పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు | Four Gold Biscuits seized at Rajiv Gandhi International Airport | Sakshi
Sakshi News home page

పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు

Published Thu, Jul 16 2015 7:27 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు - Sakshi

పాదరక్షల అడుగుభాగంలో బంగారు బిస్కెట్లు

రంగారెడ్డి (శంషాబాద్) : రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి పాదరక్షల అడుగుభాగం నుండి బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..  హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువకుడు దుబాయ్ నుంచి బయలుదేరి గురువారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు అతడిని తనిఖీ చేశారు. తనిఖీల్లో పాదరక్షల అడుగుభాగంలో దాచుకొని తీసుకొచ్చిన కిలో పది గ్రాముల బరువున్న నాలుగు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement