కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై విచారణ | high court accepts pil on kbr park | Sakshi
Sakshi News home page

కేబీఆర్ పార్కు చెట్ల నరికివేతపై విచారణ

Published Wed, Nov 23 2016 2:54 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్‌డీపీ) కింద చేపట్టిన బహుళ అంత స్తుల ఫ్లైఓవర్ల నిర్మాణానికి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో పెద్ద సంఖ్యలో చెట్లను నరికేస్తుండ టంపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు విచా రణకు స్వీకరించింది.

 వ్యాజ్యాలు స్వీకరించిన హైకోర్టు
 సాక్షి, హైదరాబాద్: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్‌డీపీ) కింద చేపట్టిన బహుళ అంత స్తుల ఫ్లైఓవర్ల నిర్మాణానికి హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కులో పెద్ద సంఖ్యలో చెట్లను నరికేస్తుండ టంపై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు విచా రణకు స్వీకరించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణల ధర్మాసనం మంగళవా రం ఉత్తర్వులు జారీ చేసింది. బహుళ అంతస్తుల  ఫ్లైఓవర్ల  నిర్మాణం కోసం, కేబీఆర్ పార్కులో చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ప్రభుత్వం ఈ ఏడాది మే నెలలో జారీ చేసిన జీవోలను సవాలు చేస్తూ ప్రముఖ పర్యావర ణవేత్త ప్రొఫెసర్ పురుషో త్తంరెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.

చెట్ల నరికివేతపై ఓ పత్రిక ఎడిటర్ హైకోర్టుకు లేఖ రాయగా దాన్నీ హైకోర్టు పిల్‌గా పరిగణించింది. 2 వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా వ్యాజ్యాలను విచారణకు స్వీకరిస్తున్నామంటూ తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement