
నుమాయిష్ లో మహిళలు సందడి చేశారు. మంగళవారం లేడీస్ డే వేడుకలు జోరుగా నిర్వహించారు. దాదాపు 10 వేల మంది మహిళలు ఎగ్జిబిషన్ను సందర్శించినట్లు అంచనా

ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. లేడీస్ డే కార్యక్రమానికి రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా హాజరై ప్రసంగించారు

విద్యార్థి దశ నుంచే బాలికల్లో ధైర్య సాహసాలు నింపేలా తల్లిదండ్రులు, విద్యా సంస్థలు పాటుపడాలని సూచించారు

కార్యక్రమంలో ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల, డి.సంధ్య, ఎన్.సుచరిత, నీతా మిశ్రా, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్ తదితరులు పాల్గొన్నారు












