Numaish
-
Numaish: ఈ నెల 17 వరకూ నుమాయిష్
అబిడ్స్: నుమాయిష్ను రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ తీర్మానం చేసింది. జనవరి 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 15న ముగియాల్సి ఉంది. ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమైనందున మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15న ముగిసే ఎగ్జిబిషన్ ఈసారి 17న ముగియనుంది. -
Hyderabad: నుమాయిష్.. కల్చరల్..జోష్..
నగరంలో 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ జోరుగా సాగుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఈవెంట్ ఫిబ్రవరి 18 వరకూ కొనసాగనుంది. ఎప్పటి నుంచో షాప్ హాలిక్స్కు ఫేవరెట్ స్పాట్గా ఉన్న ఈ వస్తూత్పత్తుల ఉత్సవం.. గత కొంత కాలంగా సాంస్కృతిక కార్యకలాపాల వేదికగానూ వరి్ధల్లుతోంది. కళలను అభిమానించేవారికి చిరునామాగా మారుతోంది. నుమాయిష్కి వెళ్లొచ్చాను అనగానే.. ఏం కొన్నావ్? ఏం తిన్నావ్? అనే ప్రశ్నలే ఎదురవుతాయి తప్ప ఎవరి పాటలు ఎంజాయ్ చేశావ్! ఎవరి నృత్యాభినయాన్ని ఆస్వాదించావ్? అనే ప్రశ్నలు అరుదే. ప్రధానంగా షాపింగ్ ప్రియుల కోసం ఏర్పాటైన ప్రదర్శన కావడం వల్ల నుమాయి‹Ùని ఒక కల్చరల్ ఈవెంట్స్కి కేరాఫ్గా పరిగణనలోకి తీసుకోరు. అయితే ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి మారుతోంది. మంచి సంగీతాన్ని, నృత్యాన్ని, హాస్య కార్యక్రమాన్ని ఆస్వాదించడానికి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అవకాశం ఉంటుందనే ఆలోచన నగరవాసుల్లో వస్తోంది. రోజుకు 6 గంటలపైనే.. నుమాయిష్ షాపింగ్ ప్రధాన ఆకర్షణ అయితే, దానితో పాటే అంతకు మించిన అనుభవాన్ని, వినోదాత్మక కార్యక్రమాలను కూడా అందిస్తోంది. రోజూ సాయంత్రం 5గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ వీటిని నిర్వహిస్తున్నారు. దీని కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రత్యేకంగా పండల్, లాన్స్లో 2 వేదికలు ఏర్పాటు చేశారు. నుమాయి‹Ùని సందర్శించాలని ప్లాన్ చేసే కళాభిమానులు తమకు నచ్చిన ఈవెంట్ ఉన్న రోజును ఎంచుకోవడానికి వీలుగా షాపింగ్తో పాటే పలు రకాల అద్భుతమైన ఈవెంట్ల జాబితా కూడా నిర్వాహకులు సిద్ధంగా ఉంచారు. మంత్రముగ్ధులను చేసే నృత్య ప్రదర్శనల నుంచి మనోహరమైన ముషైరా సెషన్స్ వరకు, ప్రతి ఒక్కరికీ నచ్చేలా వైవిధ్యభరిత ప్రదర్శనలను అందుబాటులోకి తెచ్చారు.కూచిపూడితో కూడి.. సంప్రదాయ సౌరభాలను ఆస్వాదించేవారికి నుమాయిష్ ఒక మంచి ఎంపికగా చెప్పొచ్చు. కూచిపూడి వంటి సంప్రదాయక నృత్యకళలకు ఇక్కడ ఎక్కువగా పట్టం గడుతున్నారు. అలాగే గజల్స్, సూఫీ సంగీతం వంటివి ప్రముఖ కళాకారులు అందిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు నుమాయిష్ అధికారిక వెబ్సైట్లో ఆయా ఈవెంట్లకు సంబంధించిన తేదీలు, వేదికలు, కళాకారుల వివరాలతో కూడిన ఈవెంట్ల జాబితాను పరిశీలించుకోవచ్చు. ప్రముఖ స్టార్స్ ఈవెంట్స్.. గత సంవత్సరం, బాలీవుడ్ స్టార్ సింగర్ జావేద్ అలీ అద్భుతమైన లైవ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన విషయం చాలా మంది నగరవాసులకు మధురమైన జ్ఞాపకం. ఈ ఏడాది ఇప్పటి వరకూ అలాంటి సంచలనాత్మక ప్రకటన ఏమీ రానప్పటికీ.. రానున్న రోజుల్లో ఉండొచ్చని నిర్వాహకులు, సందర్శకులు అంటున్నారు. ఏదేమైనా ఈ కార్యక్రమాలు ఓ వైపు సందర్శకులను సేదతీరుస్తూనే, మరోవైపు స్థానిక ఔత్సాహిక కళాకారులకు అనువైన వేదికలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నాయని చెప్పాలి. నేడు, రేపు..ఇలా.. ఈ వారాంతం వరకూ ఒకసారి పరిశీలిస్తే.. నేడు (మంగళవారం) కూచిపూడి నృత్యం (ఎం.భిక్షపతి) కామెడీ కార్యక్రమం (షాబుద్దీన్), బుధవారం సినిమా పాటలు (జాఫర్ ఉజ్ జమా), కూచిపూడి నృత్యం (రాజ్కుమార్), లయన్స్ క్లబ్ మ్యూజికల్ ప్రోగ్రామ్ అలాగే గురువారం భువనవిజయం ప్రదర్శన, శుక్రవారం విశ్వప్రభ కూచిపూడి నృత్యం, శ్రీకృష్ణ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, గజల్ గీతాలు (అడ్నాన్ సలీమ్)జిందా దిలాన్ఏ హైదరాబాద్ (ముషాయిరీ).. ఇలా పలు వైవిధ్యభరితంగా సందర్శకులను అలరించే సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. -
నుమాయిష్లో సందడి చేసిన టాలీవుడ్ నటి అనసూయ.. (ఫోటోలు)
-
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్కి ఇన్స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్లో మునిగిపోవడం.. రీల్ని సూపర్ హిట్ చేశాయి. -
13 రోజులు.. 5 లక్షల మంది సందర్శకులు
అబిడ్స్: ఎగ్జిబిషన్కు సందర్శకులు పోటెత్తారు. బుధవారం నుమాయిష్ కు దాదాపు 65 వేల మంది వచ్చినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి సురేందర్రెడ్డి తెలిపారు. ఈ నెల 3 నుంచి బుధవారం వరకు సుమారు 5 లక్షల మంది సందర్శించినట్లు వివరించారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులందరినీ మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేసి లోపలికి అనుమతిస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా నిఘా ముమ్మరం చేశారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్లో జోరుగా లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
-
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్కు..పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్కుమార్, సురేష్రాజ్లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్ను మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మిని ట్రైన్తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్, వైఫై టవర్.. మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ల నెట్వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: నుమాయిష్ వాయిదా… ఎప్పటి నుంచంటే!
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)కు సర్వం సిద్ధమవుతోంది. అయితే నుమాయిష్ ప్రారంభ తేదీ వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 1న ప్రారంభం కావాల్సిన నుమాయిష్ 3వ తేదీకి వాయిదా పడింది. రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమవుతుందని నిర్వాహకులు తెలిపారు. 3న సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదుగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తామని తెలిపారు. 46 రోజుల పాటు వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నిజాం కాలంలో 1938లో ప్రారంభమైన నుమాయిష్ను తిలకించేందుకు నగరవాసులే కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తారు.2200 స్టాల్స్ ఏర్పాటుఎగ్జిబిషన్లో 2200 స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడుతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వివిధ రకాల ఉత్పత్తులు ఈ స్టాళ్లల్లో కొలువుదీరనున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య, ఆరోగ్య, కార్మిక, సమాచార, ఆర్బీఐ, అటవీశాఖ, జైళ్ల శాఖలతో పాటు పలు ప్రభుత్వ శాఖలు స్టాళ్లను ఏర్పాటు చేసి సందర్శకులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పిస్తాయి. జనవరి 3న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్లో రౌండ్ స్టాళ్లను తొలగించి స్క్వైయర్ స్టాళ్లను కూడా అందుబాటులో ఉంచారు.సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ ..ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో అందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. సందర్శకులను మధ్యాహ్నం 3 గంట నుండి రాత్రి 10.30 గంటల వరకు అనుమతిస్తారు. ఈ ఏడాది ఎంట్రీ ఫీజును రూ.10 పెంచారు. గతంలో రూ.40గా ఉన్న ప్రవేశ రుసుమును రూ.50 గా నిర్ణయించారు. -
ముగిసిన నుమాయిష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
అటు కిటకిట.. ఇటు తంటా!
అబిడ్స్: ఎగ్జిబిషన్ కిక్కిరిసిపోయింది. నుమాయిష్కు మంగళవారం ఒక్కరోజే దాదాపు 75 వేల మంది సందర్శకులు వచ్చారు. గత 16 రోజుల్లో సుమారు 6 లక్షల మంది సందర్శకులు వచ్చారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు తెలిపారు. ఎగ్జిబిషన్ లోపల, బయట మాలకుంట, అజంతా, గాంధీభవన్ గేట్ల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని బేగంబజార్ పోలీస్ ఇన్స్పెక్టర్ శంకర్ తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహంతో నుమాయిష్ సందర్శకులు నరకయాతనకు గురయ్యారు. బీజేపీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారి దాటి అజంతా గేటు మీదుగా సందర్శకులు ఎగ్జిబిషన్ లోపలికి వెళ్లేవారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి నగర ట్రాఫిక్ పోలీసులు అజంతా గేటు ఎదురుగా ఉన్న ముఖ ద్వారాన్ని మూసివేశారు. రోడ్డు అవతలి నుంచి వచ్చేవారు, బీజేపీ కార్యాలయం ప్రధాన రోడ్డుమీదుగా వచ్చేవారు మెట్రోస్టేషన్ ఎక్కి రోడ్డు ఇవతలి వైపు మెట్రో స్టేషన్ దిగి అజంతా గేటుకు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు నిబంధనలను పెట్టారు. దీంతో వేలాది మంది సందర్శకులు మెట్రోష్టేషన్ ఎక్కాలంటే, దిగాలంటే నానా ఇక్కట్ల పాలయ్యారు. గతంలో మాదిరిగానే ప్రధాన రోడ్లపై వాహనాలను నిలిపి సందర్శకులను అజంతా గేటు లోపలికి అనుమతించాలని డిమాండ్ చేశారు. -
Numaish Exhibition Images 2024: నాంపల్లిలో నుమాయిష్ సందడి (ఫొటోలు)
-
నుమాయిష్ డ్రోన్ విజువల్స్
-
నుమాయిష్ 2024 ప్రారంభం.. మాస్క్ కంపల్సరీ!
హైదరాబాద్, సాక్షి: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నుమాయిష్ సోమవారం సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం, శ్రీధర్బాబు(నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు కూడా) పాల్గొన్నారు. ఈసారి కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు నుమాయిష్ 2024 జరగనుంది. నుమాయిష్ కోసం ఈసారి 2,400 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇక తెలంగాణలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. నుమాయిష్కు పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. మాస్కులు కచ్చితంగా ధరించి రావాలంటూ సందర్శకులను కోరుతున్నారు నిర్వాహకులు. ఈసారి నుమాయిష్ నేపథ్యంలో నగరంలో 45 రోజుల పాటు ఆ రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. మరోవైపు సర్వీసులను ఎక్కువ సమయం నడిపేందుకు హైదరాబాద్ మెట్రో సిద్ధమైంది. ఇక మహాలక్ష్మి పథకం ఉచిత ప్రయాణాల నేపథ్యంలోనూ నాంపల్లి రూట్లో బస్సులకు ప్రయాణికుల తాకిడి పెరిగే అవకాశం కనిపిస్తోంది. నుమాయిష్కు టికెట్ ధరలు గతంలో మాదిరే ఉండనున్నాయి. గతేడాది 10 రూపాయలు పెంచి నుమాయిష్ టికెట్ ధర రూ.40గా నిర్ణయించారు. ఇప్పుడు కూడా టికెట్ ధర రూ.40 లుగా కొనసాగించనున్నారు. నుమాయిష్ సాధారణ రోజులలో సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు కొనసాగుతోంది. వీకెండ్స్,సెలవు దినాల్లో మాత్రం సాయంత్రం 4 నుండి రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. ఈ సంవత్సరం నుమాయిష్ సందర్శన వేళలను నిర్వాహకులు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నుమాయిష్ ను సందర్శించేందుకు మహిళలు, పిల్లలకు ప్రత్యేకంగా ఒక్కో రోజు కేటాయించనున్నారు. జనవరి 9న 'లేడీస్ డే' పేరుతో మహిళలను, 31న 'చిల్డ్రన్ స్పెషల్' పేరుతో పిల్లలను నుమాయిష్ ను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తామని నిర్వహకులు తెలిపారు. నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రతీ ఏడాది సుమారు రెండు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించడంతోపాటు సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యావకాశం కల్పిస్తోంది నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ. -
Hyderabad: 45 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
హైరదాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు 83వ అఖిలభారత పారిశ్రామిక పదర్శన (నుమాయిష్) సందర్భంగా ఆయా మార్గాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర సీపీ కె.శ్రీనివాస్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాబోయే 45 రోజుల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ఈ విషయాన్ని ప్రజలు గమనించి ట్రాఫిక్ ఆంక్షలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ► ఎంజే మార్కెట్ నుంచి నాంపల్లి వైపు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఎంజే మార్కెట్ చౌరస్తా నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బషీర్బాగ్, పోలీస్ కంట్రోల్రూమ్ వైపు నుంచి వెళ్లే భారీ, ఆర్టీసీ బస్సులను ఎల్బీస్టేడియం మీదుగా బీజేఆర్ విగ్రహం నుంచి అబిడ్స్ వైపు మళ్లిస్తారు. ► బేగంబజార్ ఛత్రి, మాలకుంట ప్రాంతాల నుంచి నాంపల్లి వైపు వచ్చే భారీ, మధ్యతరహా వాహనాలను దారుసలాం జంక్షన్ నుంచి ఏక్మినార్ వైపు మళ్లిస్తారు. ► బహదూర్పురా పాతబస్తీ నుంచి వచ్చే వాహనాలను సిటీ కాలేజ్ మీదుగా నయాపూల్ వైపు మళ్లిస్తారు. -
జనవరి 1 నుంచి నుమాయిష్
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జనవరి 1న 83వ నుమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి. ఒకేచోట అన్ని వస్తువులు.. ఎగ్జిబిషన్లో అన్ని రకాల వస్తువులు ఒకేచోట లభ్యమవుతాయి. నగరంలో దొరకని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. దుస్తులు, బెడ్ïÙట్లు, కిచెన్వేర్ , మహిళల కోసం పలు విధాల వంట సామగ్రి, వివిధ రకాల దుప్పట్లు, బెడ్షీట్లు, కశీ్మరీ డ్రై ఫ్రూట్స్తో పాటు ఎలక్ట్రానిక్ వస్తువులు, వివిధ రకాల కొత్త తరహా ఫరి్నచర్స్, పలు విధాల ఉపయోగపడే పలు రకాల సామగ్రి అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర రూ.40.. ఎగ్జిబిషన్ను సుమారు 22 లక్షల మంది సందర్శింనున్నట్లు అంచనా. ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ఎగ్జిబిషన్ సొసైటీ సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తోంది. ఎగ్జిబిషన్కు వచ్చే గోషామహల్, అజంతా గేట్, గాంధీభవన్, గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసి సందర్శకులను లోపలికి అనుమతిస్తారు. టికెట్ ధర రూ.40. వినోదాత్మకమైన పలు విభాగాలు అందుబాటులో ఉంటాయి. సందర్శకులకు కనువిందు చేస్తాం.. ఎగ్జిబిషన్కు వచ్చే సందర్శకులకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. క్రీడా పోటీలు, వినోదాత్మక కార్యక్రమాలు చేపడతాం. సందర్శకుల కోసం ఆహ్లాదకర వాతావరణంలో ఏర్పాట్లు చేస్తాం. – ఏనుగుల రాజేందర్ కుమార్, ఎగ్జిబిషన్ సొసైటీ కోశాధికారి తెలంగాణ విద్యావ్యాప్తికి కృషి ఎగ్జిబిషన్ నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యారంగ వ్యాప్తికి కృషి చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా కళాశాలలు, పాలిటెక్నిక్, ఫార్మసీ, ఇంజినీరింగ్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలను స్థాపించి విద్యా వ్యాప్తికి నిరంతరం పాటుపడుతున్నాం. – బి.హన్మంతరావు, ఎగ్జిబిషన్ కార్యదర్శి 33 సబ్ కమిటీల ద్వారా ఏర్పాట్లు.. 33 సబ్ కమిటీల ద్వారా ఎగ్జిబిషన్ను విజయవంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎగ్జిబిషన్ లోపల, బయట సందర్శకులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎగ్జిబిషన్ సబ్ కమిటీల ప్రతినిధులు తగిన చర్యలు తీసుకుంటారు. – వనం సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు -
నాంపల్లి ఎగ్జిబిషన్ పార్కింగ్ దగ్గర అగ్నిప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ సమీప ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఎగ్జిబిషన్ ఎదురుగా ఉన్న పార్కింగ్ ఏరియాలో శనివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు ఎగసి పడడంతో.. ఐదు కార్లు దగ్ధం అయ్యాయి. పార్కింగ్లో ఉన్న ఓ ఎలక్ట్రిక్ కారు నుంచి ఒక్కసారిగా మంటలు ఎగసిపడడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలు ఆర్పేందుకు యత్నిస్తున్నాయి. అయితే.. మంటలు పూర్తిగా అదుపు అయినట్లు తెలుస్తోంది. మరోవైపు వీకెండ్ కావడంతో నుమాయిష్కు సందర్శకుల రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు నాంపల్లి పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఘటనపై అబిడ్స్ పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. -
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్లో త్వరలో స్లీపర్ బెర్తులు -
నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో,హీరోయిన్ల సందడి
హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్లో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ కలర్స్ స్వాతి సందడి చేశారు. జనవరి26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఓ సాంగ్ షూటింగ్ కోసం నాంపల్లి ఎగ్జిబిషన్కు వచ్చారు. ఈ నేపథ్యంలో హీరో, హీరోయిన్లతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా పెళ్లి తర్వాత ఈమధ్యే సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన స్వాతి ఇటీవలె పంచతంత్రం సినిమాతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే.. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనవరి1న ప్రారంభమైన ఈ ప్రదర్శన ఫిబ్రవరి 15వరకు జరగనుంది. దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్గా పేరొందిన నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కు భారీ సంఖ్యలో ప్రజలు విచ్చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. -
HYD: ఆ రెండు లైన్లలో అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: నగర వాసులకు కాస్త ఊరట కలిగించే వార్త అందించింది హైదరాబాద్ మెట్రో. అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడపాలని నిర్ణయించుకుంది. అయితే అది కొన్నిరోజుల వరకు, రెండు రూట్లలో మాత్రమే!. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నుమాయిష్ కొనసాగినన్ని రోజులు ఈ సౌకర్యం ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు ప్రకటించింది. మియాపూర్-ఎల్బీనగర్, నాగోల్ –రాయదుర్గం కారిడార్లలో ఈ వెసులుబాటు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఎల్బీనగర్, మియాపూర్, నాగోల్, రాయదుర్గం స్టేషన్ల నుంచి ఆఖరి రైలు అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి గమ్యస్థానాన్ని రాత్రి 1 గంటకు చేరుకుంటుందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. నుమాయిష్ సందర్శకులు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఆయన. అయితే.. జేబీఎస్–ఎంజీబీఎస్ రూట్లో చివరి రైలు మాత్రం రాత్రి 11 గంటలకు మాత్రమే బయలుదేరుతుందని ఆయన స్పష్టంచేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నుమాయిష్ ఎగ్జిబిషన్ వద్ద ఉన్న గాందీభవన్ స్టేషన్లో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. నుమాయిష్ షెడ్యూల్ ప్రకారం.. ఫిబ్రవరి 15 వరకు మెట్రో సేవల పొడిగింపు కొనసాగనుంది. -
హైదరాబాద్లో ఎగ్జిబిషన్ సందడి.. నుమాయిష్ ప్రత్యేకతలివే!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లో ఫతే మైదాన్, పరేడ్ గ్రౌండ్లాంటి చారిత్రకమైన మైదానాల జాబితాలోనిదే నాపంల్లిలోని 'ఎగ్జిబిషన్ గ్రౌండ్స్'. కొత్త సంవత్సరం వచ్చిందంటే భాగ్యనగరంలో 'హ్యాపీ న్యూ ఇయర్' కన్నా కూడా ఎక్కువగా వినబడే మాట 'నుమాయిష్'. అదే ప్రతి ఏటా జనవరి మొదటి తారీఖున ప్రారంభమై ఫిబ్రవరి 15 వరకు జరిగే ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్). చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేతుల మీదుగా 6 ఏప్రిల్ 1938లో పబ్లిక్ గార్డెన్లో ఇది ప్రారంభమైంది. 'నుమాయిష్’గా పిలవబడే ఈ ఎగ్జిబిషన్ తొలి ఏడాదిలో 100 స్టాల్స్ నెలకొల్పగా.. కేవలం 10 రోజులు మాత్రమే నడిచింది. ►హైదరాబాద్ స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి, వినియోగదారులను చైతన్యపరచడానికి ఇలాంటి ప్రదర్శన ఒకటి అవసరమన్న ఆలోచన మొదట చేసింది ఉస్మానియా యూనివర్సిటీ గ్రాడ్యుయేట్స్ గ్రూప్. ►అందులో ముఖ్యలు మీర్ అక్బర్ అలీ ఖాన్ (మాజీ ఉత్తర ప్రదేశ్ గవర్నర్ ), నవాబ్ అహ్మదలీ ఖాన్ (మాజీ హోమ్ మినిస్టర్ ), మెహెది నవాజ్ జంగ్ (మాజీ గుజరాత్ గవర్నర్)లాంటి వారు. ►హైదరాబాద్ చరిత్రలో చాలా కీలకమైన 1946-47 కాలంలో నిజాం రాజుకు దీవాన్గా (ప్రైమ్ మినిస్టర్) వ్యవహరించిన సర్ మీర్జా ముహమ్మద్ ఇస్మాయిల్ నుమాయిష్కు పబ్లిక్ గార్డెన్ సరిపోదని దాన్ని ముఖరంజాహి రోడ్డులోని దాదాపు 23 ఎకరాల విశాలమైన ప్రస్తుతమున్న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కు మార్పించారు. ►అయితే 1947-48లో ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ సంస్థాన విలీనం నాటి అల్లకల్లోల పరిస్థితుల్లో ఎగ్జిబిషన్ నిర్వహించలేక పోయారట. తిరిగి దీన్ని 1949లో ఆనాటి రాష్ట్ర గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి మళ్ళీ ప్రారంభించారు. ►కోవిడ్ విపత్తు వల్ల 81వ నుమాయిష్ 2022లో మొదలైనా కూడా కొనసాగించలేకపోవడం మనకు తెలిసిందే. ►ప్రస్తుత ఎగ్జిబిషన్ 2600కు పైగా దేశ విదేశాల స్టాల్స్తో చిత్ర విచిత్రమైన వస్తు వ్యాపారాలు, తినుభండారాలు, విజ్ఞాన వినోదాలు అన్ని వర్గాల వారికి అందిస్తూ ప్రతి రోజు దాదాపు 50 వేల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇందులో జరిగే హైదరాబాద్ సంస్కృతిలో ప్రధానమైన 'ముషాయిరా 'ఉర్దూ కవుల సమ్మేళనం ప్రత్యేక ఆకర్షణ. ►'హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ' కంపెనీ యాక్ట్ కింద రిజిస్టర్ అయిన లాభాపేక్ష లేని సంస్థ. దీనికి ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి లేదా స్పీకర్ అధ్యక్షుడుగా ఉంటారు. ప్రస్తుతం మంత్రి హరీశ్ రావు ఆ స్థానంలో ఉన్నారు. దీని ఆధ్వర్యంలో పలు విద్యా సంస్థలు నిర్వహించబడటం విశేషం. ►ఉమ్మడి రాష్ట్రంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉన్న శంకర్ జీ.. ఫౌండర్ మెంబర్ హోదాలో చాలా కాలం ఈ సొసైటీకి సేవలు అందించారని ఇందులోని సమావేశ మందిరానికి 'శంకర్ జీ మెమోరియల్ హాల్ 'అని పేరు పెట్టారు. అయితే నాటి వ్యవస్థాపక సభ్యులను పూర్తిగా మరిచిపోవడం మాత్రం అన్యాయం. -వేముల ప్రభాకర్.. డల్లాస్, అమెరికా -
నుమాయిష్తో అపూర్వ అనుభూతి
సాక్షి, హైదరాబాద్: ‘‘పెరిగిన సాంకేతికతతో మొబైల్ ఫోన్లో ఆర్డర్స్ క్లిక్ చేస్తే వస్తువులు ఇంటి వద్దకు చేరవచ్చు. కానీ, నుమాయిష్లో వివిధ సంస్కృతులు, ఆహారపు అలవాట్లు, నచ్చిన, మెచ్చిన వస్తువులను చూసి కొనుగోలు చేయడం ద్వారా పొందే అనుభూతిని మాత్రం కోల్పోతామని రాష్ట్రమంత్రి,, ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు హరీశ్రావు అన్నారు. ఆదివారం హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)–82ను ఆయన మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డి తదితరులతో కలసి ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సాళ్లను సందర్శించి వివిధ రాష్ట్రాల ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం వారు నుమాయిష్లోని టాయ్ట్రైన్లో ప్రయాణించారు. అంతకుముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజల జీవన శైలిలో ప్రతి కొత్త సంవత్సరం హైదరాబాద్ నుమాయిష్ భాగమైపోయిందన్నారు. సామాజిక అనుబంధాన్ని కోల్పోకుండా నుమాయిష్ను సందిర్శంచి లభించే గొప్ప అనుభూతిని ఆస్వాదించాలని కోరారు. కన్యాకుమారి నుంచి జమ్మూకశ్మీర్ వరకు వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఎగ్జిబిషన్కు వచ్చి స్టాళ్లు ఏర్పాటు చేస్తారని, వివిధ రకాల సంప్రదాయ ఉత్పత్తుల స్టాళ్లతో ఎగ్జిబిషన్ గ్రౌండ్ మినీభారత్ను తలపిస్తోందని పేర్కొన్నారు. ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ నుమాయిష్ ప్రపంచంలో జరిగే వ్యాపార సమ్మేళనాల్లో ఒకటిని పేర్కొన్నారు. మహిళాసాధికారతకు తోడ్పాటు ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయంతో విద్యాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నట్లు మంత్రి హరీశ్రావు వెల్లడించారు. సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలకు నిధులు సమకూర్చి దాదాపు 30 వేలమందికి నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేకంగా మహిళా విద్యను ప్రోత్సహించేందుకు విద్యాసంస్థలు నడిపిస్తూ మహిళా సాధికారతకు తోడ్పాటునందిస్తున్నారు. హైదరాబాద్లోనే కాకుండా మారుమూల నిర్మల్ వంటి దూర ప్రాంతాల్లోనూ విద్యాసంస్థలు ప్రారంభించి, ఎంతోమందిని విద్యావంతులుగా తీర్చిదిద్దుతున్నట్లు గుర్తు చేశారు. సుమారు రెండు వేల టీచింగ్– నాన్ టీచింగ్ సిబ్బంది పనిచేస్తున్నారని, ప్రతి ఏడాది దాదాపు పదివేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించడం జరుగుతోందన్నారు. ఇక్కడ చదివిన విద్యార్ధులు దేశవిదేశాల్లో ఉన్నతమైన స్ధానాల్లో ఉన్నారని , వారు సొసైటీని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. హోం మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఎగ్జిబిషన్ ద్వారా లభించే ఆదాయాన్ని విద్య కోసం వెచ్చిస్తుందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలో కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు విస్తరించాలని నిర్ణయించడం అభినందనీయమన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి మట్లాడుతూ లాభాపేక్ష లేకుండా సొసైటీ సేవలు అభినందనీయమని, మళ్లీ పాత నుమాయిష్ రోజులు రావాలని ఆకాంక్షించారు. మంత్రి తలుసాని మాట్లాడుతూ స్వాతంత్య్రం రాకముందు నుంచి నుమాయిష్ నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో పలు విద్యసంస్థలు నడపడం గొప్ప విషయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలం విషయంలో చొరవ చూపినట్లు గుర్తు చేశారు. కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ సలీం, ఎగ్జిబిషన్ సోసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
Hyderabad: నుమాయిష్కు అంతా రెడీ.. ఎంట్రీ ఫీజు ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: జనవరి 1వ తేదీ నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయి‹Ù) ప్రారంభమవుతుందని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు అశ్విని మార్గం తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ నేపథ్యంలో నుమాయిష్లోలో వ్యాపారాలు సరిగా జరగలేదని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ నుమాయిష్ ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఈ ఏడాది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్నిరకాల ఉత్పత్తులతో కూడిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాలమైన మైదానంలో స్టాల్స్కు మధ్య దూరం కల్పిస్తూ సుమారు 2400 స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎగ్జిబిషన్ ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు ఉచిత పార్కింగ్, వైద్య శిబిరం ఏర్పాటు చేయడంతో పాటు కోవిడ్ భద్రతా ఏర్పాట్లను చేపట్టినట్లు తెలిపారు. ఈ నెల 1వ తేదీన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్రెడ్డిలు ముఖ్య అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ను ప్రారంభిస్తారని వెల్లడించారు. ఈ ఏడాది ప్రవేశ రుసుము రూ.40 అని, అదేవిధంగా పిల్లలు, పెద్దల కోసం అద్భుతమైన అమ్యూజ్మెంట్ పార్కును సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సాయినాథ్, దయాకర్ శాస్త్రి, జాయింట్ సెక్రెటరీ వనం సురేందర్, పబ్లిసిటీ చైర్మన్ హరినాథ్రెడ్డి, కనీ్వనర్ ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
నుమాయిష్ నయా లుక్..సిద్ధమవుతోన్న ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి ఇంకా కొద్ది రోజులే ఉంది. గత రెండేళ్లుగా కరోనాతో పూర్తిస్థాయి వైభవానికి దూరమైన ఈ భారీ ప్రదర్శన... ఈసారి రెట్టించిన ఉత్సాహంతో సందర్శకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. కొత్త కొత్త విశేషాలను జోడిస్తున్నామని, సందర్శకుల అనుభూతిని పెంచనున్నామని ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు చెబుతున్నారు. కోవిడ్ మహమ్మారి సమస్యల కారణంగా షెడ్యూల్ ప్రకారం నుమాయిష్ నిర్వహించలేకపోయారు. కరోనాకి ముందు 45 రోజుల వ్యవధిలో సుమారు 20 లక్షల మంది ప్రజలు నుమాయిష్ను సందర్శించేవారు. వారాంతాల్లో ఒక్క రోజులో హాజరు 40,000 ఉండేది. అయితే కరోనాతో భారీగా పడిపోయిన ఈ సంఖ్యల్ని మళ్లీ తీసుకురావాలని సొసైటీ కృతనిశ్చయంతో ఉంది. ఆరంభమే...సంపూర్ణంగా... సాధారణంగా నుమాయిష్ జనవరి 1న ప్రారంభమైనా, స్టాల్స్ మొత్తం ఏర్పాటవడం అంటే అది సంక్రాంతి పండుగ తర్వాతే జరుగుతుంది. అయితే ఈసారి అలా కాకుండా తొలి రోజు నుంచే పూర్తిగా లేదా కనీసం 80 శాతం స్టాల్ యజమానులు తమ వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించేలా చూడాలని ఎగ్జిబిషన్ సొసైటీ తమ లక్ష్యంగా పెట్టుకుంది. ‘సందర్శకులకు, స్టాల్ యజమానులకు ఉభయకుశలోపరిగా ఉండేందుకు అధికారిక ప్రారంభోత్సవం నుంచే పూర్తిస్థాయిలో స్టాల్స్ ఏర్పాటయేలా ప్రయత్నిస్తున్నాం,’అని ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అశి్వన్ మార్గం అన్నారు. ప్రారంభమైన స్టాల్స్ కేటాయింపు.. నుమాయిష్లో 10/12 విస్తీర్ణంలో స్టాల్స్ నిర్మాణం వేగంగా సాగుతోంది. భద్రతా కారణాలు, అగ్నిమాపక నిరోధక నిబంధనలను మరింత పటిష్టంగా అమలు చేస్తున్న కారణంగా అత్యవసర వాహనాలు వెళ్లేందుకు ఎక్కువ స్థలాన్ని అనుమతించడం వల్ల ఈ సారి స్టాళ్ల సంఖ్య కొంత తగ్గనుంది. గత సోమవారం నుంచి స్టాళ్ల యజమానులకు సొసైటీ కేటాయింపు లేఖలు అందజేయనుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 2,000 మంది వ్యాపారుల నుంచి దరఖాస్తులు రాగా, 1,200 స్టాల్స్ను కేటాయించనున్నారు. గత ఏడాది కొందరు జీఎస్టీ కట్టకుండా వెళ్లిపోయిన దృష్ట్యా ఈ దఫా స్టాల్స్కి జీఎస్టీతో కలిపి రూ.10 వేల చొప్పున అదనంగా కేటాయింపు పెంచారు. తెలంగాణ ఉత్పత్తులు పెడతామని రాష్ట్ర సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎమ్ఇ)ల నుంచి 50స్టాల్స్ కోసం వినతి రావడంతో వాళ్ల కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తున్నామన్నారు. సందర్శన వేళలు పెంపు... వీకెండ్స్లో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో కనీసం రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ను అనుమతించాలని సొసైటీ సంబంధిత అధికారులను కోరనుంది. ‘నగరమంతటా అర్ధరాత్రి వరకు మార్కెట్లు తెరిచి ఉంటాయి. కాబట్టి ఎగ్జిబిషన్ కూడా రాత్రి 10.30 గంటల నుంచి మరో గంట సమయం అధికంగా సడలింపును కోరుతున్నాము, తద్వారా రద్దీ తగ్గి, సందర్శకులు ఇక్కడ షాపింగ్ చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి తగినంత వ్యవధి లభిస్తుంది’అని అశ్విన్ చెప్పారు. సందర్శకులకు ఉచిత ‘వైఫై’ సౌకర్యాన్ని అందించడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం్ఙ అని అన్నారాయన. ఈ సారి స్ట్రీట్ లైట్స్ వగైరాలతో మరింత సుందరంగా తయారు చేస్తున్నాం. అలాగే ఎంత రష్ ఉన్నా ఫ్రీ మూమెంట్ ఉంటుంది. తోసుకోవడం వంటివి ఉండదు. ఒకప్పుడు కార్నర్ స్టాల్స్ వరకూ వెళ్లగలిగేవారు కాదు. ఇప్పుడలా కాదు..ప్రతీ స్టాల్ మెయిన్ స్టాల్ తరహాలో కనిపిస్తుంది. అదే విధంగా గతంతో పోలిస్తే పాత్ వే 15 అడుగుల వరకూ పెంచాం. ‘వీటన్నింటి దృష్ట్యా నాలుగేళ్ల తర్వాత నుమాయిష్ ప్రవేశ రుసుమును రూ. ఒక్కొక్కరికి 40కి పెంచుతున్నాం’ అని అశ్విన్ మార్గం చెప్పారు. (చదవండి: ఆకాశ వీధి నుంచి.. అందాల వీక్షణం ) -
జనంతో కిటకిటలాడుతున్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్.. (ఫొటోలు)
-
నాంపల్లి ఎగ్జిబిషన్ పునః ప్రారంభం.. ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో శుక్రవారం నుంచి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పునః ప్రారంభమైంది. దీనికి వచ్చే సందర్శకుల తాకిడి నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఇవి అమలులో ఉంటాయి. ఎస్ఏ బజార్, జామ్బాగ్ల వైపు నుంచి ఎంజే మార్కెట్ మీదుగా నాంపల్లి వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ నుంచి అబిడ్స్ మీదుగా మళ్లిస్తారు. పోలీసు కంట్రోల్ రూమ్, ఫతేమైదాన్ వైపు నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ స్టాట్యూ వైపు పంపిస్తారు. (క్లిక్: పేరు గొప్ప.. ఊరు దిబ్బ.. ‘గాంధీ’లో గిదేందీ!) బేగంబజార్ ఛత్రి వైపు నుంచి మాలకుంట వైపు వెళ్లే భారీ సరుకు రవాణా వాహనాలను అలాస్కా జంక్షన్ నుంచి దారుస్సలాం మీదుగా పంపిస్తారు. దారుస్సలాం నుంచి వచ్చే భారీ వాహనాలు, డీసీఎంలు అలాస్కా వద్ద కుడివైపు తిరిగి ఫీల్ఖానా, బేగంబజార్ ఠాణా మీదుగా ఎంజే మార్కెట్, అబిడ్స్ చేరుకోవాలి. (క్లిక్: రూ. 99 వేల కోట్ల..నిజాం నగలున్నాయి) -
25 నుంచి నుమాయిష్ పునఃప్రారంభం
అబిడ్స్: ఈ నెల 25 నుంచి ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ను కరోనా కారణాలతో 2 నుంచి నిలిపివేయడం తెలిసిందే. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ఎగ్జిబిషన్కు అనుమతి ఇచ్చింది. దాదాపు 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది. ప్రభుత్వ, ప్రైవేటు స్టాళ్లతో పాటు పలు రాష్ట్రాల స్టాళ్లను కూడా ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేస్తారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఎగ్జిబిషన్ను పునఃప్రారంభించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. -
నుమాయిష్కు వైరస్ దెబ్బ.. ‘ఏం చేయాలో తోచడం లేదు’
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ ఈ సంవత్సరం కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రద్దయ్యింది. ఈ ప్రదర్శన కోసం జమ్మూకాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, పంజాబ్, ఉత్తరాఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సుమారు 1500 స్టాళ్లను ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇందుకుగాను స్టాళ్ల నిర్వాహకుల నుంచి రూ.లక్ష రూపాయల అద్దె, ఇతరత్రా బిల్లులను సైతం తీసుకున్నారు. వీటిని తిరిగి శుక్రవారం నిర్వాహకులకు వాపస్ ఇచ్చేశారు. దీంతో చాలా మంది స్టాళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయారు. తెచ్చిన సరుకును ప్యాక్ చేసుకుని వాహనాల్లో వారి స్వస్థలాలకు తిరుగుముఖం పట్టారు. ఎగ్జిబిషన్ అకస్మాత్తుగా మూతపడడంతో సొసైటీకి, వ్యాపారులకు నష్టం వాటిల్లిందని సొసైటీ కార్యదర్శి ఆదిత్య మార్గం తెలిపారు. నష్టం రూ.200 కోట్లు ఎగ్జిబిషన్ ఈ ఏడాదీ శాశ్వతంగా మూతపడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కోవిడ్ ఆంక్షలు అమలులో ఉన్నందున నుమాయిష్కు అనుమతి ఇవ్వలేమంటూ సిటీ పోలీసులు తేల్చి చెప్పారు. దీంతో రెండో ఏడాది నుమాయిష్ వచ్చినట్టే వచ్చి కనుమరుగైంది. దాదాపు 2 వేల దుకాణాలు కనీసం రూ.200 కోట్ల టర్నోవర్ ఎగ్జిబిషన్ సొంతం. ఇది సుదీర్ఘ కాలం సాగే ప్రదర్శన కావడంతో కశ్మీర్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్.. ఇలా వేర్వేరు ప్రాంతాల నుంచి దాదాపుగా 400 మంది వ్యాపారులు, సంబంధీకులు వచ్చేశారు. వీరిలో కొందరు చుట్టుపక్కల హోటల్స్లో, పేయింగ్ గెస్ట్ అకామడేషన్లలో బస చేశారు. ‘స్టాల్ కోసం రూ.లక్ష అద్దె చెల్లించా. రూ. 20వేలు జీఎస్టీ, రూ.25 వేల వరకు కరెంట్ బిల్లు కట్టాను. ఇవిగాక ప్రయాణ ఖర్చులూ వృథా అయ్యాయి’ అంటూ వాపో యాడు రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారి. (చదవండి: కోవిడ్ టీకా తీసుకునేందుకు టీనేజర్ల అనాసక్తి) నిర్వాహకులు విలవిల.. ఇప్పటికే రూ.60 లక్షల వ్యయంతో స్టాళ్లు నిర్మించి, అనుమతి కోసం టౌన్ ప్లానింగ్ ఫీజ్ కింద రూ.74లక్షలు చెల్లించామని, ట్రేడ్ లైసెన్స్ ఫీజ్ రూ.50లక్షలు కట్టామని నుమాయిష్ సెక్రటరీ చెప్పారు. తక్కువ ఫీజుతో నిర్వహించే 19 పాఠశాలలు, కాలేజీలకు ఏడాదికి రూ.12 కోట్ల వరకూ ఎగ్జిబిషన్ ఆదాయం నుంచి సబ్సిడీగా వెచ్చిస్తారు. వరుసగా రెండేళ్లు నుమాయిష్ మూత పడడంతో ఈ విద్యాసేవలకు గండిపడినట్టే. (చదవండి: ఆర్ఆర్ఆర్.. 4,400 ఎకరాలు.. కసరత్తు మొదలైంది) తీవ్రంగా నష్టపోయాం.. డ్రైఫ్రూట్స్ స్టాల్ తీసుకున్నాను. దీనికోసం అప్పు చేశాను. డ్రైఫ్రూట్స్ పాడైపోతే పెట్టిన పెట్టుబడి అంతా వృథా అయిపోతుంది. తీవ్రమైన నష్టాల పాలవుతాం. – ఆసిఫ్, కశ్మీర్ నిండా మునిగాం.. 10 రోజుల తర్వాతైనా అనుమతిస్తారనే ఆశతో పనివాళ్లతో కలిపి రూమ్స్ అద్దెకు తీసుకున్నాం. ఇప్పటికే రూ.7 లక్షల విలువైన మెటీరియల్ తీసుకొచ్చాం. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. – ఇమ్రాన్ హుస్సేన్, వస్త్రవ్యాపారి, శ్రీనగర్ -
కరోనా ఎఫెక్ట్: నుమాయిష్ బంద్ ఫొటోలు
-
నుమాయిష్పై కోవిడ్ ఎఫెక్ట్.. ఈ ఏడాది పూర్తిగా రద్దు..
సాకక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకీ భారీగా నమోదవుతుంటంతో నాంపల్లి నుమాయిష్పై ఎగ్జిబిషన్ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుమాయిష్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. జనవరి ఒకటినా తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా నుమాయిష్ ఎగ్జిబిషన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే మొదలైన రెండు రోజులకే కరోనా వేరియంట్ విస్తరిస్తున్న నేపథ్యంలో పది రోజుల పాటు నుమాయిష్ మూసివేస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే నుమాయిష్లోకి ప్రజల సందర్శనను నిర్వాహకులు నిలిపివేశారు. తాజాగా కరోనా, ఒమిక్రాన్ తీవ్రత పెరుగుతుండటంతో ఈ ఏడాది నుమాయిష్ పూర్తిగా నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. చదవండి: ఆ వార్తల్లో ఏది నిజం, ఏది అబద్దమో నేను చెప్పను: ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాగా ప్రతి ఏడాది జనవరి 1న ప్రారంభమైన నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు సాగుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకొని తమ వస్తువులను అమ్ముతుంటారు. ఇక నుమాయిష్కు ప్రతి రోజు వేల సంఖ్యలో వస్తుంటారు. ఈ 45 రోజుల్లో దాదాపు 20 లక్షల మంది నుమాయిష్ను సందర్శిస్తారు. ఈక్రమంలో రద్దీ ఎక్కువగా ఉండటం కారణంగా ఇక్కడ ఎన్ని ఆంక్షలు పెట్టినా కరోనా కట్టడి సాధ్యం కాదని భావించిన అధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ పూర్తిగా దీనిని రద్దు చేసింది. అయితే 2021వ సంవత్సరం కూడా ఎగ్జిబిషన్ను కరోనా నిబంధనలతో పూర్తిగా మూసివేసిన విషయం తెలిసిందే. చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసు.. వనమా రాఘవ అరెస్ట్ -
సిటీలో నుమాయిష్ సందడి
-
దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్.. 84 ఏళ్ల చరిత్ర, నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే..
ఎగ్జిబిషన్..అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన. ఈ పేరు వింటేనే నగరవాసులకో పండగ అని చెప్పొచ్చు. ఏటా జనవరి 1 నుంచి 45 రోజుల పాటు నాంపల్లి గ్రౌండ్స్లో నిర్వహించే ఎగ్జిబిషన్కు ఎంతో క్రేజ్ ఉంది. వేల సంఖ్యలో స్టాళ్లు..ఇతర రాష్ట్రాల వస్తువులు సైతం విక్రయం..వినోదానికి పెద్దపీట..కోట్ల రూపాయల వ్యాపారంతో సిటీ ఎగ్జిబిషన్కు దేశవ్యాప్తంగా పేరుంది. ఇంతటి ఎగ్జిబిషన్ గతేడాది కరోనా కారణంగా బంద్కాగా..ఈ ఏడాది శనివారం నుంచి షురూ అయింది. ఈ నేపథ్యంలో ఎగ్జిబిషన్ చరిత్ర..ప్రాముఖ్యత..పరిణామ క్రమాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం... సాక్షి హైదరాబాద్: నగరానికి తలమానికంగా నిలిచే ఎగ్జిబిషన్(నుమాయిష్)కు సరిగ్గా 85 ఏళ్ల క్రితం బీజం పడింది. అప్పట్లో హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిధుల సేకరణ కోసం పబ్లిక్ గార్డెన్స్లో స్థానిక ఉత్పత్తులతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా మారింది. నాడు కొంత మంది విద్యావంతుల ఆలోచన నేడు వేల మందికి ఉపాధిని సమకూరుస్తోంది. 80 స్టాల్స్తో దాదాపు రూ. 2.5 లక్షల ఖర్చుతో ప్రారంభమైన నుమాయిష్..నేడు దాదాపు 3500పైగా స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 50 లక్షల మంది సందర్శకులతో ప్రతి ఏటా జనవరి 1వ తేదీ నుంచి ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి ప్రపంచంలోనే అతిపెద్ద మేళాగా గుర్తింపు సాధించింది. నుమాయిష్కు అనుమతి... 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయంపై నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన ఉస్మానియా పట్టభద్రుల సంఘం నేతలను ఆహ్వానించి వివరాలను తెలుసుకున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే పరిశ్రమల్లో ఉత్పత్తి అవుతున్న వస్తువుల గురించి సాధారణ ప్రజలకు తెలుస్తుందని, అలాగే నిధులు సమకూరుతాయని వారు వివరించారు. అనంతరం నివేదికను సంస్థాన పాలకుడు ఏడవ నిజాం మీర్ ఉస్మాన్అలీఖాన్కు పంపించారు. దీంతో ఉస్మాన్అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహించడానికి అనుమతి ఇచ్చారు ►ఆ తర్వాత..నుమాయిష్ ఎక్కడ..ఎలా నిర్వహించాలనే దానిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అప్పుడు పట్టభద్రుల సంఘం వివిధ పనులకు కమిటీలు ఏర్పాటు చేసింది. ►తొలుత పరిశ్రమలు, చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసే కర్మాగారాలు, అప్పట్లో ఉన్న పెద్ద దుకాణాల నిర్వాహకులు, యజమానులను సంప్రదించి నూమాయిష్ ఆవశ్యకతను వివరించారు. ► మరోవైపు జంట నగర ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వేతికారు. చివరికి బాగేఆమ్ (పబ్లిక్ గార్డెన్)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ► చివరకు తర్జనభర్జనల అనంతరం ఏప్రిల్ 6వ తేదీ, 1938లో ఏడో నిజాం ఉస్మాన్అలీ ఖాన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఆ ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి నాంపల్లికి... 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్లో నుమాయిష్ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. స్థాపించిన తొమ్మిది సంవత్సరాల్లో ప్రజాదరణ పెరిగింది. నుమాయిష్లో స్టాల్స్ పెరగడంతో పబ్లిక్ గార్డెన్స్లో స్థలం సమస్య ఎదురైంది. దీంతో పబ్లిక్ గార్డెన్స్ నుంచి ఇతర ప్రదేశానికి మార్చాలని సంస్థాన అధికారులు, పట్టభద్రుల సంఘం భావించింది. దీంతో నగరంలోని వివిధ ప్రదేశాలను సందర్శించారు. చివరికి నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానంలో నిర్వహించాలని నిర్ణయించారు. 1946లో హైదరాబాద్ అప్పటి ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ప్రస్తుత వేదిక మార్చాలని ఆదేశించారు. నేటికీ అదే ప్రదేశంలో కొనసాగుతోంది. దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఎమిటేంటే..ఇక్కడ రూ.10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువైన వస్తువులు లభిస్తుంటాయి. నగర, రాష్ట్ర, దేశ విదేశీ పరిశ్రమల్లో తయారు చేసిన దాదాపు 10 లక్షలకుపైగా వైరైటీ వస్తువులు అందుబాటులో ఉంటాయి. ఇక ఫుడ్ ఐటమ్స్తో పాటు సంస్కాృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. వినోదం కోసం రకరకాల ఐటమ్స్ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. అందుకే దీన్ని దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్గా గుర్తిస్తున్నారు. ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా.. 1947లో దేశానికి స్వాతంత్య్రం రావడం, 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనం కావడంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. 1949లో తిరిగి నాంపల్లి మైదానంలోనే తిరిగి అప్పటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి.రాజగోపాల చారి చేతుల మీదుగా ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ గతేడాది వరకు విరామం లేకుండా ప్రతి ఏటా కొనసాగింది. గతేడాది కరోనాతో నుమాయిష్ను మూసివేసారు. ఈ ఏడాది కేవలం 1500 స్టాల్స్ను మాత్రమే ఏర్పాటు చేశారు. నుమాయిష్ ఐడియా ఎలా వచ్చిందంటే.. హైదరాబాద్ ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశంలో తీర్మానించింది. అయితే సర్వేకు నిధుల కొరత ఏర్పడగా..ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తే నిధులు వస్తాయని సభ్యులు సలహా ఇచ్చారు. మన సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే..ఇటు పరిశ్రమల ద్వారా అటు వాటిని సందర్శించడానికి వచ్చే ప్రజల నుంచి నిధులు సులువుగా వస్తాయని సభ్యులందరూ అలోచించి నుమాయిష్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. -
ఎగ్జిబిషన్ అంటే వినోదమే కాదు.. విషయ పరిజ్ఞానమూ పెరుగుతుంది
అఫ్జల్గంజ్ (హైదరాబాద్): ఎగ్జిబిషన్ అంటే కేవలం వినోదం మాత్రమే కాదని, దీనివల్ల ఎంతో విషయపరిజ్ఞానం పెరుగుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి యువ పారిశ్రామికవేత్తలు వచ్చి తమ వస్తువులను ఎగ్జిబిషన్లో ప్రదర్శించి, వాటిని విక్రయిస్తుంటారని, దీనివల్ల ఎంతోమందికి ఉపాధి దొరుకుతుందన్నారు. శనివారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానంలో 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన– 2022 (నుమాయిష్)ను మంత్రి మహమూద్అలీతో కలసి గవర్నర్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..ఎగ్జిబిషన్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని రాష్ట్రంలోని 18 విద్యాసంస్థల ద్వారా ప్రతి ఏడాది సుమారు 30 వేలమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. గవర్నర్ ప్రసంగం ఆఖరులో తెలుగులో మాట్లాడుతూ..2021కి వీడ్కోలు పలికామని, నూతన సంవత్సరానికి స్వాగతం చెప్పారు. మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా నుమాయిష్కు మంచిపేరు ఉందని, ఇక్కడకు వచ్చి వస్తువులు కొనేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తారన్నారు. 45 రోజుల పాటు నిర్వహించే ఎగ్జిబిషన్లో కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు. నుమాయిష్లో ప్రభుత్వం తరఫున వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ప్రభాశంకర్, కార్యదర్శి ఆదిత్యమార్గం, మీడియా ఇన్చార్జ్ అశ్విని మార్గం, మాజీ ఉపాధ్యక్షుడు వివేక్కుమార్ ముదిరాజ్ పలువురు సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
నుమాయిష్కు ఏర్పాట్లు చకచకా
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి గ్రౌండ్లో ఎగ్జిబిషన్ (నుమాయిష్) ప్రారంభానికి రంగం సిద్ధమైంది. 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను జనవరి 1వ తేదీన ప్రారంభించడానికి ఎగ్జిబిషన్ సొసైటీ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, ఫైర్ అనుమతులు లభించాయి. 1500 స్టాళ్లు ► ఈ ఏడాది ఎగ్జిబిషన్లో స్టాళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో ప్రతియేటా 2200 స్టాళ్లను ఏర్పాటు చేసేవారు. కరోనా కారణంగా 700 స్టాళ్లను తగ్గించారు. కేవలం 1500 స్టాళ్లతో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయాలని సొసైటీ నిర్ణయించింది. ప్రభుత్వ, ప్రైవేటు శాఖలకు చెందిన వివిధ రకాల స్టాళ్లను ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. ► తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, జమ్మూకాశ్మీర్, వెస్ట్బెంగాల్ తదితర రాష్ట్రాల స్టాళ్లు ఏర్పాటు కానున్నాయి. (చదవండి: ఐటీ కంపెనీలపై ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఇంకొంత కాలం ఇంటి నుంచే!) కోవిడ్–19 నిబంధనలతో ఎగ్జిబిషన్లో కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని ఎగ్జిబిషన్ కార్యదర్శి ఆదిత్య తెలిపారు. ఎగ్జిబిషన్ లోపల స్టాళ్ల నిర్వాహకులకు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కరోనా వ్యాక్సిన్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. జనవరి 1వ తేదీన గవర్నర్ చేతుల మీదుగా నుమాయిష్ను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. (చదవండి: న్యూఇయర్ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్) -
ముగిసిన ‘నుమాయిష్’
నగర వాసుల ‘మస్ట్ విజిట్’ ఎగ్జిబిషన్గా పేరొందిన అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్ను దాదాపు 20 లక్షల మంది సందర్శించారు. నగరంతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ఉత్పత్తులు ఇక్కడ విక్రయించారు. చివరి రోజు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి కొనుగోళ్లు జరిపారు. జ్యువెలరీ, దుస్తులు, పాదరక్షలు, డ్రైఫ్రూట్స్, గృహోపకరణాలు, ఫుడ్ స్టాల్స్ వద్ద జనం కిక్కిరిసి కన్పించారు. అబిడ్స్: నాంపల్లి ఎగ్జిబిష్ మైదానంలో 80వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్) ముగిసింది. జనవరి 1వ తేదీన ప్రారంభమై నుమాయిష్ మంగళవారం ముగిసింది. 49 రోజులపాటు కొనసాగిన ఎగ్జిబిషన్ను 20 లక్షల 20 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్, కోశాధికారి వినయ్కుమార్ ముదిరాజ్లు వెల్లడించారు. చివరిరోజు మంగళవారం దాదాపు 60 వేల మంది ఎగ్జిబిషన్కు తరలివచ్చారన్నారు. 17వ తేదీ (సోమవారం) వరకు 19 లక్షల 60 వేల మంది సందర్శకులు సందర్శించగా మంగళవారం 60 వేల మంది సందర్శకులతో కలిసి మొత్తం 20 లక్షల 20 వేల మంది ఎగ్జిబిషన్ను సందర్శించడం రికార్డు అని వారన్నారు. ఎగ్జిబిషన్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన పోలీసు, రెవెన్యూ, ఫైర్, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్, ఇతర శాఖల అధికారులు, సిబ్బందికి ప్రభాశంకర్, వినయ్కుమార్ ముదిరాజ్ కృతజ్ఞతలు తెలిపారు. -
నుమాయిష్’ కేసు కొలిక్కి!
సాక్షి, సిటీబ్యూరో: నుమాయిష్ పేరుతో వెబ్సైట్ ఏర్పాటు చేసి, అందులో ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన సమాచారాన్ని అక్రమంగా వినియోగించిన కేసు కొలిక్కి వచ్చింది. ఇందుకు బాధ్యుడైన వెబ్సైట్ నిర్వాహకుడు డి.మల్లికార్జునరావుకు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం నోటీసులు జారీ చేశారు. ఎర్రగడ్డకు చెందిన మల్లికార్జునరావు కుమారుడు ఆర్టిజం బాధితుడు. దీనిపై అవగాహన కల్పిస్తూ పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించుకున్న అతను స్మైల్ ఫౌండేషన్ను స్థాపించారు. దీని తరఫున 2017, 2018ల్లో ఎగ్జిబిషన్లో స్టాల్ ఏర్పాటు చేశారు. ఏటా నగరంలో నిర్వహిస్తున్న ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ను నుమాయిష్గా పిలిస్తున్నప్పటికీ దీనికి ఓ ట్రేడ్ మార్క్ లేనట్లు గుర్తించాడు. దీంతో ముంబైలో ఉండే ట్రేడ్ మార్క్ జారీ సంస్థ నుంచి నుమాయిష్కు రిజిస్ట్రేషన్ పొందాడు. వాస్తవానికి ఎగ్జిబిషన్ సొసైటీకి అప్పగించడానికే ఆయన ఈ ప్రక్రియ పూర్తి చేశాడు. ఇందుకు సంబం«ధించి మల్లికార్జునరావు గతంలో రెండు మూడుసార్లు ఎగ్జిబిషన్ సొసైటీని సంప్రదించి విషయం చెప్పాడు. అయితే వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఈ ట్రేడ్ మార్క్ ఆయన వద్దే ఉండిపోయింది. ఇదిలా ఉండగా మల్లికార్జునరావు నుమాయిష్ పేరుతో ఓ వెబ్సైట్ ( www.numaishonline.com) సైతం రిజిస్టర్ చేయించుకున్న నిర్వహిస్తున్నాడు. ఈ ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే జరిగింది. ఇటీవల ఎగ్జిబిషన్ సొసైటీపై హైకోర్టులో దాఖలైన ఓ ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్) అతడికి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. 2020 ఎగ్జిబిషన్కు సంబంధించి సమాచారాన్ని తన వెబ్సైట్లో ఉంచాలని భావించిన ఆయన ఎగ్జిబిషన్ సొసైటీకి చెందిన అధికారిక వెబ్సైట్ (www.exhibitionsociety.com) నుంచి కాపీ చేసి, తన దాంట్లో పేస్ట్ చేశారు. ఇది 2019 సంవత్సరానికి సంబంధించినది కావడంతో అందులో ఎగ్జిబిషన్లో 2900 దుకాణాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఉంది. అయితే గత ఏడాది ఎగ్జిబిషన్లో జరిగిన అగ్నిప్రమాదానికి పరిమితికి మంచి దుకాణాలు ఏర్పాటుకు అనుమతి ఇవ్వడమే కారణమని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కోర్టులో కేసులు సైతం దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో వివరణ ఇచ్చిన ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ఏడాది కేవలం 1500 దుకాణాల ఏర్పాటుకే నోటిఫికేషన్ ఇస్తున్నామని స్పష్టం చేయడంతో పాటు అమలు చేసింది. అయితే నుమాయిష్ వెబ్సైట్లో 2900 దుకాణాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఉండటం, ఇది ఎగ్జిబిషన్ సొసైటీకి చెందినదే అని భావించడంతో ఓ వ్యక్తి దీని ఆధారంగా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీంతో కోర్టుకు హాజరైన సొసైటీ నిర్వాహకులు నుమాయిష్ వెబ్సైట్ విషయం, అందులో ఉన్న సమాచారం తెలుసుకున్నారు. అది తమ అధికారిక వెబ్సైట్ కాదని స్పష్టం చేసిన సొసైటీ తమ అనుమతి లేకుండా తమ సైట్లోని పాత సమాచారం సంగ్రహించి, దుర్వినియోగం చేసినందుకు నుమాయిష్ వెబ్సైట్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్రావు సాంకేతిక ఆధారాలతో మల్లికార్జునరావు బాధ్యుడిగా తేల్చారు. సోమవారం అతడిని సిటీ సైబర్ క్రైమ్ ఠాణాకు పిలిపించి వాంగ్మూలం నమోదు చేశారు. ఆపై ఆయనకు సీఆర్పీసీ 41 (ఎ) ప్రకారం నోటీసులు జారీ చేసి పంపారు. -
నుమాయిష్ షురూ
అఫ్జల్గంజ్: భాగ్యనగరంలో ఏటా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. బుధవారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(నుమాయిష్)ను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు తదితరులు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా వనిత మహావిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గీతాలాపన చేసిన అనంతరం జ్యోతిప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. గత 79 ఏళ్ల నుంచి ఎగ్జిబిషన్ను విజయవంతంగా నిర్వహిస్తున్న సొసైటీ సభ్యులను మంత్రి మహమూద్ అలీ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్లో తెలంగాణ సంస్కృతైన గంగా జమునా తైజీబ్ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోందని అన్నారు. ఎగ్జిబిషన్ను కేవలం 45 రోజులకే పరిమితం చేయకుండా ఏడాదిలో పలుమార్లు నిర్వహిస్తే ఎందరికో ఉపాధి కల్పించినట్లు అవుతుందని పేర్కొన్నారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ ద్వారా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలతోపాటు ఇతర దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేసి తమ వస్తువులకు ప్రచారం చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారని తెలిపారు. తద్వారా జనవరి వచ్చిందంటే చాలు ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూస్తుందని అన్నారు. గతేడాది అగ్ని ప్రమాద అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఆదాయంతో 30 వేల మందికి విద్య.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల నుంచి వివిధ రకాల ఉత్పత్తులతోపాటు ప్రముఖ కంపెనీల వస్తువులు ఎగ్జిబిషన్లో దొరుకుతాయని మంత్రి ఈటల అన్నారు. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్తో కలసి రాష్ట్రంలోని 18 విద్యాలయాల ద్వారా ఏటా సుమారు 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతి సౌకర్యాలు కల్పిస్తున్న ఏకైక సంస్థగా ఎగ్జిబిషన్ సొసైటీ నిలుస్తుందని కొనియాడారు. నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. గత అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి అండర్గ్రౌండ్ వైరింగ్, వాటర్ సిస్టమ్తోపాటు మరెన్నో జాగ్రతలు తీసుకున్నామని అన్నారు. ఇక ఎగ్జిబిషన్కు అనుమతి ఆలస్యంగా రావడంతో స్టాల్స్ ఏర్పాటు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షులు ఎన్.సురేందర్, కోశాధికారి ఎన్.వినయ్కుమార్, సంయుక్త కార్యదర్శి బి.హన్మంతరావు, మెంబర్లు పాల్గొన్నారు. -
నుమాయిష్ ఓకే..
సాక్షి, హైదరాబాద్: నాంపల్లిలో బుధవారం (నేడు) నుంచి నుమాయిష్ ఏర్పాటు చేసేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. నుమాయిష్ ఏర్పాటుకు ప్రభుత్వాధికారులు జా రీ చేసిన నిరభ్యంతర (ఎన్వోసీ) పత్రాలు, ఇతర సమాచారంపై సమర్పించిన నివేదికలపై ధర్మాసనం ప్రాథమికంగా సంతృప్తి వ్యక్తంచేసింది. అధికారులు చెప్పినట్లుగా ఏర్పాట్లు ఉన్నాయో లేవో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి నుమాయిష్ను సందర్శించి ఈనెల 6లోగా నివేదిక సమర్పించాలని, అగ్నిప్రమాదాలు వంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారా? అని ప్రశ్నించింది. 150 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లుగా ప్రభుత్వం చెప్పడానికి భిన్నంగా 2,900 స్టాల్స్ పెట్టారని పిటిషనర్ చెప్పడం వంటి అంశాలను నివేదికలో పొందుపర్చాలని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్రెడ్డిల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి పొందకుండా నుమాయిష్ ఏర్పాటు చేయడం వల్లే గతంలో అగ్నిప్రమాదం జరిగిందని, ఇందుకు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులను బాధ్యులుగా చేసి వారిపై క్రిమినల్ కేసుల నమోదుకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్కుమార్ వాదిస్తూ.. నుమాయిష్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నామని, ఎలాంటి విపత్తు చోటు చేసుకున్నా నివారణకు జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. ఎగ్జిబిషన్ మైదానంలోనే 1.5 లక్షల లీటర్ల నీటి నిల్వ చేసేలా 2 సంపులు ఏర్పాటు చేశామని, విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగితే 8 సెకన్ల లోపే ప్రారంభమయ్యే జనరేట్లను ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా, కేసు విచారణ అయ్యే వరకూ నుమాయిష్కు అనుమతి ఇవ్వరాదని పిటిషనర్ చేసిన అభ్యర్థనను ధర్మాసనం తిరస్కరించింది. అలాగే నుమాయిష్కు ఉన్న 9 గేట్లలో మూడింటిని తెరిచి ఉంచాలని, మిగిలిన గేట్లకు కూడా తాళాలు వేయకుండా శిక్షణలో తర్ఫీదు పొందిన వ్యక్తులను గేట్ల వద్ద కాపలా పెట్టాలని ఎగ్జిబిషన్ సొసైటీని ధర్మాసనం ఆదేశించింది. విచారణను ఈనెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
నుమాయిష్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్ : నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నుమాయిష్ ఎగ్జిబిషన్కు అనుమతి ఇవ్వదంటూ, ఎగ్జిబిషన్ను నిలిపివేయాలంటూ న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టిన అనంతరం ఎగ్జిబిషన్కు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ప్రజల భద్రతపై ఎగ్జిబిషన్ నిర్వాహకులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. విచారణ కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ కోర్టుకు నేరుగా హాజరయ్యారు. జనవరి 6 లోగా పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 6కు వాయిదా వేసింది. ఇక రేపటి నుంచి నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఘపంగా ప్రారంభం కానుంది. -
నుమాయిష్ నిర్వాహకులపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేడుకగా జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్ను నిలిపివేయాలన్న పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టింది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జనవరి 1 నుంచి జరిగే నుమాయిష్కు అనుమతి ఇవ్వకూడదని న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై గతంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎగ్జిబిషన్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేయాలని ఎగ్జిబిషన్ నిర్వాహకులకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఎగ్జిబిషన్ నిర్వాహకులు నేడు అఫిడవిట్ను సమర్పించగా దాన్ని చూసిన హైకోర్టు సీరియస్గా స్పందించింది. అఫిడవిట్లో ఎక్కడా ప్రజల భద్రతపై క్లారిటీ ఇవ్వలేదని మండిపడింది. మరోసారి పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు, ఎగ్జిబిషన్ నిర్వాహకులకు మొట్టికాయలు వేసింది. అనంతరం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో నాంపల్లి ఎగ్జిబిషన్లో నుమాయిష్ మంటల్లో చిక్కుకోగా భారీ ఆస్తి నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఏడాది భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని హైకోర్టు సూచించింది. కాగా తెలంగాణ సచివాలయం కూల్చివేతపైనా నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. వాదోపవాదాల అనంతరం విచారణను జనవరి 1కి వాయిదా వేసింది. చదవండి: నుమాయిష్కు అంతా సిద్ధం -
నుమాయిష్కు అంతా సిద్ధం: ఈటల రాజేందర్
సాక్షి, హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నుమాయిష్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తలసాని శ్రీనివాస యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్లు పాల్గొననున్నారు. గతేడాదిలా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. అందులో భాగంగా రూ.3 కోట్లతో ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పై భాగాన ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి 2 కిలోమీటర్ల మేర అండర్గ్రౌండ్లో కేబుల్స్ వేస్తున్నామన్నారు. ఆదివారం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ కొన్ని వేల కుటుంబాలకు బతుకునిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్లో పారిశ్రామిక అభివృద్ధిని ప్రోత్సహించడం కోసం నుమాయిష్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. నుమాయిష్ నుంచి వచ్చే ఆదాయంతో రాష్ట్రంలోని 18 విద్యా సంస్థల్లో 30 వేల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో కిరోసిన్, స్టవ్వంటివి బ్యాన్ చేశామని, ఫైర్ సేఫ్టీ కోసం 40 మంది సిబ్బందిని నియమించామన్నారు. దుకాణాల సంఖ్య తగ్గించి జనాలు తిరిగేందుకు వీలుగా ఖాళీ స్థలాన్ని ఎక్కువగా ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల స్టాళ్లు ఉంటాయన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ అన్ని రకాల అనుమతులు తీసుకుందని స్పష్టం చేశారు. -
జనవరి 1నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్
సాక్షి, హైదరాబాద్ : జనవరి 1నుంచి నుమాయిష్ ఎగ్జిబిషన్ జరగనుందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఆదివారం మీడియాతో వెల్లడించారు. అంజనీకుమార్ మాట్లాడుతూ.. నుమాయిష్ ఎగ్జిబిషన్ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక, సంప్రదాయాలకు ప్రతీక అని వెల్లడించారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ 45 రోజుల పాటు జరగనుంది. గత ఏడాది జరిగిన అగ్రి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎగ్జిబిషన్ కమిటీ సభ్యులు తగిన జాగ్రత్తలు తసుకుంటున్నారని తెలిపారు. ప్రమాదాలను నివారించేందుకు ప్రతి 30 మీటర్లకు ఫైర్ హైడ్రాన్ట్స్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా ఫైర్ కంట్రోల్ వెహికిల్స్ సులువుగా తిరిగేందుకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రోడ్ల నిర్మాణం చేపట్టారన్నారు. లక్షా 50 వేల లీటర్ల నీటిని నిలువ ఉంచేందుకు రెండు వాటర్ సంపులను, 9 ఎమర్జెన్సీ కిట్స్ మార్గాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతను, నిఘాను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 25 నుంచి గ్రౌండ్లో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు అంజనీకుమార్ వెల్లడించారు. -
భద్రత పటిష్టం
గన్ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జనవరి 1 నుంచి నిర్వహించనున్న 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయష్)కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శుక్రవారం ఎగ్జిబిషన్ మైదానంలో సొసైటీ పాలకమండలి సభ్యులతో కలిసి వివరాలను వెల్లడించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, పారిశ్రామిక వాతావరణం నెలకొల్పేందుకు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్ సొసైటీని స్థాపించినట్లు తెలిపారు. గత 79 ఏళ్లుగా ఎగ్జిబిషన్ ద్వారా వచ్చిన ఆదాయంతో పాఠశాలలు, కళాశాలలు స్థాపించి విద్యను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. గతంలో ఎప్పుడూ జరగని దుర్ఘటన గతేడాది చోటుచేసుకుందని, అలాంటి ప్రమాదాలు మరోకసారి పునరావృతం కాకుండా పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన వివరించారు. అగ్నిమాపక శాఖ సూచనల మేరకు ఈ ఏడాది స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. స్టాల్ యజమానులు, సందర్శకులకు పూర్తి రక్షణ కల్పిస్తామన్నారు. అనంతరం మైదానంలోని భద్రత ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశంలో ఎగ్జిబిషన్ సొసైటీ గౌరవ కార్యదర్శి డాక్టర్ బి.ప్రభాశంకర్, ఉపాధ్యక్షుడు ఎన్.సురేందర్, సంయుక్త కార్యదర్శి హన్మంతరావు, కోశాధికారి వినయ్కుమార్ పాల్గొన్నారు. భద్రతలో ప్రధానమైనవి ఇవీ.. ♦ గతేడాది జరిగిన సంఘటన దృశ్యా ఈసారి మైదానంలో పైభాగాన ఉన్న విద్యుత్ వైర్లను తొలగించి అంతర్గతంగా అమరుస్తున్నారు. ♦ ప్రతి స్టాల్కు అండర్గ్రౌండ్ నుంచే విద్యుత్ను సరఫరా చేయడంతో పాటు ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఆటోమెటిక్గా విద్యుత్ ఆగిపోయేలా బాక్సులను ఏర్పాటు చేస్తున్నారు. ♦ మైదానంలోని ఇరువైపులా 1.5 లక్షల లీటర్ల నీటి సామర్థ్యంగల రెండు ఫైర్ వాటర్ సంపులనునిర్మిస్తున్నారు. ♦ ఎగ్జిబిషన్ మైదానం చుట్టూ అంతర్గతంగా వాటర్ పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ♦ మైదానంలో కొన్ని ప్రాంతాల్లో ఫైర్ బకెట్లు, వాటర్ బారెల్స్, అగ్నిమాపక వాహనాలను అందుబాటులో ఉంచనున్నారు. అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ తిరగడానికి వీలుగా తగినంత స్థలం వదిలిపెడుతున్నారు. ♦ ఈ ఏడాది స్టాల్ యజమానులు తమ స్టాళ్లల్లో వంట చేసుకోవడానికి గ్యాస్ స్టవ్లను అనుమతించడం లేదు. ♦ అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు బయటకు వెళ్లేందుకు వీలుగా గేట్ల సంఖ్యను పెంచుతున్నారు. -
మంటల వెనుక పరిగెత్తడం కాదు..
సాక్షి, హైదరాబాద్: అగ్ని ప్రమాదం జరిగితే మంటలను ఆర్పేందుకు పరిగెత్తడం కాదని, ఆ ప్రమాదం జరగకుండా తగిన చర్యలు తీసుకున్నప్పుడు సక్రమంగా విధులు నిర్వర్తించినట్లని హైకోర్టు వ్యాఖ్యానించింది. విపత్తుల నిర్వహణ సంస్థ సమర్థవంతంగా పనిచేస్తుంటే ఇలాంటి విపత్తులు జరగకుండా ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్ నుమాయిష్లో ఇటీవల అగ్నిప్రమాద ఘటనపై దాఖలైన వ్యాజ్యంలో విపత్తు నిర్వహణ సంస్థ, కాలుష్య నియంత్రణ మండలి, చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, తెలంగాణ న్యాయ సేవాధికార సంస్థలను ప్రతివాదులుగా చేర్చింది. భవిష్యత్తులో అగ్నిప్రమాదాల నివారణ, విపత్తుల నిర్వహణ తదితర అంశాలపై తదుపరి విచారణ సమయంలో తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది. తదుపరి విచారణను మార్చి 5కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతి తీసుకోకుండానే ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్న నిర్వాహకులను ప్రాసిక్యూట్ చేసేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది ఖాజా ఇజాజుద్దీన్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్జీపీ) ఎస్.శరత్కుమార్ వాదనలు వినిపిస్తూ, ధర్మాసనం ఆదేశాల మేరకు కౌంటర్ దాఖలు చేశామన్నారు. పిటిషనర్ ఇజాజుద్దీన్ జోక్యం చేసుకుంటూ, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోకుండానే ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్గా కేబినెట్ మంత్రి ఉండటమే ఇందుకు కారణమన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ సంస్థ ఉందా? అని ఆరా తీసింది. ఉందని, అది అగ్నిపమాక శాఖలో భాగమని శరత్ చెప్పగా, తాము అడుగుతున్నది విపత్తుల ప్రతిస్పందన విభాగం గురించి కాదని, దే శస్థాయిలో ఉన్న విపత్తుల నిర్వహణ సంస్థ గురించని, దీనికి రాష్ట్రస్థాయిలో ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ సంస్థకు పలు అధికారాలతో పాటు కీలక బాధ్యతలు కూడా ఉంటాయంది. ఇంతకీ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ విస్తీర్ణం ఎంతని ధర్మాసనం ప్రశ్నించగా, 24 ఎకరాలని శరత్ చెప్పారు. ఈ మొత్తం భూమిలో హరితహారం కింద మొక్కలు నాటేస్తే అసలు ఏ ఇబ్బందులు ఉండవని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంలో విపత్తుల నిర్వహణ సంస్థతో పాటు పీసీబీ తదితరులను ప్రతివాదులుగా చేరుస్తున్నామంటూ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ సమయంలో కార్యాచరణను నిర్ణయించి తగిన ఆదేశాలిస్తామంటూ విచారణను వాయిదా వేసింది. -
నుమాయిష్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నుమాయిష్ అగ్ని ప్రమాదంపై ఐఏఎస్ అధికారితో సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణం ఏమిటనే కోణంలో దర్యాప్తు చేయాలని కోరారు. బాధితులు సమస్యలు చెప్పుకుందామంటే రాష్ట్రంలో మంత్రులు లేని పరిస్థితి దాపురించిందన్నారు. వ్యాపారస్తులు మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. సంఘటన స్థలాన్ని సీపీఐ కార్యవర్గ సభ్యులు సుధాకర్, నగర కార్యదర్శి ఈటీ నరసింహ, ఏఐటీయూసీ నాయకులు వెంకట్, గెల్వయ్య, మన్నన్ తదితరులు సందర్శించారు. -
అంగడి ఆగమాగం
సాక్షి, హైదరాబాద్: ఓవైపు బాధితుల ఆగ్రహ జ్వాలలు.. మరోవైపు మిన్నంటిన ఆక్రందనలు, ఆర్త నాదాలు.. ఇంకోవైపు నేతల ఘెరావ్లు, ఆందోళనలతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ గురువారం అట్టుడికింది. అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి రోడ్డునపడ్డ బాధితులను ఆదుకునేందుకు ఇటు ప్రభుత్వపరంగా, అటు నిర్వాహకుల నుంచి ఎలాంటి హామీ లభించకపోవడంతో బాధితులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఎగ్జిబిషన్ సొసైటీ పాలక మండలి కార్యాలయాన్ని ముట్టడించి, అక్కడున్న పూలకుండీలను ధ్వంసం చేశారు. లోపలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన హోం మంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ సహా ఇతర నేతలను బాధితులు ఘోరావ్ చేశారు. వారి కాన్వాయ్ని అడ్డుకునేందుకు యత్నించిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. ఇదే సమయంలో కొంత మంది బాధితులు సొసైటీ కార్యాలయంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని వారికి నచ్చజెప్పారు. నుమాయిష్లో జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన ఓ స్టాల్లో చెల్లాచెదురుగా పడివున్న వస్తువులు, సగం కాలిన వస్త్రాలు వచ్చే ఏడాది ఉచితంగా స్టాళ్లు... బుధవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోని నుమాయిష్లో అగ్నిప్రమాదం జరిగి దాదాపు 300 స్టాళ్లు దగ్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసు, అగ్నిమాపకశాఖ, క్లూస్టీం బృందాలు గురువారం ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించాయి. 15 రెవెన్యూ బృందాలు బాధితుల వివరాలు, ఆస్తి నష్టాల వివరాలను సేకరించాయి. 130 మందికి చెందిన 300 స్టాళ్లు దగ్ధం కావడంతో సుమారు రూ.60 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. దీంతో బాధితులకు తక్షణ సాయంగా రూ.10వేల నగదుతోపాటు రూ.25వేల చెక్కును అందజేయనున్నట్లు మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటెల రాజేందర్ ప్రకటించారు. నుమాయిష్కు శుక్ర, శనివారాలు సెలవు ప్రకటించారు. ఫిబ్రవరి 15 నుంచి 28 వరకు ఎగ్జిబిషన్ పొడగిస్తున్నట్లు హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. షెడ్డులు మళ్లీ ఏర్పాటుచేసి, బాధితులకు ఉచితంగా అందజేయడమే కాకుండా ఆ 14 రోజులపాటు వచ్చే ఆదాయాన్ని పూర్తిగా బాధితులను ఆదుకునేందుకే కేటాయించనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది కూడా వారి నుంచి ఎలాంటి అద్దె వసూలు చేయబోమని స్పష్టంచేశారు. ఓ స్టాల్లో కాలిపోయిన కరెన్సీ నోట్లు సేవాభావం నుంచి వ్యాపార ధోరణికి... చిరు వ్యాపారులను ఆదుకునేందుకు నిజాం ప్రభువు హైదరాబాద్లోని నాంపల్లి మైదానంలో ఏటా ఎగ్జిబిషన్ నిర్వహించేవారు. నుమాయిష్ దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ కావడంతో ఇక్కడ స్టాళ్లను ఏర్పాటు చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా జమ్ముకాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, సూరత్, ఈశాన్య రాష్ట్రాల నుంచి వ్యాపారులు వస్తుంటారు. మొదట్లో ఇది పూర్తిగా సేవాభావంతో పనిచేసేది. ప్రస్తుతం దీన్ని కమర్షియల్గా మార్చేశారు. ఒక్కో షాపునకు రూ.70 వేల అద్దె వసూలు చేస్తుండటంతో యజమానులు వాటిని మరో ఇద్దరు ముగ్గురు వ్యాపారులకు సబ్లీజుకు ఇస్తున్నారు. చివరకు మైదానంలోని దేవాలయం చుట్టూ కూడా షాపులు ఏర్పాటు చేశారు. పైగా వాటి మధ్య కనీసం గ్యాప్ కూడా వదిలిపెట్టలేదు. మరోవైపు షాపుల ముందు ఫైర్ సేఫ్టీ సదుపాయాలు కూడా ఏర్పాటు చేయలేదు. అంతే కాకుండా ఒకే విద్యుత్ వైరు నుంచి అనేక షాపులకు కనెక్షన్లు ఇచ్చారు. నాసిరకం కేబుళ్లు వాడటం, అనేకచోట్ల జాయింట్లతోపాటు లూజ్ కనెక్షన్లు ఉన్నాయని చెప్పినా విద్యుత్ అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆందోళన చేస్తున్న స్టాళ్ల యజమానులు కళ్ల ముందే బూడిదయ్యాయి నాలుగైదేళ్ల నుంచి నుమాయిష్లో స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నా. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల చేనేత వస్త్రాలను విక్రయిస్తున్నా. షాపులో రూ.10 లక్షలకుపైగా విలువైన మెటిరీయల్ ఉంటుంది. వస్త్రాలు అమ్మగా వచ్చిన రూ.48వేల నగదు కూడా కౌంటర్లోనే ఉంది. ఒంటిపై ఉన్న బంగారం కుదువపెట్టి, ఫైనాన్స్ నుంచి అప్పు తీసుకుని మెటిరీయల్ కొన్నా. సంపాదించిన నగదు సహా అన్నీ కళ్ల ముందే కాలిబూడిదయ్యాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – ఆర్తి, హైదరాబాద్ భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను పదిహేనేళ్ల నుంచే నుమాయిష్లో పాల్గొంటున్నా. రూ.70వేలు చెల్లించి స్టాల్ అద్దెకు తీసుకున్నా. రూ.20 లక్షలు ఖర్చుచేసి ఖరీదైన సిల్క్, ఇతర డ్రెస్ మెటిరీయల్ తెప్పించాను. అంతా కళ్లముందే కాలి బూడిదైపోయింది. భార్యాపిల్లలతో రోడ్డున పడ్డాను. కట్టుకునేందుకు బట్టలే కాదు, కనీసం తినేందుకు తిండి కూడా లేదు. – మునాఫ్ ఆలం, బిహార్ తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు సూరత్లో ఓ వ్యాపారి వద్ద నా భార్య నగలన్నీ కుదవపెట్టి సరుకు తెచ్చాను. మరికొంత బంధువుల వద్ద అప్పు కూడా తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాను. ఇప్పటి వరకు సరుకు అమ్మగా వచ్చిన నగదు కూడా కౌంటర్లోనే ఉంది. మెటీరీయల్తో పాటు నగదు కూడా కాలిపోయింది. తిరిగి వెళ్లడానికీ డబ్బుల్లేవు. – ఉమేష్, గుజరాత్ అన్నీ కాలిపోయాయి 30 ఏళ్ల నుంచి స్టాల్ ఏర్పాటు చేస్తున్నా. అన్నీ చేనేత వస్తువులే. అప్పు చేసి మెటీరియల్ కొన్నా. ఈ ఏడాది వ్యాపారం కూడా అంతగా లేదు. 95 శాతం సరుకు స్టాల్లోనే ఉండిపోయింది. ఆ రోజు వచ్చిన నగదు సహా అన్నీ కాలిపోయాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. – రత్నమాణిక్యం, నర్సాపూర్ ఫైరింజన్లో నీళ్లు లేవు తాగేందుకు నీరు లేదు. బాత్రూమ్లూ బాగోలేదు. మౌలిక సదుపాయాల కల్పన విషయంలో పాలకమండలి ఘోరంగా విఫలమైంది. దీనిపై 2018లోనే ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరూ పట్టించుకోకపోగా, బ్లాక్ మెయిల్ చేశారు. అద్దె చెల్లించినా.. అదనంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఫోన్ చేసిన వెంటనే ఫైర్ ఇంజన్ వచ్చినప్పటికీ.. అటు ఇటూ తిరిగిందే కానీ మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేదు. అందులో నీళ్లు కూడా లేవు. – సబిత, గుజరాత్ స్టాళ్ల మధ్య గ్యాప్ లేకపోవడం వల్లే ప్రమాదం గతంలో స్టాల్కు స్టాల్ మధ్య గ్యాప్ ఉండేది. ఏదైనా ప్రమాదం జరిగితే, వెంటనే ఆర్పేందుకు మైదానానికి నాలుగు వైపులా నాలుగు ఫైర్ ఇంజన్లు ఉండేవి. స్టాల్స్ ముందు ఫైర్సేప్టీ కూడా ఉండేది. ప్రస్తుతం వాటిని ఏర్పాటు చేయలేదు. అందువల్లే ఇంత భారీ ప్రమాదం చోటుచేసుకుంది. – మహ్మద్ అశ్రత్, జమ్ముకాశ్మీర్ సమావేశంలో మాట్లాడుతున్న ఈటల బాధితులను ఆదుకుంటాం: ఈటల హైదరాబాద్: నుమాయిష్లో జరిగిన అగ్నిప్రమాదంలో నష్టపోయిన బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని మాజీమంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ తెలిపారు. గురువారం ఎగ్జిబిషన్ సొసైటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 79 ఏళ్ల నుమాయిష్ చరిత్రలో ఇంతపెద్ద ప్రమాదం జరగలేదన్నారు. ఘటనలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వ ఏజెన్సీలు, క్లూస్ టీంలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపారు. అలాగే నష్టం వివరాలను అంచనా వేస్తున్నామన్నారు. ప్రమాద వివరాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని వెల్లడించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రైవేటు, వ్యాపార సంస్థ కాదని.. గొప్ప ఆశయం కోసం ఇది ఏర్పాటైందని తెలిపారు. ప్రైవేటు సంస్థలను డిమాండ్ చేసినట్లుగా సొసైటీని డిమాండ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఏడాది ఎగ్జిబిషన్ ఏర్పాటులో ఇటువంటి సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రతలు తీసుకుంటామని స్పష్టంచేశారు. స్టాల్కు స్టాల్కు మధ్య స్థలం ఉండేలా చూస్తామని, స్టాళ్లను కట్టెలతో కాకుండా ఇనుముతో నిర్మిస్తామని పేర్కొన్నారు. ప్రతి షాప్ వద్ద ఫైర్సేఫ్టీ సదుపాయాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్లు, స్టౌవ్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. షాపు యజమానులు స్టాల్స్కు బీమా తీసుకోవాలని.. ఈ విషయంలో సొసైటీ తరపున రాయితీ కల్పిస్తామని ఈటల తెలిపారు. -
నిర్లక్ష్యమే నిప్పంటించింది
భాగ్యనగరం అనగానే గుర్తుకొచ్చే అపురూపాల్లో ఒకటిగా... ఎన్నో తరాలకు ఒక తీయని జ్ఞాప కంగా ఉంటూ వస్తున్న నుమాయిష్ బుధవారం రాత్రి ఉన్నట్టుండి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 400 దుకాణాలు దగ్థమయ్యాయంటే, జరిగిన ఆస్తినష్టం రూ. 60 కోట్ల మేర ఉన్నదంటే... గురువారం సాయంత్రానికి కూడా మంటలు పూర్తిగా అదుపులోకి రాలేదంటే దీని తీవ్రతేమిటో అర్ధమవుతుంది. ఆ సమయంలో దాదాపు 50,000మంది సందర్శకులున్నా వారంద రినీ సురక్షితంగా బయటకు పంపడం ఊరటనిస్తుంది. ఇందుకు పోలీసుల్ని, అగ్నిమాపక సిబ్బం దిని, విపత్తు నివారణ బృంద సభ్యుల్ని అభినందించాలి. అయితే ప్రమాదాలను అంచనా వేయడంలో, వాటి నివారణకు అవసరమైన చర్యల్ని అమల్లోకి తీసుకురావడంలో అటు అధికార యంత్రాంగం, ఇటు నుమాయిష్ నిర్వాహకులు కూడా విఫలమైన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇదేమీ కొత్తగా మొదలైన వేడుక కాదు. చిరు వ్యాపారులను ఆదుకోవడం కోసం నిజాం పాలకుడు 79 ఏళ్లనాడు దీన్ని ప్రారంభించాడు. ఏటా నెలన్నరపాటు లక్షలాదిమంది ఈ నుమాయిష్ను సందర్శిస్తారు. నిజానికి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన పేరిట దీన్ని నిర్వహిస్తున్నా జనం నానుడిలో ఇది నుమాయిష్గానే ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో సహా దేశం మూలమూలలనుంచీ చిరు వ్యాపారులంతా దీనికోసం తరలివస్తారు. వారు కేవలం తమ తమ ప్రాంతాల్లో చేతివృత్తులవారు, గ్రామీణ ప్రాంత హస్త కళాకారులు, చిన్న పరిశ్రమలవారు రూపొందించిన ఉత్పత్తులను తీసుకు రావడం మాత్రమే కాదు...అక్కడి సంస్కృతీ సంప్రదాయాలను కూడా మోసుకొస్తారు. ఆ రకంగా నుమాయిష్ భిన్న ప్రాంతాలమధ్య సజీవమైన, బలమైన అనుబంధం ఏర్పడేందుకు దోహద పడుతోంది. సందర్శకులు ప్రతి ఏటా క్రమం తప్పకుండా హాజరుకావటానికి ఉత్సాహం చూపడం లోని రహస్యం ఇదే. ఎగ్జిబిషన్ నిర్వాహణకు ప్రత్యేకంగా ఒక సొసైటీ దశాబ్దాలుగా పనిచేస్తోంది. కానీ ఇన్నేళ్ల అనుభవం నుంచి వారు నేర్చుకున్నదేమీ లేదని తాజా ప్రమాదం చాటుతోంది. వారి వైఫల్యం మాట అటుంచి కనీసం పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక విభాగం, విపత్తు నివారణ సంస్థల అధికారులైనా సక్రమంగా వ్యవహరించలేకపోయారు. ఎగ్జిబిషన్ ప్రారంభానికి ముందే ఆ ప్రాంతాన్ని సందర్శించి లోటుపాట్లను ఎత్తిచూపి సరిచేసే బాధ్యత తీసుకోవద్దా? కేవలం అదృష్టవ శాత్తూ ఇన్నేళ్లుగా ప్రమాదాలు జరగలేదు తప్ప, అందుకోసం ముందస్తుగా తీసుకున్న ప్రత్యేక చర్య లేమీ లేవని ఈ దుర్ఘటన అనంతరం బయటపడిన అంశాలు స్పష్టం చేస్తున్నాయి. భారీయెత్తున జనం హాజరయ్యే సందర్భాలున్నప్పుడు వారి భద్రత కోసం అమలయ్యే చర్య లేమిటని ఆరా తీయడం ముఖ్యం. అది లేనప్పుడు అనుభవాలనుంచి మనం గుణపాఠాలు నేర్చు కోవడం లేదని అర్ధం. మన దేశంలో కావొచ్చు... వేరే దేశాల్లో కావొచ్చు, గతంలో ఎన్నో అగ్ని ప్రమా దాలు, తొక్కిసలాటలు చోటుచేసున్నాయి. 1995లో హరియాణాలోని ఒక పట్టణంలో పాఠశాల వార్షికోత్సవంలో వేదిక అంటుకుని 450 మంది పిల్లలు సజీవ దహనమయ్యారు. 2011లో కోల్క తాలో ఒక ఆస్పత్రి మంటల్లో చిక్కుకుని 90 మంది మరణించారు. నాలుగేళ్లక్రితం ఢిల్లీలోని ఎయి మ్స్లో ఉన్న ఒక వార్డులో మంటలు చెలరేగాయి. జరిగే అగ్ని ప్రమాదాల్లో దాదాపు సగం వాటికి విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణమని దేశవ్యాప్తంగా జరిగిన పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కనుక ఎగ్జిబిషన్ వంటివి నిర్వహిస్తున్నప్పుడు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా విద్యుత్ వినియోగానికి ఉపయోగించే వైర్ల నాణ్యత ఏపాటో తనిఖీ చేయడం అవసరం. అలాగే ఒకే కనెక్షన్ నుంచి వేర్వేరు దుకాణాలకు విద్యుత్ సరఫరా చేయడం ప్రమాదం తెస్తుంది. దుకాణాల ఏర్పాటుకు కట్టెలు ఉపయోగించడం, త్వరగా మంటలు వ్యాపించడానికి ఆస్కారమిచ్చే సిల్కు, పాలియెస్టర్ వస్త్రాలను వాటి రూపకల్పనలో వాడటం ముప్పు కలిగిస్తుంది. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. మంచిదే. కానీ అక్కడ ఏర్పాటు చేసే దుకాణాల విషయంలో ఇటీవల వ్యాపార దృక్పథమే ఎక్కువ కనిపిస్తున్నదని చాలామంది చెబుతున్నారు. ఒక్కో దుకాణాన్ని రూ. 70,000 చొప్పున అద్దెకివ్వడం వల్ల అంత మొత్తాన్ని భరించలేనివారు ఆ చోటును మరో ఇద్దరు ముగ్గురితో కలిసి పంచుకుంటు న్నారు. దాంతో సహజంగానే విద్యుత్ వినియోగం పెరుగుతుంది. సరఫరా తీగలపై అధిక భారం పడుతుంది. ఇవన్నీ నుమాయిష్ నిర్వాహకుల దృష్టికి రాలేదంటే ఏమనుకోవాలి? ప్రమాదాలు జరిగిన పక్షంలో సురక్షితంగా జనాన్ని తరలించడానికి, మంటలను సాధ్య మైనంత త్వరగా అదుపులోనికి తెచ్చేందుకు అనువుగా దుకాణాల డిజైన్ రూపొందాలి. పొగ బయ ల్దేరిన వెంటనే అలారం మోగి అప్రమత్తం చేసే ఏర్పాటుండాలి. ఏదైనా అనుకోనిది సంభవించి నప్పుడు ఫైరింజన్లు రావడానికి ఉన్న మార్గాలేమిటో, అక్కడుండే అడ్డంకులేమిటో పరిశీలించాలి. నుమాయిష్ వంటి అతి పెద్ద సందర్భంలో ఇవి తప్పనిసరి. అలాగే ప్రతి దుకాణం వద్దా మంటల్ని ఆర్పే పరికరాలు ఉంచాలి. వాటిని ఉపయోగించడం ఎలాగో దుకాణదారులకు నేర్పాలి. అదే అమలు చేసి ఉంటే ఫైరింజన్లు వచ్చేలోగా దుకాణదారులంతా ఒక్కటై మంటల్ని అదుపు చేసేవారు. నష్టం కనిష్టంగా ఉండేది. ఈ తరహా భద్రతా ప్రమాణాల మాట అటుంచి ప్రమాద సమాచారం అందుకుని వచ్చిన ఫైరింజన్లలో నీళ్లే సరిగా లేవు. ఈ దుర్ఘటనలో నష్టపోయిన దుకాణదారులకు ఆదుకుంటామంటున్నారు. అది సాధ్యమేనా? ఎందరో వ్యాపారులు స్థిరచరాస్తులు కుదువ పెట్టు కుని వచ్చారు. అలాంటివారంతా సర్వస్వం కోల్పోయారు. తిరిగి వెళ్లడానికి కూడా వారిదగ్గర డబ్బు లేదంటే నష్టం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయొచ్చు. నిర్వాహకుల నిర్లక్ష్యం, దురాశ, అధికార యంత్రాంగంలో కొరవడిన ముందుచూపు దుకాణదారుల బంగారు భవిష్యత్తుకు నిప్పంటిం చాయి. ఇందుకు ఎవరికి శిక్ష పడాలి? -
‘79ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు’
-
‘79ఏళ్ల చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం జరగలేదు’
సాక్షి, హైదరాబాద్ : భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లోజరిగిన అగ్ని ప్రమాద నష్టంపై విచారణ జరుపుతున్నామని, నివేదిక ఆధారంగా స్టాల్స్ నిర్వాహకులను ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రెసిడెంట్ ఈటల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 79ఏళ్ల నుమాయిష్ ఎగ్జిబిషన్ చరిత్రతలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదన్నారు. అగ్నిప్రమాద ఘటన వివరాలను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకుంటున్నారని చెప్పారు. ప్రమాదంలో నష్టపోయిన వ్యాపారులతో పాటు సొసైటీ తీవ్రంగా బాధపడుతుందని తెలిపారు. నష్టపోయిన వ్యాపారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. (నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం) ‘షాప్ ఓనర్లు ఎన్నో ఏళ్లుగా మాలో ఒక కుటుంబంలా ఉన్నారు. వాళ్లకు నష్టం వచ్చిందంటే మాకు నష్టం వచ్చినట్లే. గొప్ప ఆశయం కోసం ఈ సోసైటీ ఏర్పాటైంది. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రయివేటు సంస్థ కాదు.. వ్యాపార సంస్థ కాదు.. పేద ప్రజల కోసం పని చేస్తోంది. సొసైటీ ద్వారా వచ్చే లాభాలను పేద ప్రజలు, విద్యార్థుల కోసం వినియోగిస్తుంది. ప్రతి పైసా విద్యకోసం ఖర్చు పెడుతోంది. జరిగిన సంఘటనను రాజకీయం చేయొద్దు. మొత్తం 300 షాపుల వరకు ప్రమాదంలో దగ్ధమయ్యాయి. ఒక స్టాల్ వద్ద అగ్రిప్రమాదం జరగడంతో చుట్టుపక్కల మంటలు చెలరేగాయి. ఇలాంటివి జరగకుండా ఇకపై ఫైర్ ఇంజన్లతో సంబంధం లేకుండా ప్రతి షాప్కు ప్రత్యేకంగా మోటర్ లు ఏర్పాటుచేస్తాం. రాబోయే కాలంలో షాపుల కట్టెలతో కాకుండా దృడంగా ఉండేలా నిర్మిస్తాం. పూర్తి విచారణ జరిగిన తర్వాత ఎవరిది తప్పు అనేది చెబుతాం. ప్రమాదం దృష్ట్యా నేడు, రేపు ఎగ్జిబిషన్ను నిలిపివేస్తున్నాం’ అని ఈటల పేర్కొన్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ వద్ద ఆందోళనలు
సాక్షి, నాంపల్లి(హైదరాబాద్): హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) బుధవారం రాత్రికి అగ్నికి ఆహుతైంది. క్షణాల్లోనే అక్కడున్న వందల స్టాళ్లు బూడిద అయ్యాయి. దీంతో తమకు న్యాయం చేయాలంటూ నష్టపోయిన స్టాల్ నిర్వాహకులు గురువారం సొసైటీ ముందు ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో వ్యాపరస్తులు సొసైటీ ముట్టడికి యత్నించారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. మేమేంటో చూపిస్తాం: స్టాల్ నిర్వాహకులు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చెలరేగిన మంటలతో లక్షల రూపాయలు నష్టపోయామని వ్యాపరస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు నష్ట పరిహారం చెల్లించాలంటూ సొసైటీ సభ్యులను డిమాండ్ చేస్తున్నారు. 30 నిమిషాల్లో అధికారులు వచ్చి మాట్లాడకపోతే ఆందోళన మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు. తమకు న్యాయం చేస్తామని సోసైటీ సభ్యులు హామీ ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. -
నాంపల్లి ఎగ్జిబిషన్లో భారీ అగ్ని ప్రమాదం
-
మంటల్లో నుమాయిష్.. బుగ్గిపాలైన 400 స్టాళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు వినోదాన్ని పంచే.. ఎగ్జిబిషన్లో పరిస్థితి విషాదకరంగా మారింది. హైదరాబాద్లోని నాంపల్లిలో ప్రతిఏటా జరిగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) అగ్నికి ఆహుతైంది. బుధవారం రాత్రి ఏడున్నర గంటల ప్రాంతంలో రేగిన నిప్పురవ్వలు.. చూస్తుండగానే దావానలంలా మారి క్షణాల్లో అక్కడున్న స్టాళ్లను బూడిద చేశాయి. అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే.. ఈ ఘటన జరిగిన సందర్భంలో సుమారు యాభైవేలకు పైగా సందర్శకులు ఎగ్జిబిషన్లో వివిధ స్టాళ్లలో ఉన్నప్పటికీ.. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఉధృతంగా ఎగసిపడిన మంటలు, దట్టమైన పొగ కారణంగా సుమారు ఏడుగురు అస్వస్థతకు గురవడంతో.. వీరికి సమీపంలోని కేర్, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్సనందిస్తున్నారు. ఆస్తి నష్టం మాత్రం వందల కోట్లలో ఉండొచ్చని ప్రాథమిక అంచనా. దాదాపు 400 స్టాళ్లు బూడిదయ్యాయి. దీంతో ఆ స్టాళ్ల యజమానుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. వారిని ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. రాత్రి 10.30 గంటల వరకు కూడా మంటలు ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. మిగిలిన స్టాళ్లకు మంటలు విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. 7.30గంటల సమయంలో.. ఎప్పటిలాగే.. మధ్యాహ్నం 3 గంటలకు ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. అయితే.. సాయంత్రం 7.30 గంటల ప్రాంతంలో వనితా మహావిద్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన జైళ్లు, ఆంధ్రాబ్యాంక్ స్టాళ్ల సమీపం నుంచి మంటలు మొదలయ్యాయి. సందర్శకులు, స్టాళ్ల యజమానులు చూస్తుండగానే.. ఈ మంటలు గాంధీ విగ్రహం సమీపంలోని హెచ్పీ గ్యాస్, పిస్టా హౌజ్ స్టాళ్ల మధ్య, వీటికి ఎదురుగా ఉన్న స్టాళ్లకు వ్యాపించాయి. వీటిలో చేనేత, దుస్తులు, చెప్పులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల స్టాళ్లే ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు జైళ్లు, ఆర్బీఐ, ఆంధ్రాబ్యాంక్, రియల్ ఎస్టేట్ స్టాళ్లన్నీ దగ్ధమయ్యాయి. కశ్మీర్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి స్టాళ్లలోని చిన్న గ్యాస్ సిలిండర్లు (వారు వంట వండుకునేవి) పేలిపోయి భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కలకలం మంటలు క్షణాల్లోనే పెరిగిపోతుడడంతో స్టాళ్ల యజమానులతోపాటు అక్కడికొచ్చిన సందర్శకుల్లో ఆందోళన పెరిగిపోయింది. ఎటుపోవాలో అర్థంకాక.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెరోపక్కకు పారిపోయే ప్రయత్నం చేయడంతో.. ఒక దశలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది కిందిపడిపోయి స్వల్పంగా గాయపడ్డారు. ఆహ్లాదకరంగా ఉన్న ఎగ్జిబిషన్లో పరిస్థితి క్షణాల్లోనే భయానకంగా మారడంతో.. బయట నుండి రావాల్సిన సందర్శకులను నిలిపేయటంతో పాటు, లోపల ఉన్న సందర్శకులు సైతం పిల్లా పాపలతో గాంధీభవన్, అజంతా, గోషామహల్ గేట్ల వైపు పరుగులు తీశారు. సాయంత్రం ఏడు గంటల నుండి పదిన్నర గంటల వరకు చెలరేగిన అగ్నికీలల్లో సుమారు 400 స్టాళ్లు పూర్తిగా దహనం అయ్యాయి. దీంతో ఆస్తినష్టం వందల కోట్లలో ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు అంచనాకు వచ్చారు. అరగంట తర్వాత వచ్చిన ఫైరింజన్ తొలుత నిప్పురవ్వలు వచ్చి మంటలు అంటుకోగానే ఫైర్స్టేషన్కు సమాచారం ఇచ్చారు. అయితే ఆ సమయంలో నుమాయిష్ గేటు బయటే ఉన్న ఫైరింజన్ లోపలకు వచ్చేందుకు 28 నిమిషాల సమయం పట్టిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దురదృష్టవశాత్తూ.. అందులోనూ మంటలార్పేందుకు సరిపోయేన్ని నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అగ్నిప్రమాదం విషయమై ఉన్నతాధిరులు జోక్యం చేసుకుని సుమారు 18 ఫైరింజన్లు పంపినా.. రాత్రి పదిన్నర గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దాన కిషోర్లు ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ దుర్ఘటన తర్వాత.. ఎగ్జిబిషన్ గ్రౌండ్ నుండి వెళ్లిపోయే సందర్శకుల కోసం అర్థరాత్రి వరకు ఉచితంగా మెట్రో రైళ్లను నడిపారు. నష్టపరిహారం కోసం ఆందోళన మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్కు వచ్చిన హోంమంత్రి మహమూద్ అలీకి స్టాళ్ల యజమానుల నుండి నిరసన ఎదురైంది. సకాలంలో ఫైరింజన్లు రాకపోవటం వల్లే తమ స్టాళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయని హోంమంత్రిని చుట్టుముట్టి, తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.ఒక దశలో పోలీస్లు జోక్యం చేసుకుని ఆందోళనకారులను చెదరగొట్టారు. అనంతరం కొందరు ప్రతినిధులు మహమూద్ అలీతో సమావేశమై తమ పరిస్థితిని వివరించారు. ప్రభుత్వం తప్పక న్యాయం చేస్తుందని ఈ సందర్భంగా హోంమంత్రి వారికి భరోసా ఇచ్చారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా జనవరి 1న ప్రారంభమైన 79వ పారిశ్రామిక ప్రదర్శన (ఎగ్జిబిషన్)ను 23 ఎకరాల్లో 2900 స్టాళ్లతో ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు సాగే ఈ ఎగ్జిబిషన్ను సుమారు 25–30లక్షల మంది సందర్శిస్తారు. జైళ్లు, అటవీశాఖలతో పాటు జమ్మూకశ్మీర్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి చేతివృత్తి కళాకారుల రూపొందించే వస్త్రాలు, కళాఖండాలకు సంబంధించిన స్టాళ్లున్నాయి. కళ్లముందే కాలిపోయాయి: అక్బర్ అలీ మేం ప్రతి ఏటా స్టాల్స్ ఏర్పాటు చేస్తాం. ఈ యేడు పోచంపల్లితో పాటు ఇతర చేనేత వెరైటీలతో నాలుగు స్టాళ్లు ఏర్పాటు చేశాము. తొలుత ఆంధ్రాబ్యాంక్ స్టాల్ పక్క స్టాల్నుండి చెలరేగిన మంటలు చూస్తుండగానే విస్తరించాయి. నా స్టాళ్లలోని సుమారు 60 లక్షల విలువైన వస్త్రాలు దహనం అయ్యాయి. ఇప్పుడేం చేయాలో అర్థం కావటం లేదు. ఫైరింజన్ల ఆలస్యం: చింతాడ గోవర్ధన్, పోచంపల్లి ఫైరింజన్లు సకాలంలో వచ్చుంటే ఇంత నష్టం జరిగేది కాదు. మేం ఫోన్ చేసిన చాలా సేపటికి ఫైరింజన్లు వచ్చాయి. పోచంపల్లి ఖాదీతో మేం ఏర్పాటు చేసిన స్టాళ్లు చూస్తుండగానే కాలిపోయాయి. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పరిగెత్తడం మినహా.. మరేం చేయలేకపోయా. నాకు సుమారు 7 లక్షల నష్టం వాటిల్లింది. ప్రభుత్వమే ఆదుకోవాలి. లేకపోతే ఆత్మహత్య తప్పదు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సొసైటీ కాలేజీలకు పూర్వ వైభవం!
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యాప్తికి అధిక ప్రాధాన్యతను ఇస్తోందని, ఎగ్జిబిషన్ సొసైటీ కింద నడిచే కళాశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో సోమవారం 78వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కడియం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీ కింద పనిచేసే విద్యా సంస్థలను పటిష్టం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ కింద పనిచేసే 18 కళాశాలల్లో ఒకటి, రెండు మినహా అన్నీ బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయని చెప్పారు. సొసైటీ ఆదాయంతో నడిచే కళాశాలలను ప్రభుత్వం నడిపించేందుకు సిద్ధంగా ఉందన్నారు. సొసైటీ అంగీకరిస్తే ప్రభుత్వమే ఖాళీగా ఉన్న అధ్యాపకుల భర్తీ, కనీస సదుపాయాల కల్పన చేపడుతోందన్నారు. కళాశాలలను ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఇష్టంగా లేకుంటే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయడానికైనా ప్రతిపాదనలు పంపాలని కోరారు. స్టాల్స్ సంఖ్య పెంచుతాం: ఈటల స్టాల్స్ నిర్వహణ కోసం దరఖాస్తులు విపరీతంగా వస్తున్నాయని, ఈ సారి పది వేల దరఖాస్తులు వచ్చాయని సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో స్టాల్స్ సంఖ్యను పెంచే ప్రయత్నం చేస్తామన్నారు. 70 శాతం స్టాల్స్ నిర్వాహకులు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను ప్రదర్శించుకునేందుకు మూడు తరాలుగా వస్తున్నారని చెప్పారు. ఈ సొసైటీ కింద 18 కళాశాలలు కొనసాగుతున్నాయని, విద్యా సంస్థల నిర్వహణ కోసం పాటుపడుతున్న ఎగ్జిబిషన్ లీజు 50 సంవత్సరాల పాటు పర్మినెంట్గా కొనసాగించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. నుమాయిష్ హెరిటేజ్ ఈవెంట్ లాంటిదని ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి డాక్టర్ ఎన్విఎన్ చార్యులు అన్నారు. సందర్శకులకు ఉచిత వైఫై సేవలు, ఉచిత పార్కింగ్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నరోత్తమరెడ్డి, సంయుక్త కార్యదర్శి వంశీ తిలక్, కోశాధికారి సి.హెచ్. రవీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
నిధుల కోసమే నుమాయిష్
నుమాయిష్.. దాదాపు 2,500 స్టాల్స్, వందల కోట్ల రూపాయల వ్యాపారం, 40 లక్షల మంది సందర్శకులతో ప్రపంచంలోనే అతిపెద్దదిగా పేరుపొందిన ఈవెంట్. నగరంలో ప్రతి యేటా జనవరి 1వ తేదీన ప్రారంభమై.. 45 రోజుల పాటు కొనసాగుతుంది. నిజాం సంస్థానంలో ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి నిర్వహించే సర్వే కోసం సుమారు 80 స్టాల్స్తో రూ. 2.5 లక్షల ఖర్చుతో ఈ నుమాయిష్ ప్రారంభమైంది. నేడు నుమాయిష్ ప్రారంభమౌతున్న సందర్భంగా ‘సాక్షి’ప్రత్యేక కథనం... – సాక్షి, హైదరాబాద్ నూమాయిష్ ఎక్కడ ప్రారంభించారు.. అనుమతి లభించిన వెంటనే పట్టభద్రుల సంఘం.. వివిధ పనులపై కమిటీలు ఏర్పాటు చేశారు. పరిశ్రమలు, పెద్ద దుకాణాల నిర్వాహకులను సంప్రదించి నుమాయిష్ ఆవశ్యకత ను వివరించారు. ప్రజలకు అనువుగా ఉండే ప్రదేశం కోసం వెతికారు. చివరికి బాగే ఆమ్ (పబ్లిక్గార్డెన్)లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని ఏర్పా ట్లు పూర్తయ్యాక 1938, ఏప్రిల్ 6న ఉస్మాన్ అలీఖాన్ జన్మదినం సందర్భంగా ఆయన చేతుల మీదుగానే పబ్లిక్ గార్డెన్లో (నముష్–ఇ–మాస్నావత్–ఎ–ముల్కి)గా నుమాయిష్ను ప్రారంభించారు. తొలి ఏడాది 10 రోజుల పాటు నుమాయిష్ నిర్వహించారు. పబ్లిక్ గార్డెన్స్ నుంచి నాంపల్లికి... అప్పటి స్టాల్స్ 1946 వరకు పబ్లిక్ గార్డెన్స్లో నుమాయిష్ నిర్వహించారు. 10 రోజుల నుంచి 15 రోజుల వరకు పెంచారు. ప్రజా దరణ పెరిగి స్టాల్స్ పెరగడంతో పబ్లిక్ గార్డెన్స్లో స్థలం సమస్య వచ్చింది. దీంతో నాంపల్లిలోని విశాలమైన 32 ఎకరాల మైదానానికి మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రదేశం నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉంటే వివిధ ప్రదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకూ అనువుగా ఉంటుందని భావించారు. అలా 1946లో హైదరాబాద్ ప్రధాని సర్ మీర్జా ఇస్మాయిల్ ఆదేశాల మేరకు సుమాయి ష్ను పబ్లిక్ గార్డెన్ నుంచి నాంపల్లి మైదానాని(ఎగ్జిబిషన్ గ్రౌండ్)కి మార్చారు. ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్... 1949లో నాంపల్లిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి వచ్చిన అప్పటి గవర్నర్ జనరల్ సి.రాజగోపాలచారి 1947లో దేశ స్వాతంత్య్రం.. 1948లో హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్లో విలీనంతో ఈ రెండేళ్లు నుమాయిష్ ఏర్పాటు చేయలేదు. తిరిగి 1949లో నాంపల్లి మైదానంలోనే నాటి హైదరాబాద్ రాష్ట్ర గవర్నర్ జనరల్ సి. రాజగోపాల్ ప్రారంభించారు. అప్పుడు నుమాయిష్ పేరును ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్గా మార్చారు. అప్పటి నుంచి నేటికీ ప్రతి ఏటా ఎలాంటి అంతరాయం లేకుండా ఎగ్జిబిషన్ సాగుతోంది. ప్రపంచంలో ఎలాంటి విరామం లేకుండా 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఈవెంట్ హైదరాబాద్ ఎగ్జిబిషన్. గతేడాది 40 లక్షల మంది సందర్శకులను ఆకర్షించింది. వాణిజ్యంలో రూ. 150 కోట్లు దాటింది. ఇందులో రూ. 10 నుంచి మొదలు కొని లక్షల రూపాయల విలువ చేసే వస్తువులు ఉంటాయి. నుమాయిష్ ఐడియా ఎలా వచ్చింది... హైదరాబాద్ సంస్థాన ప్రజల ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి సర్వే నిర్వహించాలని 1937లో నాటి ఉస్మానియా పట్టభద్రుల సంఘ సమావేశం తీర్మానించింది. అయితే సర్వే నిర్వహించడానికి నిధుల కొరత ఉండటంతో ఏదైనా కార్యక్రమం నిర్వహించి నిధులు సేకరించాలని సభ్యులు సలహా ఇచ్చారు. సంస్థానంలో తయారయ్యే వివిధ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేస్తే పరిశ్రమల ద్వారానే కాకుండా సందర్శకుల నుంచి కూడా నిధులు వస్తాయని ఆలోచించి నుమాయిష్ (ప్రదర్శన)కు రూపకల్పన చేశారు. అనుమతి లభించిందిలా... 1937లో ఉస్మానియా పట్టభద్రుల సంఘం నుమాయిష్ ఏర్పాటుకు ఓ నివేదిక రూపొందించి అప్పటి సంస్థాన ప్రధాన మంత్రి సర్ అక్బర్ హైదరీకి పంపించారు. ఆయన పూర్తిస్థాయిలో నివేదిక పరిశీలించి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్కు పంపించారు. నివేదిక అందిన తరువాత ఉస్మాన్ అలీ ఖాన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇచ్చారు. -
ఎక్కడి శ్రీనగర్.. ఎక్కడి నాంపల్లి!
ఏడాదంతా వేచిచూసి.. ఆశలతో వచ్చినా కొనేవారు కరువు 'నుమాయిష్'ను కుదుపుతున్న నోట్ల రద్దు! ఎక్కడో జమ్ముకశ్మీర్లోని శ్రీనగర్ నుంచి.. ఎన్నో ఆశలతో నగరానికి వచ్చాడు ఇంతియాజ్ అలీ. నాంపల్లిలో కొనసాగుతున్న 77వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)లో 'కశ్మీరీ ఎంబ్రాయిడరీ సెంటర్' పేరిట స్టాల్ ఏర్పాటుచేశాడు. ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం కోసం ఏడాది మొత్తం ఎదురుచూసి.. ఏర్పాట్లు చేసుకొని మరీ వచ్చాడు. కానీ, ఈసారి ఆయన స్టాల్ను చూసి.. అందులోని అద్భుతమైన ఎంబ్రాయిడీ ఉత్పత్తులను చూసి మురిసిపోయే వారే కానీ.. కొనేవారు మాత్రం కరువయ్యారు. కారణం పెద్దనోట్లరద్దు. డిమానిటైజేషన్ ఎఫెక్ట్తో ఇంతియాజ్ ఆశలు అడియాసలు అయ్యాయి. ఏడాదంతా వేచిచూసి.. మంచి గిరాకీ ఉంటుందన్న ఆశతో వస్తే.. నోట్లు రద్దు దెబ్బకు కొనేవాళ్లు కనిపించడం లేదు. 'ఈ ఎగ్జిబిషన్ కోసం మేం ఏడాదంతా వేచిచూస్తాం. గత 40 ఏళ్లుగా మా కుటుంబం ఇక్కడ స్టాళ్లు ఏర్పాటుచేస్తున్నది. కానీ ఈ సంవత్సరం వ్యాపారం దారుణంగా పడిపోయింది. నిజానికి మేం కూడా పేటీఎంను వాడుతున్నాం. అయినా ఎవరూ ముందుకు రావడం లేదు' అని ఇంతియాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లిలో జరిగే నుమాయిష్తో ఇంతియాజ్ కుటుంబానికి సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తండ్రి, తాత ఈ ఎగ్జిబిషన్కు వచ్చి తమ ఉత్పత్తులను అమ్మారు. కానీ, ఈ ఏడాది 70శాతం వరకు వ్యాపారం పడిపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డామని ఆయన చెప్తున్నారు. 'గత ఏడాది రోజుకు రూ. 25వేల వ్యాపారం చేసేవాళ్లం. కానీ, ఇప్పుడు కేవలం తొమ్మిది వేలు అది వారాంతపు రోజుల్లోనే కొనుగోళ్లు జరుగుతున్నాయి' అని ఇంతియాజ్ తెలిపారు. నోట్లరద్దు ప్రభావంతో ఈసారి నుమాయిష్ తీవ్రంగా నష్టపోతున్నదని ఆయన అనుభవపూర్వకంగా చెప్తున్నారు. కార్డు వినియోగించేందుకు ఉద్దేశించిన వెండింగ్ మెషిన్లు ఉంటే ఎంతోకొంత వ్యాపారం జరుగుతున్నదని, అంతేకానీ పీటీఎం వంటి డిజిటల్ సౌకర్యాలు ఉన్నా జనాలు ముందుకురావడం లేదని అంటున్నారు. నిజానికి ఇది ఒక్క ఇంతియాజ్ పరిస్థితి మాత్రమే కాదు. దేశం నలుమూలల నుంచి నుమాయిష్కు తరలివచ్చే వ్యాపారులంతా ఈ ఏడాది నోట్లరద్దు ప్రభావంతో చితికిపోతున్నారు. ఇంత పెద్ద పారిశ్రామిక ప్రదర్శనలోనూ ఆశించినంత గిరాకీ, కొనుగోళ్లు లేకపోవడంతో వ్యాపారులు సతమతమవుతున్నారు. -
నుమాయిష్ ప్రారంభం
► ప్రారంభించిన సీఎం కేసీఆర్ ► సొసైటీ విద్యా సంస్థలను విస్తరిస్తాం: మంత్రి ఈటల ► మైదానం భూములపై సొసైటీకి పూర్తి స్థాయి హక్కులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) శుక్రవారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా హాజరై నుమాయిష్-2016 ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, సొసైటీ పాలక మండలి, ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీ విస్తరణ కార్యకలాపాలకు ప్రభుత్వ పరంగా సహకారం అందిస్తామని ప్రకటిం చారు. ప్రతి ఏటా కేవలం 45 రోజుల నుమాయిష్కే ఎగ్జిబిషన్ మైదానం పరిమితం కాకుం డా 365 రోజులూ ఇతర వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు కూడా నిర్వహించుకునేందుకు వీలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఎగ్జిబిషన్ మైదానం భూమిపై పూర్తిస్థాయి హక్కులను సొసైటీకి కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇప్పటికే ప్రక్రియ పూర్తయిందని అన్నారు. రెవెన్యూ కార్యదర్శి సెలవుల్లో ఉన్న కారణంగా కొంత ఆలస్యమైందని, రెండు మూడు రోజుల్లో సొసైటీకి హక్కులు అందవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా సుమారు 30 వేల మంది విద్యార్థులకు విద్యాబోధన లభిస్తోందన్నారు. త్వరలో మరి న్ని జిల్లాలకు విద్యాసంస్థలను విస్తరించేందుకు సొసైటీ సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి, సొసైటీ గౌరవాధ్యక్షడు అనిల్ స్వరూ ప్ మిశ్రా, కార్యదర్శి సత్యేందర్, సంయుక్త కార్యదర్శి ఆదిత్య, కోశాధికారి ఎస్వీఎస్ చా ర్యులు, విక్రమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైద్రాబాద్లో 'నుమాయిష్' వెలుగులు
-
నుమాయిష్కు పోటెత్తిన సందర్శకులు