నుమాయిష్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ | High Court Gives Green Signal To Nampally Exhibition | Sakshi
Sakshi News home page

నుమాయిష్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Published Tue, Dec 31 2019 6:35 PM | Last Updated on Tue, Dec 31 2019 6:41 PM

High Court Gives Green Signal To Nampally Exhibition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నాంపల్లి నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నుమాయిష్‌ ఎగ్జిబిషన్‌కు అనుమతి ఇవ్వదంటూ, ఎగ్జిబిషన్‌ను నిలిపివేయాలంటూ  న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన అనంతరం ఎగ్జిబిషన్‌కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ప్రజల భద్రతపై ఎగ్జిబిషన్‌ నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ కోసం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీ కుమార్‌ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. జనవరి 6 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. ఇక రేపటి నుంచి నుమాయిష్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఘపంగా ప్రారంభం కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement