exhibition
-
విజయవాడ జలకన్య ఎగ్జిబిషన్లో భారీ అగ్నిప్రమాదం (ఫొటోలు)
-
బంజారాహిల్స్ : ఆసియా జ్యువెలరీ ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
Numaish: ఈ నెల 17 వరకూ నుమాయిష్
అబిడ్స్: నుమాయిష్ను రెండు రోజుల పాటు పొడిగిస్తూ ఎగ్జిబిషన్ సొసైటీ మేనేజింగ్ కమిటీ తీర్మానం చేసింది. జనవరి 3న ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఈ నెల 15న ముగియాల్సి ఉంది. ఈ ఏడాది రెండు రోజులు ఆలస్యంగా ఎగ్జిబిషన్ ప్రారంభమైనందున మరో రెండు రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏటా ఫిబ్రవరి 15న ముగిసే ఎగ్జిబిషన్ ఈసారి 17న ముగియనుంది. -
హైదరాబాద్లో కిసాన్ అగ్రి షో
హైదరాబాద్: తెలంగాణలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన.. కిసాన్ అగ్రి షో 2025 (KISAN Agri Show 2025) నిర్వహణకు హైదరాబాద్ సిద్ధమైంది. కిసాన్ అగ్రి షో-2025 మూడో ఎడిషన్ ఫిబ్రవరి 7 నుండి 9 వ తేదీ వరకు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతుంది. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు, మార్గదర్శకులు, రైతులను ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శన సిద్ధంగా ఉంది.మూడు రోజుల పాటు ఈ భారీ వ్యవసాయ ప్రదర్శన జరగనుంది. 150 పైగా కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. వ్యవసాయానికి సంబంధించిన తాజా ఉత్పత్తులు, వినూత్న ఆవిష్కరణలు ఇక్కడ ప్రదర్శించనున్నారు. హైదరాబాద్లో కిసాన్ అగ్రి షో వ్యవసాయ ప్రదర్శన మొదటి రెండు ఎడిషన్లు విజయవంతమైన నేపథ్యంలో మూడవ ఎడిషన్కు తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి 30,000 మందికి పైగా సందర్శకులు వస్తారని భావిస్తున్నారు.ఈ ఎగ్జిబిషన్నలో వ్యవసాయం, ఉద్యాన శాఖ, ఇతర విభాగాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా రైతులకు అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన విధానాలు, పథకాలను ప్రదర్శిస్తారు. ప్రదర్శనకారులు తమ వినూత్న ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించడానికి కిసాన్ అగ్రి షో విలక్షణ వేదికగా నిలవనుంది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన మార్పిడికి కేంద్రం కానుంది. -
హైదరాబాద్ : హైటెక్స్లో ముగిసిన పెటెక్స్ ఎక్స్పో (ఫొటోలు)
-
2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్ను... ఎత్తుకెళ్లారు
ఎస్సెన్ (నెదర్లాండ్స్): నెదర్లాండ్స్లో దొంగలు ఏకంగా వేల ఏళ్లనాటి బంగారు హెల్మెట్పైనే కన్నేశారు. ఎలాగైనా చేజిక్కించుకోవాలనుకున్నారు. చివరికి అనుకున్నది సాధించారు. కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థను బాంబులతో బద్ధలుకొట్టి మరీ దోచుకెళ్లిపోయారు. అది ఏకంగా 2,500 ఏళ్లనాటి బంగారు హెల్మెట్! దాంతో ఈ దొంగతనం సంచలనం సృష్టించింది. ప్రాచీన వస్తు ప్రదర్శన కోసం తమ దేశం నుంచి నెదర్లాండ్స్ పట్టుకుపోయిన అత్యంత విలువైన వస్తువులు చోరశిఖామణుల పాలబడటంతో రొమేనియా సైతం దిగ్భ్రాంతికి గురైంది. నెదర్లాండ్స్లోని ఎస్సెన్ నగరంలోని డ్రెంట్స్ పురాతన వస్తుప్రదర్శనశాలలో ఈ భారీ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శనివారం తెల్లవారుజామున ముసుగులు ధరించిన దొంగలు మ్యూజియం వద్దకొచ్చి బయటివైపు ఉన్న భారీ తలుపును రంధ్రాలు పెట్టే మెషీన్, ఇనుప