భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం | foreign currency gang arrested in adilabad district | Sakshi
Sakshi News home page

భారీగా విదేశీ కరెన్సీ స్వాధీనం

Published Tue, Jun 28 2016 1:52 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

foreign currency gang arrested in adilabad district

-ఐదుగురి అరెస్టు

జైపూర్: విదేశీ కరెన్సీని చెలామణీ చేసేందుకు యత్నించిన ముఠాను ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పోలీసులు పట్టుకున్నారు. శ్రీరాంపూర్ సీఐ వేణు చందర్ తెలిపిన వివరాలివీ.. టర్కీ దేశం కరెన్సీ ‘లిరా’ను చెలామణీ చేసేందుకు ఏడుగురు సభ్యుల ముఠా యత్నిస్తోంది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు మంగళవారం వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మొత్తం 300 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. భారత కరెన్సీలో వాటి విలువ రూ. 500 కోట్లని తేలింది. అయితే, ఆ కరెన్సీ ప్రస్తుతం టర్కీలో చెలామణీలో లేదు. ఈ మేరకు నిందితులను రిమాండ్‌కు పంపారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement