రుత్వం లేదని, ఈ ప్రేమ వ్యవహారమే హత్యకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: భర్త ఇంట్లో ఒంటరిగా ఉండగా.. ప్రియుడిని రప్పించి చాకచక్యంగా.. -
పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాల మధ్య ఘర్షణ..
-
ఉద్రిక్తత: భూమి విషయంలో గొడవ.. కొట్టుకున్న రెండు గ్రామాల రైతులు
సాక్షి, నాగర్ కర్నూలు: జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్ శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుడికిల, నార్లాపూర్ గ్రామాల రైతులు పోడు భూముల వ్యవహారంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో రెండు గ్రామాల రైతులు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం పదిమందికి గాయాలవ్వగా, ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. బాధితులను కొల్లాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోడు భూముల వ్యవహారంలో రెండు గ్రామాలకు ప్రజల మధ్య తరచుగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా పోడు భూముల సర్వే సందర్భంగా భూమి తమది అంటే తమది అంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు విసురుకుంటూ కట్టెలతో కొట్టుకుంటూ దాడులకు తెగబడ్డారు. దీంతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది. -
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యపై అనుమానాలెన్నో.. ఆ పనిచేసిందెవరు?
సాక్షి, జడ్చర్ల: డిగ్రీ విద్యార్థిని మునావత్ మైన(19) ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజలు కళాశాలలో అసలేం జరుగుతోందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో చరిత్ర కలిగి ఉండి ఇటీవలే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల. దీనికితోడు బొటానికల్ గార్డెన్ ఏర్పాటు, హెర్బేరియం గుర్తింపు తదితర కార్యక్రమాలు.. ఇవన్నీ నాణేనికి ఒకవైపు ఉండగా.. మరోవైపు కొందరు ఆడపిల్లల పట్ల అనుచిత భావన కలిగి ఉన్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా గురుశిష్యుల బందాన్ని తప్పుగా అర్థం చేసుకోలేరన్న భావనను కొందరు లెక్చరర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారన్న ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. వైరల్ అయిన ఫొటోలు విద్యార్ధిని మైన ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఓ విద్యార్ధినితో ఓ లెక్చరర్ కలిసి ఉన్న ఫొటోలు గురువారం ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్టారెంట్ తదితర ప్రాంతాల్లో ఉన్న సమయంలో కొందరు వారిని అనుసరించి దూరంగా ఉండి తీసినట్లుగా ఉన్న ఫొటోలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఆ ఫొటోలలో ఉన్న విద్యార్థిని ఎవరన్నది పోలీసులు నిర్ధారించాల్సి ఉంది. సంబంధిత వార్త: Viral Video: అవమాన భారం.. తీసింది ప్రాణం వీడియో ఎవరు తీశారు? విద్యార్థిని మైనా ఆత్మహత్యకు ప్రధాన కారణంగా భావిస్తున్న వీడియోను ఎవరు తీశారన్నది తెలియాల్సి ఉంది. డిగ్రీ కళాశాల తరగతి గదిలో ఆ రోజు ఎందుకు గొడవ జరిగింది. ప్రిన్సిపాల్, లెక్చరర్లు చెబుతున్నదే నిజమా.. మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో విచారించాల్సి ఉంది. అసలు ఈ గొడవలో దాడికి పాల్పడిన విద్యార్థిని, ఫొటో తీశారని చెబుతున్న మరో విద్యార్థిని, లెక్చరర్ల పాత్ర ఎంత మేరకు ఉందో కూడా విచారించాల్సి ఉంది. ఆత్మహత్య చేసుకున్న మైన తాను తీసిన ఫోటోలను ఎవరికి పంపిందో కూడా తెలియాల్సి ఉంది. లెక్చరర్లు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు నిఘా వేసి బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారా..? అన్న అనుమానాలు ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఓ లెక్చరర్, ఓ విద్యార్థిని ఎక్కడెక్కడ తిరిగిన ఫొటోలో తీయాల్సిన అవసరం ఎవరికి ఉండి ఉందో కూడా తేలాల్సిన అవసరం ఉంది. విద్యాబోధన గాలికొదిలారా..? విద్యా బోధనను గాలికి వదిలేసి, బోధనేతర కార్యక్రమాలపై లెక్చరర్లు దృష్టి సారించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రిన్సిపాల్ చిన్నమ్మ అడ్మినిస్ట్రేషన్లో కొంత వీక్గా ఉన్నారన్న ప్రచారం ఉంది. పోలీసులు, ఉన్నత విద్యాధికారులు జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కళాశాల ప్రతిష్టకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆత్మహత్యకు పాల్పడిన మైన ప్రస్తుతం గర్భిణిగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై నాగర్కర్నూల్ సీఐ హన్మంతు ‘సాక్షి’ వివరణ కోరగా.. ప్రస్తుతానికి అలాంటిదేమి లేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని చెప్పారు. కళాశాలలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీనివాసరావును ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్మిట్టల్ ఆదేశాల మేరకు కలెక్టర్ వెంకట్రావ్ సస్పెండ్ చేశారు. -
పాలమూరులో వైద్య కళాశాలలు
-
మునుగోడు బరిలో ఉంటాం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బిజినేపల్లి: త్వరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ చెప్పారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వెల్గొండలో మీడియాతో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. అనంతరం రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని వెల్లడించారు. చదవండి: బీజేపీకి తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి: రేవంత్ -
నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోర ప్రమాదం
-
జూపల్లి కృష్ణారావు ఇంటికి కేటీఆర్
-
కాంగ్రెస్ కు చరిత్ర తప్ప మిగిలింది శూన్యం: మంత్రి కేటీఆర్
-
బుల్లితెరపై కందనూలు కుర్రాడు.. పదేళ్ల కష్టం తర్వాత..
సాక్షి, మహబూబ్నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్కర్నూల్కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్లోనూ సెకండ్ లీడ్రోల్లో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. రాఘవ డిగ్రీ వరకు నాగర్కర్నూల్లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్ఫిలిమ్స్లోనూ ప్రయత్నాలు చేశారు. టిక్టాక్తోనే.. స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్టాక్లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్లో సంప్రదించి అవకాశం ఇచ్చారు. చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్.. మొదటిసారి యాడ్లో.. దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్కే టీ పౌడర్ యాడ్లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్లోనూ నటించారు. సీరియల్స్లో అవకాశం.. 2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్లో హీరో కావాలని.. ఆడిషన్స్లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో అవ్వడమే లక్ష్యం.. ప్రస్తుతం రెండు సీరియల్స్లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను. – రాఘవ, సీరియల్ హీరో -
మళ్లొస్తా నల్లమలకు..
సాక్షి, నాగర్కర్నూల్: చెంచుల సంక్షేమం, జీవ నోపాధికి నిబద్ధతతో కృషి చేస్తానని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. ఆదివాసీల స్థితిగతులను మెరుగుపరిచేందుకు రాష్ట్రవ్యాప్తంగా 6 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసుకున్నామని, తర్వాత మిగతా గిరిజన ఆవాసాలకూ ఈ కార్యక్రమాలను విస్తరిస్తా మని తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా నల్లమ లలోని లోతట్టు అటవీప్రాంతం అప్పాపూర్ గ్రామాన్ని గవర్నర్ శనివారం సందర్శించారు. దట్టమైన అడవిలో చెంచులను వారి నివాసా ల్లో కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంద ని, ఇది తన జీవితంలో మర్చిపోలేని రోజని అన్నారు. మళ్లీ ఒకసారి నల్లమల ప్రాంతాన్ని సందర్శిస్తానని చెప్పారు. ఓ గవర్నర్గా కాకుండా డాక్టర్గా చెంచుల ఆరోగ్యం, జీవన స్థితిగతుల పట్ల తనకెప్పుడూ ఆందోళనగా ఉంటుందన్నారు. చెంచుల ఆరోగ్య సంరక్షణతో పాటు పోషకాహారం అందించేందుకు న్యూట్రిషన్ ఇంటర్వెన్షన్ స్కీంలో భాగంగా ఆరోగ్య పరీక్షలు, మందులు, ఆస్పత్రి సౌకర్యాన్ని కల్పించనున్నట్లు వివరించారు. 6 గ్రామాలకు రూ. 1.5 కోట్లు నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ జిల్లాల్లో రెండేసి గ్రామాల చొప్పున మొ త్తం 6 గ్రామాలను దత్తత తీసుకున్నామని గవర్నర్ తెలిపారు. స్వచ్ఛంద సంస్థల సహకారం తో ఆయా గ్రామాల్లో సోలార్ విద్యుత్, పాఠశా లల మరమ్మతులు, గిరిజనుల ఇళ్ల మరమ్మతు ల పనులు చేపడుతున్నట్లు చెప్పారు. పోషకాహార లోపం నివారణకు ప్రత్యేక కార్యక్రమాల అమలుతో పాటు ఇంటింటికీ 10 చొప్పున రాజశ్రీ కోళ్లను పంపిణీ చేశామన్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 6 గ్రామాలకు రూ.1.5 కోట్లు కేటాయించామని తెలిపారు. గవర్నర్ పర్యటకు నాగర్కర్నూల్ ఎంపీ రాములు, స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గైర్హాజరయ్యారు. మరోవైపు సమావేశానికి హాజరైన చెంచులకు అధికారులు భోజన వసతి కల్పించకపోవడంతో చెంచులు ఆకలితోనే వెనుదిరిగారు. 2 గ్రామాలకు 2 మొబైల్ బైక్ అంబులెన్స్లు అప్పాపూర్లోని చెంచు ఆవాసాలను సందర్శించిన గవర్నర్.. ఇంటింటికీ మంచినీటి సరఫరాను ప్రారంభించారు. చెంచుల ఆరాధ్య దైవం బైరమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలకు కుట్టుమిషన్ శిక్షణ కార్యక్రమంతో పాటు అప్పాపూర్, భౌరాపూర్ గ్రామా లకు రెండు మొబైల్ బైక్ అంబులెన్స్లను అం దజేశారు. ఉన్నత విద్యను చదువుతున్న చెంచు విద్యార్థులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం తో పాటు స్టడీ మెటీరియల్ను అందజేశారు. గవర్నర్కు రాజీనామా లేఖ ఇచ్చిన సర్పంచ్ చెంచులపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ అమ్రాబాద్ మండలం సార్లపల్లి సర్పంచ్ చిగుర్ల మల్లికార్జున్ వేదికపైనే గవర్నర్కు తన రాజీనామా లేఖను అందించారు. గిరిజన గ్రామాల్లో సర్పంచుల తీర్మానాలకు విలువ లేకుండా పోయిందన్నారు. గిరిజన గ్రామాల సర్పంచులను వివిధ శాఖల అధికారులు హేళనగా చూస్తున్నారని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా చెంచులకు తాగునీరు అందిస్తున్నామంటున్నారని.. అది అబద్ధమని, బోర్ల ద్వారా వచ్చే చిలుము నీటితో అనారోగ్యానికి గురవుతున్నామని చెప్పారు. చెంచుపెంటల్లో సారాయి, మద్యం లేకుండా చేస్తేనే తామంతా ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. -
మేమొచ్చాక 2 లక్షల ఉద్యోగాలు
సాక్షి, నాగర్కర్నూల్: ‘డిసెంబర్లో కేసీఆర్ ప్రభుత్వం రద్దు అవుతుంది. వచ్చే మార్చికల్లా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. 12 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మా ప్రభుత్వ హయాంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం..’అని టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్రెడ్డి చెప్పారు. అంతవరకు ఓపిక పట్టాలి అని, తెలంగాణలో కాంగ్రెస్ ఉంటేనే పేదలకు అండ దొరుకుతుందని పేర్కొన్నారు. మంత్రివర్గంలో నలుగురు మహిళలకు అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చేందుకు రాష్ట్రమంతటా కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతానన్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన ఊరు – మన పోరు’కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ మాట్లాడారు. 50 ఏళ్లయినా ‘పాలమూరు’ పూర్తవుతుందా? ‘కరువు ప్రాంతమైన పాలమూరులో వలసలు ఆపేందుకు ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేస్తామని చెప్పి ఎనిమిదేళ్లయినా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయలేదు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ఈ లెక్కన 50 ఏళ్లయినా ప్రాజెక్టును పూర్తిచేసేలా కనిపించడం లేదు. నీళ్లిస్తే పంటలెందుకు ఎండుతున్నాయో నీళ్ల నిరంజన్రెడ్డి సమాధానం చెప్పాలి. ..’అని డిమాండ్ చేశారు. వైఎస్ను నకల్ కొట్టాలని చూస్తున్నారు ‘చేపల వేటను వృత్తిగా బతికే ముదిరాజుల్లో ఎదిగిన ఒక్కడినీ ఓర్వలేక బొందపెట్టాలని చూస్తే.. జనం కర్రు కాల్చి వాత పెట్టారు. టీఆర్ఎస్ నాయకుల నెత్తి మీద రూపాయి పెడితే ఏక్ అణాకు కూడా అమ్ముడుపోరు. లాల్చీ వేసుకుంటే లాల్ బహదూర్ శాస్త్రి కాలేరు, గడ్డం పెంచుకుంటే భగత్ సింగ్ కాలేరు. పంచె కట్టుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాలేరు. ఈ మధ్య నకిలీ పంచెగాళ్లు వైఎస్ను నకల్ కొట్టాలని చూస్తున్నారు. ఓట్ల కోసం ‘పీకే’డ్రామాలు ఆడుతున్నారు..’అని విమర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంతో ఉండాలి.. కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాలి ‘కేసీఆర్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే ఫొటోలు బయటకు విడిచి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాలి. నల్లమల అడవి గాలి పీల్చి, కృష్ణా నీటిని తాగిన పాలమూరు బిడ్డకు రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశాన్ని సోనియా ఇచ్చారు. ఒక్క ఓటుతో మీ బిడ్డను ఆశీర్వదించండి..’అని రేవంత్ కోరారు. శ్రీనివాస్గౌడ్ను కుక్క కూడా కరవదు ‘కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించేందుకు నేను శాయశక్తులా కృషి చేశా. కానీ కాంట్రాక్టుల కోసం, కమీషన్ల కోసం, కోట్ల కోసం పార్టీ మారిండు. ఏ ముఖం పెట్టుకుని కొల్లాపూర్లో తిరుగుతుండు ఆ సన్నాసి. నాగర్కర్నూల్లో మర్రో.. తిర్రోడో ఎమ్మెల్యే ఉన్నడు. బంకమట్టిని కూడా వదలడం లేదు. అచ్చంపేటలో గువ్వలోడు గబ్బిలాలోడు కూడా అంతే. అబ్రహాం గురించి నేను చెప్పను. ముందస్తు అంటూ ఆయనే ప్రకటనలు చేస్తున్నడు. అలంపూర్లో సంపత్కుమార్ 50 వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయం. మంత్రి శ్రీనివాస్గౌడ్ను రోడ్డు మీద పోయే కుక్క కూడా కరవదు. ఆయన హత్యకు రూ.15 కోట్ల సుపారీ ఇచ్చారంటా. ఇసుక, మట్టి, భూముల ఆక్రమణలు, గుడి భూముల ఆక్రమణలు చేసి ఎంత మందిని బాధపెట్టారో ఆయన. ఇక జిల్లా ఎంపీల పరిస్థితి చూస్తే.. ‘మంచోడని మంచం ఎక్కిస్తే.. మంచం అంతా పాడుచేసిండంటా..’అట్లుంది..’అంటూ రేవంత్రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. సమావేశంలో పార్టీ నేతలు బోస్రాజు, అంజన్కుమార్ యాదవ్, సంపత్కుమార్, మల్లు రవి, షబ్బీర్ అలీ, చిన్నారెడ్డి, నాగం జనార్దన్రెడ్డి, అద్దంకి దయాకర్, జిల్లా అధ్యక్షుడు చిక్కుడు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నల్లమలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్
సాక్షి, నాగర్కర్నూల్: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ విశిష్టతను కాపాడుతూనే వన్యప్రాణుల పరిరక్షణకు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నామని కేంద్ర అటవీశాఖ డైరెక్టర్ జనరల్ చంద్రప్రకాశ్ గోయల్ తెలిపారు. ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ వద్ద నల్లమల ముఖద్వారాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన్ననూర్ నుంచి దోమలపెంట వరకు 70 కి.మీ. రహదారిని ప్లాస్టిక్ రహితంగా మార్చడంతో పాటు ఆ ప్లాస్టిక్ను మన్ననూర్లో రీసైక్లింగ్ చేయిస్తామన్నారు. ఇందుకోసం 15 మంది స్థానిక చెంచులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశామన్నారు. టైగర్ రిజర్వులో ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేయడం దేశంలోనే తొలిసారన్నారు. అనంతరం మన్ననూర్లోని వైజ్ఞానిక, పర్యావరణ కేంద్రం, బయోల్యాబ్ను కేంద్ర బృందం పరిశీలించింది. అమ్రాబాద్ జంగిల్ సఫారీలో ప్రయాణించిన అధికారులు ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తంచేశారు. నల్లమలలో చెంచు మహిళలకు ఉపాధి కల్పించేందుకు అపోలో ఫౌండేషన్ ఏర్పాటుచేసిన ప్యాకేజింగ్ వర్క్షాపు, అచ్చంపేట అటవీశాఖ కార్యాలయంలో చౌసింగా మీటింగ్ హాల్, ఔషధ మొక్కలతో ఏర్పాటుచేసిన మెడిసినల్ గార్డెన్ను ప్రారంభించారు. అలాగే అచ్చంపేటలో నిర్మించనున్న అటవీ అమరవీరుల స్తూపానికి శంకుస్థాపన చేశారు. -
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు మృతి
సాక్షి, చిత్తూరు: జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. చంద్రగిరి మండలం ఐతేపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. విశాఖ నుంచి కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో రెండేళ్ల చిన్నారి, ఓ మహిళ ఉన్నారు. బోల్తాపడిన కారు నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకు వచ్చిన కారు మార్చాల సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. మృతులు మహబూబాబాద్కు చెందిన కిరణ్మయి (22), పిఎ పల్లికి చెందిన శిరీష (20), కొండమల్లే పల్లి అన్నేపక అరవింద్ (23) గా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని ఆసుప్రతికి తరలించారు. టీచర్ మృతి మరోవైపు ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం బోరాజ్ చెక్పోస్టు వద్ద జరిగిన ప్రమాదంలో బైక్పై వెళుతున్న ఉపాధ్యాయురాలు పద్మ మరణించారు. బైక్ను ట్రక్కు ఢీ కొట్టడంతో ఉపాధ్యాయురాలు అక్కడికక్కడే మృతి చెందింది. -
ఏపీ, తెలంగాణ మధ్య తీగల వంతెన.. పిల్లర్లు లేకుండానే..
అచ్చంపేట (నాగర్కర్నూల్): తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ మధ్య మరో వారిధికి మార్గం సుగమమైంది. దశాబ్దాల కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021– 22 బడ్జెట్లో రూ.600కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల– సిద్దేశ్వరం వద్ద అధునాతన ‘ఐకానిక్’ (తీగల) వంతెన ఏర్పాటుకు నివేదిక ఇవ్వడంతో జాతీయ రహదారుల సంస్థ గత నెల 21న డీపీఆర్కు ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు సైతం జారీ చేసింది. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారిలోని 76/400 కి.మీ., కల్వకుర్తి (కొట్ర) నుంచి నంద్యాల వరకు 173.73 కి.మీ., రహదారిగా నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా సోమశిల వద్ద తీగల వంతెన నిర్మిస్తారు. ఇప్పటికే టూరిజం హబ్గా ఉన్న నాగర్కర్నూల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నాయి. పర్యాటకానికి కేంద్ర బిందువుగా ఉన్న సోమశిల తెలంగాణకు మరో కలికితురాయిగా మారుతుంది. కృష్ణానది బ్యాక్వాటర్, సహజ సిద్ధమైన కొండలు, ప్రకృతి వాతావరణంలో బ్రిడ్జి ఏర్పాటు కాబోతుంది. మూడు ప్రతిపాదనలు కృష్ణానదిపై సోమశిల బ్రిడ్జి ఏర్పాటుకు కన్సల్టెంట్ సంస్థ మూడు ప్రతిపాదనలు తయారు చేసి జాతీయ రహదారుల సంస్థకు నివేదిక సమర్పించింది. ఇందులో మూడో ఆప్షన్కు ఆమోదం ముద్ర వేసింది. మొదటి ఆప్షన్ సోమశిల కాటేజీల నుంచి 1,800 మీటర్ల బ్రిడ్జికి, రెండో ఆప్షన్ సోమశిల వెళ్లే రహదారిలో కుడివైపు కృష్ణానది బ్యాక్వాటర్ నుంచి రోడ్డు, 750 మీటర్ల బ్రిడ్జికి ప్రతిపాదించారు. మూడో ఆప్షన్లో ప్రతిపాదించిన సోమశిల రీ అలాన్మెంట్ 9.20 కి.మీ రహదారి 600 మీటర్ల ఐకానిక్ బ్రిడ్జి ప్రతిపాదనలకు జాతీయ రహదారుల సంస్థ ఆమోదం తెలిపింది.æ కేంద్ర ప్రభుత్వం భారత్మాల పథకం కింద 173.73 కి.మీ., జాతీయ రహదారిలో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 87.600 కి.మీ., రోడ్డు, 600 మీటర్ల తీగల వంతెనకు రూ.1,200 కోట్లు కేటాయించింది. సిద్దేశ్వరం రెండు కొండల మధ్య ఏర్పాటు కానున్న తీగల వంతెనతో రెండు రాష్ట్రాల మధ్య రాకపోకల సమస్య తీరడంతోపాటు సోమశిల పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందనుంది. తీగల వంతెన అంటే.. సోమశిల– సిద్దేశ్వరం రెండు కొండల మధ్య (600 మీటర్లు) తక్కువ దూరం ఉండటంతో ఈ స్థలం ఎంపిక చేశారు. రెండు కొండల మధ్య పిల్లర్లు కాకుండా లండన్ బ్రిడ్జి మాదిరిగా అటు ఇటు రెండు పెద్ద టవర్లు నిర్మిస్తారు. ఈ రెండు టవర్లకు కేబుల్స్ బిగించి బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల కేబుల్స్ నుంచి బ్రిడ్జి సప్సెంట్ అవుతుంది. ఈ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి జాతీయ రహదారుల సంస్థ మొగ్గు చూపింది. దివంగత సీఎం హయాంలోనే.. సోమశిల బ్రిడ్జి నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో కొల్లాపూర్ ఎక్స్రోడ్డులో శిలాఫలకం వేశారు. అప్పట్లో బీఓటీ పద్ధతిన నిర్మించేందుకు రూ.93 కోట్లు కేటాయించారు. కొన్ని సాంకేతిక కారణాలతో అప్పట్లో పనులు మొదలుకాలేదు. తిరిగి 2012లో బ్రిడ్జి నిర్మాణానికి రూ.193కోట్లు, రోడ్డుకు రూ.60 కోట్లు కేటాయించగా రోడ్డు పనులు పూర్తిచేశారు. బ్రిడ్జి నిర్మాణం అప్పటి నుంచి పెండింగ్లో ఉంటూ వస్తోంది. అభివృద్ధికి బాటలు.. జాతీయ రహదారి, సోమశిల బ్రిడ్జితో నాగర్కర్నూల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. అధునాతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఐకానిక్ బ్రిడ్జి ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకంగా ఈ ప్రాంతంలో రిసార్ట్స్ ఏర్పాటవుతాయి. వెనకబడిన ఈ జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎంతో మంది ముందుకు వచ్చే అవకాశం ఉంది. నల్లమల అందాలు తిలకించేందుకు ఇప్పటికే పర్యాటకులు వస్తున్నారు. బ్రిడ్జి ఏర్పాటుతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. – రాములు, ఎంపీ, నాగర్కర్నూల్ -
కేసీఆరే నిజమైన అంబేడ్కర్వాది
సాక్షి, మహబూబ్నగర్: ‘రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ చూపిన మార్గంలో 14 ఏళ్లపాటు పోరాడి తెలంగాణ సాధించిన వ్యక్తి సీఎం కేసీఆర్.. డాక్టర్ బాబాసాహెబ్ గారినే కేసీఆర్ అవమానించిండు అని దుర్మార్గంగా మాట్లాడుతున్నారు.. కేంద్ర బడ్జెట్పై కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే దమ్ము లేక విపక్ష నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. కేసీఆర్ కంటే నిజమైన అంబేడ్కర్వాది ఎవరూ లేరు’అని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం కోడ్గల్లో రైతు వేదిక, 40 డబుల్ బెడ్రూం ఇళ్లతోపాటు ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ హైస్కూల్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, ఎంపీ రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో సీఎం మాట్లాడారని.. తెలంగాణకు నిధుల కేటాయింపు విషయమై ప్రశ్నించారని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే కేంద్రం నుంచి ఉలుకూపలుకు లేదన్నారు. వాటికి సమాధానం చెప్పే సత్తా లేక, విషయ పరిజ్ఞానం లేక, భావ దారిద్య్రంతో కేవలం విమర్శ కోసమే విమర్శ అన్నట్లు కొందరు చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశమంతా ‘దళితబంధు’ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా చేస్తే ప్రధానమంత్రిని ప్రత్యేకంగా రాష్ట్రానికి పిలిచి సన్మానం చేస్తామన్నారు. తెలంగాణనూ సమదృష్టితో చూడాలని కోరుకుంటా.. ‘నేను రచించిన రాజ్యాంగాన్ని పాలకులు దుర్వినియోగం చేస్తే ఆ రాజ్యాంగాన్ని తగలబెట్టడంలో నేనే ముందుంటా’అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ స్వయంగా చెప్పారని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. నాటి నుంచి నేటి వరకు కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు 105 సార్లు రాజ్యాంగానికి సవరణలు చేశాయన్నారు. ఇది అంబేడ్కర్ను అవమానించినట్లు అవుతుందా అని ప్రశ్నించారు. 2001లో అటల్ బిహారీ వాజ్పేయి రాజ్యాంగ సవరణకు ఒక కమిటీ వేశారని, మోహన్ భాగవత్ కొత్త రాజ్యాంగం కావాలన్నారని.. వారు కూడా రాజ్యాంగాన్ని అవమానపరిచినట్లా అని నిలదీశారు. ‘ప్రధాని మోదీ శనివారం సమతామూర్తి విగ్రహాన్ని అవిష్కరించేందుకు వస్తున్నారు. ఆయన కలలోకి వెళ్లి తెలంగాణను కూడా సమదృష్టితో చూడాలని, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, కర్ణాటక, మహారాష్ట్రలతో సమానంగా తెలంగాణను చూడాలని ఆ రామానుజచార్యుల వారిని కోరుకుంటా’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం సహకరించడం లేదు.. ‘విద్య విషయంలో కేంద్రం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. దేశంలో 150 మెడికల్ కాలేజీలు, 8 ఐఐఎం కళాశాలలు, వందకు పైగా నవోదయ పాఠశాలలు మంజూరు చేసినా.. తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. బాబాసాహెబ్ చెప్పినట్లు బోధించు, సమీకరించు, పొరాడు అనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ సాధించింది కేసీఆరే. కేంద్రం కలసి వచ్చినా రాకపోయినా ప్రజాశీర్వాదంతో టీఆర్ఎస్ ప్రభుత్వం వెనుకడుగు వేయదన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండల కేంద్రంలో నూతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించి పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రి కేటీఆర్ -
‘యాసంగి’ యమా స్పీడ్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యాసంగి సీజన్ పంటల సాగు జోరందుకుంది. వానాకాలంలో వర్షాలు పుష్కలంగా కురవడంతో చెరువులు, కుంటలు నిండుకుండలా కనిపిస్తున్నాయి. మరోవైపు భూగర్భ జలాలు సైతం పెరగడంతో సాగు పనులు చకచకా సాగుతున్నాయి. యాసంగి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 46,49,676 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు క్షేత్రస్థాయిలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచింది. ఇప్పటివరకు 8,06,511 ఎకరాల్లో (17 శాతం) వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయంలో కేవలం 4,63,744 ఎకరాల్లో పంటలు సాగు కాగా, ఈ ఏడాది రెట్టింపు వేగంతో పంటల విస్తీర్ణం పెరుగుతున్నట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జనవరి నాటికి లెక్కతేలనున్న వరి విస్తీర్ణం ధాన్యం కొనుగోలుపై కేంద్రం పలు ఆంక్షలు విధించిన క్రమంలో యాసంగి సీజన్లో వరిసాగు వద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి సూచనలు చేస్తోంది. వాస్తవానికి యాసంగిలో రాష్ట్రంలో సగటున 52.80 లక్షల ఎకరాల్లో వరి పంట సాగయ్యేది. ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయలేమని కేంద్రం తేల్చిచెప్పడంతో వరి సాగును తగ్గించి ప్రత్యామ్నాయ పంటలవైపు రైతుల దృష్టి పెట్టారు. ఈక్రమంలో ఈ ఏడాది వరిసాగును 21 లక్షల ఎకరాలకు తగ్గించేలా ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈ సీజన్లో వరిసాగు 31.01 లక్షల ఎకరాల్లో ఉంటుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 1,737 ఎకరాల్లోనే వరి సాగైనట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణంగా వరినాట్లు డిసెంబర్లో మొదలై జనవరి రెండో వారంకల్లా గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుతం వరినాట్లు ప్రారంభ దశలో ఉండటంతో విస్తీర్ణం ఏమేరకు తగ్గుదల ఉంటుందో చూడాలి. నాగర్కర్నూల్లో అత్యధికం... యాసంగి సీజన్ పంటల సాగులో నాగర్కర్నూల్ జిల్లా ముందు వరుసలో ఉంది. ఈ జిల్లాలో ఇప్పటికే 76 శాతం మేర పంటలు సాగయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్ జిల్లాలో 61 శాతం, వనపర్తి జిల్లాలో 39 శాతం, మహబూబ్నగర్ జిల్లాలో 36 శాతం, గద్వాల జిల్లాలో 35 శాతం పంటలు సాగైనట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఈ నెల రెండోవారం నుంచి సాగు పుంజుకునే అవకాశాలున్నాయి. నెలాఖరుకల్లా సాధారణ సాగు విస్తీర్ణాన్ని చేరుకునే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
చలో నల్లమల.. 17 నుంచి టూర్ ప్రారంభం
సాక్షి, నాగర్కర్నూల్: అడవి గురించి తెలుసుకునేందుకు, వన్యప్రాణులను ప్రత్య క్షంగా వీక్షేందుకు, ఇక్కడ స్థానికంగా ఉన్న చెంచులతో మాట్లాడి వారి స్థితిగతులను అర్థం చేసుకునేందుకు నల్లమలలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అవకాశం కల్పిస్తోంది. వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించేలా ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అమలు చేస్తోంది. నల్లమలలోని అరుదైన, ప్రత్యేకమైన వన్యప్రాణులు, పక్షులు, జీవ, వృక్షజాతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అటవీ సౌందర్యాన్ని తనివితీరా ఆస్వాదించేలా ప్రత్యేక జంగిల్ స్టే ప్యాకేజీలను అమలుపర్చబోతోంది. జంగిల్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్తో పాటు స్థానిక గిరిజనులతో మమేకమయ్యేలా ప్యాకేజీలను రూపొందించింది. ఈనెల 17 నుంచి ఆన్లైన్ ద్వారా బుకింగ్ ప్రారంభంకానుంది. 24 కి.మీ. మేర జంగిల్ సఫారీ.. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లోని వన్యప్రాణులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలు గా సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్తారు. అమ్రాబాద్ మండలంలో హైదరాబాద్– శ్రీశైలం రహదారిపై ఉన్న గుండం చెక్పోస్టు నుంచి ఫర్హాబాద్ వ్యూపాయింట్ వరకు తీసుకెళ్తారు. నల్లమలలో జంగిల్సఫారీ ఇక్కడ నుంచి నల్లమల అటవీప్రాంతం చూడముచ్చటగా ఉంటుంది. అక్కడి నుంచి ఫర్హాబాద్ పెంట మీదుగా ఫర్హాబాద్ చెక్పోస్టు వరకు సఫారీ ప్రయాణం కొనసాగుతుంది. సుమారు 24 కి.మీ.మేర సాగే ఈ సఫారీలో పులులతో పాటు వివిధ వన్యప్రాణులను ప్రత్యక్షంగా చూసే అవకాశముంది. స్థానికంగా ఉండే చెంచులే టూరిస్టు గైడ్లు.. నల్లమలలో స్థానికంగా నివసించే చెంచులతో మమేకమై వారితో ముచ్చటించేందుకు ఏటీఆర్ అవకాశం కల్పిస్తోంది. చెంచుల స్థితిగతులు, జీవనవిధానంపై నాటిక రూపంలో ప్రదర్శనలు, పాటలను ఆలపిస్తారు. వారు తినే ఆహారం, స్థానికంగా ఉన్న వెరైటీలను సందర్శకులకు కూడా రుచి చూపిస్తారు. మన్ననూరు నుంచి ఉమామహేశ్వర ఆలయం వరకు అడవిలోని కొండల మధ్య ట్రెక్కింగ్కు సైతం చెంచులే తీసుకెళ్తారు. నల్లమల అందాలను మనసారా ఆస్వాదించేలా ఫారెస్ట్ స్టే, సఫారీ, ట్రెక్కింగ్లను ఏటీఆర్ అధికారులు రూపొందించారు. రెండు రోజుల పాటు అడవిలో గడిపేలా ఈ ప్యాకేజీ ఉంటుంది. -
రూ.2 కోట్ల విలువైన మెఫిడ్రోన్ స్వాధీనం
కుత్బుల్లాపూర్: డ్రగ్స్ సరఫరా చేస్తూ యువతను పెడదోవ పట్టిస్తున్న ఓ ముఠాకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చెక్ పెట్టారు. మేడ్చల్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ సభ్యులు రూ.2 కోట్ల విలువైన 5 కిలోల మెఫిడ్రోన్/మిథాంఫిటమిన్ మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరి ఆచూకీ కోసం వెతుకుతున్నారు. మేడ్చల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సైజ్ కమిషనర్ చంద్రయ్య, మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ సూపరిండెంట్ విజయభాస్కర్ శనివారం ఈ వివరాలు వెల్లడించారు. కూకట్పల్లి న్యూ బాలాజీనగర్లోని ఎస్వీ సెలెక్షన్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ తీసుకోవడం తీసుకోవడంతోపాటు విక్రయాలు చేస్తున్నట్లు సమాచారం అందుకున్న మేడ్చల్ జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టాస్క్ఫోర్స్ బృందం సభ్యులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా నెట్వర్క్.. ఈ దాడుల్లో క్యాబ్ డ్రైవర్ పవన్ అలియాస్ చిటుకూరి ప్రశాంత్రెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 5 గ్రాముల మత్తు పదార్థం లభించింది. అదుపులోకి తీసుకుని విచారించగా, కన్నారెడ్డి అలియాస్ మహేశ్ కన్నారెడ్డి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో బొంగులూర్ గేటు సమీపంలోని గురుదత్తా లాడ్జిపై దాడులు చేయగా కన్నారెడ్డి పట్టుబడ్డాడు. అతడి వద్ద 921 గ్రాముల మెఫిడ్రోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతోపాటు ఈ వ్యవహారంతో సంబంధమున్న నాగర్కర్నూల్ జిల్లా తిమ్మరాజ్పేట మండలం బావాజీపల్లి గ్రామానికి చెందిన కొండమూరి రామకృష్ణగౌడ్ ఇంటిపై దాడులు చేశారు. అతడి వాహనాన్ని తనిఖీలు చేయగా, 4 కిలోల మెఫిడ్రోన్ పట్టుబడింది. బావాజీపల్లికి చెందిన బండారు హన్మంత్రెడ్డి, సురేశ్రెడ్డి అలియాస్ ఎస్.కె.రెడ్డి తనకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు అతను చెప్పారు. వీరిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో ఓ ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేసిన ఎస్.కె.రెడ్డి పటాన్చెరులో ఓ మూతబడిన పరిశ్రమను అడ్డాగా చేసుకుని డ్రగ్స్ సరఫరాకు పాల్పడుతున్నట్లు సమాచారం. కాగా, కుత్బుల్లాపూర్, బాలానగర్, మేడ్చల్ ప్రాంతాల్లోని ఇంజినీరింగ్ కాలేజీల వద్ద నిఘా ఏర్పాటు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయిస్తున్నట్లు లేదా తీసుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, తగిన నగదు పారితోషికం అందిస్తామని అధికారులు తెలిపారు. -
పాఠశాలల్లో కరోనా కలకలం
తుంగతుర్తి/దేవరకొండ/కట్టంగూర్/నాగర్కర్నూల్ క్రైం/లింగాలఘణపురం: రాష్ట్రంలోని పాఠశాలల్లో కరోనా కలకలం సృష్టిస్తూనే ఉంది. తాజాగా సూర్యాపేట, నల్లగొం డ, నాగర్కర్నూల్, జనగామ జిల్లాల్లోని పాఠశాలల్లో తొమ్మి ది పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని బండరామారం జెడ్పీ ఉన్న త పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలికి బుధవా రం కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. నల్లగొండ జిల్లా దేవరకొండ మండల పరిధిలోని కమలాపూర్ ప్రభుత్వ ప్రా థమిక పాఠశాలలో విద్యార్థులకు బుధవారం వైద్య సిబ్బంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థికి పాజిటివ్గా తేలింది. నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలోని దుగినవెల్లి ప్రా«థమిక పాఠశాలకు చెందిన ఓ ఉపాధ్యాయురాలు కరోనా బారిన పడ్డారు. నాగర్కర్నూల్లో నలుగురు విద్యార్థినులకు.. తరగతులు పునఃప్రారంభమైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు నాగర్కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, జెడ్పీహెచ్ఎస్ (బాలికల)లో చేసిన పరీక్షల్లో మొత్తం నలుగురు విద్యార్థినులకు పాజిటివ్గా తేలింది. మిగతా విద్యార్థులకు గురువారం మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నాగారం ప్రాథమికోన్నత పాఠశాలలో బుధవారం పరీక్షలు నిర్వహించగా ఇద్దరు విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. కరోనా బారిన పడిన వారికి మెడికల్ కిట్లు అందించి, పాఠశాలలను శానిటైజ్ చేశారు. -
Nagarkurnool: బస్సు నడుస్తున్న సమయంలోనే ఊడిపోయిన చక్రాలు
కల్వకుర్తి రూరల్: ఆర్టీసీ బస్సు నడుస్తున్న సమయంలోనే వెనుక చక్రాలు అకస్మాత్తుగా ఊడిపోయాయి. ఈ ఘటన ఆదివారం మార్చాలలో చోటు చేసుకుంది. నాగర్కర్నూల్ జిల్లా తోటపల్లి నుంచి 20 మంది ప్రయాణికులతో ఓ ఆర్టీసీ బస్సు కల్వకుర్తికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో సాంకేతిక సమస్యలతో నిలిచిపోయింది. దానిని వెనక్కి తీసుకురావడానికి కల్వకుర్తి డిపో నుంచి మరో బస్సు (ఏపీ 28జెడ్ 2271)ను అధికారులు పంపించారు. అయితే ఆ బస్సు మార్చాల సమీపంలోని కాటన్మిల్ వద్దకు చేరుకోగానే అకస్మాతుగా వెనుక ఉన్న రెండు చక్రాలు ఊడిపోయాయి. అప్రమత్తమైన డ్రైవర్ రోడ్డు పక్కకు నిలిపివేయడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన జరిగినప్పుడు అందులో ప్రయాణికులెవరూ లేరు. -
పీర్ల పండుగలో ‘గోరటి’ సందడి
తెలకపల్లి: ఎమ్మెల్సీ గోరటి వెంకన్న.. శాసనమండలికి ఎంపికైన తర్వాత తొలిసారి వచ్చిన పీర్ల పండుగలో సందడి చేశారు. ఆయన స్వగ్రామం నాగర్కర్నూల్ జిల్లా గౌరారంలో పీర్ల చావడిలో గురువారం రాత్రి ఫాతేహా నిర్వహించారు. పీర్లకు దట్టీలు సమర్పించి, మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం గ్రామ యువకులతో కలిసి అగ్ని గుండం చుట్టూ ఆడిపాడారు. టీఆర్ఎస్ను గద్దె దించుతాం: ఠాగూర్ సాక్షి, నాగర్కర్నూల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను గద్దె దించుతా మని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ విశ్వాసం వ్యక్తం చేశారు. నాగర్కర్నూల్లో శుక్రవారం నిర్వహించిన పార్లమెంట్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్నిరంగాల్లో గుణాత్మకమైన అభివృద్ధి చోటు చేసుకుంటుందన్నారు. పార్టీలో సెప్టెంబర్ 30లోగా ప్రతి బూత్కు ముగ్గురుసభ్యుల చొప్పున కమిటీ నియామకాన్ని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీనియర్ నేతలు మల్లు రవి, బోసు రాజు, చిన్నారెడ్డి, సంపత్కుమార్, మహేశ్గౌడ్, నాగం జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. -
కాసేపట్లో పెళ్లి.. షాకిచ్చిన వధువు
అమ్రాబాద్: కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉండగా..తనకు చదువుకోవాలని ఉందని, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని వధువు తేల్చి చెప్పడంతో పీటల మీద పెళ్లి ఆపేసిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం..ఉప్పునుంతల మండలం మర్రిపల్లికి చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్ పూర్తి చేయగా..ఆమెకు వంకేశ్వరం గ్రామానికి చెందిన బద్రు అనే యువకుడితో ఇటీవల వివాహం నిశ్చయించారు. ఇరు కుటుంబాలు వీరి వివాహానికి బుధవారం ముహూర్తం నిర్ణయించారు. దీంతో పెళ్లికూతురు, ఆమె తరఫు బంధువులు వరుడు స్వగ్రామం వంకేశ్వరానికి చేరుకున్నారు. కాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన సమయంలో ఈ పెళ్లి ఇష్టం లేదని, తనకు బాగా చదువుకోవాలని ఉందని వధువు చెప్పడంతో అక్కడికి చేరుకున్న బంధువులు అ వాక్కయ్యారు. వధువుకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎంత సర్ది చెప్పినా ఆమె వినకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పెళ్లిని ఆపేశారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ తలెత్తకుండా చూశారు. -
ఆ ఇంట అన్నీ విషాదాలే.. ఆరు నెలల్లో నలుగురు మృతి
సాక్షి, నాగర్కర్నూల్: ఆ ఇంట అన్నీ విషాదాలే. ఆరు నెలల క్రితం అన్న, ఐదు నెలల క్రితం చిన్నారి, నేడు తండ్రి, కొడుకుల మరణం.. ఇలా ఆ కుటుంబంలో నలుగురు మగవారు అందులో ముగ్గురు ఇంటికి పెద్దదిక్కుగా ఉండగా మృత్యువాత పడటం గ్రామస్తులను కలిచివేసింది. వివరాల్లోకి వెళితే.. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని వట్టెం గ్రామానికి చెందిన సరళమ్మ, చిన్నబాలయ్యగౌడ్ (60) దంపతులకు దివ్యాంగుడు బాలరాజ్ (40), శివకుమార్ (35) కొడుకులు ఉన్నారు. పెద్ద కుమారుడికి వివాహం కాలేదు. గద్వాల మున్సిపల్ కార్యాలయంలో నాలుగో తరగతి ఉద్యోగిగా పనిచేసేవాడు. అనారోగ్యంతో ఆరు నెలల క్రితమే చనిపోయాడు. చిన్నబాలయ్యగౌడ్ (ఫైల్), శివకుమార్ (ఫైల్) ఈయనకు చెందిన మెడికల్ బిల్లులు తీసుకుని శుక్రవారం ఉదయం చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్ బైక్పై గద్వాలకు బయలుదేరారు. బిజినేపల్లి పోలీస్స్టేషన్ సమీపంలోకి చేరుకోగానే మరో బైక్పై ఎదురుగా వస్తున్న కొటాల్గడ్డకు చెందిన వినోద్కుమార్, రాఘవేందర్ ఢీకొన్నారు. దీంతో తండ్రీకొడుకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరు యువకులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై శివకుమార్ భార్య సంధ్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటేష్ కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతదేహాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోయిన చిన్నబాలయ్యగౌడ్, శివకుమార్ల మృతదేహాలను జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి పరిశీలించారు. అనంతరం మృతుల కుటుంబసభ్యులను ఓదార్చి తక్షణ ఆర్థిక సహాయం కింద రూ.20 వేలు అందజేసి, కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వరుస సంఘటనలతో విషాదం కాగా, చిన్నబాలయ్యగౌడ్ మనవడు ఐదు నెలల క్రితమే గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందాడు. ఆరు నెలల క్రితం పెద్ద కుమారుడు, ఇప్పుడు తండ్రి, చిన్న కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. అలాగే సంధ్య ప్రసుతం ఏడు నెలల గర్భిణి. ఇలా వరుస సంఘటనలతో ఆరు నెలల వ్యవధిలో ఆ కుటుంబంలో నలుగురు మృత్యువాత పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
నాగర్ కర్నూల్: ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి
-
నాగర్ కర్నూల్: రెండు కార్లు ఢీకొని...ఏడుగురి మృతి
సాక్షి, నాగర్కర్నూల్/హైదరాబాద్/ఉప్పునుంతల: శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళుతున్న నలుగురు.. మల్లన్నను దర్శించుకుని తిరిగొస్తున్న మరో నలుగురు.. రెండు కార్లూ వేగంగా దూసుకెళ్తున్నాయి. రెప్పపాటులో భారీ ప్రమాదం.. రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొని నుజ్జునుజ్జు అయ్యాయి. ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. హైదరాబాద్– శ్రీశైలం జాతీయ రహదారి (765 నంబర్)పై నాగర్కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం పిరట్వాన్పల్లి–చెన్నారం గేటు మధ్య శుక్రవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళుతున్న కారులో ఉన్న శివకుమార్ (30), ఆయన తల్లి సుబ్బలక్ష్మి (61), లవమూర్తి (41), అతడి కుమారుడు వెంకటరమణమూర్తి (15) చనిపోయారు. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న కారులో వంశీ (32), వెంకటేశ్ (29), కార్తీక్ (30) మృత్యువాత పడ్డారు. నరేశ్ అనే యువకుడు గాయపడ్డాడు. నరేశ్ను మొదట అచ్చంపేట ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం హైదరాబాద్కు తరలించారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, నాగర్కర్నూల్ కలెక్టర్ ఎల్.శర్మన్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తోటి ఉద్యోగి వద్ద కారు తీసుకుని.. మల్కాజిగిరి ఆనంద్బాగ్కు చెందిన శివకుమార్ సికింద్రాబాద్లోని ప్యారడైజ్ హోటల్లో షిఫ్ట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇప్పటికే వివాహం కాగా విడాకులు తీసుకున్నాడు. మళ్లీ వివాహం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. మంగళవారం పెళ్లిచూపులకు వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో శ్రీశైలం వెళ్లి మొక్కుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ప్యారడైజ్ హోటల్లోనే పనిచేసే భాస్కర్ వద్ద కారు తీసుకున్నాడు. తన తల్లి సుబ్బలక్ష్మి, మిత్రుడు లవమూర్తి, ఆయన కుమారుడు వెంకటరమణమూర్తిలతో కలసి శుక్రవారం మధ్యాహ్నం శ్రీశైలానికి బయలుదేరారు. సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శివకుమార్ స్వస్థలం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురం. 15 ఏళ్ల క్రితమే వారి కుటుంబం హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. శివకుమార్ తండ్రి కూడా నాలుగేళ్ల కింద రోడ్డు ప్రమాదంలోనే చనిపోయారు. ఇక ప్రమాదంలో మరణించిన లవమూర్తి స్వస్థలం ఏపీలోని విశాఖపట్నం జిల్లా తుని. శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావాలని శివకుమార్ కోరడంతో.. కుమారుడు వెంకటరమణమూర్తిని వెంట తీసుకుని వచ్చారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. స్నేహితులంతా కలిసి వెళ్లి.. హైదరాబాద్లోని జీడిమెట్లకు చెందిన వంశీ, నిజాంపేటకు చెందిన వెంకటేశ్, పటాన్చెరుకు చెందిన కార్తీక్, అమీన్పూర్ మండలం గండిగూడకు చెందిన నరేశ్ నలుగురు స్నేహితులు. వారంతా 2011లో కూకట్పల్లిలోని ఓ ప్రైవేటు కాలేజీలో కలిసి ఇంటర్మీడియట్ చదివారు. అంతా కలిసి గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో బయలుదేరి శ్రీశైలం వెళ్లారు. రాత్రికి అక్కడే ఉండి దర్శనం చేసుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఇంట్లో చెప్పకుండా వెళ్లి.. నిజాంపేటకు చెందిన తలారి శంకరయ్య, బాలామణిల రెండో కుమారుడు వెంకట్. గురువారం మధ్యాహ్నం స్నేహితులతో కలిసి శ్రీశైలం వెళ్లాడు. అక్కడికి వెళ్లాక కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. తిరిగి ఇంటికి రాకుండానే కన్నుమూశాడు. ఇక వంశీ యూత్ కాంగ్రెస్ నాయకుడు. ఇంకా వివాహం చేసుకోలేదు. తండ్రి వీరాస్వామి, తల్లి అనసూయతో కలిసి జీడిమెట్లలో ఉంటున్నాడు. గండిగూడకు చెందిన నరేశ్ ఓ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ప్రమాదం జరిగిన తర్వాత నరేశ్ తమకు ఫోన్ చేశాడని, బాగానే ఉన్నట్టు చెప్పాడని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అతివేగమే కారణం? హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్తున్న ఇతియోస్ కారు, శ్రీశైలం నుంచి హైదరాబాద్ వస్తున్న ఫిగో కారు ఎదురెదురుగా వేగంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు 100– 120 కిలోమీటర్ల వేగంతో వస్తూ అదుపు తప్పిందని, ఎదురుగా వస్తున్న ఫిగో కారును బలంగా ఢీకొట్టి, కుడివైపు దూసుకెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్టు తెలిసింది. అత్యంత వేగంగా ప్రయాణిస్తుండటంతో రెండు కార్లు కూడా నుజ్జునుజ్జు అయ్యాయి. మృతదేహాలు కార్లలోనే చిక్కుకున్నాయి. బయటికి తీసేందుకు పోలీసులు గంటన్నరకుపైగా శ్రమించాల్సి వచ్చింది. ఇక కార్లలో ఎయిర్ బెలూన్లు ఉన్నప్పటికీ తెరుచుకోలేదని.. మృతిచెందిన వారిలో ఎవరూ సీట్ బెల్టు పెట్టుకున్న దాఖలాలు లేవని పోలీసులు చెప్తున్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని సాయం నాగర్కర్నూల్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రుడి కుటుంబానికి రూ.50 వేలు పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని, తగిన సహాయం అందించాలని స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఆదేశించారు. -
తాడు సాయంతో వాగు దాటుతున్న స్థానికులు : నాగర్ కర్నూల్
-
Photo Story: ‘నీళ్ల’కంఠుడు.. పూర్తిగా మునిగిన శివాలయం
చుట్టూ గుట్టలు.. పచ్చని పొలాలు.. మధ్యలో అలుగు పారుతున్న ఊకచెట్టు వాగు.. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పామాపురం సమీపంలో కనువిందు చేస్తున్న జలదృశ్యమిది. వాగు మధ్యలోని శివుడి విగ్రహం చుట్టూ నీళ్లు పారుతున్న చిత్రం ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. – కొత్తకోట రూరల్ (వనపర్తి జిల్లా) నిజామాబాద్ జిల్లా కందకుర్తిలోని గోదావరి నదిలో గల పురాతన శివాలయం వరదనీటిలో పూర్తిగా మునిగింది. నిజామాబాద్ జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో విస్తారంగా వర్షాలు కురవడంతో కందకుర్తి త్రివేణి సంగమ ప్రాంతం గోదావరి, మంజీర, హరిద్ర నదుల వరద నీటితో జలకళను సంతరించుకుంది. – రెంజల్(బోధన్) సోమశిల సమీపంలోని కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఏపీలోని కర్నూలు జిల్లా సరిహద్దులో గల సంగమేశ్వరాలయం నీట మునిగింది. జూరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వదులుతుండడంతో నది నీళ్లు గుడిని తాకాయి. మంగళవారం రాత్రి నుంచి నదిలో వరద ఉధృతి పెరగడంతో బుధవారం సాయంత్రం దాదాపు 4 అడుగుల మేర గుడి నీటిలో మునిగింది. సోమశిల, మంచాలకట్ట, అమరగిరి ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో మత్స్యకారులు చేపల వేటను నిలిపివేశారు. – కొల్లాపూర్ (నాగర్కర్నూల్ జిల్లా) -
నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటి?: నిరంజన్రెడ్డి
సాక్షి, నాగర్కర్నూల్: చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలంగాణ మంత్రి నిరంజన్రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో గురువారం ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు రావని, హమాలీ పని రూపంలో ఉపాధి కల్పిస్తున్నామని అన్నారు. నిరుద్యోగులు హమాలీ పనులు చేసుకుంటే తప్పేంటని బాధత్యరాహిత్యంగా వ్యాఖ్యానించారు. వరల్డ్ స్కిల్ యూత్ డే రోజు మంత్రి నిరంజన్రెడ్డి నోటి నుంచి ఇటువంటి వ్యాఖ్యలు రావటం దారుణమని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. -
భూ వివాదం: కలెక్టరేట్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం
సాక్షి,నాగర్కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ముందు ఓ మహిళ కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. వివరాలు..బిజినేపల్లి మండలం సల్కరిపేటకు చెందిన జ్యోతి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. తన భర్త మృతి చెందడంతో భూమికోసం రెండేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంది. వారసత్వంగా రావలసిన భూమి తనకు ఇవ్వకుండా తన బావ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అధికారులకు మొరపెట్టుకుంది. భూమి దగ్గరికి వస్తే చంపేస్తానంటూ బెదిరిస్తున్నాడని విన్నవించుకుంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో విసిగి పోయిన మహిళ కిరోసిన్ డబ్బాతో ఈరోజు ఉదయం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకునే ప్రయత్నం చేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది కురుమయ్య కిరోసిన్ బాటిల్ లాక్కున్నాడు. అప్పటికే కిరోసిన్ కొంత ఆమెపై పడింది. తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గరికి ఆమెను తీసుకెళ్లాడు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలియజేసింది. సమస్యను పరిష్కరిస్తానని ఇలాంటి కార్యకాలపాలకు పాల్పడవద్దని అన్నారు. -
నల్లమలలో ప్రేమజంట ఆత్మహత్య కలకలం
అమ్రాబాద్: నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం మద్దిమడుగు నల్లమల అటవీ ప్రాంతంలో ఓ ప్రేమజంట ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. పదర ఎస్ఐ సురేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం గట్టు ఇప్పలపల్లికి చెందిన శ్రీనివాసులు, పద్మ దంపతుల కుమార్తె శమంత (27), అదే గ్రామానికి చెందిన అయ్యన్న, లింగమ్మ దంపతుల కుమారుడు సురేశ్(28) ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు ఒప్పుకోలేదు. ఎనిమిదేళ్ల క్రితం శమంతకు సికింద్రాబాద్కు చెందిన సతీష్తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం పుట్టింటికి వచ్చిన శమంత జూన్ 24న నాలుగేళ్ల చిన్న కుమారుడిని తీసుకుని సురేశ్తో వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త, కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని జవహర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ కేసు నమోదైన నేపథ్యంలో శనివారం తాము ఆత్మహత్య చేసుకుంటున్నామని సురేశ్, శమంత తమ కుటుంబసభ్యులు, స్నేహితులకు ఫోన్ చేసి చెప్పారు. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులు సహాయంతో సిగ్నల్స్ ఆధారంగా మద్దిమడుగు అటవీ ప్రాంతంలో వెతికారు. ఆ సమయంలో అక్కడ బాలుడి ఏడుపు శబ్ధం విని.. ఘటనస్థలానికి చేరుకున్నారు. అప్పటికే పురుగుల మందు తాగి, ఇద్దరూ విగత జీవులుగా పడి ఉన్నారు. మృతదేహాలను గుర్తించిన పోలీసులు, వివరాలు సేకరించారు. -
మద్యానికి బానిసైన తండ్రి.. తల్లిని వేధిస్తున్నాడన్న కోపంతో..
ఊర్కొండ (నాగర్ కర్నూల్): తరచూ తల్లిని వేధిస్తుండటాన్ని తట్టుకోలేక తండ్రిని తనయుడు నరికి చంపిన ఘటన మండలంలోని ఇప్పపహాడ్లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఇప్పపహాడ్కు చెందిన డబ్బా రాములు (52), భార్య రామచంద్రమ్మ వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా.. వీరి కుమారులు యాదగిరి, విష్ణు హైదరాబాద్కు వలస వెళ్లారు. అయితే మద్యానికి బానిసైన రాములు తాగినప్పుడల్లా భార్యను వేధించడంతోపాటు చితకబాదేవాడు. మూడురోజుల క్రితం తాగి వచ్చి కొట్టడంతో రామచంద్రమ్మ కుమారులకు సమాచారం అందించింది. వారు గ్రామానికి చేరుకుని తండ్రితో వాగ్వాదానికి దిగి మందలించారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పెద్దకుమారుడు యాదగిరి పొలానికి వెళ్లగా.. చిన్న కుమారుడు విష్ణు ఇంటి వద్దే ఉన్నాడు. రాములు భార్యను కొట్టడంతో కోపోద్రిక్తుడైన చిన్న కుమారుడు విష్ణు గొడ్డలితో తండ్రిపై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే పెద్ద కుమారుడు యాదగిరి, రామచంద్రమ్మ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి సీఐ సైదులు, స్థానిక ఎస్ఐ విజయ్కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. నిందితుడు విష్ణు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఈ ఘటనపై పెద్ద కుమారుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
వివాహేతర సంబంధం: మత్తుకు బానిసై కన్నతండ్రే..
నాగర్కర్నూల్ క్రైం: ఆలనాపాలనా చూడాల్సిన తండ్రే.. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న కొడుకులను కడతేర్చేందుకు ప్రయత్నించాడు. నిద్రపోతున్న ఇద్దరు కుమారుల మణికట్టు కోయగా.. ఓ కుమారుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన నాగర్కర్నూల్ జిల్లా మంతటిలో గురువారం తెల్లవారుజామున జరిగింది. కుటుంబసభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. నాగర్కర్నూల్ మండలం మంతటికి చెందిన శివశంకర్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి గడ్డంపల్లికి చెందిన స్వప్నతో ఎనిమిదేళ్ల కింద వివాహం కాగా, మల్లికార్జున్ (7), ప్రణయ్ ఇద్దరు కుమారులు ఉన్నారు. శివశంకర్ మద్యానికి బానిస కావడంతో పాటు వివాహేతర సంబంధానికి అలవాటుపడటంతో స్వప్న 3 నెలల కింద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న కొడుకులను శివశంకర్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలో ఉన్న ఇద్దరి కుమారుల కుడిచేతి మణికట్టును కత్తితో కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం తాను చనిపోతున్నానంటూ తండ్రి పుల్లయ్యకు ఫోన్చేసి చెప్పగా.. వెంటనే వారు పక్క గదిలోకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లికార్జున్ మృతి చెంది ఉన్నాడు. గాయపడిన ప్రణయ్ను హుటాహుటిన జిల్లా ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చారు. గ్రామంలో చెరువుకట్ట వద్ద శివశంకర్ను గుర్తించిన గ్రామస్తులు ఇంటికి తీసుకొచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని ఇన్చార్జి సీఐ వెంకట్రెడ్డి, ఎస్ఐలు విజయ్కుమార్, రాజులు పరిశీలించి వివరాలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు శివశంకర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ( చదవండి: బెంగళూరులో హత్య, హైదరాబాద్లో గాలింపు! ) -
గిరిజనులను కుళ్లబొడిచిన ఫారెస్ట్ అధికారులు
సాక్షి, నాగర్కర్నూలు: అమ్రాబాద్ మండలంలోని మన్ననూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఆదివాసీ గిరిజనులు మన్ననూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఇప్పపువ్వు కోసం అడవికి వెళ్లగా ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకొని తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో పది మంది గిరిజనులకు గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా అటవీ అధికారులు గిరిజనులను మన్ననూర్ బేస్ క్యాంప్లో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న గిరిజనులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకొని కర్రలతో అటవీశాఖ అధికారులపై దాడి చేశారు. గిరిజనులు చేసిన దాడిలో పలువురు ఫారెస్ట్ అధికారులకు గాయాలు అయ్యాయి. తమవారిపై అటవీ అధికారులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచినందుకు గిరిజనులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి అటవీశాఖ సిబ్బంది తమను వేధిస్తున్నారని గిరిజనలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అడవిలో దొరికే ఇప్పపువ్వు కోసం తాము వెళితే పోలీసులు అకారణంగా తమను గాయపరిచారని బాధితులు తెలిపారు. గిరిజనులు పెద్ద సంఖ్యలో పోలీసులు చేసిన దాడికి నిరసనగా జాతీయ రహదారిపై ధర్నా చేశారు. దీంతో జాతీయ రహదారిపై పలు వాహనాలు నిలిచిపోయాయి. చదవండి: భార్యా భర్తల గొడవ.. బామ్మర్తి చేతిలో బావ హతం -
నాగర్కర్నూలు: మన్ననూర్ టైగర్ఫారెస్ట్లో గిరిజనులపై దాడి
-
కారుతో ఢీ కొట్టి.. ఆపై గొడ్డలితో నరికి
నాగర్కర్నూల్: ఆస్తి కోసం తోడబుట్టిన అన్ననే కారుతో ఢీకొట్టి.. ఆపై గొడ్డలితో దారుణంగా నరికి చంపిన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం అనేఖాన్పల్లి తండాలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. తండాకు చెందిన బాదావత్ హనుమంతు (40), బాదావత్ శంకర్ అన్నదమ్ములు. వీరి మధ్య కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఇదే క్రమంలో మంగళవారం మరోమారు ఆస్తి విషయంలో గొడవపడ్డారు. ఈ క్రమంలో ప్రాణాలైనా తీసేందుకు సిద్ధమని, ఆస్తి మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తమ్ముడు శంకర్ హెచ్చరించాడు. ‘నీ చేతనైన పని చేసుకో’ అని అన్న హనుమంతు బదులిచ్చాడు. దీంతో అన్నను ఎలాగైనా హతమార్చాలనుకున్న తమ్ముడు సమయం కోసం ఎదురుచూశాడు. బుధవారం హనుమంతు వ్యక్తిగత పనులపై వట్టెం గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బైక్పై బయల్దేరాడు. ఈ విషయం తెలుసుకున్న తమ్ముడు శంకర్ మార్గమధ్యలో బైక్ను కారుతో ఢీకొట్టాడు. దీంతో కిందపడిన అన్నను గొడ్డలితో తల, కాలిపై నరికి హతమార్చాడు. మృతుడికి భార్య యామిని, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సంఘటనపై ఎస్ఐ వెంకటేష్ని వివరణ కోరగా.. హత్య జరిగిన మాట వాస్తవమేనని, దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. చదవండి: మహిళతో రెడ్ హ్యండెడ్గా దొరికాడు.. భార్య నగలన్నీ ఆమెకు -
కానిస్టేబుల్ హల్చల్.. విధుల్లో బూతుపురాణం..!
సాక్షి. నాగర్కర్నూల్ క్రైం: ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజలకు చేరువ కావాలని రాష్ట్ర డీజీపీ సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల పోలీస్ శాఖకు చెడ్డపేరు వస్తోంది. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ పోలీస్ కానిస్టేబుల్ కొందరు యువకులను దుర్భాషలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. ఆ వివరాలు.. దీపావళి పండుగ సందర్బంగా పట్టణంలోని రాంనగర్ కాలనీలో గల రామస్వామి ఆలయం ఎదుట బాణాలు కాల్చిన యువకులు అక్కడే కూర్చున్నారు. పెట్రోలింగ్ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అందులో ఒకరు శివశంకర్ వచ్చిరాగానే అక్కడున్న యువకులపై దూషణకు దిగాడు. అక్కడనుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. చదవండి: సీఐ సోమశేఖర్, హెడ్ కానిస్టేబుల్ అరెస్ట్ యువకులు వెళ్తుండగానే ఇక్కడ కూర్చోవడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చార్రా అంటూ బూతులు తిట్టాడు. దీంతో యువకులు ఏంతప్పు చేశామని దూషిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరింత రెచ్చిపోయిన కానిస్టేబుల్ తనకు బీపీ లేపొద్దంటూ తిట్ల దండకానికి దిగాడు. అక్కడున్న వారిలో ఒకరు సెల్ఫోన్లో ఈతతంగాన్ని చిత్రీకరించి సోషల్మీడియాలో పెట్టారు. బీజేపీ నాగర్కర్నూల్ ఇన్చార్జ్ దిలీపాచారి, పలువురు ప్రజా సంఘాలు దీనిపై తీవ్రంగా స్పందించారు. కానిస్టేబుల్పై చర్య తీసుకోవాలంటూ అదే మాద్యమాల్లో డిమాండ్ చేశారు. అనుచిత ప్రవర్తన.. పోలీస్ సస్పెన్షన్ విధుల నుంచి తొలగించాం యువకులతో అనుచితంగా వ్యవహరించిన కానిస్టేబుల్ శివశంకర్ను బ్లూకోల్ట్స్ విధుల నుంచి తప్పించామని సీఐ గాంధీనాయక్ తెలిపారు. జిల్లా హెడ్క్వార్టర్కు అటాచ్ చేశామని వెల్లడించారు. -
విషాదం: కోడి కూర వండలేదని..
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండగ రోజు కోడికూర వండలేదని భార్యను హతమార్చాడో భర్త. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన లింగాల మండలం క్యాంపు రాయవరం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సన్నయ్య మద్యానికి బానిసగా మారాడు. దసరా పండగ రోజు (ఆదివారం) మద్యం తాగివచ్చి, భార్య సీతమ్మ(38)ను కోడికూర వండమని చెప్పగా.. ఆమె వండలేదు. దీంతో కోపోద్రిక్తుడైన సన్నయ్య భార్యను కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్లిపోయాడు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులుకు సమచారం ఇవ్వగా.. అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. చదవండి: (నడిరోడ్డుపై యువతి దారుణ హత్య : షాకింగ్ వీడియో) -
తల్లి గొంతు కోసి..
-
భారీ వర్షాలు: నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన ఆటో
-
డిండి వాగులో చిక్కుకున్న దంపతులు
సాక్షి, నాగర్ కర్నూల్ : భారీ వర్షాలు జిల్లాను ముంచెత్తున్నది. చెరువులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో అచ్చంపేట మండలం సిద్దాపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు నీటిలో చిక్కుకున్నారు. సభావత్, వెంకట్ రాములు,అనే దంపతులు డిండి వాగులో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి, సీఎస్లతో మాట్లాడి వారిని రక్షించడానికి ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హెలికాప్టర్ను కోరారు. ప్రస్తుతం వారు డిండి వాగులోనే చిక్కుకొని ఉండగా.. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఉన్నత అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మరి కొద్ది గంటల్లో రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకోనుంది. ('డిండి' దారెటు?) -
శ్రీశైలం అగ్ని ప్రమాదం: పరిహారం భారీగా పెంపు
సాక్షి, నాగర్ కర్నూల్ : శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన విద్యుత్ ఉద్యోగుల కుటుంబాలకు ప్రభుత్వం అందించే ఎక్స్ గ్రేషియాకు అదనంగా రూ.75 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు తెలంగాణ జెన్ కో- ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మరణించిన డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, మిగతా ఉద్యోగుల కుటుంబాలకు 1 కోటి రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందుతుందని ఆయన వెల్లడించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఇతర శాఖాపరమైన సహాయం కూడా త్వరితగతిన అందించనున్నట్లు వెల్లడించారు. (శ్రీశైలం విద్యుత్ కేంద్రంలో ఉత్కంఠ!) తెలంగాణ జెన్ కో బోర్డు సమావేశం సీఎండీ ప్రభాకర్ రావు అధ్యక్షతన విద్యుత్ సౌధలో శనివారం జరిగింది. శ్రీశైలం ప్రమాదంపై బోర్డు సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మరణించిన వారికి బోర్డు సభ్యులు సంతాపం తెలిపారు. సమావేశంలో సీఎండీ పాటు డైరెక్టర్లు, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ, ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీశైలం ప్రమాదంలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సముచిత నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. (శ్రీశైలం పవర్ ప్లాంట్లో మళ్లీ పేలుడు?) గతంలో ప్రమాదం జరిగినప్పుడు ఎలాంటి సహాయం అందింది, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే విషయంతో సంబంధం లేకుండా శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేక పరిస్థితిగా పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి కూడా మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు చేయగలిగినంత సాయం చేయాల్సిందిగా సీఎండీని కోరారు. ముఖ్యమంత్రి, మంత్రి ఆదేశాలను పరిగణలోకి తీసుకుని, మరణించిన వారి త్యాగాన్ని, సాహసాన్ని దృష్టిలో పెట్టుకుని చేయాల్సిన సహాయంపై బోర్డు విస్తృతంగా చర్చించింది. శ్రీశైలం ప్రమాదాన్ని ప్రత్యేకమైన అంశంగా పరిగణించి సహాయం అందించాలని బోర్డు ఏకగ్రీవంగా నిర్ణయించింది. ‘‘ప్రమాదంలో మన తోటి ఉద్యోగులు మరణించడం అందరినీ కలిచివేస్తున్నది. ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన. మరణించిన వారిది గొప్ప సాహసం, త్యాగం. మరణించిన వారిని మళ్లీ తీసుకురాలేకపోవచ్చు. కానీ మానవ మాత్రులుగా చేయాల్సినంత సహాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా కాకుండా, ప్రత్యేక అంశంగా పరిగణించి సహాయం అందించాలి. ప్రభుత్వం ప్రకటించిన సహాయానికి అదనంగా తెలంగాణ జెన్ కో పక్షాన అదనపు సహాయం అందించాలని భావిస్తున్నాం’’ అని సీఎండీ ప్రభాకర్ రావు సమావేశంలో ప్రకటించారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవడానికి ప్రతిపాదనలు చేయగా, వాటిని బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించింది. అవి 1. ప్రమాదంలో మరణించిన డిఇకి రూ.50 లక్షలు, మిగతా ఉద్యోగులకు రూ.25 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించింది. దీనికి అదనంగా తెలంగాణ జెన్ కో ఒక్కొక్క కుటుంబానికి రూ.75లక్షల చొప్పున సహాయం అందిస్తుంది. దీని వల్ల డిఈ కుటుంబానికి మొత్తం రూ.1.25 కోట్లు, ఇతర ఉద్యోగుల కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున సహాయం అందుతుంది. 2. మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో ఒకరికి విద్యుత్ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించబడుతుంది. విద్యార్హతలను బట్టి డిఈ, ఎఈల కుటుంబాలకు ఎఈ/పీఓ ఉద్యోగాలు, ఇతరులకు జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. 3. ప్రమాదానికి గురైన శ్రీశైలం జల విద్యుత్ కేంద్రంలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించేందుకు అసవరమైన చర్యలు తీసుకోవడానికి ముగ్గురు సభ్యుల కమిటీని సీఎండీప్రభాకర్ రావు నియమించారు. జెన్ కో హైడల్, సివిల్ డైరెక్టర్లు, శ్రీశైలం ప్రాజెక్టు సిఇలు ఇందులో సభ్యులుగా ఉంటారు. శ్రీశైలం ప్లాంటులో జరుగుతున్న పునరుద్ధరణ పనులను పర్యవేక్షించడంతో పాటు, అక్కడికక్కడే అవసరమైన నిర్ణయాలు తీసుకుని అమలు పరుస్తారు. వీలైనంత త్వరగా ప్లాంటును పునరుద్ధరించడం లక్ష్యంగా కమిటీ పనిచేస్తుంది. -
అవినీతి వివాదంలో మరో ఎమ్మార్వో
నాగర్ కర్నూల్ : రెవెన్యూ శాఖలో అవినీతి బాగోతం కొనసాగుతూనే ఉంది. కీసర తహసీల్దార్ కోటి రూపాయల లంచం వ్యవహారం ముగివకముందే మరో అవినీతి బాగోతం బయటపడింది. ఓ రైతు నుంచి లక్షా 50 వేల రూపాయలు లంచం డిమాండ్ చేస్తూ నాగర్ కర్నూల్ జిల్లా లింగాల తహసీల్దార్ మళ్లిఖార్జున్ వివాదంలో చిక్కుకున్నాడు. అయితే ఎమ్మార్వో మొత్తంలో డిమాండ్ చేయగా.. రైతు తరువాత ఇస్తానని ఒప్పుకోవడంతో తొలుత అడ్వాన్స్గా 50 వేలు తీసుకున్నాడు. అదే పనికి మరో రైతు నుంచి అదనపు డబ్బులకు కక్కుర్తిపడ్డాడు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని ఇతరులకు పట్టా పంపిణీ చేశాడు. దీంతో తిరగబడ్డ రైతులంతా శుక్రవారం తహసీల్దార్ తీరు నిరశిస్తూ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. (ఈఎస్ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్) ఈ విషయం కాస్తా పెద్దది కావడంతో వివాదం నుంచి ఎమ్మార్వో తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే తొలుత 50 తీసుకున్న రైతుకు 40 వేలు తిరిగి ముట్టజెప్పాడు. మిగతా పదివేలు కూడా ఇవ్వాలని పట్టుబట్టగా ఖర్చయ్యాయంటూ పారిపోయేందుకు యత్నించాడు. దీంతో ఎమ్మార్వో కారుకు రైతులు అడ్డుపడ్డారు. అయినప్పటికీ రైతులను తోసుకుంటు వెళ్లిపోయారు. (కలెక్టర్, ఆర్డీవో చెబితేనే వెళ్లాను) -
శ్రీశైలం పవర్ ప్లాంట్లో మళ్లీ పేలుడు?
-
ప్రతాపరుద్రుని కోటలో కలెక్టర్ శర్మన్
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ శివారులోని నల్లమలలో ఉన్న ప్రతాప రుద్రుని కోటను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. అటవీ శాఖా, పర్యాటక శాఖాధికారులతో కలిసి ఆదివారం ఉదయం ఆయన చారిత్రాత్మకమైన ప్రతాప రుద్రుని కోటను పరిశీలించారు. కొండలపై ఉన్న కోటను ఆయన కాలినడకన వెళ్లారు. పర్యాటకంగా కోటను అభివృద్ది చేసేందుకు గల చర్యలపై అధికారులతో కలెక్టర్ శర్మన్ చర్చించారు. (తెలంగాణలో కొత్తగా 2,924 కేసులు, 10 మరణాలు) శ్రీశైలం వెళ్లే పర్యాటకులు కోటపై నుంచి నల్లమల అందాలను వీక్షించే ఏర్పాట్ల చేస్తే పర్యాటకులు మధురానుభూతి పొందుతారని తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రతాప రుద్రుని కోటపై ఏడు రకాల జలపాతాలు, పుష్కరిణులు ఉన్నాయి. వాటిని అభివృద్ది చేసి పర్యాటకులకు చేరువ చేస్తే బాగుంటుందని స్థానికులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కాగా కొత్తగా కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన శర్మన్ ప్రతాప రుద్రుని కోటను సందర్శంచడం పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
చినికి చినికి గాలి వానలా మారిన భూ వివాదం
సాక్షి, మహబూబ్నగర్ / నాగర్కర్నూల్: గ్రామ కంఠం భూమికి సంబంధించిన వివాదం చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామ శివారులో మూడున్నర ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. దానిలో ప్రకృతి వనం నిర్మించాలని గ్రామ పంచాయతీ తీర్మానించింది. అయితే ఆ భూమి గతంలో రాజులకు చెందినదిగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ భూమి గ్రామ కంఠంలో ఉంది. అయితే కొంతమంది తాము రాజుల వారసులమని ప్రచారం చేసుకుంటూ ఆ భూమి తమకే చెందుతుందంటున్నారు. ఇదిలా ఉండగా అదే గ్రామానికి చెందిన మరికొందరు ఆ భూమిలో గుడిసెలు వేసుకునేందుకు వచ్చారు. దీన్ని పెద్ద వివాదంగా చేయాలనే ఉద్దేశంతోనే కొంత మంది గ్రామస్తులను ఉసిగొల్పుతున్నారని, ఎట్టి పరిస్థితుల్లో గ్రామ కంఠం భూమి అన్యాక్రాంతం కావడానికి వీలు లేదని చెప్పి మరో వర్గం అక్కడికి చేరుకుంది. ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ముగ్గురికి గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. -
విషాదం: లోపలున్న 9 మందీ మృతి
-
పవర్ హౌజ్ ప్రమాదంపై సీఐడీ విచారణ
-
శ్రీశైలం పవర్ ప్లాంట్: ఆరుకు చేరిన మృతుల సంఖ్య
-
మరో ఐదు మృతదేహాలు గుర్తింపు
సాక్షి, నాగర్ కర్నూలు: శ్రీశైలం ఎడమ గట్టు కాలువ భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. తొలుత రెస్క్యూ బృందం మూడో ఫ్లోర్లో ఏఈ సుందర్ నాయక్ (35) మృతదేహాన్ని గుర్తించింది. ఆ తర్వాత మోహన్తో పాటు మరో నలుగురి మృతదేహాలను గుర్తించింది. ఏఈ సుందర్తో పాటు మోహన్ మృత దేహాలను బయటకు తరలించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రెస్య్కూ ఆపరేషన్ పూర్తయ్యేందుకు మరో అయిదు గంటల సమయం పట్టనుంది. కాగా గురువారం రాత్రి 10.35 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. ప్రమాద ఘటన గురించి సీం కేసీఆర్కు వివరించామని పేర్కొన్నారు (గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు..) -
మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి మృతి
సాక్షి, కల్వకుర్తి/కల్వకుర్తి: రైతుల ప్రధాన సమస్యల్లో ఒకటైన కరెంట్ ఇక్కట్లు తీర్చాలని ఎన్నో పోరాటాలు చేసి.. చివరికి సమస్య పరిష్కారానికి కృషిచేసి కరెంట్ కిష్టారెడ్డిగా పేరు గడించిన ఎడ్మ కిష్టారెడ్డి మంగళవారం మృతిచెందారు. గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న మాజీ ఎమ్మెల్యే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పారీ్టలో కొనసాగుతున్నారు. అభివృద్ధిలో చెరగని ముద్ర కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేయడంతోపాటు.. అభివృద్ధిలో తనదైన ముద్ర వేశాడు మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి. 1994 నుంచి 2004 వరకు విద్యుత్ కోసం ఆమరణ దీక్ష చేసి రైతుల పక్షాన పోరాటం చేసిన నాయకుడు ఆయన. విద్యుత్ సరఫరా సరిగా లేక బోరు మోటార్లు కాలిపోయి.. చేతికొచ్చే పంటలు ఎండిపోయి ఎంతోమంది రైతులు ఆత్మహత్యలే శరణ్యమనుకునే రోజుల్లో వారి బాధలు చూసి చలించిన ఆయన 9రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఎట్టకేలకు విద్యుత్ సమస్యను తీర్చి కరెంట్ కిష్టన్నగా పేరు గడించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం సాధనకు ఉద్యమాలు ఎన్నో చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక అభివృద్ధిని పరుగులు పెట్టించడంలో ఆయనకు ఆయనే సాటి. 2004లో ఎమ్మెల్యేగా విజయం సాధించాక నియోజకవర్గంలో 18.. 33/11కేవి సబ్స్టేషన్లు ఏర్పాటు చేయించి విద్యుత్ కష్టాలు తీర్చాడు. మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డికి కిష్టారెడ్డి ప్రీతిపాత్రు నిగా ఉన్నాడు. సబ్సిడీ కందిపప్పు పథకాన్ని కల్వకుర్తిలోనే ప్రారంభించారు. విద్యకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి కృషిచేశారు. అలాగే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, ప్రస్తుత ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్.జగన్మోహన్రెడ్డి, కేసీఆర్ తదతరులతో సత్సంబంధాలు నెలకొల్పారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన మరణం నియోజకవర్గానికి తీరనిలోటని పలువురు పేర్కొంటున్నారు. ఎడ్మ ఆశయ సాధనకు కృషి : మంత్రి జీవితాంతం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాల కోసం పాటుపడిన మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆశయ సాధన కోసం కృషి చేద్దామని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం సాయంత్రం కల్వకుర్తిలో ఎడ్మ కిష్టారెడ్డి పారి్థవదేహంపై పూలమాలలు వేసి నివాళులరి్పంచి మాజీ ఎమ్మెల్యే భార్య పుష్పమ్మ, కుమారుడు మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యంను ఓదార్చారు. సీఎం కేసీఆర్ ఆయన మృతికి సంతాపం తెలిపారన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కోసం రాజీలేని పోరాటం చేసిన చరిత్ర ఎడ్మ కిష్టారెడ్డిదని కొనియాడారు. నివాళులరి్పంచిన వారిలో ఎంపీ రాములు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, జైపాల్యాదవ్, మర్రి జనార్దన్రెడ్డి, అంజయ్య యాదవ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ మంత్రులు జూపల్లి కృష్ణారావు, జానారెడ్డి, జెడ్పీ చైర్మన్ పద్మావతి, వైస్చైర్మన్ బాలాజీసింగ్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, అభిమానులు హాజరయ్యారు. అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ఎడ్మ కిష్టారెడ్డి అంత్యక్రియలు మంగళవారం సాయంత్రం అశ్రునయనాల మధ్య జరిగాయి. ఆయన పారి్థవదేహాన్ని ఇంటి నుంచి దేవరకొండ రోడ్డులో ఉన్న వారి వ్యవసాయం పొలం వరకు ర్యాలీగా తీసుకెళ్లారు. మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, కిష్టారెడ్డి అభిమానులు, నాయకులు, కార్యకర్తలు ర్యాలీ వెంట కదిలారు. పెద్ద ఎత్తున జనం అంతిమయాత్రకు తరలివచ్చారు. ఆయన కుమారుడు, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించారు. -
కరోనాతో నంది ఎల్లయ్య కన్నుమూత
సాక్షి, హైదరాబాద్/ముషీరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ కురువృద్ధుడు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు నంది ఎల్లయ్య(78) శనివారం కరోనాతో కన్నుమూశారు. గత నెల 29న అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఎల్లయ్యకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని జీహెచ్ఎంసీ అధికారులు నిమ్స్ ఆసుపత్రి నుంచి బన్సీలాల్పేట శ్మశానవాటికకు తీసుకువెళ్లి కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. 1964లో రాజకీయ ప్రస్థానం షురూ.. 1942 జూలై 1న హైదరాబాద్లోని ముషీరాబాద్లో నాగయ్య, నరసమ్మ దంపతులకు నంది ఎల్లయ్య జన్మించారు. ఆయన అప్పట్లో పీయూసీ వరకు చదువుకున్నారు. 22 ఏళ్ల వయసులోనే 1964లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఎల్లయ్య ఐదుసార్లు సిద్దిపేట నుంచి, ఒకసారి నాగర్కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా, ఒకసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్ కౌన్సిలర్గా 1964లో ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో సిద్దిపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి మొదటిసారి ఎంపీగా విజయం సాధించారు. 1980, 1989, 1991, 1996 ఎన్నికల్లోనూ సిద్దిపేట ఎంపీగా ఎన్నికయ్యారు. 2014లో నాగర్కర్నూల్ ఎంపీగా గెలుపొందారు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇందిర, పలువురు సీఎంలతో సన్నిహిత సంబంధాలు నిరుపేద దళిత కుటుంబంలో పుట్టిన నంది ఎల్లయ్య సుమారు 40 ఏళ్లపాటు పార్లమెంటేరియన్గా పనిచేసిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రులు టి. అంజయ్య, మర్రి చెన్నారెడ్డి, వై.ఎస్.రాజశేఖర్రెడ్డితో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. 1969లో మర్రి చెన్నారెడ్డితో కలిసి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొని 22 రోజులపాటు జైలు జీవితం గడిపారు. ప్రధాని ఇందిరాగాంధీ పోటీచేసిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పక్కనే ఎల్లయ్య పోటీ చేసిన సిద్దిపేట నియోజకవర్గం ఉండడంతో ఇందిరతో కూడా మంచి సంబంధాలను కొనసాగించారు. ఆ తరువాత సోనియాగాంధీతో కూడా మంచి సంబంధాలు ఉండడంతో రెండుసార్లు రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఏఐసీసీ, టీపీసీసీ ఉపాధ్యక్షుడితోపాటు పార్టీ, ప్రభుత్వానికి చెందిన పలు కమిటీల్లో సభ్యులుగా పనిచేశారు. సాదాసీదా ఒంటరి జీవితం 8 సార్లు ఎంపీగా పనిచేసినప్పటికీ ఎల్లయ్య సాదాసీదా రాజకీయ జీవితాన్ని గడిపారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భార్య నుంచి విడిపోవడంతో మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఇండియన్ ఎయిర్లైన్స్లో పనిచేసి పదవీ విరమణ పొందిన అతని సోదరుడు నంది కృష్ణతో కలిసి రాంనగర్లోనే ఉమ్మడిగా కలిసి జీవించేవారు. ఎల్లయ్య నిరాడంబరుడు, మితభాషిగా పేరొందారు. సీఎం కేసీఆర్ సంతాపం నంది ఎల్లయ్య మృతిపట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. ఎల్లయ్య కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఎల్లయ్య మృతిపట్ల హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్, మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వి.శ్రీనివాస్గౌడ్, టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే.కేశవరావు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పతాకం అవనతం.. నంది ఎల్లయ్య మృతికి సంతాప సూచకంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయమైన గాంధీభవన్లో పార్టీ పతాకాన్ని శనివారం అవనతం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇన్చార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి నిబద్ధతతో, క్రమశిక్షణతో ఎల్లయ్య పనిచేశారని కొనియాడారు. ఎల్లయ్య మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం తెలిపినవారిలో ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, రేవంత్ రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శులు సంపత్ కుమార్, వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు వీహెచ్, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరులున్నారు. సోనియా ఫోన్ పరామర్శ(బాక్సు) నంది ఎల్లయ్య మృతి చెందిన సమాచారం తెలుసుకున్న ఏఐసీసీ చీఫ్ సోనియాగాంధీ ఫోన్ ద్వారా ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. సోదరుడు నంది కృష్ణకు ఫోన్ చేసిన ఆమె విషయం అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లయ్య కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎల్లయ్య సోదరుడు చక్రధర్కు పార్టీ ముఖ్య నేత గులాంనబీ ఆజాద్ ఫోన్ చేసి పరామర్శించినట్టు గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలకు పాజిటివ్ హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితోపాటు తాండూరు, ఎల్బీనగర్ ఎమ్మెల్యేలు పంజుగుల రోహిత్రెడ్డి, దేవిరెడ్డి సుధీర్రెడ్డిలకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత ఆదివారం (ఈ నెల 2న) కోవిడ్–19 టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుంచి హోం ఐసోలేషన్లో ఉన్నానని, ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నానని మంత్రి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు, మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రోహిత్రెడ్డి శనివారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్గా తేలింది. వెంటనే అపోలోలో అడ్మిట్ అయ్యారు. ఎమ్మెల్యే గన్మెన్లు, పీఏ, వ్యక్తిగత సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించగా నెగెటివ్ వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డితోపాటు కుటుంబసభ్యులకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కుటుంబసభ్యులందరం హోం ఐసోలేషన్లో ఉన్నామని, త్వరగా కోలుకొని ప్లాస్మా దానం చేస్తామన్నారు. -
సిద్దిపేట ముద్దుబిడ్డ, ఐదుసార్లు అక్కడి నుంచే
సాక్షి, హైదరాబాద్/సిద్దిపేట: కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కడవరకూ కట్టుబడి నడుచుకున్న సీనియర్ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య (78) ఇకలేరు. 10 రోజుల క్రితం కరోనా బారినపడిన ఆయన నిమ్స్లో చికిత్స పొందుతూ శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆరు సార్లు లోక్సభ, రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా ప్రాతినిథ్యం వహించిన నంది ఎల్లయ్య వివాదాలకు దూరంగా ఉండే నేతగా పేరు గడించారు. 1942 జూలై 1న హైదరాబాద్లోని ముషీరాబాద్లో ఆయన జన్మించారు. నంది ఎల్లయ్యకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. ప్రస్థానమిలా సిద్దిపేట నుంచి 1977 లో మొదటి సారి సిద్దిపేట (ఎస్సీ) లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి నంది ఎల్లయ్య గెలుపొందారు. అప్పటి వరకు సిద్దిపేట ఎంపీగా పని చేసిన జి.వెంకటస్వామి శాసనమండలికి వెళ్లడంతో ఆ స్థానం ఖాళీ అయింది. దాంతో సిద్దిపేట పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నంది ఎల్లయ్య పోటీ చేసి గెలిచారు. 1980లో జనతా ప్రభుత్వం కూలిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో సిద్దిపేట నుంచి మళ్లీ పోటీ చేసి ఆయన గెలుపొందారు. 1984లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి డాక్టర్ గుండె విజయరామారావు చేతిలో నంది ఎల్లయ్య ఓడిపోయారు. తిరిగి 1989లో విజయరామమారావును ఓడించి మూడవ సారి విజయం సాధించారు. ఎన్టీఆర్ ఛైర్మన్గా వ్యవహరించిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూలిపోవడంతో 1991లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నంది ఎల్లయ్య సిద్దిపేట నుంచి నాలుగో సారి గెలిచారు. 1996లో మెజారిటీ లేక పోవడంతో అప్పటి ప్రధాని వాజ్ పాయ్ తన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో నంది ఎల్లయ్య ఐదో సారి సిద్దిపేట నుంచి గెలిచారు. 1998లో వాజ్పేయి ప్రభుత్వం మళ్లీ పడిపోవడంతో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మల్యాల రాజయ్య చేతిలో ఓటమి పాలయ్యారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్కర్నూల్ లోక్సభ స్థానం నుంచి పోటిచేసిన నంది ఎల్లయ్య మందా జగన్నాథాన్ని ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. మొదటి నుంచి దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ముఖ్య అనుచరుడిగా నంది ఎల్లయ్య కొనసాగారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. (కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి) -
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
-
కరోనాతో మాజీ ఎంపీ నంది ఎల్లయ్య మృతి
సాక్షి, హైదరాబాద్: మాజీ ఎంపీ నంది ఎల్లయ్య(78) కన్నుమూశారు. జులై 29న కరోనా బారినపడి అనారోగ్యంతో నిమ్స్లో చేరిన నంది ఎల్లయ్య శనివారం ఉదయం 10.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఈయన కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నంది ఎల్లయ్య ఐదుసార్లు లోక్సభ సభ్యుడిగా, రెండుసార్లు రాజ్యసభ సభ్యడిగా పనిచేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 2014లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటిచేసి మంద జగన్నాథంను ఓడించి 16వ లోక్సభకు ఎన్నికయ్యారు. (ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్) కాంగ్రెస్ సీనియర్ నేత నంది ఎల్లయ్య అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జి ఆర్.సి కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి డీకే సమరసింహరెడ్డి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 'కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిబద్దతతో క్రమశిక్షణతో పనిచేశారు. ఆయన క్రమశిక్షణ నేటి తరానికి ఆదర్శం. ఓటమి ఎరగని నేత, దళిత బాంధవుడు నంది ఎల్లయ్య. గాంధీ ఆశయాలను తుచ తప్పకుండా పాటించిన ఆదర్శ నాయకులు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు. నంది ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాం' అని పేర్కొన్నారు. -
కరోనా లక్షణాలున్న వారికి ఆర్ఎంపీలు చికిత్స
నాగర్కర్నూల్ క్రైం: కరోనా వైరస్ జిల్లా ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వైరస్ లక్షణాలు ఉన్న వారు తమ మధ్యనే తిరుగుతున్నారేమో అన్న భయం ప్రజలను వెంటాడుతోంది. సాధారణ దగ్గు, జలుబు , జ్వరం వచ్చిన వారి దగ్గరకు వెళ్లాంటేనే జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని జిల్లాలో కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు, కొందరు ఆర్ఎంపీలు కరోనా లక్షణాలున్న వారికి మలేరియా, టైఫాయిడ్తో పాటు ఇతరరోగాల బారిన పడ్డారంటూ చికిత్స చేస్తూ డబ్బులు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. రోగులు వారి వద్ద కొన్నిరోజులు చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో పరీక్ష చేయించుకుంటే కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలన్న కఠినమైన నిబంధనలను ఆర్ఎంపీలు లెక్కచేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు వారిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఇలా.. ♦ నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లోని గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణ కేంద్రాల్లోని ఆర్ఎంపిలు, ప్రైవేటు ఆసుపత్రులు కరోనా లక్షణాలున్న వారికి వైద్యం అందిస్తున్నారు. ♦ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం , గొంతునొప్పి వంటి లక్షణాలతో భాదపడు తూ జిల్లాకేంద్రంలోని ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లాడు. అతడు టైఫా యిడ్ వచ్చిందటూ చికిత్స అందించినా తగ్గకపోవడంతో జిల్లా ఆసుపత్రిలో కరోనా పరీక్షకు శాంపిల్ ఇచ్చాడు. ఆదివారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు భాదితుడిని వివరాలు సేకరించే క్రమంలో పదిరోజులు ఆర్ఎంపి వద్ద చికిత్స తీసుకున్నట్లు తెల్సింది. ♦ శనివారం వచ్చిన ఫలితాల్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా అతడు జిల్లా కేంద్రంలోని ఓ వైద్యుడితో చికిత్స చేయించుకున్నట్లు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వైద్యుడిని హోం క్వారంటైన్ చేశారు. కేసుల వివరాల్లో తేడాలు జిల్లా ప్రజలు కరోనాకు సంబంధించి రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేస్తున్న హెల్త్ బుటిటెన్లను నిశితంగా గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్ బులిటెన్లో ఉన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు మీడియాకు వెల్లడిస్తున్న కరోనా పాజిటివ్ కేసు సంఖ్యల్లో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో ప్రజలు అయోమయానికి గురిఅవుతున్నారు. కొద్దిరోజుల క్రితం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో 6పాజిటివ్ కేసులు నమోదైనట్లు వెల్లడించినా వాటికి సంబంధించి నేటివరకు జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులకు సమాచారం లేనట్లు తెల్సింది. గత ఆదివారం విడుదల చేసిన హెల్త్బులిటెన్లో 23పాజిటివ్ కేసులు చూపగా జిల్లా వైద్యశాఖ అధికారులు 13పాజిటివ్ కేసుల వివరాలు మాత్రమే వెల్లడించడం అయోమయానికి గురిచేస్తుంది. -
అవి కేసీఆర్తోనే సాధ్యమైంది: సింగిరెడ్డి
సాక్షి, నాగర్ కర్నూల్: జిల్లాలో 60 ఏళ్లలో 50 సబ్ స్టేషన్లు కడితే ఆరేళ్లలో 58 సబ్ స్టేషన్లు కట్టామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉచిత కరెంట్, తెలంగాణ రావడం, కేసీఆర్ నాయకత్వం మూలంగానే సాధ్యమయిందన్నారు. 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. 60 ఏళ్లు ఏమీ చేయని వారు కూడా 24 గంటల కరెంట్ సరఫరాను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. పాలమూరులో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటితో తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నామని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సీఎం కేసీఆర్ మూలంగానే సాధ్యమైందని మంత్రి వ్యాఖ్యానించారు. -
కరోనా కలకలం: జిల్లాలో 44 కేసులు
సాక్షి, ఖమ్మం : జిల్లాలో కరోనా వ్యాప్తి కలవరం పుట్టిస్తోంది. సోమవారం ఒక్క రోజే 12 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా కేంద్రం ఎన్ఎస్టీ రోడ్డుకు చెందిన ఓ వ్యక్తికి ఇటీవల కరోనా వైరస్ సోకడంతో ప్రస్తుతం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కరోనా బారిన పడిన వారందరినీ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఐసోలేషన్లో చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 44 పాజిటివ్ కేసులు నమోదు కాగా 18 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. (మార్కెట్లోకి కరోనా ఔషధం..) సాక్షి, నాగర్ కర్నూల్ : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న స్టాఫ్ నర్సుతోపాటు వార్డ్ బాయ్కు కరోనా పాజిటివ్గా తెలిసింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురవుతోంది. ఆస్పత్రి సిబ్బంది నుంచి వీరితో సన్నిహితంగా మెలిగిన వారి వివరాలు అధికారులు సేకరిస్తున్నారు. కాగా జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ నిర్ధారించినట్లు కలెక్టర్ శ్రీధర్ వెల్లడించారు. వీరిలో ల్దండ మండలం కొట్రకు చెందిన ఒకరు. నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లికి చెందిన ఒకరు. బిజినపల్లి మండలం గంగారనికి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ నమోదు అయినట్లు తెలిపారు. (20,369 పరీక్షలు : 462 పాజిటివ్ కేసులు) -
కేన్సర్తో ఆస్పత్రిలో చేరి.. కరోనాతో..!
సాక్షి, నాగర్కర్నూల్: కేన్సర్ వ్యాధితో హాస్పిటల్లో చేరిన వ్యక్తి కరోనా వైరస్తో మృతి చెందినా.. రిపోర్ట్లు రాకముందే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అంటగట్టి చేతులు దులుపుకోవడంతో అధికారులు, మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం వీరంరాజ్పల్లికి చెందిన ఓ వ్యక్తి(52) 15 ఏళ్ల క్రితం గ్రామం నుంచి హైదరాబాద్ వలస వెళ్లి అల్వాల్ ప్రాంతంలోని నేతాజీనగర్లో భార్యాపిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఈయన ఈ నెల 14న అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్లో చేర్పించగా.. గొంతు కేన్సర్గా గుర్తించారు. దీంతో కుటుంబ సభ్యులు లక్డికాపూల్ ఎంఎన్జేæ కేన్సర్ హాస్పిటల్లో చికిత్స నిమిత్తం చేర్పించారు. కాగా అతని రక్త నమూనాలను ఈ నెల 5న సేకరించి టెస్టులకు పంపించగా.. 6వ తేదీ ఉదయం 7 గంటలకు ఆయన మృతిచెందాడు. దీంతో హాస్పిటల్ నిర్వాహకులు, సిబ్బంది మృతదేహాన్ని వెంటనే తీసుకెళ్లాలని అతని కుమార్తెకు తెలియజేయడంతో ఆమె తన బంధువు సాయంతో అంబులెన్స్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్వగ్రామమైన వీరంరాజుపల్లికి తీసుకొచ్చింది. గ్రామంలో కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి మధ్యాహ్నం 2:30 గంటలకు మృతదేహాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో పాటు వివిధ గ్రామాలకు చెందిన బంధువులు 46 మంది కార్యక్రమంలో పాల్గొన్నారు. దహన సంస్కారాల అనంతరం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హాస్పిటల్ నుంచి అతనికి కరోనా పాజిటివ్ రిపోర్ట్ వచ్చినట్లు సమాచారం వచ్చింది. ఈ విషయం ఆదివారం సర్పంచ్ భర్త మనోహర్కు తెలియడంతో ఆయన అధికారులకు సమాచారం అందించారు. చదవండి: చేస్తున్నది అటెండర్ ఉద్యోగం.. చేసేది కలెక్టర్ సంతకం వివరాలు సేకరించిన డీఎంహెచ్ఓ 22 మందిని క్యారంటైన్కు తరలించే చర్యలు తీసుకుంటున్నామని, మిగతా వారిని హోం క్వారంటైన్లో ఉంచడంతో పాటు, గ్రామం మొత్తం జనం ఇళ్ల నుంచి బయటికి రాకుండా 14 రోజుల పాటు హోం క్వారంటైన్లో ఉంచాలని ఎస్ఐతో పాటు డాక్టర్లకు సూచించారు. ఈ సంఘటనతో గ్రామంలోని జనం బిక్కుబిక్కు మంటూ బయటికి రావడానికి జంకుతున్నారు. గ్రామాన్ని సందర్శించిన డీఎంహెచ్ఓ కరోనా పాజిటివ్ కేసు వ్యక్తి మృతదేహానికి అత్యక్రియలు జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి సుధాకర్లాల్, తహసీల్దార్ రాధాకృష్ణ, ఎస్ఐ వీరబాబు, డాక్టర్లు సురేష్, శ్రావణ్లతో పాటు వైద్య సిబ్బంది ఆదివారం గ్రామాన్ని సందర్శించారు. మృతుని కుమార్తె, భార్యతో హాస్పిటల్లో చోటుచేసుకున్న పరిణామాలను తెలుసుకున్నారు. కేన్సర్తోనే మా తండ్రి మృతి చెందినట్లు ఎంఎన్జె హాస్పిటల్ సిబ్బంది, డాక్టర్లు తెలుపడంతో మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు చేశామని తెలియజేశారు. అంత్యక్రియల్లో 46 మంది పాల్గొనగా.. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మృతదేహాన్ని తాకినట్లు వెల్లడించారు. అంత్యక్రియల అనంతరం తమకు హాస్పిటల్ నుంచి మా నాన్నకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అల్వాల్ పోలీసుల ద్వారా సమాచారం అందినట్లు వివరించారు. -
నాగం జనార్ధన్రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత
-
ఈతకు వెళ్లి.. తండ్రి, కొడుకుల మృతి
నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. తిమ్మాజిపేటకు చెందిన బోయ గురువయ్య(40)కు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. పెద్ద కుమారుడు శివ(9)కు ఈత నేర్పేందుకు తండ్రి రోజూ గ్రామ శివారులోగల అమ్మ చెరువు సమీపంలోని వ్యవసాయ బావికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం వెళ్లిన వారు రాత్రి వరకు తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు సర్పంచ్ వేణుగోపాల్గౌడ్ను ఆశ్రయించారు. ఆయనతోపాటు గ్రామస్థులు అక్కడికి వెళ్లి చూడగా కొత్తబావి గట్టుపై దుస్తులు కనిపించాయి. బావిలో వెతుకగా శివ, గురువయ్యల మృతదేహాలు కనిపించాయి. మృతదేహాలను వెలికి తీసిన పోలీసులు జడ్చర్ల ఆసుపత్రికి తరలించారు. -
రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ
తెలంగాణకు తలమానికం వంటి పశు జాతి ‘పొడ తూర్పు’. తూర్పు కనుమల్లోని అమ్రబాద్ టైగర్ రిజర్వ్ నల్లమల అటవీ ప్రాంతంలో విరాజిల్లుతున్న పశు జాతి ఇది. నాగర్కర్నూల్ (పాత మహబూబ్నగర్) జిల్లాలోని తూర్పు భాగాన రైతులు, పశుపోషకులు అయిన లంబాడాలు, గొల్లలు, చెంచులకు తరతరాలుగా జీవనాధారంగా నిలుస్తున్నందున ఈ పశుజాతికి ‘తూర్పు’ అనే మాట వచ్చింది. ఈ జాతి పశువుల దేహంపై పొడ మచ్చలు ఉండటంతో ‘పొడ తూర్పు’ అని పేరు వచ్చింది. స్థానికులు ‘పొడ ఎడ్లు’ అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ జాతి ఎడ్లు మెట్ట రైతులకు వ్యవసాయంలో పెద్ద భరోసాగా నిలుస్తున్నాయి. మెట్ట పొలాలను దున్నటంతో పాటు మాగాణుల్లో దమ్ము చేయడానికి, ఇతర వ్యవసాయ పనుల్లో పొడ ఎడ్లు బాగా పనిచేస్తాయి. ఎంత కష్టమైన పనైనా విసుగు విరామం లేకుండా కొనసాగించి పూర్తి చేయటం, చీటికి మాటికి జబ్బుపడకుండా ఉండటం, తక్కువ మేత, తక్కువ నీటితో కూడా మనగలగడం ఈ పశు జాతి ఎడ్లకున్న సుగుణాలు. అందుకే నాగర్కర్నూల్ ప్రాంత పశుపోషకులకు, రైతులకు పొడ ఎడ్లంటే అంత మక్కువ. వారి పండుగలు జాతర్లలో ఈ పశువులకు ప్రాధాన్యం ఉంటుంది. పొడ జాతి ఆవులు పాలు తక్కువగా ఇస్తాయి. అందుకే ఆ పాలను కూడా పూర్తిగా దూడలకే వదిలేసే పశుపోషకులు కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తారు. మూడేళ్ల క్రితం వాసన్ అనే స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు పొడ తూర్పు పశు జాతి విశిష్టతల గురించి, స్థానిక పశు సంరక్షక, వ్యవసాయ కుటుంబాల వారు తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షించుకుంటూ పొట్టపోసుకుంటున్న వైనం గురించి రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. 2016లో, 17లో పొడ ఎడ్ల మేళాలను ఏర్పాటు చేయటంతో ఈ జాతి ఎడ్లంటే వివిధ ప్రాంతాల, రాష్ట్రాల రైతులకున్న మక్కువ వెల్లడైంది. దీంతో తెలంగాణ పశుసంవర్థక శాఖ పొడ తూర్పు జాతి పశు జాతి జన్యు స్వచ్ఛతను కాపాడాలని సంకల్పించింది. కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు చెయ్యడం నిలిపివేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన 44వ పశుజాతి ఆ తర్వాత రెండేళ్ల పాటు ఈ జాతి పశు సంపద స్థితిగతులపై అధ్యయనం జరిగింది. స్థానిక రైతులు, పశుపోషకుల జీవితాలతో, వారి జీవనోపాదులతో ఈ పశు జాతి తరతరాలుగా ఎంత గాఢంగా పెనవేసుకొని ఉన్నదో అధికారికంగా గుర్తించడానికి ఈ అధ్యయనం తోడ్పడింది. సుమారు 450–500 వరకు లంబాడి, గొల్ల, ఎస్సీ కుటుంబాలు కేవలం పొడ తూర్పు పశు జాతి పోషణనే జీవనాధారంగా చేసుకొని జీవిస్తున్నారు. ప్రస్తుతం ఈ జాతి పశువులు 15,076 ఉన్నాయి. వీటికి ప్రత్యేకంగా మేత వేయటం, దాణా పెట్టడం అవసరం లేదు. పచ్చిక బయళ్లలో, అటవీ ప్రాంతంలో మేసే మేతే చాలు. ప్రత్యేకంగా మేత, దాణా వేయక్కరలేదు. ఈ నెల 19న కేంద్ర ప్రభుత్వానికి చెందిన జాతీయ పశు జన్యువనరుల బోర్డు(ఎన్.ఎ.పి.జి.ఆర్.) పొడ తూర్పు జాతి పశువులకు గుర్తింపునిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఎన్.ఎ.పి.జి.ఆర్. ఇప్పటికే 43 భారతీయ పశుజాతులను గుర్తించింది. తాజాగా గుర్తింపు పొందిన ‘పొడ తూర్పు’ 44వది. రైతుల కన్నా పశుపోషకుల ఆదాయం ఎక్కువ నాగర్కర్నూల్, పాత మహబూబ్నగర్ ప్రాంతంలో వర్షాధార వ్యవసాయమే ఎక్కువ. తరచూ కరువు పరిస్థితులను చవిచూసే ఈ ప్రాంత రైతులు వ్యవసాయంపై పొందే ఆదాయం కన్నా ‘పొడ తూర్పు’ పశువులను పెంచుకుంటూ జీవించే కుటుంబాల ఆదాయం ఎక్కువగా ఉన్నట్లు వాసన్ అధ్యయనంలో తేలింది. 110 మంది పశుపోషకులపై అధ్యయనం చేశారు. వీరంతా కలిసి ‘అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవు సంఘం’గా సంఘటితమయ్యారు. 80 నుంచి 120 పొడ తూర్పు ఆవులు, ఎద్దులు, దూడల మంద కలిగిన పశుపోషకుడు ఏటా 20 నుంచి 30 వరకు గిత్త దూడలను విక్రయిస్తూ, రూ. లక్షన్నర నుంచి రూ. 3 లక్షల వరకు ఆదాయం గడిస్తున్నారు. 8 నుంచి 15 నెలల గిత్త దూడల ధర రూ.8 వేల నుంచి 15 వేల వరకు పలుకుతోంది. రెండున్నర ఏళ్ల వయసు నుంచి 20 ఏళ్ల వయసు వరకు వ్యవసాయ పనుల్లో ఈ గిత్తలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఐదెకరాల మెట్ట భూమిలో వ్యవసాయం చేసే రైతులు సైతం రూ. 30 వేలకు మించి ఆదాయం పొందలేకపోతున్న ఆ ప్రాంతంలో పొడ తూర్పు పశువులను పెంచి గిత్త దూడలను అమ్ముకునే పశుపోషకుల ఆదాయం చాలా ఎక్కువగా ఉందని వాసన్ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ ‘సాక్షి’తో చెప్పారు. మెట్ట ప్రాంత వ్యవసాయానికి చాలా అనువైన ఈ పశుజాతిని పరిరక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ గుర్తింపు ఇందుకు తోడ్పడుతుందని ఆయన అంటున్నారు. మేత కోసం నెలల తరబడి వలస దాదాపు 400 ఏళ్ల క్రితం నుంచి ఈ పశుజాతిని స్థానికులు పోషించుకుంటూ జీవనం గడుపుతున్నారని ఒక అంచనా. గతంలో నల్లమల అటవీ ప్రాంతంలో 15 కిలోమీటర్ల లోపలి వరకు వెళ్లి పశువులను మేపుకునే వారు. అయితే, అటవీ శాఖ అధికారులు ఇటీవలి కాలంలో మూడు కిలోమీటర్ల కన్నా లోపలికి అనుమతించడం లేదు. దీంతో శీతాకాలం నుంచే మేత దొరకడం గగనమైపోయింది. జనవరి నెల నుంచి మే, జూన్ నెల వరకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణాజిల్లాలకు పశువులతో వలస వెళ్లక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. పిల్లలతో సమానంగా ప్రేమిస్తాం! ముత్తాతల కాలం నుంచి పొడ(తూర్పు) ఎడ్లే మాకు జీవనాధారం. వీటితో మా జీవితాలకు విడదీయలేని అనుబంధం ఉంది. మా పిల్లలతో సమానంగా వీటిని మేం ప్రేమిస్తాం. మా తాతలు, తండ్రులు, మేము, మా పిల్లలు అందరం వీటిపైనే ఆధారపడి బతుకుతున్నాం. పిలిస్తే పలుకుతాయి మా ఎడ్లు. కొండలు, గుట్టలు ఎక్కి మేస్తాయి. విజిల్ వేస్తే చాలు చప్పున దిగి వస్తాయి. మా ప్రాంతంలో నెల క్రితమే మేత కరువైంది. మాకున్న 300 పొడ తూర్పు పశువులను తోలుకొని 15 రోజుల క్రితం గుంటూరు జిల్లాకు వలస వచ్చాం. ఇక్కడినుంచి కృష్ణా జిల్లాకు వెళ్తాం. మే, జూన్లో వర్షాలు కురిసి పచ్చిమేత మొలిచే వరకూ మాకు సంచార జీవనం తప్పదు. నేను గత పదిహేనేళ్లుగా ప్రతి ఏటా పశువులను తోలుకొని వలస వస్తూ ఉన్నాను. శ్రమ, ఖర్చు అయినా మాకు జీవనాధారమైన పశువులను రక్షించుకోవాల్సిందే. పొడ ఎడ్లకు ప్రభుత్వ గుర్తింపు రావటం సంతోషంగా ఉంది. ప్రభుత్వ ప్రోత్సాహం కావాలి. మా పశువులకు, మాకు, జీతగాళ్లకు బీమా కల్పించాలి. – గంటల హనుమంతు (96525 21052), అధ్యక్షుడు, అమ్రాబాద్ పొడ లక్ష్మి గోవుల సంఘం, బీకే లక్ష్మీపుర్ తండా, నాగర్కర్నూల్ జిల్లా గుర్తింపు వల్ల ఒరిగేదెమిటి? పొడ తూర్పు పశుజాతికి కేంద్ర ప్రభుత్వ గుర్తింపు రావడం వల్ల తరతరాలుగా ఈ పశుజాతిని పరిరక్షిస్తున్న స్థానిక గ్రామాల్లోని లంబాడాలు, గొల్లలు, చెంచులు, ఎస్సీలకు గ్రామ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమిటీల (బి.ఎం.సి.ల) ద్వారా ఈ పశుజాతిపై ప్రత్యేక హక్కులు దఖలుపడతాయి. అందువల్ల ఈ పశువులను పెంచే వారికి ప్రభుత్వ పథకాలు వర్తింపజేయడానికి వీలవుతుంది. ఈ ఎడ్లను, ఆవులను కొనుగోలు చేసే రైతులు బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు తీసుకోవచ్చు. ఫలితంగా పశుపోషకుల ఆదాయం పెరుగుతుంది. అంతేకాదు.. అటవీ హక్కుల చట్టం కింద కూడా పొడ తూర్పు పశుపోషకులకు హక్కులు సంక్రమిస్తాయి. అటవీ శాఖ స్థానిక పశుపోషకుల హక్కులను గుర్తించేందుకు, సానుకూలంగా స్పందించడానికి అవకాశం ఉందని వాసన్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ డా. సవ్యసాచిదాస్ (94408 04860) ఆశాభావం వ్యక్తం చేశారు. – పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఏసీబీకి చిక్కిన డిప్యూటి తహసీల్దార్
సాక్షి, నాగర్కర్నూల్ : కలెక్టరేట్లోని సి–సెక్షన్లో సూపరింటెండెంట్గా పనిచేస్తున్న డిప్యూటి తహసీల్దార్ జయలక్ష్మి సోమవారం సాయంత్రం రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. వివరాలిలా.. నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం మారెపల్లికి చెందిన దోమ వెంకటయ్య అనే రైతు అదే గ్రామానికి చెందిన బంధువులు విమల, విప్లవ, వికాస్ అనే వ్యక్తుల వద్ద 3 ఎకరాల 15 గుంటల భూమిని 2016లో కొనుగోలు చేశాడు. ఆ భూమిని తన పేరుపై పట్టా మార్చుకునేందుకు తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్ల గ్రామానికి చెందిన మల్లేష్ అనే వ్యక్తి 2006లో విమల, విప్లవ, వికాస్ల తాతయ్య బృంగి తిర్పతయ్య తనకు ఆ భూమిని ముందే అమ్మాడని, దోమ వెంకటయ్యకు పట్టా చేయవద్దంటూ తిమ్మాజీపేట తహసీల్దార్ కార్యాలయంలో పిటిషన్ వేశాడు. అప్పటినుంచి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇదే విషయమై నాగర్కర్నూల్ ఆర్డీఓ కార్యాలయంలో కేసు కూడా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వెంకటయ్య జేసీకి పిటిషన్ ఇచ్చేందుకు కలెక్టరేట్కు వచ్చిన క్రమంలో సి–సెక్షన్లో ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న జయలక్ష్మీతో పరిచయం ఏర్పడింది. ఈ వ్యవహారాన్ని తాను చక్కబెట్టి వెంకటయ్యకు అనుకూలంగా కేసు వచ్చేలా చూస్తానని డీటీ రూ.13లక్షలు డిమాండ్ చేసింది. చివరకు రూ.10 లక్షలకు బేరం కుదిరింది. ఒకేసారి అంత నగదు ఇవ్వలేకపోతే విడతలవారీగా ఇవ్వాలని జయలక్ష్మి కోరడంతో తన వద్ద అంత డబ్బు లేదని వెంకటయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుబడిందిలా.. ఫిర్యాదు స్వీకరించిన ఏసీబీ అధికారులు అవినీతి చేపను పట్టేందుకు వలపన్నారు. సోమవారం రూ.లక్ష అడ్వాన్స్గా డీటీ జయలక్షి్మకి వెంకటయ్య ఇచ్చేలా పతకం రచించారు. ముందుగా డీటీని వెంకటయ్య కలిసి డబ్బులు తెచ్చానని కోరగా కాసేపు అటుఇటు తిప్పి కలెక్టరేట్లోని ఓ గదిలో తీసుకరావాలని కోరారు. అనుకున్నట్టుగా డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి ఏసీబీ అధికారులకు చెప్పాడు. వెంటనే వారు దాడిచేసి రెడ్ హ్యాడెడ్గా çపట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు . కోర్టులో హాజరు పరుస్తాం రైతు వద్ద రూ.లక్ష లంచం తీసుకుంటూ రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు ఫిర్యాదును స్వీకరించి దాడులు చేశామని, అనుకున్నట్టుగానే డబ్బులు తీసుకుంటూ డీటీ పట్టుబడ్డారని తెలిపారు. ఇదే సమయంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో కూడా మరో బృందం తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీనెంబర్ 1064 కు ఫిర్యాదు చేయాలని కోరారు. దాడుల్లో ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. పాలమూరులో తనిఖీలు మహబూబ్నగర్ క్రైం: నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లోని డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న జయలక్ష్మీ సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సరిగ్గా అదే సమయంలో పాలమూరులోని ఆమె ఇంట్లో సైతం తనిఖీలు జరిగాయి. జయలక్ష్మీ నివాసం ఉండే మర్లులోని మహాలక్ష్మీ టవర్స్లోని 203 ఫ్లాట్లో ఏసీబీ సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేశారు. సాయంత్రం నుంచి రాత్రి 10 గంటల వరకు ఇంటిని మొత్తం తనిఖీలు చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి గదిని, బీరువాలు, ఇతర స్థలాలు అన్నింటిని పరిశీలించారు. ఇంట్లో దొరికిన డాక్యుమెంట్స్, ల్యాప్టాప్ను స్వా«దీనం చేసుకున్నారు. -
జూలు విదిల్చిన జూదం..!
సాక్షి, నాగర్కర్నూల్ క్రైం: జిల్లాలో పేకాట ‘మూడురాజాలు, ఆరు రాణులు’గా విచ్చల విడిగా సాగుతుంది. ఎంతో మంది పేకాటకు బానిసై తమ జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా రాజా, రాణిలతో సాహవాసం చేస్తూ పేకాటలో డబ్బులు పోగుట్టుకుని జోకర్లుగా మిగిలిపోతున్నారు. రోజుకు రూ.లక్షల్లో పేకాటలో డబ్బులు చేతులు మారుతున్నాయి. పట్టణంలోని లాడ్జీలు, ప్రైవేటు గృహాలు, పట్టణ, గ్రామాల్లోని శివారు ప్రాంతాలు పేకాటకు అడ్డాలుగా మారాయి. నిత్యం జిల్లాలో ఎక్కడో ఒక చోట పోలీసుల దాడుల్లో పేకాట రాయుళ్లు పట్టుబడటమే గాక రూ.లక్షల్లో నగదు, సెల్ఫోన్లు, వాహనాలను స్వాదీనం చేసుకుంటున్నారు. జిల్లాలో కొందరు వ్యక్తులు సురక్షిత ప్రాంతాలను అడ్డాగా చేసుకుని పేకాట శిబిరాలను నిర్వహిస్తూ రూ.లక్షలు సంపాదించుకుంటున్నారు. రహస్యంగా పేకాట జిల్లా పరిధిలోని నాగర్కర్నూల్, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్, ప్రాంతాల్లో చాలాకాలంగా పేకాట జోరుగా సాగుతుంది. పేకాట కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరి పేకాటను ఆడుతున్నట్లు సమాచారం. పట్టణాలలో, గ్రామ శివారు ప్రాంతాలు, వ్యవసాయ పొలాలను తమ అడ్డాలుగా మార్చుకుని పేకాట ఆడుతున్నారు. నగర శివారులు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎవరికీ అనుమానం రాదన్న ఆలోచనతో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు ఎన్నిసార్లు దాడులు చేసి పేకాటరాయుళ్లను అరెస్టు చేసినా.. వారు మాత్రం తమ పద్దతి మార్చుకోవడం లేదు. పోలీసు యంత్రాంగం పేకాటరాయుళ్లను మాత్రమే కాకుండా పేకాట నిర్వహకులపై గట్టి చర్యలు తీసుకుని బీద, మధ్యతరగతి కుటుంబాలను పేకాట ఊబిలోంచి బయటపడేలా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది 156 మంది అరెస్టు జిల్లా పరిదిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో గత సంవత్సరం పోలీసులు జరిపిన దాడుల్లో 156 మంది పేకాట రాయుళ్లను అరెస్టు చేయడమే కాకుండా వారి వద్ద నుండి రూ.3,62,080 నగదును స్వాదీనం చేసుకున్నారు. పోలీసుల దాడుల్లో సెల్ఫోన్లు, వాహనాలు అధికంగా పట్టుబడుతున్నాయి. ఇవిగో సంఘటనలు.. 23జూలై 2019 జిల్లా కేంద్రంలో సంతబజారులో ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి రూ.18,100 నగదును స్వాదీనం చేసుకున్నారు. 22 డిసెంబర్ 2019 బిజినేపల్లి మండలంలోని అనకాపల్లితండా శివారులో పేకాట ఆడుతుండగా 11మందిని అరెస్టు చేసి రూ.60వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 పిబ్రవరి 2020 బిజినేపల్లి మండల కేంద్రంలో ఓ ఇంట్లో పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేసి రూ.75,500, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని 10మందిని అరెస్టు చేశారు. కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైనా పేకాట శిబిరాలు నిర్వహిస్తేవారిపై కఠినచర్యలు ఉంటాయి. పేద, మధ్యతరగతి యువత పేకాట ఆడి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పట్టణ శివారులో, గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైనా పేకాట ఆడుతుంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. పేకాటలో పట్టుబడిన వారిపై కఠినచర్యలు తీసుకుంటాం. – గాంధీనాయక్, సీఐ, నాగర్కర్నూల్ -
స్వాతిరెడ్డి అరెస్ట్, జైలుకు తరలింపు
సాక్షి, నాగర్కర్నూలు : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భర్త సుధాకర్రెడ్డి హత్యకేసులో నిందితురాలైన స్వాతి రెడ్డిని పోలీసులు నిన్న (మంగళవారం) అరెస్ట్ చేశారు. కొంతకాలంగా కోర్టు కేసు వాయిదాలకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి ఇటీవల స్వాతికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. కాగా, నాగర్ కర్నూల్ పట్టణానికి చెందిన స్వాతిరెడ్డి ...కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి 2017 నవంబర్లో దారుణంగా హతమార్చింది. ఈ కేసులో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయగా కొంతకాలం జైలులో ఉంది. (స్వాతికి జామీను ఉపసంహరణ) 2018 జూలైలో బెయిల్పై వచ్చిన స్వాతి మహబూబ్నగర్ స్టేట్ హోంకు తరలించారు. కేసు విచారణలో భాగంగా నాగర్కర్నూల్జిల్లా కోర్టులో వాయిదాలకు ఆమె హాజరు కాకపోవడంతో జిల్లా నాలుగో తరగతి ఫాస్ట్ట్రాక్ కోర్టు న్యాయమూర్తి రవికుమార్ నాన్బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దీంతో స్టేట్ హోంలో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి నిన్న కోర్టులో హాజరు పరిచారు. అనంతరం మహబూబ్నగర్ జిల్లా జైలుకు తరలించారు. -
కృష్ణానదిలో.. ‘అలవి’ వేట!
సాక్షి, నాగర్కర్నూల్ : కృష్ణానదిలో నిషేధిత అలవి వలల వేట కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం నిషేధించినప్పటికీ దళారులు దందాను దర్జాగా కానిస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాలైన వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలో ఈ అక్రమ దందా నిర్వహిస్తున్నారు. పోలీసు, మత్స్యశాఖ అధికారులు దాడులు చేసి కేసులు నమోదు చేసినా, పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకోడం లేదు. మంగళవారం వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు వద్ద టాస్క్ఫోర్స్ అధికారుల దాడుల్లో ఏడు అలవి వలలు పట్టుబడ్డాయి. ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులు గద్వాల, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల పరిధిలోని కృష్ణానది తీర గ్రామాల మత్స్యకారులు, ప్రజలు దళారుల చర్యలతో ఉపాధి కోల్పోతున్నారు. ప్రతి ఏటా కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు సుమారు ఎనిమిది నెలల పాటు ఈ ప్రాంత మత్స్యకారులు చేపలు పట్టుకొని జీవనం సాగిస్తుంటారు. కొంత మంది దళారులు అత్యాశతో ఆంధ్రాలోని వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు తదితర ప్రాంతాల నుంచి జాలర్లను తీసుకొచ్చి అలివి వలలతో చేపలను పట్టిస్తుండడంతో చిన్నచిన్న చేపపిల్లలు కూడా ఈ వలలో చిక్కుకుని బయటికి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో స్థానిక మత్స్యకారులు నష్టపోతున్నారు. గుడారాల ముందు ఎండబెట్టిన చేపలు నిషేధం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం అలవి వలలను నిషేధించింది. అయినా కొందరు అక్రమ సంపాదనే ధ్యేయంగా వాటిని వినియోగిస్తూ చిన్న చేపలను సైతం వేటాడుతూ మత్స్ససంపదను కొల్లగొడుతున్నారు. వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, కొవ్వూరు ప్రాంతాలకు చెందిన మత్స్యకారులతో అలవివేటను చేయిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలోని మంచాలకట్ట, మల్లేశ్వరం, జటప్రోలు, సోమశిల, అదేవిధంగా వనపర్తి జిల్లా పరిధిలోని చిన్నంబావి, బెక్కెం, చెల్లపాడు, పెద్దమరూరు, చిన్నమరూర్, గ ద్వాల జిల్లా పరిధిలోని అలంపూ ర్, గొందిమళ్ల తదితర గ్రామాల పరిధిలోని కృష్ణాతీరంలో కొంత మంది దళారులు ఆంధ్రా మత్స్య కారులతో ఒప్పందాలు చేసుకొని అలవి వలలు ఉపయోగిస్తున్నారు. దీంతో ఈ వలల్లో చిక్కుకుని 5 గ్రాముల చిన్నచిన్న చేపలు కూడా బయటికి వస్తాయి. వాటన్నింటినీ ఆరబోసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చేపలు పెరిగి పెద్దయితే స్థానిక మత్స్యకారులకు ఉపాధి దొరుకుతుంది. రష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మత్స్యకారుల కోసం లక్షల చేపపిల్లలు నదిలో వదులుతుండగా అవి పెరిగి పెద్దవి కాకముందే దళారులు అలవి వలల ద్వారా వేటాడుతున్నారు. మత్స్యకారులు ఎన్నో సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. నెరవేరని ప్రభుత్వ లక్ష్యం కృష్ణానదిలో చేపలు పట్టేవారిలో ఎక్కువశాతం ఆంధ్రాకు చెందిన మత్స్యకారులే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతానికి చెందిన వారు దళారుల అవతారం ఎత్తి అక్కడి మత్స్యకారులకు అడ్వాన్స్లు ఇచ్చి వారితో చేపల వేట చేస్తున్నారు. కృష్ణానది మధ్య దీవుల్లో నివాసం ఉంటూ చేపల వేటకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం మత్స్యకారుల అభివృద్ధికి పెద్దపీట వేస్తూ లక్షలాది చేపపిల్లలను నదుల్లో, చెరువుల్లో వదిలి ఉపాధి కల్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. -
వాళ్లిద్దరూ కాంగ్రెస్ను మోసం చేసినవాళ్లే
సాక్షి, నాగర్ కర్నూల్: రాష్ట్రంలో ఫామ్ హౌస్ పాలన సాగుతోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. రుణమాఫీ చేయకుండా సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారని మండిపడ్డారు. మంగళవారం ఆయన కొల్లాపూర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వీళ్లిద్దరూ కాంగ్రెస్ పార్టీని మోసం చేసినవాళ్లేనని విమర్శించారు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి వెళ్లానన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి ఒక సంవత్సరం నుంచి కొల్లాపూర్లో ఏం అభివృద్ధి చేశాడో చెప్పాలని నిలదీశారు. తల్లిపాలు తాగి రొమ్ము విరిచినట్లుగా కాంగ్రెస్కు జూపల్లి ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి మోసం చేశారని మల్లు రవి పేర్కొన్నారు. టీఆర్ఎస్లో ఏ నాయకుడికి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ పార్టీతో బీజేపీకి రహస్య ఒప్పందముందని ఆయన ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయాల్లో సీఎం కేసీఆర్ బీజేపీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అన్ని వర్గాలకు సమన్యాయం చేసే పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 20కి 20 వార్డులు గెలుచుకుని చైర్మన్ను కైవసం చేసుకుంటుందని మల్లు రవి ధీమా వ్యక్తం చేశారు. చదవండి: మున్సిపల్ ఎన్నికలు: గీత దాటితే వేటే -
అచ్చంపేట ఆస్పత్రిలో దారుణం
అచ్చంపేట రూరల్: వైద్య నిర్లక్ష్యానికి తల్లి కడుపులోని బిడ్డ కడుపులోనే కన్నుమూసింది. మరికొద్ది నిమిషాల్లో భూమ్మీదకు రావాల్సిన గర్భస్థ శిశువు రెండు ముక్కలై ప్రాణాలు విడిచింది. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఓ గర్భిణికి వైద్యులు సాధారణ ప్రసవం చేస్తుండగా శిశువు తల భాగం మొండెం నుంచి వేరుపడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం అచ్చంపేట మండలం నడింపల్లికి చెందిన సాయిబాబు భార్య స్వాతి ఈ నెల 18న ఉదయం ప్రసవం కోసం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిలో చేరింది. గర్భిణి రిపోర్టులను పరిశీలించిన అనంతరం అదే రోజు ఉదయం 11 గంటలకు ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, వైద్యులు సుధారాణి, సిరాజుద్దీన్ ఆమెకు సాధారణ ప్రసవం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే తీవ్ర రక్తస్రావం అవుతుండటం, శిశువు తలభాగం బయటకు కనిపించడంతో బయటకు లాగేందుకు తీవ్ర ప్రయత్నం చేశారు. ఆ సమయంలో మొండెం నుంచి తల వేరుపడగా మొండెం మాత్రం గర్భిణి కడుపులోనే ఉండిపోయింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన వైద్యులు శిశువు పొట్ట నీరుతో నిండి ఉండటంతో బయటకు రావట్లేదని, మెరుగైన వైద్యం కోసం వెంటనే హైదరాబాద్ ఆసుపత్రికి వెళ్లాలని రెఫర్ చేశారు. అప్పటికే గర్భిణి పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన హైదరాబాద్లోని జజ్జిఖాన ఆస్పత్రికి తరలించారు. గురువారం ఆ ఆస్పత్రి వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటకు తీశారు. శిశువు తలభాగం లేకపోవడం చూసి వారు ఆశ్చర్యపోయారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి వైద్యులతో వాగ్వాదానికి దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఆస్పత్రిలోని ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. తమకు విషయం చెప్పకుండా పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ ఆసుపత్రికి రెఫర్ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్ తీసుకెళ్లాకే తెలిసింది.. బాధితురాలి భర్త సాయిబాబు మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రిల్లో తన భార్యకు పరీక్షలు చేయించినప్పుడు అందరూ బాగానే ఉందన్నారని చెప్పారు. అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు మాత్రం తన భార్యకు సీరియస్గా ఉందని చెప్పడంతోనే హైదరాబాద్కు తీసుకెళ్లామన్నారు. కానీ అక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత డాక్టర్లు చెబితేనే శిశువుకు తల లేని విషయం తెలిసిందన్నారు. తల్లి ప్రాణం కాపాడటానికే రెఫర్ చేశాం.. తల్లి గర్భంలో శిశువు పొట్ట లావుగా ఉందని రిపోర్టులలో చూశాక తెలిసిందని, ఆ విషయం కుటుంబ సభ్యులకు ముందుగానే చెప్పామని వైద్యులు సుధారాణి, తారాసింగ్ చెప్పారు. స్కానింగ్ రిపోర్టులో కూడా శిశువు బరువుగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పామన్నారు. మహిళకు మొదటిసారి అబార్షన్ జరగ్గా ప్రస్తుతం రెండో కాన్పుకు ఆస్పత్రికి వచ్చిందన్నారు. గర్భంలోని శిశువు తలభాగం మెత్తగా ఉండటంతోనే లాగే సమయంలో బయటకు వచ్చిందని చెబుతున్నారు. కాగా, శిశువు తల భాగం అచ్చంపేట ప్రభుత్వ సివిల్ ఆస్పత్రి పరిసరాల్లోనే ఉందని స్థానికులు అంటున్నారు. కలెక్టర్ విచారణ.. ఇద్దరిపై వేటు ఈ సంఘటనపై నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇన్చార్జి డీఎంహెచ్ఓ సుధాకర్లాల్ విచారణ చేపట్టారు. శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఆస్పత్రిలోనే ఉన్న కలెక్టర్... ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది, బాధిత కుటుంబ సభ్యులతో వేర్వేరుగా మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాల మేరకు ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ తారాసింగ్, డాక్టర్ సుధారాణిని సస్పెండ్ చేస్తూ డీఎంహెచ్ఓ ఉత్తర్వులు జారీ చేశారు. -
18 సంవత్సరాలు నిండకుండానే..
నాగర్కర్నూల్ క్రైం: తెలిసీ, తెలియని వయసులో మైనర్లు రోడ్లపై వాహనాలతో చక్కర్లు కొడుతూ ఆనంద పడుతున్నారు. అనుకోని సంఘటనలు జరిగి రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే ఈ ఆనందం కాస్త ఆవిరికావాల్సి వస్తుంది. చాలా రోజుల నుంచి నియోజకవర్గ పరిధిలో రోడ్లపై వాహనాలతో మైనర్లు హల్చల్ చేస్తూ.. వాహనదారులకు, పాదాచారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. రోడ్లపై మైనర్లు వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమైతే శిక్షను తల్లిదండ్రులు అనుభవించాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలో కొందరు మైనర్లు ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పకుండా, మరికొందరు మైనర్ల తల్లిదండ్రులే తమ పిల్లలకు వాహనాలను ఇచ్చి రోడ్లపైకి పంపుతున్నారు. ట్రాఫిక్ రూల్స్పై అవగాహన లేక మైనర్లు ఇష్టారీతిగా వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. 18 సంవత్సరాలు నిండకుండానే చాలా మంది మైనర్లు 18 సంవత్సరాలు నిండకుండానే వాహనాలు నడుపుతున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు వయస్సు లేదని తెలిసి కూడా వారే స్వయంగా వాహనాల్లో వెనుక కూర్చొని తమ పిల్లలతో వాహనాలను నడిపించి ఆనందపడుతున్నారు. కొందరు మైనర్లు పాఠశాలలకు ద్విచక్రవాహనాలను తీసుకుని వెళ్తున్నారు. టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాలను నడపాలంటే 18 సంవత్సరాల వయస్సు నిండి ఉండాలి. 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు రవాణా శాఖ ద్వారా జారీ చేసిన డ్రైవింగ్ లైసెన్స్లను పొందిన తర్వాత మాత్రమే వాహనాలను నడపాలి. కౌన్సెలింగ్ ఇచ్చినా.. పోలీసులు నిత్యం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడుతూనే ఉన్నారు. తనిఖీల సమయంలో పట్టుబడిన మైనర్లకు, వారి తల్లిదండ్రులకు పోలీస్శాఖ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ ఇచ్చినా పరిస్థితి మారడం లేదు. పోలీస్శాఖ ఇచ్చిన కౌన్సెలింగ్లను మైనర్ల తల్లిదండ్రులు పెడచెవిన పెట్టి తమ పిల్లలు మేజర్లు కాకుండానే, డ్రైవింగ్ లైసెన్సు లేకుండానే రోడ్లపైకి వాహనాలను తీసుకెళ్తుంటే చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. కట్టడి చేయకుంటే కష్టమే.. మైనర్ల తల్లి›దండ్రులు తమ పిల్లలకు 18 సంవత్సరాలు రాకుండా వాహనాలు నడపుతుంటే కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మైనర్ల దశలో ఉన్న పిల్లలకు ఆలోచన శక్తి తక్కువగా ఉండటంతో రోడ్లపైకి వాహనాలు తీసుకెళ్లడం లాంటివి చేస్తే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కొందరు మైనర్లు వాహనాలను వేగంగా నడుపుతూ పాదాచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కల్గిస్తున్నారు. మైనర్ల తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. తల్లిదండ్రులే బాధ్యత వహించాలి 18 సంవత్సరాలు నిండకుండా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారి తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. తనిఖీల సమయంలో వాహనాలు నడుపుతూ.. పట్టుబడిన మైనర్లు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇచ్చి రోడ్లపైకి పంపే తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మాధవరెడ్డి, ఎస్ఐ, నాగర్కర్నూల్ -
‘కొల్లాపూర్ రాజా బండారం బయటపెడతా’
సాక్షి, కొల్లాపూర్: తనపై తప్పుడు ఆరోపణలు చేసిన సురభి రాజా ఆదిత్య బాలాజీ లక్ష్మణ్ రావుపై రూ.10 కోట్లు పరువు నష్టం దావా వేస్తున్నట్లు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఆదివారం కొల్లాపూర్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తన ఇరవై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ తప్పుడు పని చేయలేదన్నారు. రాజకీయంగా చిన్న మచ్చ కూడా లేదని చెప్పారు. రేపు కొల్లాపూర్లో ఎన్టీఆర్ చౌరస్తాలో బహిరంగ సభను ఏర్పాటు చేసి కొల్లాపూర్ రాజా బాగోతం బయట పెడతానన్నారు. స్వార్థ రాజకీయాలు తెలియవని, ప్రజా సంక్షేమం, అభివృద్ధికే నిత్యం పాటు పడుతున్నానని జూపల్లి పేర్కొన్నారు. -
పోలీసులకు సవాల్
సాక్షి, నాగర్కర్నూల్ : జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గాల్లో ఇటీవల వరుస దొంగతనాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో కూడా ఇంటికి తాళాలు వేసి వెళ్లాలంటే కాస్త వెనకాముందు ఆలోచన చేస్తున్నారు. కమ్యూనిటీ పోలిసింగ్లో భాగంగా పోలీస్శాఖ తరఫున సీసీ కెమరాలు ఏర్పాటు చేయిస్తూ.. తరచూ కార్డెన్ సెర్చ్లు నిర్వహిస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. దొంగలు దర్జాగా వచ్చి తమ పని తాము చేసుకుని వెళ్లిపోతున్నారు. గత నెలరోజుల్లోనే జిల్లా కేంద్రంతో పాటు, నియోజకవర్గాల్లోఇంటికి తాళం భారీ స్థాయిలో చోరీలు జరిగాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో నేర పరిశోధనలో ముందడుగు వేయడంతోపాటు అసలు నేరాలే జరగకుండా చూడాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న పోలీసులకు జిల్లాలో దొంగలు రెచ్చిపోతూ సవాల్ విసురుతున్నారు. టెక్నాలజీ ఉన్నా.. సమగ్ర నేరస్తుల సర్వే పేరుతో పాత నేరస్తుల జీవన విధానం, స్థితి గతులు, వారి వివరాలు, వారికి సహకరిస్తున్న వారితో సహా వేలిముద్రలు, ఐరిస్ రికార్డు చేశారు. ఎక్కడ ఏ నేరం జరిగినా నేరస్తుడు ఎవరన్నది.. ఏ ప్రాంతం వాడన్నది క్షణాల్లో గుర్తించే విధంగా అధునాతన టెక్నాలజీని అనుసంధానం చేస్తున్నారు. కాగా పోలీసులు నేర పరిశోధనలో, ముందస్తు నేర నివారణలో పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ దొంగతనాలు ఆగడం లేదు. నేరాలు జరిగినప్పుడు పోలీసులు డాగ్స్క్వాడ్, క్లూస్ టీంతో బాగానే పరిశీలన, విచారణ చేస్తున్నా దొంగల ఆచూకీ అంతుచిక్కడంలేదు. సీసీ కెమెరాలు లేకనే.. దొంగతనాలు జరిగినప్పుడు వాటిని ఛేదించడంలో సీసీ కెమరాలు ఎంతో కీలకంగా పనిచేస్తాయి. జిల్లా కేంద్రంలో కేవలం ప్రధాన రహదారి, ముఖ్యమైన కూడళ్లలో మాత్రమే సీసీ కెమరాలు ఏర్పాటు చేయలేదు. చాలా గ్రామాల్లో సీసీ కెమరాలు ఏర్పాటు చేయకపోవడంతో దొంగలను గుర్తించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన చోరీలు ► ఈనెల 7న అర్ధరాత్రి తిమ్మాజిపేట మండలంలోని ఆవంచ, బుద్దసముద్రంకాలనీ, అమ్మపల్లి గ్రామాల్లో దొంగలు రెచ్చిపోయారు. ఏకకాలంలో తాళం వేసి ఉన్న 11 ఇళ్లలో చోరీలు జరిగాయి. తలుపులు పగలగొట్టి 15 తులాలకు పైగా బంగారం, రూ 58 వేలకు పైగా నగదు చోరీ చేసారు. ► ఈనెల 6న అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని రెండు వైన్ షాపుల్లో చోరీకి పాల్పడి రూ.27వేలకు పైగా నగదును ఎత్తుకెళ్లారు. ► ఈనెల 5న జిల్లా కేంద్రంలోని ఓంనగర్కాలనీలోని ఓ ఇంట్లో చోరీకి ప్రయత్నించడంతో ఇంటిపైన అద్దెకు ఉన్న వారు గుర్తించి కేకలు వేయడంతో దొంగలు పారిపోయారు. ► ఈనెల 3న నాగర్కర్నూల్ మండల పరి«ధిలోని తూడుకుర్తిలో రెండిళ్లలో దొంగలు పడి 108 తులాల వెండి గొలుసులు, కడియాలు, గొలుసులతో పాటు 4 తులాల బంగారం ఆభరణాలు దొంగిలించారు. ► అక్టోబర్ 31న బిజినేపల్లిలో కిరాణం షాపు తాళాలు పగలగొట్టి రెండు బంగారు ఉంగరాలు, నగదును తీసుకెళ్లారు. ► అక్టోబర్ 20న జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో దొంగలు ఇంటి తాళాలు విరగొట్టి బీరువాలోని వస్తువులను చిందరవందరగా పడవేసి చోరికి యత్నించారు. ► సెప్టెంబర్ 25న జిల్లా కేంద్రంలోని హౌజింగ్బోర్డు కాలనీలోని ఓ ఇంట్లో ఎవరూలేనిది చూసి రూ 80ల నగదును ఎత్తుకెళ్లారు. త్వరలోనే పట్టుకుంటాం చోరీలకు పాల్పడుతున్న వారిని త్వరలోనే గుర్తించి పట్టుకుంటాం. ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పిస్తాం. ఇప్పటికే జరిగిన చోరీలపై నిఘా కొనసాగుతోంది. ప్రజల భద్రతే లక్ష్యంగా పోలీస్శాఖ పనిచేస్తోంది. – మోహన్రెడ్డి, డీఎస్పీ, నాగర్కర్నూల్ -
ముగిసిన మద్యం టెండర్ల ప్రక్రియ
సాక్షి, నాగర్కర్నూల్ క్రైం: నూతన మద్యం పాలసీ 2019–21 కి సంబంధించి దుకాణాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ముగిసింది. లాటరీ పద్ధతిలో కేటాయింపు జరిగింది. జిల్లా కేంద్రంలోని సుఖజీవన్రెడ్డి గార్డెన్ ప రిసరప్రాంతంలో ఉదయం నుంచే కోలాహలం గా కనిపించింది. జిల్లాలోని 45 మద్యం దుకాణాలకు 1,064 టెండర్లు దాఖలయ్యాయి. లాట రీలో అదృష్టం వరించిన వారు సంబరాల్లో మునిగిపోగా దక్కని వారు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచి టెన్షన్టెన్షన్ జిల్లాలోని 45 మద్యం దుకాణాలకు సంబంధించి లాటరీ పద్ధతి ద్వార ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జేసీ శ్రీనివాస్రెడ్డి, భువనగిరి నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, ఈఎస్ గంగారాం ఆధ్వర్యంలో ప్రక్రియ నిర్వహించారు. ప్రతి మద్యం దుకాణానికి సంబంధించి టెండర్ దారుల ముందే లాటరీ తీసి డ్రాలో వచ్చిన వారికి దుకాణాన్ని కేటాయించారు. జిల్లాలోని 45 దుకాణాలకు 1,064 టెండర్లు రాగా డ్రాలో 40 మంది పురుషులకు, ఐదుగురు మహిళలకు దుకాణాలు దక్కించుకున్నారు. జిల్లా పరిధిలోని వంగూరు మద్యం దుకాణానికి అధికంగా 62 దరఖాస్తులు రాగా రంగారెడ్డి జిల్లాకు చెందిన జూలూరి నరేందర్ మద్యం షాపును దక్కించుకున్నారు. దుణాలను దక్కించుకున్న యజమానులు 1/8 వంతు లైసెన్సు ఫీజును ఎక్సైజ్ శాఖకు చెల్లించాల్సి ఉండగా మద్యం వ్యాపారులు అక్కడే ఏర్పాటు చేసిన బ్యాంకు కౌంటర్లలో నగదును చెల్లించారు. లైసెన్సు దక్కించుకున్నవారు నవంబర్ 1వ తేదీ నుంచి దుకాణాలను ప్రారంభించాల్సి ఉంది. స్థానికులకే దక్కిన దుకాణాలు ఈ ఏడాది ప్రభుత్వం రూ.2 లక్షలకు లైసెన్సు ఫీజును పెంచినా ఎన్నో ఏళ్లుగా మద్యం వ్యాపారంలో కొనసాగుతున్న వారితోపాటు కొత్తవారు సైతం తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిండికేట్గా మారారు. ఒక్కో సిండికేట్ నుంచి 20 నుంచి 30 దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. సిండికేట్గా మారిన మద్యం వ్యాపారులకు జిల్లాలో పలు షాపులు దక్కాయి. నాగర్కర్నూల్ సర్కిల్ పరిధిలోని 12 షాపులకు గాను స్థానికులే షాపులు దక్కించుకున్నారు. కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని 7 దుకాణాలకు గాను 5 స్థానికులకు వచ్చాయి. కొల్లాపూర్ దుకాణం మాత్రం రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తికి, పెంట్లవెల్లి దుకాణం హైదరాబాద్కు చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. అలాగే తెలకపల్లి సర్కిల్ పరిధిలోని 5 దుకాణాలకు గాను లింగాల షాపు హైదరాబాద్కు చెందిన వ్యక్తి, 4 షాపులు ఉమ్మడి జిల్లాకు చెందిన వారు దక్కించుకున్నారు. కల్వకుర్తి సర్కిల్ పరిధిలోని 11 షాపులకు గాను 8 షాపులు స్థానికులు దక్కించుకోగా, 2 షాపులు గుంటూరుకు చెందిన వ్యక్తులు, ఒక షాపు రంగారెడ్డికి చెందిన వ్యక్తి దక్కించుకున్నారు. అచ్చంపేట సర్కిల్ పరిధిలోని 10 షాపులకు గాను 8 షాపులు స్థానికులకే రాగా 2 మాత్రం నల్గొండ జిల్లాకు చెందిన వారికి వచ్చాయి. ఎందరికో నిరాశ టెండర్లలో జిల్లా వాసులతోపాటు పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యాపారులు జిల్లాలో చాలా ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు టెండర్లు దాఖలు చేయగా శుక్రవారం తీసిన లాటరీలో షాపులు దక్కక పోవడంతో నిరాశతో వెనుదిరిగారు. అదేవిధంగా ఈ ఏడాది మద్యం దుకాణాలకు మద్యం వ్యాపారులు వారి భార్యలు, కుటుంబంలోని లక్కున్న ఆడవారితో టెండర్లు వేయించగా కేవలం ఐదుగురికి మాత్రమే అవకాశం వచ్చింది. మిగతా వారు నిరాశతో వెనుదిరిగారు. ఉదయం నుంచే కోలాహలం జిల్లా కేంద్రంలోని సుఖజీవన్రెడ్డి గార్డెన్స్లో నిర్వహించిన మద్యం దుకాణాల డ్రా కోసం ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొంది. భారీస్థాయిలో వాహనాలు నిలిచిపోయాయి. టెండర్దారులు, మద్యం వ్యాపారులు, వారి మిత్రులు చేరుకోవడంతో జాతరను తలపించింది. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పాసులు ఉన్న వారిని మాత్రమే పోలీసులు క్షుణ్ణంగా తనిఖీచేసి లోనికి అనుమతించారు. డ్రా జరిగే ప్రదేశంలో వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయక పోవడంతో రోడ్లపైనే వాహనాలను నిలిపివేశారు. డ్రా తీసే పరిసర ప్రాంతలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఆరీఫ్పాష, ఎక్సైజ్సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. -
ఏసీబీ వలలో నాగర్ కర్నూల్ ఎస్ఐ
-
బస్సుకు తప్పిన పెను ప్రమాదం
-
పల్లెల్లో ‘క్రిషి’
సాక్షి, నాగర్కర్నూల్: పాడిపశువులతో పాటు పాల ఉత్పత్తులు పెంచడానికి పశుసంవర్ధక శాఖ తగు చర్యలు చేపట్టింది. వాటిని నమ్ముకున్న రైతులకు ఆదాయం పెంచడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్రీయ గోకుల్ మిషన్లో భాగంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని 500 గ్రామాల్లో క్రిషి కల్యాణ్ అభియాన్ అమలు చేయాలని నిర్ణయించారు. పశువుల్లో కృత్రిమ గర్భధారణ చేపట్టి పశు సంతానోత్పత్తిని పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పశు సంతానోత్పత్తి ఆశించినంతగా లేదు. మగ పశువులు అందుబాటులో లేకపోవడం, ఉన్న వాటిలో మంచి బీడ్ర్ కాకపోవడం, పశువులు ఎదకు వచ్చినప్పుడు రైతులు గుర్తు పట్టకపోవడం తదితర కారణాల వల్ల సహజ సిద్ధ విధానంలో పశు సంతానోత్పత్తి ఆశించినస్థాయిలో జరగడం లేదని పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఫలితంగా పాల దిగుబడీ పెరగడం లేదు. దీనిని అధిగమిచేందుకు గాను గేదెలు, ఆవుల్లో కృత్రిక గర్భధారణను చేపట్టేందుకు కేంద్రం, పశు సంవర్ధకశాఖ చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అమలు చేయనున్న గ్రామాలను గుర్తించారు. దీనిపై ఈపాటికే వెటర్నరీ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి గ్రామంలో 200 పాడి పశువులకు.. ఈ పథకంలో భాగంగా ఎంపిక చేసిన ప్రతి గ్రామంలో పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన 200 పాడి పశువులను గుర్తిస్తారు. వీటికి ఆవులు, ముర్రా గేదెలకు ఐఎన్ఏపీహెచ్ టాగింగ్ వేసి ఉచితంగా కృత్రిమ గర్భధారణ ఇంజెక్షన్లు వేయనున్నారు. దీనిని అమలు చేసేందుకు ప్రతి జిల్లాలో వంద గ్రామాలను జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారులు గుర్తించారు. ఇలా మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నారాయణపేట, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి మొత్తం 500 గ్రామాల్లో జిల్లాకు 20వేల పశువుల చొప్పున పశువులకు కృత్రిమ గర్భధారణ చేయించనున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి విడతగా ఈ నెలాఖరు నుంచి 2020 మార్చి వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పశువులు, గేదెలకు కృత్రిమ గర్భధారణ నిమిత్తం టెక్నీషియన్కు రూ.50, దూడపుట్టిన తర్వాత మరో రూ.వంద చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుంది. వారు ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. పశుసంవర్ధక శాఖ వైద్యులు, సిబ్బంది ఆయా గ్రామాల్లో పర్యటించి ఉచితంగా పశువులకు ఎద సూది ఇవ్వనున్నారు. అలాగే వాటిలో రోగ నిరోధకశక్తి పెంపొందించడానికి మందులు వేస్తారు. వచ్చే ఆరు నెలల్లోనే కృత్రిమ గర్భధారణను 40శాతానికి పెంచాలని పశు సంవర్ధకశాఖ భావిస్తోంది. రైతుల వద్ద ఉన్న ఆవులు, గేదెలకు మేలు జాతికి చెందిన పశువుల వీర్యాన్ని మాత్రమే ఎక్కిస్తారు. గేదెలకు ముర్రజాతి, ఆవులకు జెర్సీ, హెచ్ఎఫ్, ఒంగోలు, సాయివాల్, గిర్ తదితర జాతులకు చెందిన పశువుల వీర్యాన్ని వినియోగిస్తారు. తమ వద్ద ఉన్న పశువులకు ఏ జాతి వీర్యం కావాలన్నది రైతులు నిర్ణయించుకోవచ్చు. ఈ సమయంలో పశు సంవర్ధకశాఖ అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వృద్ధి చెందనున్న పాడిరంగం ఉమ్మడి జిల్లాలో గోజాతి, గేదె జాతి పశువులు కలిపి మొత్తం 6,76,072 ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. పాలిచ్చే వాటినే అంచనా వేస్తే వీటి ద్వారా నిత్యం సుమారు ఐదు లక్షల లీటర్ల పాల దిగుబడి ఉంది. ఈ ఏడాది ఆఖరులోగా 20వేల పశువులకు కృత్రిమ గర్భధారణ విధానాన్ని అమలు చేస్తే ఇప్పుడున్న పాల దిగుబడి మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పశుసంతానోత్పత్తితో పాటు పాల ఉత్పత్తి పెరగడం వల్ల రైతులు ఆర్థికంగా మరింత బలోపేతమయ్యే అవకాశం ఉంది. పాడి రైతులకు ఎంతోమేలు క్రిషి కల్యాణ్ అభియాన్తో పాడి రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది. జిల్లాలో ఇప్పటికే వంద గ్రామాలను గుర్తించాం. ఒక్కో గ్రామంలో 200పశువులకు గర్భధారణ సూదులు ఇప్పిస్తాం. దీనిని గోపాలమిత్రలు, వెటర్నరీ సిబ్బంది ద్వారా అమలు చేస్తాం. ఇప్పటికే వారి శిక్షణ ఇచ్చాం. – అంజిలప్ప, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, నాగర్కర్నూల్ -
సేవ్ నల్లమల
సాక్షి, నాగర్కర్నూల్: కొన్నిరోజులుగా సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరి నోటా ‘సేవ్ నల్లమల’ అనే మాటే వినపడుతోంది. సోషల్మీడియాలో ఇప్పుడు ఇదే హాట్టాపిక్. దేశంలో తరగని సంపద ఉందని.. దానికంటే ప్రజల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని అందరూ కోరుతున్నారు.. ఇదే విషయమై ఆదివారం సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో తవ్వకాలకు అనుమతి ఇవ్వబోమని నల్లమల ప్రజలకు భరోసా ఇచ్చే మాటిచ్చారు. ఆందోళన సినీ రంగాన్ని కూడా కదిలించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జనసేన అధినేత, సినీ హీరో ప్రవన్ కళ్యాణ్, దేవరకొండ విజయ్, యాంకర్లు, డైరెక్టర్లు యురేనియానికి వ్యతిరేకంగా మద్దతు తెలిపారు. భావితరాలకి, బంగారు తెలంగాణ ఇస్తారా.? యురేనియం కాలుష్య తెలంగాణ ఇద్దమా? అని ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఆలోచించాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. యురేనియం కొనొచ్చు.. కానీ అడవిని కొనగలమా? యురేనియం కోసం నల్లమలను నాశనం చేస్తారా అని సినీనటుడు విజయ్ దేవరకొండ ట్విట్ చేస్తూ ఉద్యమానికి మద్దతు తెలిపారు. వీరిదారిలోనే రాహుల్ రామకృష్ణ, దర్శకుడు శేఖర్ కమ్ముల, సురేంధర్రెడ్డి, నాగ్ ఆశ్విన్, ఆడివి శేష్, నటి సుమంత, రామ్, వరుణ్తేజ్, సాయితేజ్, అనసూయ, వివి వినాయక్ యురేనియానికి వ్యతిరేకంగా ట్విట్ చేస్తూ సేవ్ నల్లమల ఉద్యమానికి మద్దతు తెలిపారు. నల్లమలలో యురేనియం త్వవకాలకు వ్యతిరేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు నినాదాలు చేసి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వంలో కదలిక.. సీఎం ప్రకటనతో ఊరట సేవ్ నల్లమల ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించింది. దీనిపై రెండు రోజుల క్రితం కేటీఆర్ సీఎం దృష్టికి తీసికెళతామని, ప్రజల ఉద్యమాన్ని పరిగణంలోకి తీసుకుంటామని చెప్పిన విధంగానే ఆదివారం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ యురేనియం తవ్వకాలను అనుమంతిచబోమని ప్రకటించారు. యురేనియం తవ్వకాలకు ప్రభుత్వం ఎవరికి అనుమతులు ఇవ్వలేదని, ఇచ్చే ఆలోచన కూడా లేదని, భవిష్యత్లో కూడా ఇవ్వబోమన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. గతంలో 2009లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని, కడపలో తవ్వుతున్నారని, రైతాంగానికి అన్నం పెట్టే ప్రధానమైన కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జుసాగర్ ప్రాజెక్టులు కలుషితమై నాశనం అయ్యే పరిస్థితి ఉందని, హైదరాబాద్ కూడా దెబ్బతినే పరిస్థితి ఉండటం చేత ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వమని, ఇదీ ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణ యమని స్పష్టం చేశారు. కేంద్రం గట్టిగా పట్టుపడితే అందరం కలిసి కొట్లాడుద్దామని సీఎం ప్రకటించారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున యురేనియం పరిశోధన, తవ్వకాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని, భవిష్యత్లో ఇవ్వ బోదని మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ శాసన మం డలిæలో స్పష్టం చేశారు. దీనిని సంతృప్తి చెందని ఈ ప్రాంత ఉద్యమకారు లు సీఎం ప్రకటనను స్వాగితిస్తూనే మన పోరాటంతో అప్రమత్తంగా ఉండాలని, ప్ర మాదం ఏరూపంలోనైనా ముంచుక రా వచ్చని ప్రకటించింది. సీఎం ప్రకటన వల్ల ఉద్యమం నిలిచిపోతుందా! యథావిధిగా కొనసాగిస్తారనే దానిపై స్పష్టత రాలేదు. మేమెప్పుడూ ప్రజాపక్షం.. నల్లమల సురక్షితం తాను ముందు నుంచి చెబుతూనే ఉన్నా.. యురేనియం తవ్వకాలు జరిగితే ప్రజల పక్షాన తానే ముందుండి పోరాడతానని. ప్రతి పక్షాల కుట్రలను సీఎం కేసీఆర్ పటాపంచలు చేశారు. యురేనియం నిక్షేపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్లో కూడా ఇవ్వబోమని సీఎం తేల్చి చెప్పారు. ఇదీ ప్రకృతి పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వంకు ఉన్న నిబద్దత. నల్లమల సురక్షితంగా ఉంటుంది. తాను సంతకాలు పెట్టారని కాంగ్రెస్ నాయకులు గగ్గోలు పెట్టి ప్రజల్లో భయాందోళనలు సృష్టించారు. – గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే అచ్చంపేట -
నిబంధనలు పాటించని కళాశాలల మూసివేతలు
సాక్షి, మహబూబ్నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రస్తుతం ప్రైవేటు జూనియర్ కళాశాలలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొటున్నాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలల పూర్తవుతున్నా పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేక, అధ్యాపకులు రాక నిర్వహణ భారమై మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రభుత్వం గురుకులాలు, కేజీబీవీల్లో పూర్తి స్థాయిలో ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రాకపోవడం కూడా ఓ కారణంగా చెప్పవచ్చు. కాస్త ఆర్థికంగా ఉన్న వారు హైదరాబాద్, ఇతర పట్టణాలకు పంపించి ఇంటర్ విద్య చదివిస్తున్నారు. పెరిగిన అడ్మిషన్లు ప్రైవేటు కళాశాలల్లో పేదలు, సామాన్య కుటుంబాలకు చెందిన పిల్లలను ప్రభుత్వం సర్కారు కళాశాలలకు మళ్లించడంలో విజయవంతం అయిందనే చెప్పాలి. ఇది శుభ పరిణామం కూడా. కేవలం ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే ప్రభుత్వ కళాశాలల్లో దాదాపు 3,300 అడ్మిషన్లు గత సంవత్సరం కంటే పెరిగాయి. అయితే గత సంవత్సరం కళాశాలలను సరిగ్గా నిర్వహించలేదని, పూర్తి స్థాయిలో అడ్మిషన్లు లేవని గమనించిన అధికారులు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాలో కలిపి మొత్తం 5 ప్రైవేటు కళాశాలలు అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్నా ఈ విద్యాసంవత్సరం నుంచి అడ్మిషన్లు తీసుకునేందుకు అనుమతిని నిరాకరించారు. ఉమ్మడి జిల్లాలో ఈ సంఖ్య పదుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాక ప్రతి సంవత్సరానికి ఒక సారి అఫ్లియేషన్ కోసం కళాశాలలు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు చేసుకున్న చాలా కళాశాలలకు ప్రభుత్వం గుర్తింపు ఇంకా మంజూరు చేయలేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నాణ్యతా, ప్రమానాలు పాటించే కళాశాలలకు మాత్రమే అనుమతి మంజూరు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. 37 కళాశాలలకు పెండింగ్.. జిల్లాలోని 37 ప్రైవేటు కళాశాలలకు ఇప్పటికి ప్రభుత్వ అఫ్లియేషన్ ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 109 ప్రైవేటు కళాశాలలు ఉంటే ఇప్పటివరకు అనుమతి ఇచ్చింది 72 కళాశాలలకు మాత్రమే. గద్వాల్లో 6 కళాశాలలు, వనపర్తిలో 13 కళాశాలలు, నాగర్కర్నూల్ 14 కళాశాలలు, మహబూబ్నగర్, నారాయణపేట కలిపి మొత్తం 39 కళాశాలలకు మాత్రమే అఫ్లియేషన్ ఇచ్చింది. ఇక నిబంధనల ప్రకారం గత సంవత్సరం కళాశాలలను నిర్వహించని కళాశాలలను అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న, వాటికి కనీసం అడ్మిషన్లు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఈ క్రమంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ జూనియర్ కళాళాల, భవిత, న్యూఎరా, మక్తల్లో సాయి చైతన్య, మద్దూర్లో వివేకానంద జూనియర్ కళాశాలలను ప్రభుత్వం అడ్మిషన్లకు అనుమతి నిరాకరించింది. అంతేకాకుండా అఫ్లియేషన్ ఇవ్వని 37 కళాశాలల్లో కూడా కొన్ని కళాశాలలు మాత్రమే పూర్తి స్థాయిలో నిబంధనల ప్రకారం కళాశాలలు నిర్వహిస్తున్నారని, చాలా కళాశాలలో ప్రభుత్వ నిభంధనల ప్రకారం నిర్వహించడం లేదని అధికారులు అంటున్నారు. గద్వాల జిల్లాలో చాలా జూనయర్ కళాశాలలు రేకుల షెడ్డుల్లో నిర్వహిస్తున్నారని, వాటిని అనుమతి వచ్చే అవకాశం లేదని తెలస్తుంది. ఇవీ నిబంధనలు.. కళాశాలలకు అనుమతి ఉండాలంటే ముఖ్యంగా ఆర్సీసీసీ బిల్డింగ్ సొంతమా లేక, అద్దె భవనమా అని చూసి కళాశాలకు తరగతులకు నాలుగు సెక్షన్ల వరకు అనుమతి ఉంటుంది. ఇక ప్లే గ్రౌండ్ విషయంలో మున్సిపాలిటీ పరిధిలో ఉంటే ఒక ఎకరా భూమిని, అర్బన్ ప్రాంతంలో ఉంటే 2.5 ఎకరాలు ఉన్నట్లు ప్రభుత్వానికి చూపించాలి. ఇక పారిశుద్ధ్య విషయంలో విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు, వాష్బేసిన్లు, శుద్ధజలం వంటి వాటికి ముఖ్యమైనవి. స్ట్రక్షర్ సౌండ్ ఎఫెక్ట్కు సంబంధించి ఆర్అండ్బీ నుంచి అనుమతి, ఫైర్సేఫ్టీకి సంబంధించి ఎఫ్ఆర్డీ నుంచి అనుమతి తీసుకోవాలి. తరగతుల వారిగా సీసీ కెమెరాల ఏర్పాటు తప్పనిసరి. ఇక ల్యాబరోటరీలు, ఫిజిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, జువాలజీ వేరువేరుగా ప్రత్యేక ల్యాబ్లను ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక లైబ్రరీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి పుస్తకాలు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ప్రతి కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ ఉండాలి. అధ్యాపకుడి పూర్తి వివరాలు, ఒరిజినల్ సర్టికెట్లను ఆన్లైన్ పద్ధతిలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి ఆ శాఖల నుంచి అనుమతి పత్రాలను ప్రభుత్వానికి ఒరిజినల్వి పంపాలి. అన్ని ధ్రువీకరణ పత్రాలు సరిగ్గా ఉంటే అప్పుడు బోర్డు అధికారులు తనిఖీలకు వెళ్లి అనుమతిని ధ్రువీకరిస్తారు. ప్రభుత్వ కళాశాలల్లో పెరిగిన అడ్మిషన్లు ప్రభుత్వ కళాశాలలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ఎక్కువ మొత్తంలో విద్యార్థులను ప్రభుత్వ కళాశాలోల్లో చేర్పించేందుకు కృషి చేస్తోంది. ఇటీవల కస్తూర్బా గాంధీ కళాశాలల్లో నియోజకవర్గానికి రెండు చొప్పున 22 కేజీబీవీల్లో ఇంటర్మీడియట్ విద్యను ప్రభుత్వం ప్రారంభించింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల్లాలో కూడా పెద్ద సంఖ్యలో ప్రారంభించడంతో విద్యార్థులు అక్కడ అడ్మిషన్లు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఎటువం టి ఫీజులు లేకుండా పుస్తకాలు, వసతి, యూనిఫాం లతో పాటు నాణ్యమైన విద్య అందించడం తో అటువైపు చాలా మంది విద్యార్థులు వెళ్తున్నా రు. వీటితో పాటు ఇంటర్ జూనియర్ కళాశాల ల్లో కూడా పూర్తిగా ఉచిత విద్యను అందించడం తో విద్యార్థులు అక్కడే ఆసక్తి చూపుతున్నారు. ఒక్క మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు 3,300 అడ్మిషన్లు గతంలో కంటే పెరిగాయంటే పరిస్థితి అర్థం అవుతుంది. ఈ కారణాలతో ప్రైవేటు కళాశాలల్లో అడ్మిషన్లు కరువయ్యాయి. నిబంధనలు పాటిస్తేనే అనుమతి జిల్లాలో అఫ్లియేషన్ కోసం దరఖాస్తులు చేసుకున్న కళా శాలలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే అనుమతి లభిస్తుంది. నిబంధనలు ఖాతరు చేయని కళాశాలలకు అడ్మిషన్లు నిలిపివేశాం. అప్లియేషన్ రాని కళాశాలలు పూర్తి స్థాయిలో అన్ని వివరాలను సకాలంలో సమర్పిస్తేనే అనుమతి ఇస్తాం. ప్రభుత్వ కళాశాలల్లో ఉచితంగా విద్యను అందించడం వల్ల చాలా వరకు అక్కడ అడ్మిషన్లు పెరిగాయి. – వెంక్యానాయక్, ఇంటర్మీడియెట్ అధికారి -
నల్లమలలో యురేనియం రగడ
సాక్షి, నాగర్కర్నూల్: యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నల్లమలలో ఉద్యమాలు ఉధృతం అవుతున్నాయి. యురేనియం తవ్వకాలు జరపొద్దంటూ ఓ వైపు పర్యావరణ శాస్త్రవేత్తలు, ప్రజా సంఘాలు, రాజకీయ పారీ్టలు, స్థానిక ప్రజలు ఆందోళనలు చేపడుతుండగా.. మరోవైపు తవ్వకాలకు సంబంధించిన సన్నాహాలను యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ముమ్మరం చేసింది. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంతంలో 21 వేల ఎకరాల విస్తీర్ణంలో నమూనాల సేకరణకు కేంద్ర అణుశక్తి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని మొత్తం 83 కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం నిల్వల పరిమాణం, నాణ్యతలను తెలుసుకునేందుకు అనుమతిం చాలని తెలంగాణ అటవీ శాఖను కోరింది. అందుకనుగుణంగా నాగర్కర్నూలు జిల్లా అటవీశాఖ అధికారులు నివేదికలను తయారు చేసినట్లు సమాచారం. అయితే బోర్లు ఎక్కడెక్కడ వేస్తారన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో ముందే బోర్ పాయింట్లను గుర్తించేందుకు జియాలజిస్టులను రంగంలోకి దింపారు. ఇప్పటికే నల్లగొండ జిల్లా దేవరకొండకు చేరుకున్న 30 మంది జియాలజిస్టులు నేడో, రేపో నాగర్కర్నూలు జిల్లా పరి«ధిలోని నల్లమలకు వచ్చే అవకాశం ఉంది. జీవ వైవిధ్యానికి తీవ్ర నష్టం ప్రకృతి సంపద, జీవ వైవిధ్యానికి పెట్టింది పేరైన అటవీ ప్రాంతంలో యురేనియం నమూనాల సేకరణకే 4వేల బోర్లు వేయనుండటంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. యురేనియం అన్వేషణకు నాగర్కర్నూలు జిల్లా ఉడిమిల్ల, పదర, నల్లగొండ జిల్లా అటవీ డివిజన్లోని నారాయణ పురం నల్లమల పెద్ద పులుల రక్షిత ప్రాంతంలో 4 వేల బోర్లు వేస్తామని ఏఎండీ పేర్కొంది. బోర్ల తవ్వకాలు, వాహనాల శబ్దాలు, జన సంచారంతో నల్లమల అటవీ ప్రాంతానికి, పెద్ద పులులతో సహా వన్యప్రాణులకు తీవ్ర నష్టం జరుగనుందనే ఆం దోళన వ్యక్తం అవుతుంది. యురేనియం తవ్వకాలు జరిగే ప్రదేశంలో వెలువడే కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల కేన్సర్, చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. యురేనియం శుద్ధికి కృష్ణా జలాలను వినియోగిస్తే మత్స్య సంపద నాశనమవుతుందని పర్యావరణ వేత్తలంటున్నారు. అలాగే హైదరాబాద్ వాసులకు మంచి నీరు బదులు విషపు నీరు సరఫరా అవుతుందని, నాగర్కర్నూలు, వనపర్తి, గద్వాల, మహబూబ్నగర్, నల్లగొండతో పాటు ఏపీలోని గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాలు దెబ్బతింటాయని వెల్లడిస్తున్నారు. వ్యతిరేక ఉద్యమాలు ఉధృతం.. నల్లమలలో 112 చెంచుపెంటల్లో దాదాపు 12 వేల మంది చెంచులు నివసిస్తున్నారు. యురేనియం తవ్వకాలకు అనుమతి ఇవ్వడం వల్ల అడవిని నమ్ముకొని జీవిస్తున్న చెంచులు తమ అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం వచి్చంది. సుమారు 70 రకాల వన్యప్రాణులకు కూడా ముప్పు కలగనుంది. అమ్రాబాద్, పదర మండలాల పరిధిలోని దాదాపు 18 గ్రామ పంచాయతీలు ప్రమాదంలో పడనున్నాయి. దీంతో యురేనియం తవ్వకాల వల్ల ఆ చెంచు జాతిని మరింత ప్రమాదంలోకి నెట్టే ప్రయత్నాలపై ప్రజా సంఘాలు, పారీ్టలు పోరాటానికి సిద్ధం అవుతున్నాయి. యురేనియంను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ ఉద్యమానికి సిద్ధం కావడం, జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ కూడా యురేనియం తవ్వకాలను జరపొద్దంటూ ప్రకటించడం, కోదండరాం, రేవంత్రెడ్డి ఇప్పటికే నల్లమలలో పర్యటించడంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9న నల్లమల బంద్ కూడా విజయవంతమైంది. జిల్లాకు జియాలజిస్టులు రాలేదు యురేనియం తవ్వకాల సర్వే కోసం బోర్పాయింట్లు గుర్తించేందుకు జిల్లాకు జియాలజిస్టులు రాలేదు. కేంద్ర అణుశక్తి సంస్థ నుంచి వచ్చిన ప్రతిపాదనలకు అనుగుణంగా ఆమ్రాబాద్, పదర మండలాల పరిధిలో దాదాపు 21 వేల ఎకరాలు భూమి కావాల్సి ఉంటుంది. అందులో 4 వేల బోర్లు వేయనున్నారు. బోర్వెల్స్ గుర్తించిన పాయింట్లకు ఏవిధంగా వెళ్లాలి. బోర్ పాయింట్లు ఎక్కడనేది స్పష్టత వస్తే ప్రభావంపై అంచనా వేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి నివేదికలు పంపలేదు. – జోజి, జిల్లా అటవీశాఖ అధికారి, నాగర్కర్నూల్ -
పదవుల కోసం పాకులాడను
సాక్షి, కొల్లాపూర్: పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాదని, తెలంగాణ సాధన కోసం మంత్రి పదవినే త్యాగం చేసిన నిఖార్సైన టీఆర్ఎస్ పార్టీ నాయకుడినని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం పట్టణంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..తాను పార్టీ వీడి ఇతర పార్టీలో చేరుతున్నట్లు ఇటీవలి కాలంలో కొందరు వ్యక్తులు సోషల్మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పోస్టింగ్లు పెట్టిన నాగరాజు ముచ్చర్లతో పాటు, మూలె కేశవులు అనే వ్యక్తిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతోపాటు వారిపై రూ.కోటి పరువు నష్టం దావా వేస్తానన్నారు. మితిమీరి ప్రవర్తించే వారికి తగిన బుద్ది చెబుతామన్నారు. తాను కారు గుర్తు ఉన్న టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నానని వెల్లడించారు. ఉద్యమ సమయంలో, అభివృద్ధి అంశాల్లో ఎప్పుడూ ప్రజల పక్షానే ఉన్నానని, టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కొనసాగానే తప్పా అధికారం కోసం పార్టీ మారలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం, కేసీఆర్కు చేదోడుగా ఉండాలనే సంకల్పంతో టీఆర్ఎస్లో చేరానని, పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించానన్నారు. సమావేశంలో ఎంపీపీ కమలేశ్వర్రావు, నాయకులు మేకల నాగరాజు, పసుపుల నర్సింహ్మ, నరసింహ్మారావు, ఎక్బాల్ తదితరులున్నారు. -
ఎస్సై చిత్రహింసలు: ఢిల్లీలో ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ : తమ పార్టీ కార్యకర్తను చిత్రహింసలకు గురి చేస్తున్నారని నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి ఎస్సై వెంకటేష్పై జాతీయ బిసి కమిషన్కు బీజేపీ నాయకుడు దిలీపాచారి ఫిర్యాదు చేశారు. పక్షపాతం లేకుండా న్యాయంగా వ్యవహరించాల్సిన పోలీసులు టీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ఎస్సైను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దిలీపాచారి ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఘటనపై పూర్తి విచారణ జరిపి నివేదిక అందించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. -
అడవిలో ఉండటం వల్లే కొంత ఆలస్యం : మంత్రి
సాక్షి, నాగర్కర్నూల్ : త్వరలో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం క్షేత్రస్థాయి పరిశీలనకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా శరవేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కాళేశ్వరం పూర్తితో కేసీఆర్పై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. రోజుకు రెండు టీఎంసీలు ఎత్తిపోయాలన్నది ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు. అడవిలో ఉండడంతో నార్లాపూర్ పంపు హౌస్ పనులు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందించడం కేసీఆర్ లక్ష్యమని, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా మొత్తం సస్యశ్యామలమవుతుందని భరోసా వ్యక్తం చేశారు. -
అరుదైన మూలికలు@సంతబజార్
సాక్షి, మహబూబ్నగర్ : ఏదైన ఆయుర్వేదం వైద్యానికి కావాల్సిన మూలికలు, దినుసులు నాగర్కర్నూల్ సంత బజార్లో దొరుకుతాయి. చిరుధాన్యాల నుంచి ఆరుదుగా దొరికే అడవి గింజలు, ఆకులు, మూలికలు వరకు అన్ని ఒకే చోట లభ్యమవుతున్నాయి. ఆయర్వేదం వైద్యానికి అవసరమగు నేరేడు విత్తులు, నాగ కేశరములు, అడవి బాదామి, తిప్ప తీగ, తెల్లపట్టిక తదితర అన్నీ ఇక్కడే విక్రయిస్తుంటారు. దాదాపు వంద రకాల దినుసులు, చెట్ల వేర్లు, మూలికలు ఇక్కడ ఉన్నాయి. వీటిని ముఖ్యంగా మన్ననూర్, హైదరాబాద్లోని బేగంబజార్, సికింద్రాబాద్, బెంగళూర్ వంటి దూర ప్రాంతాల నుంచి వీటిని తీసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నారు. దశాబ్దాలుగా అనేక రకాలైన దినుసులు, మూలికలు, వేర్లు విక్రయిసున్నారు. అంతే కాకుండా పూజా సామగ్రి విరివిగా లభిస్తాయి. బంగారు విక్రయ షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. దశాబ్దాలుగా బంగారు విక్రయాలకు నిలయంగా ఈ వీధి ఉంది. అరుదుగా దొరికే కొన్ని రకాల మూలికలు అక్రోట్ కాయలు, మాసి కాయలు, అడవి యాలకులు, నల్లవుసిరి, తిప్ప తీగ, నాగ కేసరములు, పట్టి వేరు, టానికాయలు, అడవి బుర్రెలు, అడవి చింత, కలబంధ, కటక రోహిణి, సకస్తూరి పసుపు, మాని పసుపు, నేల తాటి, నేల గుమ్మడి, ఎర్ర మద్ది, మర్రి ఊడలు, కురు వేరు, వజ కొమ్మలు, అతి వజ, ఆదొండ, దొండ పిండి, కంద చెక్కర, సూర్యనామ, సొంటి, కరక్కాయలు, వాయుకుంభాలు, గంటు భరంగి, ఆకుల కర్ర, సామ్రానీ జైపు, పిట్టకాయలు, సైదవ లవణం, తాటి బెల్లం, సపేదమెస్త్రీ, కర్జూర పండ్లు తదితర ఆయుర్వేదానికి సంబంధించి అడవి మూలికలు లభిస్తాయి. దినుసులు సారా పప్పు, అడవి జిలకర్ర, తోక మిరియాలు, అటుకు మామిడి పప్పు, ఎదురు బియ్యం, లవంగాల పట్ట, రాగి హంస, దులగొండి విత్తులు, నేరేడి విత్తులు, బాదం పప్పు, అడవి జిలకర్ర, ఆజా వాము, కుసుములు, కంది, పెసర, శనగ పప్పు గింజలు, ఆముదాలు, వడ్లు, చిల్ల గింజులతో పాటు చిరు ధాన్యాలు, వివిధ రకాల ఇతర పప్పుధాన్యాలు లభిస్తాయి. గింజల నుంచి మూలికల నుంచి తీసిన నూనెలు ఇప్ప నూనె, కానుగ నూనె, వేప నూనె, ఆవ, కుసుమ, నువ్వుల నూనెలు, ఆముదం నూనె, అల్వీన్ ఆయిల్ తదితర నూనెలు ఉన్నాయి. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం వివిధ ప్రాంతాల నుంచి అనేక రకాలైన పుప్పు ధాన్యాలు, మూలికలు, వేర్లు, ఆయుర్వేదంకు అవసరమయ్యే అనేక రకాల మొక్కలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాము. నాలుగు దశాబ్దాలుగా వ్యాపారం చేస్తున్నాం. ప్రజలు వచ్చి తమకు అవసరం అయ్యే వాటినే కొంటారు. ఆన్లైన్లో కూడా మా దుకాణం సమాచారం వస్తుంది. – బొడ్డు వెంకటప్రసాద్, వ్యాపారి, సంతబజార్, నాగర్కర్నూల్ -
ఎత్తిపోతలకు బ్రేక్!
సాక్షి, నాగర్కర్నూల్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి జూరాలకు అక్కడి నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తెంది. కృష్ణానదిలో లక్షల క్యూసెక్కుల నీరు పరుగులు పెడుతున్నా నీళ్లు తోడుకోలేని దుస్థితి ఏర్పడింది. కేఎల్ఐ రెండో లిఫ్ట్లో విద్యుత్ సాంకేతిక లోపం కారణంగా మూడు లిఫ్ట్ల పరిధిలోని నీటి పంపింగ్ నిలిచిపోయింది. కల్వకుర్తి మొదటి లిఫ్ట్ నుంచి ఎల్లూరు రిజర్వాయర్కు, ఎల్లూరు నుంచి సింగోటం, అక్కడి నుంచి జొన్నలబొగుడ రిజర్వాయర్కు వచ్చి చేరిన నీరు ముందుకు వెళ్లడం లేదు. గుడిపల్లి గట్టు వద్ద ఉన్న మూడో లిఫ్ట్లో సర్జిపూల్ పంపుల్లో విద్యుత్ వ్యవస్థకు పని చేయకపోవడంలో పంపింగ్ నిలిచిపోయింది. మూడో లిఫ్ట్ పనిచేయకపోవడం, ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్లలో కూడా నీటిని ఎత్తిపోయకుండా అధికారులు పంపులను నిలిపివేశారు. దానికి తోడు కేఎల్ఐ ప్రాజెక్టు కింద నిర్మించిన రిజర్వాయర్ల సామర్థ్యం తక్కువగా ఉండడంతో వరద వచ్చినపుడు లిప్ట్ చేసిన నీటిని నిల్వకు అవకాశం లేకుండాపోయింది. కేఎల్ఐ కింద ఉన్న మూడు రిజర్వాయర్లు కలిపి 3.396 టీఎంసీల సామర్థ్యం మాత్రమే కలిగి ఉంది. నీటిని ఎక్కువగా నిల్వ చేసుకునేందుకు 47అదనపు రిజర్వాయర్లు నిర్మించాలని నిర్ణయించారు. సర్వే కూడా పూర్తి చేశారు. 19 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపించారు. కానీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ప్రతి యేటా ఆయకట్టు లక్ష్యం నెరవేరడం లేదు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే వరద వచ్చిన సమయంలో లిఫ్ట్లను బంద్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కేఎల్ఐ మూడు లిఫ్ట్లకు బ్రేక్.. కేఎల్ఐ మొదటి లిఫ్ట్ నుంచి నీటి పంపింగ్ ప్రారంభమై 12రోజులు పూర్తయినా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం ఇప్పటి వరకు మూడు రిజర్వాయర్లను మాత్రమే నింపుకొని సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్లను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణాదికి వరద ప్రవాహం పెరగడంతో ఈనెల 1వ తేదీన ఇంజనీరింగ్ అధికారులు ఎల్లూరు వద్ద మూడు పంపులను ప్రారంభించారు. ఎల్లూరు రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. మూడు పంపుల నుంచి 2,400 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఎల్లూరు రిజర్వాయర్ సామర్థ్యం 0.35 టీఎంసీలు, అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.55 టీఎంసీల సామర్థ్యం గల సింగోటం రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి జొన్నలబొగుడ ఎత్తిపోతల పథకానికి గ్రావిటీ ద్వారా సర్జ్పూల్లోకి విడుదల చేశారు. కేఎల్ఐ రెండో లిఫ్ట్ జొన్నలబొగుడ నుంచి పంపుల ద్వారా రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం 2.14 టీఎంసీల సామర్థ్యం ఉన్న జొన్నలబొగడ రిజర్వాయర్ కూడా నిండింది. అయితే అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా 0.98 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న గుడిపల్లి గట్టు రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే గుడిపల్లి గట్టు లిఫ్ట్ వద్ద విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలను తలెత్తడంతో అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. అలాగే గుడిపల్లి గట్టు సమస్యతో జొన్నలబొగడ ప్రధాన కాల్వ నుంచి పుస్పుల బ్రాంచ్ కెనాల్ ద్వారా 43వేల ఎకరాలకు సాగునీటిని అందించాల్సి ఉండగా దానిని నిలిపివేశారు. జొన్నలబొగడ నుంచి వచ్చే నీరు నేరుగా గుడిపల్లి గట్టు సర్జ్పూల్లోకి వెళ్తాయి. జొన్నలబొగుడ నుంచి ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభం కాగానే పస్పుల బ్రాంచ్ కెనాల్కు నీటిని వదలాల్సి ఉంటుంది. గుడిపల్లి గట్టు వద్ద ఎదురైన సాంకేతిక సమస్య కారణంగా నీటి పంపింగ్ పూర్తిగా నిలిచిపోయింది. మొదటి, రెండో లిఫ్ట్ల వద్ద ఉన్న ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు కూడా నిండిపోవడంతో మొదటి, రెండో లిఫ్ట్ల వద్ద కూడా అధికారులు నీటి పంపింగ్ను నిలిపివేశారు. గుడిపల్లి గట్టు నుంచి 30వ ప్యాకేజీ పరిధిలోని 90కి.మీ. కెనాల్ ద్వారా 80వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని, అదే విధంగా 29వ ప్యాకేజీ పరిధిలోని 220కి.మీ.ల కెనాల్ ద్వారా 2.17లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని అధికారులు నిర్ధారించారు. పస్పుల బ్రాంచ్ కెనాల్తో కలుపుకొని ఈ ఏడాది మొత్తం 3.07లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అధికారులు లక్ష్యం నిర్దేశించుకున్నారు. నెరవేరని 4.35 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యం కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఆయకట్టు లక్ష్యాన్ని చేరుకోవడం లేదు. ఈ పథకంలో మొదట్లో 2.5లక్షల ఎకరాల ఆయకట్టును ప్రతిపాదించగా ప్రస్తుతం 4.35లక్షల ఎకరాలకు చేరింది. నీటి కేటాయింపు కూడా 25 టీఎంసీల నుంచి 40 టీఎంసీలకు పెంచారు. కాని పూర్తిస్థాయిలో పనులు కాకపోవడంతో దాదాపు 450చెరువులను నింపి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా పరిధిలో 16 మండలాల్లో 2,97,496 ఎకరాలకు, వనపర్తి జిల్లాలోని 6 మండలాల పరిధిలో 89,733 ఎకరాలకు, మహబూబ్నగర్ జిల్లాలోని మూడు మండలాల పరిధిలోని 15,504 ఎకరాలకు, రంగారెడ్డి జిల్లా పరిధిలోని 21,372 ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాల్సి ఉంది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో లక్ష్యం నెరవేరలేదు. ఈ ఏడాది 3.07లక్షల ఎకరాలు సాగునీరు అందించాలని అధికారులు నిర్ణయించారు. వరద వచ్చినప్పుడు నీటిని తోడుకోవాల్సి ఉంటుంది. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రస్తుతం మూడు లిఫ్ట్ల నుంచి నీటి ఎత్తిపోతలు నిలిచిపోయాయి. దానికి తోడు నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు తక్కువగా ఉన్నాయి. 47 అదనపు రిజర్వాయర్లు నిర్మించేందుకు అధికారులు సర్వేలు నిర్వహించారు. 20 రిజర్వాయర్లకు సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు కానీ అనుమతి రాలేదు. అదనపు రిజర్వాయర్లు పూర్తయితేనే పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ప్రారంభిస్తాం గుడిపల్లి గట్టు వద్ద ఉన్న కేఎల్ఐ మూడో లిఫ్ట్ వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు సాంకేతిక సమస్య వల్ల నీటి ఎత్తిపోతను ప్రారంభించలేదు. బుధవారం మధ్యాహ్నం మూడో లిఫ్ట్ను ప్రారంభించి నీటిని గుడిపల్లి రిజర్వాయర్లోకి విడుదల చేస్తాం. ఎల్లూరు, సింగోటం, జొన్నలబొగుడ రిజర్వాయర్లు నిండడం వల్ల మొదటి, రెండో లిఫ్ట్లను నిలిపివేశాం. అదనపు రిజర్వాయర్లకు సంబంధించి సర్వే చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తాం. – రమేష్ జాదవ్, ఈఈ, కేఎల్ఐ -
బ్లాస్టింగ్తో పొంచి ఉన్న ముప్పు
సాక్షి, నాగర్కర్నూల్: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మొదటి ప్యాకేజీ పనుల్లో భాగంగా కొనసాగుతున్న అండర్ టన్నెల్(సొరంగం) పనుల్లో వినియోగిస్తున్న బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ మొదటి లిఫ్ట్కు ప్రకంపనలు వస్తున్నాయని లిఫ్ట్ను నిర్వహిస్తున్న పటేల్ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఏడాది క్రితమే ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. సొరంగం పనుల్లో కంట్రోల్ బ్లాస్టింగ్ కాకుండా ఎక్కువ సామర్థ్యంతో బ్లాస్టింగ్ చేయడం వల్ల ఆ శబ్దానికి సమీపంలో ఉన్న కేఎల్ఐ మొదటి లిఫ్ట్ వద్ద భూమి కంపించి ఇప్పటికే లిఫ్ట్ వద్ద అద్దాలు పగిలిపోవడంతో పాటు, భవిష్యత్లో ఇబ్బందులు తలెత్తవచ్చనే ఉద్దేశంతో కేఎల్ఐ అధికారులకు, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం వారు పరిశీలించారు. బెంగళూరుకు చెందిన ఎన్ఐఆర్ఎం ప్రతినిధులతో బ్లాస్టింగ్ తీవ్రతను పరీక్షించారు. అయితే బ్లాస్టింగ్ తీవ్రత కేఎల్ఐ లిఫ్ట్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదని అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే అక్కడ పనిచేస్తున్న వారు మాత్రం బ్లాస్టింగ్ వల్ల లిఫ్ట్కు ప్రమాదం పొంచి ఉందని, బ్లాస్టింగ్ తీవ్రత తగ్గించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి నివేదించిన అనంతరం ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. కేఎల్ఐ లిఫ్ట్ను పరిశీలించిన ఉన్నతాధికారులు.. పాలమూరు–రంగారెడ్డి సొరంగం పనుల్లో ఎక్కువ సామర్థ్యంతో కూడిన కెమికల్ను వినియోగిస్తూ బ్లాస్టింగ్ చేయడం వల్ల భూగర్భంలో ఉన్న కేఎల్ఐ లిఫ్ట్కు ప్రకంపనలు వస్తున్నాయని, దానివల్ల లీకేజీలు, స్లాబ్క్రాక్లు, అద్దాలు పగిపోవడం వంటివి జరుగుతున్నాయని లిఫ్ట్ నిర్వాహకులు ఏడాది క్రితం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. మళ్లీ అదే పరిస్థితి తలెత్తడంతో మూడు నెలల క్రితం కేఎల్ఐ, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. బుధవారం పాలమూరు–రంగారెడ్డి సీఈ రమేష్, ఈఈ విజయ్కుమార్, ఎస్ఈ అంజయ్య, ఈఈలు, డీఈలు, ఏఈలు కేఎల్ఐ మొదటి లిఫ్ట్ను పరిశీలించారు. బెంగళూర్ నుంచి ఎన్ఐఆర్ఎంకు ప్రతినిధులను పిలించి పాలమూరు–రంగారెడ్డి టెన్నెల్ పనుల్లో బ్లాస్టింగ్ చేయించి ప్రత్యేక పరికరం ద్వారా కేఎల్ఐ లిఫ్ట్లో వచ్చే తీవ్రతను పరీక్షించారు. అయితే పెద్దగా ప్రభావం చూపడం లేదని తేల్చినట్లు సమాచారం. స్వల్పంగా ప్రకంపనలు కనిపిస్తున్నాయని తేల్చినట్లు తెలిసింది. ఈ విషయం సీఈ రమేష్ను వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించగా చెప్పేందుకు ఇష్టపడలేదు. జనరల్ విజిట్ వెల్లడించారు. బ్లాస్టింగ్ వల్ల కేఎల్ఐ లిఫ్ట్కు పెద్దగా ఇబ్బంది ఉండదంటూ పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు అధికారులు, కేఎల్ఐ అధికారులు వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ–1 పనుల్లో భాగంగా కొనసాగుతున్న సొరంగం పనులు 1,300 మీటర్లు కొనసాగించాల్సి ఉంటుంది. కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగిస్తేనే చుట్టుపక్కల పెద్దగా ఇబ్బంది ఉండదు. కేఎల్ఐ మొదటి లిఫ్ట్లో ఐదు పంపులు ఉన్నాయి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కేఎల్ఐ మొదటి లిఫ్ట్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని మొదటి ప్యాకేజీ పనులు చేస్తున్న కంపెనీ వారికి కంట్రోల్ బ్లాస్టింగ్ వినియోగించే విధంగా ఆదేశించాలని అక్కడి వారు అభిప్రాయ పడుతున్నారు. పూర్తిస్థాయిలో పరీక్షించి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. 2005లో రూపకల్పన శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 25 టీఎంసీల మిగులు జలాలను తీసుకునే ప్రతిపాదనలతో 2005లో కేఎల్ఐ ప్రాజెక్టును రూ.2,990 కోట్ల వ్యయంతో ప్రారంభించారు. ఈ ప్రాజెక్టును మూడు లిఫ్ట్లుగా విభజించారు. కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మొదటి లిఫ్ట్, పెద్దకొత్తపల్లి మండలం జొన్నలబొగుడ వద్ద రెండో లిఫ్ట్, నాగర్కర్నూల్ మండలం గుడిపల్లి వద్ద మూడో లిఫ్ట్ను నిర్మించారు. మొదటి లిఫ్ట్ నుంచి 13వేల ఎకరాలకు, రెండో లిఫ్ట్ నుంచి 47 వేల ఎకరాలకు, మూడో లిఫ్ట్ నుంచి 2.80 లక్షల ఎకరాలకు కలిపి మొత్తం 3.40 లక్షల ఎకరాలకు నీరందించేందుకు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కేఎల్ఐ కాల్వల సామర్థ్యం పెంచుకోవడంతో పాటు, పెండింగ్లో ఉన్న కాల్వల నిర్మాణం, రిజర్వాయర్ల నిర్మాణం పూర్తి చేస్తేనే కేఎల్ఐ ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందే అవకాశం ఉంది. -
‘నల్లమలను లూటీ చేయాలని చూస్తున్నారు’
సాక్షి, హైదరాబాద్ : నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి వంశీచందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకు ఊటీ లాంటి నల్లమల ప్రాంతాన్ని పాలకులు లూటీ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో తామంతా ఉద్యమిస్తే తవ్వకాలు నిర్ణయంపై వెనక్కు తగ్గారని, కానీ కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని మళ్లీ తవ్వకాలు మొదలు పెట్టాలని చూస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గాంధీభవన్లో నాగర్కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి ఆయన మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ‘నల్లమల టైగర్ రిజర్వు ఫారెస్టు. చెంచులు, ఆదివాసీలు బతుకుతున్న ప్రాంతం. ఇక్కడ తవ్వకాలను మేం ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బహుళ జాతి కంపెనీలకు కోట్ల రూపాయలు కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలను, అటవీ సంపదను బలి చేస్తారా. విదేశాల్లో, కడపలో కూడా యురేనియం తవ్వకాలను ఆపేశారు. యురేనియం తవ్వకాల వల్ల పుట్టబోయే బిడ్డలకు కూడా అంగవైకల్యం ఏర్పడుతుంది. ప్రకృతి పూర్తిగా నాశనమవుతుంది. శ్రీశైలం నదీ జలాలు కలుషితం అవుతాయి. నాగార్జునసాగర్ నీరు తాగే హైదరాబాద్ ప్రజలపై కూడా ఈ ప్రభావం పడనుంది. గతంలో కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ కవిత యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. మాతో కలిసి వచ్చే అందరితో కలిసి పోరాటాలు చేస్తాం. ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం. తవ్వకాల నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు మా ఉద్యమం ఆగదు’అన్నారు. -
విద్యతోనే సమాజాభివృద్ధి
సాక్షి, నాగర్కర్నూల్: మాది తలకొండపల్లి మండలం ఖానాపూర్. నాన్న కీ.శే.కసిరెడ్డి దుర్గారెడ్డి, అమ్మ కీ.శే.కిష్టమ్మ. మేము ఐదుగురం సంతానం. అన్నలు రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, అక్క యశోద, పరమేశ్వరమ్మ. నేను చివరివాడిని. అన్నలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు, నా సతీమణి మాధవి. పిల్లలు దుర్గాప్రసాద్ బీటెక్ పూర్తి చేశాడు. కృష్ణ వంశీధర్రెడ్డి ఏడో తరగతి చదువుతున్నాడు. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న వ్యవసాయం చేసి మా అందరినీ చదివించాడు. చిన్నప్పుడు ఇంటర్ వరకు వ్యవసాయ పనులను చేశాను. నాగలి దున్నడం, కరిగెట చేయటం వంటి పనులు చేశాను. అన్నలు జీతగాళ్లతో సమానంగా పనిచేసే వాళ్లని, అప్పట్లోనే మా నాన్న, మాకు ఉన్న 300 ఎకరాల భూమిలో 100ఎకరాలను మాత్రమే ఉంచుకొని, చుట్టు పక్కల వాళ్లకి, బీసీ వర్గాలకు 200ఎకరాలు దానంగా ఇచ్చేశాడు. కష్టపడే తత్వం నాన్న నుంచి నేర్చుకున్నాను. ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలన్నదే మా అమ్మ, నాన్న ఆశయం. క్రమశిక్షణతో పెంచారు. వారి ఆశయాలకు అనుగుణంగానే చదువుకున్నాం. విద్యాభ్యాసం.. విద్యాసంస్థల ఏర్పాటు.. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు చుక్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో, తొమ్మిదో తరగతి నుంచి పదో తరగతి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. ఇంటర్ షాద్నగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ఇంజనీరింగ్ బీటెక్ హైదరాబాద్లో, ఎంటెక్ రాజస్థాన్లోని సింగానియా యూనివర్సిటీలో పూర్తి చేశాను. హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అద్దె రూముల్లో ఉండి చదువుకునే వాడిని. ఖర్చుల కోసం టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్ చెప్పేవాడిని. దాదాపు 50మంది వరకు విద్యార్థులు వచ్చేవారు. అప్పుడే ఒక పాఠశాల ఏర్పాటు చేస్తే, పగలు కూడా బోధన చేయవచ్చనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతోనే దిల్సుఖ్నగర్లో 1986–87లోనే బ్రిలియంట్ గ్రామర్ హైస్కూల్ ఏర్పాటు చేశా. పదేళ్ల పాటు ప్రైవేటు విద్యాసంస్థలతో సమానంగా బ్రిలియంట్ ఉన్నత పాఠశాలను కొనసాగించాం. ఇంటర్ తర్వాత చాలా మంది విద్యార్థులకు ఐఐటీలో సీటు సంపాదించడం కష్టంగా ఉండేది. దీనికి కారణం అన్వేషిస్తే, బేసిక్స్ లేకపోవడమే అని అర్థమైంది. విద్యావేత్తలు, రిటైర్డ్ ప్రొఫెసర్లతో చర్చింది.. ప్రొఫెసర్లు కసిరెడ్డి కొండల్రెడ్డి, కమాన్, సిద్దాంతి, క్రిష్టమూర్తి, శ్రీనివాసరావు లాంటి ప్రొఫెసర్లతో ప్రత్యేకంగా మెటీరియల్ రూపొందించా. ఐఐటీ కోచింగ్ ఎనిమిదో తరగతి నుంచే ప్రారంభించాం. దేశంలోనే ఇంటిగ్రేటెడ్ కరికులమ్ మా పాఠశాలలోనే ప్రారంభమైంది. మేము సక్సెస్ అయిన తర్వాతనే శ్రీ చైతన్య, నారాయణ వంటి పాఠశాలల్లో అమలు చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం తెలంగాణలో 64 బ్రిలియంట్ గ్రామల్ స్కూళ్లను ఏర్పాటు చేశాం. వాటిలో 40వేల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. సామాన్యుడికి అందుబాటులో ఫీజులు ఉంటాయి. అలాగే మూడు ఇంజనీరింగ్ కళాశాలలు రామోజీ ఫిల్మ్సిటీ దగ్గర ఉన్నాయి. వాటిలో 12వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. సుమారు 4వేల మందికి పైగా టీచర్లు, ఇతర సిబ్బంది విద్యాసంస్థలలో పనిచేస్తున్నారు. బాధ కలిగించిన అంశం.. కొంతమంది అవసరం కోసం వెంటనే ఉండి, అవసరాలు తీర్చుకున్న తర్వాత నమ్మక ద్రోహం చేశారు. అవసరం తీరిన వారు తిరిగి ఎప్పుడూ కనిపించకపోతే బాధ కలుగుతుంది. అలాగే ఆమనగల్లోని మా ఇంటర్, డిగ్రీ కళాశాలకు వచ్చే దాదాపు 50శాతం మంది విద్యార్థులకు పైగా చెప్పులు ఉండేవి కావు. తల్లిదండ్రుల సమావేశ ఏర్పాటు చేసినప్పుడు కూడా చాలామంది చెప్పులు లేకుండా వచ్చేవారు. వారి ఆర్థిక పరిస్థితి చూసి బాధ కలిగేది. అందుకే చాలా మందికి ఉచిత విద్యను అందిస్తున్నాం. సంతోషం కలిగించే అంశం.. మా విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వచ్చినప్పుడు, ఐఐటీ వంటి ఫౌండేషన్ కోర్సులు ప్రవేశపెట్టినప్పుడు విమర్శించిన వారే ఆ తర్వాత పొగిడినప్పుడు, మా విద్యార్థులు ఇతర దేశాల్లో, దేశంలో ఉన్నత స్థాయిలో ఉద్యోగం పొందిన సందర్భాలలో సంతోషం కలిగేది. నాకు వేంకటేశ్వరస్వామి ఇష్టమైన దైవం, క్రికెట్ అంటే చాలా ఇష్టం. రాజకీయ నేపథ్యం ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. అప్పట్లో ఓ నేత హామీ మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. చివరి నిమిషంలో టికెట్ రాకపోవడంతో స్థానిక కార్యకర్తలు, నేతల ప్రోద్బలంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశాను. కల్వకుర్తి ప్రాంతానికి అందుబాటులో ఉండి సేవ చేయాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్లో చేరాను. ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో విజయం సాధించాను. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఇచ్చిన హామీలను మంత్రుల సహకారంతో ఎమ్మెల్సీ అయిన తర్వాత నెరవేర్చగలిగాను. ఇన్నేళ్ల జీవితంలో రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే నమ్మక ద్రోహంచూశాను. ప్రభుత్వ సహకారంతో మిషన్ భగీరథ ద్వారా తాగునీరు తీసుకురావడానికి కృషి చేశాను. సంజాపూర్ వద్ద కాల్వల కోసం రైతులకు సొంతంగా భూ పరిహారం చెల్లించి కేఎల్ఐ కాల్వలు పూర్తి చేశాను. ప్రస్తుతం 34వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. కేటీఆర్ చొరవతోనే చారకొండ, వంగూర్, ఊర్కొండ మండలాలలను కలుపుతూ కల్వకుర్తి రెవెన్యూ డివిజన్ సాధించడం చాలా సంతోషకరమైన అంశం. ఆమెదే కీలకపాత్ర.. నేను నా సొంత ప్రాంతానికి సేవ చేయాలనే ఉద్దేశంతో మా నాన్న పేరుపైన కేఆర్డీఆర్ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశా. 15వేల మంది విద్యార్థులకు ఎలాంటి ఫీజులు లేకుండా స్కాలర్షిప్తోనే విద్యను అందిస్తున్నాం. విద్యాభివృద్ధి ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందనేది నా నమ్మకం. మా విద్యాసంస్థలు విస్తరించడంలో నా సతీమణి మాధవి పాత్ర కూడా కీలకమనే చెప్పాలి. ఆమె కూడా ఎమ్మెస్సీ బీఈడీ చేసింది. టీచర్గా బోధన చేయడంతో పాటు విద్యాసంస్థల నిర్వహణ చూసుకుంటున్నారు. కుటుంబ వ్యవహారాలను అన్నింటినీ ఆమెనే చూసుకుంటుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే దాదాపు వంద కు పైగా ప్రభుత్వ పాఠశాలలో సొంతంగా ఒక్కో పాఠశాలకు రూ.లక్ష ఖర్చు చేసి ప్రయోగశాలలు ఏర్పాటు చేయించా. -
టీఆర్ఎస్ ప్రభుత్వం హామీలకే పరిమితమైంది
సాక్షి, నాగర్ కర్నూల్ : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హామీలకే పరిమితమైందని, చేతల్లో పూర్తిగా నర్వీర్యమై పోయిందని ఎంపీ జితేందర్ రెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 35 వేల కోట్లతో భారీ ఎత్తున చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేస్తానన్న కేసీఆర్ ఇప్పటివరకు ఒక్క రిజర్వాయర్ కూడా పూర్తి చేయకపోవటం టీఆర్ఎస్ ప్రభుత్వ తీరుకు అద్దం పడుతోందని అన్నారు. టీఆర్ఎస్పై ప్రజలు విశ్వాసం కోల్పోయారని, ప్రజాసంక్షేమానికి పెద్దపీట వేస్తున్న బీజేపీ వైపు ఆకర్షితులవుతున్నారని వ్యాఖ్యానించారు. రైతులకు ఎకరాకు రూ.6000 పెట్టుబడి సాయం చేసి బీజేపీ ఆదుకుంటుందని చెప్పారు. 60 ఏళ్లు దాటిన వృద్ధ రైతులకు పెన్షన్ స్కీము ప్రవేశపెట్టిన ఘనత బీజేపీదేనని కొనియాడారు. విదేశాల్లో దాచిన 4 లక్షల కోట్ల ధనాన్ని భారతదేశానికి తెప్పించిన ఘనత కూడా బీజేపీదేనని అన్నారు. -
మళ్లీ ఓటరు గణన
సాక్షి,కల్వకుర్తి : మున్సిపల్ ఎన్నికలను జూలైలో నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ టీకే శ్రీదేవి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటరు గణనను ప్రారంభించాలని సర్క్యూలర్ జారీ చేశారు.వచ్చే నెల 2న మున్సిపాలిటీల పాలకవర్గ పదవీకాలం పూర్తి కానుంది.దీంతో పాలకవర్గం పూర్తయిన వాటికి ఎన్నికలు నిర్వహించేందుకు ఓటరు గణన పూర్తి చేసి, జాబితాను రూపొందించేలా చూడాలని ఆయా మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో.. కల్వకుర్తి మున్సిపాలిటీలలో ఓటరు గణనను ఆయా మున్సిపాలిటీ అధికారులు,సిబ్బంది ప్రారంభించారు. మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలను విలీనం చేశారు. ఆయా గ్రామాల ఓటరు గణనను కూడా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే మహిళా ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేకంగా ఓటరు గణనను చేసి, గడువులోగా మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలని, మున్సిపాలిటీలోని ప్రతి ఇంటికీ తిరిగి ఓటర్లను కులాల వారీగా గుర్తించాలని సర్కులర్లో ఉంది. అలాగే కులాల వారీగా గుర్తించిన ఓటర్ల వివరాలను మున్సిపాలిటీ పరిధిలోని రిజిస్ట్రర్ రాజకీయ పార్టీలకు, ఆయా కార్యాలయాలలో ఓటరు జాబితాను ప్రదర్శించాలి. ఇంటింటికి తిరగకుండానే.. మున్సిపాలిటీలో గతంలో కులాల వారీగా నిర్వహించిన ఓటరు జాబితాను మున్సిపల్ అధికారులు, సిబ్బందికి సూచించారు. అయితే మున్సిపల్ సిబ్బంది మాత్రం వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇంటింటికి తిరగకుండానే, ఓటరు గణను పూర్తి చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈసారైన మున్సిపల్ అధికారులు, సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఓటరు గణను నిర్వహించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ∙ఈనెల 21న మున్సిపాలిటీ పరిధిలోని బీఎల్ఓలకు ఓటరు గణనను ఎలా నిర్వహించాలనే విషయమై శిక్షణ తరగతులు. ∙22నుంచి జూలై 4వరకు ఇంటింటికీ తిరిగి కులాల వారీగా ఓటరు గణనను చేయాలి. ∙జూలై 5న కులాల వారీగా ఓటరు జాబితా తయారు చేయాలి. ∙జూలై 6న డ్రాఫ్ట్ పబ్లికేషన్ పోలింగ్ బూత్ వారీగా తయారుచేసి సంబంధిత మున్సిపల్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఓటరు జాబితాను అందజేయాలి. ∙జూలై 7 నుంచి 11వరకు ఓటరు జాబితాపై అభ్యంతరాల స్వీకరణ. ∙జూలై 12 నుంచి 14వరకు వచ్చిన అభ్యంతరాలను పరిశీలించాలి. ∙జూలై 15నుంచి 16వరకు వచ్చిన అభ్యంతరాలపై ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి, వాటిని గుర్తించాలి. ∙జూలై 17న అన్ని అభ్యంతరాల పరిశీలన తర్వాత ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 18న కులాల వారీగా ఫైనల్ ఓటరు జాబితాను తయారు చేయాలి. ∙జూలై 19న ప్రతిపాదిత ఫార్మాట్లో ఓటరు జాబితాను మున్సిపల్ ప్రధాన కార్యాలయానికి పంపించాలి. ఓటరు గణన చేపడుతున్నం రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ నుంచి ఆయా మున్సిపాలిటీల్లో కులాల వారీగా, మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలతో కలుపుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయమని సర్క్యూలర్ వచ్చింది. కులాల వారీగా మహిళా ఓటర్లను గుర్తించి వాటికి సంబంధించిన ఓటరు గణన పూర్తి చేసి, గడువులోగా మున్సిపల్ శాఖ ప్రధాన కార్యాలయానికి పంపించాలని దేశాలు వచ్చాయి. దీంతో మున్సిపాలిటీలో విలీన గ్రామాలతో పాటు, పట్టణంలో ఓటరు గణనను ప్రారంభించాం. – చింత వేణు, కమిషనర్, కల్వకుర్తి మున్సిపాలిటీ -
ఆడబిడ్డ పుట్టిందని .. తండ్రి ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూలు : నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆడబిడ్డ పుట్టిందని ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అచ్చంపెట పట్టణ సమీపంలోని వ్యవసాయ పొలంలో ఆంజనేయులు(24) చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. మృతుని భార్య శుక్రవారం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో మనోవేదనతో ఆంజనేయులు ఆత్మహత్య చేసుకున్నాడు. -
నిర్వాసితులకు నాగం మద్ధతు
నాగర్ కర్నూల్ జిల్లా: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు(పీఆర్ఎల్ఐ) భూనిర్వాసితులు చేస్తోన్న ఆందోళనకు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత నాగం జనార్దన్ రెడ్డి మద్ధతు తెలిపారు. బిజినాపల్లి మండలం వట్టెం గ్రామం వద్ద నిర్మాణమవుతోన్న పాలమూరు-రంగారెడ్డి రిజర్వాయర్లో భూములు, ఇళ్లు కోల్పోతున్న రైతులు ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకుని హెచ్ఈఎస్ కంపెనీ ముందు ఆందోళన నిర్వహించారు. తమ భూములకు, ఇండ్లకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులో భూనిర్వాసితులకు ఏవిధమైన పరిహారం ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలంటూ రైతులు ఆందోళన చేపట్టారు. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంతో తాను పోరాడతానని నాగం జనార్దన్ రెడ్డి తెలిపి సంఘీభావం ప్రకటించారు. -
నాగర్కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం
-
రోడ్డెక్కిన అన్నదాతలు
-
‘పరిషత్’ ఎన్నికలకు కసరత్తు
సాక్షి, కొత్తకోట : ఓ వైపు పార్లమెంట్ ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించడానికి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుండగా... మరో వైపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు వెనువెంటనే ఎన్నికలు నిర్వహించడానికి అధికారులు కసరత్తులు మొదలు పెట్టారు. ఈ ఏడాది జూన్లో ఎంపీటీసీ, జెడ్పీటీల పదవికాలం ముగియనుంది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియతో పాటుగా ఓటరు జాబితా ముసాయిదాను విడుదల చేశారు. జాబితాను గ్రామ పంచాయితీ కార్యాలయాలు, తహాసీల్దార్ కార్యాలయాలం ఎదుట ప్రదర్శించారు. ఇంతకు ముందే ఎంపీటీసీ స్థానాల ఏర్పాట్లపై అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మండలంలో 59పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు. గతంలో ఐదు ఎంపీటీసీ స్థానాలు ఉన్న కొత్తకోట గ్రామ పంచాయితీ ప్రస్తుతం మున్సిపాలిటీగా మారడంతో అయిదు స్థానాలకు ఎన్నికలు లేకుండా పోయాయి. మండలంలో రిజర్వేషన్లు ఇలా.. మండలంలో 22గ్రామ పంచాతీలకు గానూ 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రక్రియ సైతం ముగిసింది. అమడబాకుల(జనరల్), అప్పరాల (బీసీ మహిళ), కానాయపల్లి (బీసీ జనరల్), కనిమెట్ట (జనరల్), మిరాషిపల్లి (జనరల్ మహిళ), నాటవెళ్లి (ఎస్టీ జనరల్), నిర్వేన్ (జనరల్ మహిళ), పాలెం (ఎస్సీ జనరల్), పామాపురం (బీసీ మహిళ), రాయిణిపేట (జనరల్ మహిళ), సంకిరెడ్డిపల్లి (జనరల్), వడ్డెవాట (ఎస్సీ మహిళ)కు కేటాయించారు. 40,289మంది ఓటర్లు.. మండలంలో 23 పంచాయతీల్లో ఓటర్ల లెక్క తేలింది. మొత్తం 40,289మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20,458, మహిళలు 19,831మంది ఉన్నారు. పైరవీలు షురూ.. ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేయాలనుకునే అశావహులు తమ పార్టీ పెద్దల వద్ద పైరవీలు మొదలు పెట్టారు. సర్పంచ్ సీటు కోల్పోయిన వారు, గతంలో సీటు కోసం యత్నం చేసి విఫలం చెందిన వారు ఎంపీటీసీ స్థానాల సీటు కేటాయించాలని ఆయా పార్టీల పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. ప్రత్యర్థులకు ధీటుగా ఆర్థికంగా తట్టుకునే వారిని నిలబెట్టేందుకు పార్టీ పెద్దలు చూస్తున్నారు. కసరత్తు చేస్తున్నాం స్థానిక ఎంపీటీసీ ఎన్నికలకు సంబందించి ఓటురు లిస్టును ప్రర్శించాం. అధికారుల అదేశాల మేరకు ఎన్నికల ప్రక్రియ చేస్తున్నాం. నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల కానుందో సమాచారం లేదు. ఎన్నికలు ఎప్పడు వచ్చిన ఎదుర్కొవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. – కతలప్ప, ఎంపీడీఓ, కొత్తకోట -
పెద్ద జీతగాడిలా పనిచేస్తా
సాక్షి,నాగర్కర్నూల్: పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు పెద్ద జీతగాడిలా పనిచేసి రుణం తీర్చుకుంటానని ఎంపీ అభ్యర్థి రాములు అన్నారు. నాగర్కర్నూల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు.హౌసింగ్ బోర్డు నుంచి బస్టాండ్ కూడలి వరకు బైక్ ర్యాలీ తీసిన అనంతరం అక్కడే కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండు రోజులు కార్యకర్తలు పనిచేస్తే ఐదేళ్లు కందనూలు అభివృద్ధికి శాయశక్తులా కృషిచేస్తానన్నారు. ఎంపీ నిధుల్లో సింహభాగం నాగర్కర్నూల్ నియోజకవర్గానికే కేటాయిస్తామని, గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తానన్నారు. 1996 నుంచి అచ్చంపేట ప్రజలకు సేవ చేస్తున్నానన్నారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా తనను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేలపై జీవించిన నేను.. ఈ నేల ప్రజలకే సేవ చేసి తనువు చాలిస్తానన్నారు. 16 ఎంపీ సీట్లు గెలిచి సీఎంకు బహుమతిగా ఇస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి అభివృద్ధి కోసం అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే మర్రిజనార్దన్రెడ్డి మాట్లాడుతూ నాగర్కర్నూల్కు సంబంధించిన రైతులు గతంలో హైదరాబాద్లో అడ్డా కూలీలుగా ఉన్నారని, కేఎల్ఐ నీటి రాకతో తిరిగి కొన్ని ప్రాంతాలకు చేరుకుని వ్యవసాయం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంతాన్ని కేసీఆర్ సస్యశ్యామలం చేసినందుకే రెండోసారి సీఎం అయ్యారన్నారు. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే కేసీఆర్ ప్రధాని అవుతారన్నారు. ఎమ్మెల్సీ దామోదర్రెడ్డి మాట్లాడుతూ గతంలో నాగర్కర్నూల్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా వలస వచ్చిన వారేనని, ప్రస్తుతం స్థానికుడికి సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ప్రజా సమస్యలు తీర్చే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్యాదవ్, రఘునందన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల పోరుకు పోలీసులు రెడీ
సాక్షి, కల్వకుర్తి టౌన్: పార్లమెంట్ ఎన్నికలకు పోలీసుశాఖ ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 11న నిర్వహించే ఎన్నికల పటిష్ట బందోబస్తుకు శాఖా పరంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు పోలీ సులు తెలిపారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి తెలిపారు. గత పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామాల్లో అలజడులు సృష్టించి, చిన్న, చిన్న వివాదాలను సృష్టించిన వారిని గమనించి, వారిపై ఒక ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. గ్రామ పోలీస్ అధికారులతో సమాచారం తెప్పించుకుని వారిపై చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తుగా వారిని బైండోవర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కల్వకుర్తి సబ్డివిజన్ పరిధిలోని కల్వకుర్తి, ఊర్కొండ, వెల్దండ, వంగూర్, చారకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూస్తామని డీఎస్పీ తెలిపారు. ప్రత్యేక నిఘా కల్వకుర్తి సబ్ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను పోలీసులు గుర్తించారు. ఎన్నికల సమయంలో గ్రామాల్లో మద్యం తయారీ, విక్రయాలపై నిఘా వేశారు. విక్రయదారులను బైండోవర్ చేశారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం, డబ్బు తరలకుండా ప్రత్యేక స్క్వాడ్ బృందం సభ్యులు చర్యలు తీసుకున్నారు. సమస్యస్మాతక ప్రాంతాల గుర్తింపు కల్వకుర్తి సబ్డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లోని 169 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో కల్వకుర్తి మండలంలో 61 పోలింగ్ స్టేషన్లలో 4 సమస్యాత్మకంగా, ఊర్కొండ మండలంలో 16 పోలింగ్ స్టేషన్లకు 9 సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. అలాగే వెల్దండ మండలంలో 35 పోలింగ్ స్టేషన్లకు 13, వంగూరు మండలంలో 36 పోలింగ్ స్టేషన్లకు రెండు, చారకొండ మండలంలో 21 పోలింగ్ స్టేషన్లకు 3 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కేంద్ర బలగాల కవాతు కల్వకుర్తి సబ్డివిజన్ పరిధిలోని అన్ని మండలా ల్లో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. మంగళవారం కల్వకుర్తి పట్టణంలో కేంద్ర బలగాలతో కల్వకుర్తి డీఎస్పీ పుష్పారెడ్డి,, కల్వకుర్తి సీఐ సురేందర్, ఎస్ఐ నర్సింహులు కవాతులో పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు సబ్డివిజన్ పరిధిలో ఇద్దరు సీఐలు, 5 మంది ఎస్ఐలు, 10 మంది ఏఎస్ఐలు, దాదాపు 80 మంది కానిస్టేబు ళ్లు, హోంగార్డులు, 100 మంది దాకా కేంద్ర బలగాలు, మహిళా పోలీసులు ఎన్నికల విధులు నిర్వహించనున్నారు. అలాగే కల్వకుర్తి పట్టణంలోనే ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, వాటిని భద్రపరిచేది కూడా కల్వకుర్తి పట్టణంలో ఉండడంతో మరి కొంత మంది కేంద్ర బలగాల పోలీసులు ఇక్కడ విధులు నిర్వహించనున్నారు. స్వేచ్ఛగా ఓటుహక్కును వినియోగించుకోవాలి ప్రజలు ప్రశాంత వాతావరణంలో వారి ఓటుహక్కును వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు పోలీసు శాఖ తరఫున ఏర్పాటు చేశాం. సబ్డివిజన్ పరిధిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. ఎక్కడ ఏ చిన్న గొడవ జరిగినా వెంటనే తెలిసేలా చర్యలు తీసుకుంటున్నాం. పోలీస్ సిబ్బందితో పాటుగా, ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు, ఎన్నికల ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. – పుష్పారెడ్డి, డీఎస్పీ, కల్వకుర్తి -
మాచర్ల రైల్వేలైన్ సాధిస్తాం
నాగర్కర్నూల్ క్రైం: కాంగ్రెస్, బీజేపీలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని, స్థానికేతరులైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను కాకుండా టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాములును అధిక మెజార్టీతో గెలిపిస్తేనే నాగర్కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి సాధిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం బిజినేపల్లిలో రోడ్షో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాగర్కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ప్రధాన అంశమైన మాచర్ల రైల్వేలైన్ హామీని కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు నెరవేర్చలేకపోయాయని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మాచర్ల రైల్వేలైన్ సాధించేందుకు కృషిచేస్తామన్నారు. అట్టడుగు వర్గాల ప్రజల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి రాములు అని గుర్తించి ఎంపీగా సీఎం కేసీఆర్ అవకాశం ఇచ్చారని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఎంపీ అభ్యర్థి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను నిర్లక్ష్యం చేస్తుందని, రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి రావాల్సిన నిధులను కొట్లాడి సాధించుకుంటామన్నారు. ప్రస్తుత పార్లమెంట్ బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు స్థానికేతరులని, స్థానికుడైన తనను గెలిపిస్తే నాగర్కర్నూల్ పార్లమెంట్ అభివృద్ధి కోసం శాయశక్తులా కృషిచేస్తానన్నారు. రెండుసార్లు నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏమాత్రం కృషిచేయలేదని ఆరోపించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ 70 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ ఐదేళ్లలో చేశారన్నారు. ఎంపీ అభ్యర్థి రాములును నియోజకవర్గ ప్రజలు తనకు ఇచ్చిన 54 వేల మెజార్టీ కంటే అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని కోరారు. రోడ్షోలో పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జ్ రఘునందన్రెడ్డి, నాయకులు శ్రీనివాస్యాదవ్, జెడ్పీటీసీ సభ్యురాలు సుధా పరిమళ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
సమయం లేదు మిత్రమా!
సాక్షి, మహబూబ్నగర్: ఎన్నికల సంగ్రామానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ లోక్సభ అభ్యర్థుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. మిగిలిన రెండ్రోజుల సమయాన్ని వృథా చేయకుండా ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. రంగంలో దిగిన నాటినుంచి టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంటు స్ధానాల్లో అవిశ్రాంతంగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. పగలు ప్రచారం.. రాత్రిపూట మంతనాలు నిర్వహిస్తున్నారు. సామాజిక వర్గాలపై దృష్టి ఎన్నికల్లో సామాజిక వర్గాల ఓట్లే కీలకంగా మారిన నేపథ్యంలో వారి మద్దతు కూడగట్టుకునేందుకు కుల, మత పెద్దలతో అభ్యర్థులు, ముఖ్యనేతలు రహహస్య భేటీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఉన్న ఓట్లలో ఎక్కువ ఓట్లు కలిగిన సామాజిక వర్గాలపై దృష్టిసారించిన అభ్యర్థులు వారిని ఆకట్టుకునేందుకు ముందస్తు హామీలు ఇస్తున్నారు. కుల, మత పెద్దలతో సమావేశం నిర్వహించిన మరుసటి రోజే వారి ప్రాంతాల్లో ప్రచారాలు చేస్తున్నారు. ఓ పక్క గెలుపు వ్యూహాలు రచిస్తూనే మరోపక్క ఇతర పార్టీ నేతలు, కార్యకర్తలను తమ పార్టీల్లో చేర్పించుకుంటున్నారు. పోలింగ్కు నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఇప్పటికీ చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆఖరి నిమిషంలో ఎవరు ఏ పార్టీలో చేరుతారు..? ఏ సామాజిక వర్గం ఎవరికి మద్దతు ఇస్తుందో తెలియక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రానున్న నాలుగు రోజులు కీలకంగా మారిన నేపథ్యంలో అన్ని పార్టీలు అప్రమత్తంగా ఉంటూ ఓట్లర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ము మ్మరం చేశాయి. వీటితో పాటు అన్ని పార్టీలు సోషల్ మీడియాను ప్రచారస్త్రాంగా వాడుకుంటున్నా యి. వాట్సప్, యూట్యూబ్, ఫేస్బుక్, ట్వి ట్టర్, ఇన్స్ట్రాగాంలతో ప్రచారాలు నిర్వహిస్తున్నా యి. ఫోన్కాల్స్, ఎస్ఎంఎస్లతో నేరుగా ఓటర్లను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నలు చేస్తున్నాయి. అగ్రనేతల పర్యటనలు ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులకు మద్దతుగా మహబూబ్నగర్, నాగర్కర్నూల్ లోక్సభ స్ధానాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడు రాహుల్గాంధీ, సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో రెండు లోక్సభ స్ధానాలు కైవసం చేసుకోవాలని అన్ని పార్టీలూ వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం సభలు, సమావేశాలు, రోడ్షోలు, ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తూ ఓటర్ల మద్దతు కోరే ప్రయత్నం చేస్తున్నారు. తాము గెలిస్తే చేయబోయే అభివృద్ధి పనులు, కార్యక్రమాలను ఓటర్లకు వి వరిస్తున్నారు. అయితే రేపటితో ప్రచారపర్వానికి తెరపడనుండడంతో ఆ తర్వాత అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పట్నుంచే దృష్టిసారించారు. ప్రచారంలో దూసుకెళ్తున్న కారు అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తోంది. ఉమ్మడి జిల్లాలో అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం, ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్కు చెందిన వాళ్లే ఎక్కువ మంది సర్పంచ్లుగా గెలుపొందడం ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులకు కలిసొచ్చిన అంశంగా మారింది. దీంతో పాటు గత ఐదేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తూనే తెలంగాణలో 16 ఎంపీ సీట్లు గెలుపొందడం ద్వారా కేంద్రంలో కేసీఆర్ పోషించనున్న పాత్రను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ప్రజలకు వివరిస్తున్నారు. ఇప్పటికే మహబూబ్నగర్ లోక్సభ స్ధానానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, నాగర్కర్నూల్కు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డికి ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించిన కేసీఆర్ ఎమ్మెల్యేలు, మంత్రులతో కలిసి సమన్వయం పని చేసి టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు ఎంపీ అభ్యర్థులతో, మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఒక్కస్థానం కూడా చేజారనీయకుండా తమతమ నియోజకవర్గాల్లో సభలు, సమావేశాలు, రోడ్షోలు, నిర్వహిస్తూ ప్రచారంలో బిజీగా గడుపుతున్నారు. ఇదే క్రమంలో నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్లో ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి మద్దతుగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్అలీ నేడు ప్రచారం నిర్వహించనున్నారు. ఔర్ ఏక్ బార్.. మోదీ సర్కార్ ఇదే నినాదంతో ముందుకెళ్తున్న బీజేపీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ స్థానాల నుంచి ఆ పార్టీ తరుఫున బరిలో ఉన్న డీకె అరుణ, బంగారు శ్రుతి తమదైన శైలీలో ప్రచారం నిర్వహిస్తున్నారు. వారికి మద్దతుగా ఆయా పార్టీ జిల్లా నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీతోనే దేశరక్షణ, భద్రత సాధ్యమని ప్రచారంలో చేస్తున్న ప్రసంగాలిస్తున్నారు. తాము గెలిస్తే స్థానిక సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇస్తున్నారు. అభ్యర్థులకు మద్దతుగా నాగర్కర్నూల్ లోక్సభ పరిధిలోని గద్వాలలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచార బహిరంగ సభలో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. నేడు మహబూబ్నగర్ పరిధిలోని దేవరకద్రలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ పాల్గొననున్నారు. కాంగి‘రేసు’ ఎన్నికల ప్రచార రేసులో కాంగ్రెస్ అభ్యర్థులు పరుగులు పెడుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ స్థానాల నుంచి బరిలో ఉన్న చల్లా వంశీచందర్రెడ్డి, మల్లురవి పార్టీ సంప్రదాయ ఓట్లపై దృష్టిసారించారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూనే తమను గెలిపిస్తే పార్లమెంటు సెగ్మెంట్లో చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తున్నారు. ముఖ్యంగా స్ధానికంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథక పనులు, జాతీయ హోదా, న్యాయ్ పథకం పేరిట పేదలకు ఏడాదికి రూ. 72వేలు, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ వంటి అంశాలపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. -
అందుబాటులో పౌర సేవలు
సాక్షి, అచ్చంపేట : పట్టణ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా మున్సిపల్ కార్యాలయంలో పౌరసేవా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కేంద్రం ద్వారా 34రకాల సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రజలు తమ సమస్యలను ఫోన్, ఈమెయిల్, నేరుగా సంప్రదించి అధికారులకు తెలిపే వెసులుబాటును కల్పించింది. ఆయా సేవలకు దరఖాస్తు చేసుకునే వారు సమర్పించాల్సిన పత్రాలకు సంబంధించిన వివరాలను గోడలపై, బోర్డులపై రాసి ఉంచారు. సిటిజన్ చార్టర్ బోర్డును ఏర్పాటు చేశారు. దరఖాస్తు విధానం ఈవోడీబీ(ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సేవలను ఆన్లైన్ ద్వారా ఇంటి నుంచే పొందే వీలు ఉంటుంది. ఆయా పనుల నిమిత్తం కార్యాలయం చుట్టూ తిరగాల్సిన పని ఉండదు. దరఖాస్తుదారుడికి తన దరఖాస్తుకు సంబంధించి జరుగుతున్న పని ఎప్పటికప్పుడు మొబైల్కు మెసేజ్ వస్తుంది. సిటిజన్ చార్టర్ నిబంధనల ప్రకారం గడువులోగా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మున్సిపల్ పరిధిలోని ఏదైనా విభాగంలో దరఖాస్తు చేయాలనుకునే వారు ఈ– ఆఫీస్ ద్వారా ఆన్లైన్ నమోదు చేయాలి. వచ్చిన దరఖాస్తులను కమిషనర్ పరిశీలించి అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే విషయాలను పరిశీలించిన అనంతరం అనుమతులు జారీ చేస్తారు. సేవలను వినియోగించుకోవాలి పట్టణ ప్రజలు పౌర సేవా కేంద్రం సేవలను వినియోగించుకోవాలి. గడువులోగా సర్టిఫికెట్లు పొందవచ్చు. పైరవీలకు తావే లేదు. 30కి పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని సేవలు అందుబాటులోకి వస్తాయి. పారదర్శకత పెంచేందుకే సేవా కేంద్రం ఏర్పాటు చేశాం. – నాయిని వెంకటస్వామి, మున్సిపల్ కమిషనర్, అచ్చంపేట -
నాగర్కర్నూల్లో ప్రచారం.. హోరాహోరీ
సాక్షి, నాగర్కర్నూల్: ఎన్నికలు సమీపిస్తుండడంతో నాగర్కర్నూల్ నియోజకవకర్గంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు విస్తృతంగా ప్రచారం చేయడంతో గ్రామాల్లో సైతం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు ఎవరికి వారు తమ సొంత అంచనాలతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ప్రచారానికి సంబంధించిన కార్యక్రమాలు ఊపందుకున్నాయి. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మండలాల వారికి వచ్చిన ఓట్లను బేరీజు వేసుకుని నాయకులు ప్రచారం నిర్వహిస్తున్నారు. టీఆర్ఎస్ రోడ్ షో... నాగర్కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు సంబంధించి ఎన్నికల ప్రచారం ఇప్పటికే ముమ్మరమైంది. ఇప్పటికే నాగర్కర్నూల్ నియోజకవర్గంలో అన్ని మండలాల్లో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్ షోలు ఇతర కార్యక్రమాలు నిర్వహించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడంతో పాటు ఎమ్మెల్యే ఎన్నికల మాదిరి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాగర్కర్నూల్ నియోజకవర్గంలో 259 పోలింగ్ బూత్లు ఉండగా 2,14,095మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,07,525మంది పురుషులు, 1,06,567మంది స్త్రీలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. కాగా నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీఆర్ఎప్ పార్టీకు సంబంధించి అన్ని మండలాల్లో కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు బైకాని శ్రీనివాస్ యాదవ్, జక్కా రఘునందన్రెడ్డిలు నియోజకవర్గంలోని గ్రామాల్లో ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నాగం జనార్దన్రెడ్డి ఓటమి పాలవ్వడంతో పార్టీకి చెందిన క్యాడర్ మొత్తం నిస్తేజంలో ఉండిపోయింది. పార్టీకి ఎంపీగా పోటీచేస్తున్న మల్లు రవి నాగర్కర్నూల్కు పాత వ్యక్తి కావడం, కొంత మంది మద్దతు ఉన్నారు. పోటీ.. హోరాహోరీ నాగర్కర్నూల్ నియోజకవర్గంలో శాసనసభ ఎన్నికల ముందు టీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నా ఇటీవల జరిగిన ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఫలితాలు రావడంతో నియోజకవర్గంలో పరిస్థితులు కూడా మారాయి. ఎన్నికల తర్వాత కొంత మంది కాంగ్రెస్ నాయకులు పార్టీలో ఉన్నా పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ నాయకులు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ప్రస్తుతం కొన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రచారం నిర్వహించడానికి కూడా క్యాడర్ లేని పిరిస్థితి నెలకొందనేది కొందరి వాదన. ఇటీవల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు కొంత ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న బండారు శ్రుతి ఇప్పటికే నాగర్కర్నూల్ నియోజకవర్గంలో తన ప్రచారం ముమ్మరం చేసింది. బీజేపీలో ఉన క్యాడర్ మొత్తం తనకు సహకరిస్తుండడంతో ప్రచార కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఏది ఏమైనా నాగర్కర్నూల్ నియోజకవర్గంలో ప్రచార కార్యక్రమాలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. -
ఓటును నోటుకు అమ్ముకోవద్దు
సాక్షి, నాగర్కర్నూల్ : ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దని, నీతి, నిజాయితీతో ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని, ప్రజాస్వామ్య పరిరక్షణకు నాడు అంబేద్కర్ రాజ్యాంగంలో ఓటుహక్కు కల్పించారన్నారు. కొంతమంది స్వార్థపరులు ఓటును నోటుకు అమ్ముకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని, ఫలితంగా ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా వెనకబడుతున్నాయన్నారు. రాములును ఎంపీగా గెలిపించి పార్లమెంట్కు పంపించాలని, అప్పుడే ఈ ప్రాంత సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించడం జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో నాయకులు భగవంతు, విజయ్కుమార్, జయశంకర్, నాగేష్, నిరంజనమ్మ, రాములు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్తోనే అభివృద్ధి తాడూరు: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని ఇంద్రకల్, మేడిపూర్ గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించిందన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. స్థానంగా అందరికి అందుబాటులో ఉండే రాములును గెలిపించాలన్నారు. అనంతరం సింగిల్ విండో అధ్యక్షుడు సమ్మద్పాష ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కృష్ణమోహన్రావు శ్రీశైలంతో పాటు కార్యకర్తలు పార్టీలో చేరారు. సమావేశంలో సర్పంచ్ రమణ, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రమేష్, టీఆర్ఎస్ నాయకులు మధుసూదన్రెడ్డి, కార్యదర్శి మల్లెపల్లి వెంకట్రెడ్డి, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలి తిమ్మాజిపేట: తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికావాలంటే టీఆర్ఎస్ ఎంపీలను గెలిపించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పూర్తికావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా టీఆర్ఎస్ ఎంపీలు గెలువడం ముఖ్యమన్నారు. పాలమూర్–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తి కావాలంటే కేంద్రం నిధులు అవసరమన్నారు. కేంద్రంలో ఏర్పాడే ప్రభుత్వంలో టీఆర్ఎస్ ముఖ్య భూమిక పోషించాలన్నారు. పాలమూర్–రంగారెడ్డి పూర్తయితే మండల పరిధిలో పూర్తిస్థాయిలో సాగునీరు అందుతుందన్నారు. టీఆర్ఎస్లో చేరికలు టీఆర్ఎస్ పార్టీలో పలువురు కాంగ్రెస్, ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సంఘం నాయకులు వనమోలి బాల్రాజు, చింతకాయాల వెంకటయ్య, చింతకాయల నాగయ్య, పెద్దనాగయ్య, పూజరి బాల్రాజు, పురమోని బాల్రాజు, మాలమహానాడు నీరంజన్, 6వ వార్డు మెంబర్ చంద్రమ్మ, ఆటోడ్రైవర్ల యూనియన్ సభ్యులు జంగయ్యలు పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రెసిడెంట్ రవీందర్రెడ్డి, నాయకులు ప్రదీప్, వేణుగోపాల్గౌడ్, ఎంపీపీ జయలక్ష్మి, చింతకింది లింగం, లీలావతి పాల్గొన్నారు.