రాడ్లతో ఎలాగోలా తెరిచారు. అక్కడే లోపలివైపు ఇంకో భారీ తలుపు ఉంది. అత్యంత పటిష్టంగా ఉన్న దీనిని మామూలుగా తెరవడం సాధ్యంకాదని దొంగలకు తెలుసో ఏమో, ముందుజాగ్రత్తగా పెద్ద బాంబును వెంట తెచ్చుకున్నారు. తలుపుకు బాంబు అమర్చి పేల్చేశారు. తునాతునకలైన ద్వారం గుండా ఎంచక్కా లోపలికి వెళ్లి అక్కడ అత్యంత ప్రాచీనమైన నాలుగు వస్తువులను తీసుకుని ఉడాయించారు. వెలకట్టలేని హెల్మెట్ చోరీకి గురైన వాటిల్లో 2,500 ఏళ్ల క్రితం నాటి పుత్తడితో చేసిన హెల్మెట్ ఉంది. క్రీస్తుపూర్వం 50వ సంవత్సరంలో దీనిని తయారు చేశారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు. దాదాపు 907 గ్రాముల బరువైన ఈ హెల్మెట్ను రొమేనియాలో వంద సంవత్సరాల క్రితం ఒక కుగ్రామంలో కనుగొన్నారు. ‘హెల్మెట్ ఆఫ్ కోటోఫెనెస్టీ’గా పిలుచుకునే దీనిని పూర్వకాలంలో ఉత్సవాలు, సంబరాల్లో ఉపయోగించేవారు. హెల్మెట్ ముందుభాగంలో పెద్ద కళ్లను చెక్కారు. దుష్టశక్తుల బారిన పడకుండా కాపాడుతుందని ఆనాటి జనం విశ్వసించేవారు. జంతు వధ చేస్తున్నట్లుగా హెల్మెట్ వెనుకవైపు చెక్కారు. రొమేనియా సంస్కృతి సంబంధించి ఇది వెలకట్టలేని ప్రాచీన కళాఖండమని చోరీ తర్వాత రొమేనియా ప్రభుత్వం ఆవేదన వ్యక్తంచేసింది. దీంతోపాటు డేసియన్ల రాజ్యానికి చెందిన అలనాటి రాయల్ బ్రేస్లెట్సహా మూడు వస్తువులనూ దొంగలు పట్టుకెళ్లిపోయారు. రోమన్లు రొమేనియాను పాలించడానికి ముందు రాజ్యమేలిన డేసియన్ల సంస్కృతిని కళ్లకుకట్టేందుకు ఆనాటి వస్తువులను ఒక దగ్గరకు చేర్చి నెదర్లాండ్స్ ప్రభుత్వం ఒక ప్రదర్శనను ఏర్పాటుచేసింది. గత ఏడాది జూలై నుంచి ఈ ప్రదర్శన కొనసాగుతోంది. కీలకమైన హెల్మెట్ను సైతం రొమేనియా నుంచి తెప్పించిమరీ ప్రదర్శనకు ఉంచగా అది కాస్తా ఇప్పుడు దొంగలపరమైంది.చోరుల కోసం వేట మొదలు మళ్లీ అప్పజెప్తామని చెప్పి బుకారెస్ట్ నగరంలోని ‘నేషనల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ రొమేనియా’ నుంచి తీసుకొచ్చిన ప్రాచీన వస్తువులు పోవడంతో నెదర్లాండ్స్ ప్రభుత్వం ఈ చోరీ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా వాళ్లను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. వారం క్రితం చోరీకి గురైన ఒక కారు ఈ మ్యూజియం దగ్గర కాలిపోయిన స్థితిలో ఉండటం చూసి ఈ రెండు చోరీలకు ఏమైనా సంబంధం ఉందేమోనని పోలీసులు అనుమానిస్తున్నారు. కొట్టుకొచ్చిన కారులో ఇక్కడికొచ్చిన దొంగలు ఆ తర్వాత పారిపోతూ నాలుగు మైళ్ల దూరంలో కారును వదిలేసి తగలబెట్టిపోయారని పోలీసులు భావిస్తున్నారు. కొట్టేసిన కారుకు నకిలీ నంబర్ ప్లేట ఉండటం చూస్తుంటే ఇదేదో ఆరితేరిన దొంగలముఠా పనిగా అనుమానిస్తున్నారు. ‘‘ మా మ్యూజియం 170 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఇలాంటి చోరీ ఘటన చూడలేదు. నిజంగా ఇది దురదృష్టకరం’’ అని ఎస్సెన్లోని డ్రెంట్స్ మ్యూజియం డైరెక్టర్ హ్యారీ ట్యూపన్ అన్నారు. -
Numaish 2025: రెక్కలు తొడిగిన ఆశలు
వృద్ధులు చంటి పిల్లలతో సమానం అంటారు.. చంటి పిల్లలకు ఎలా అయితే అన్నీ చూడాలని ఆశ ఉంటుందో వయస్సు పెద్దపడిన వారికి కూడా ప్రతిదానిపై ఆసక్తి ఉంటుంది. సరిగ్గా ఇదే ఆలోచన చేసిన నగరానికి చెందిన దోబారా అనే ఎన్జీవో.. వారి కోసం అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. నగరంలోని అపోలో హోంకేర్, గ్లెన్ఫీల్డ్ మల్లారెడ్డి తదితర ప్రైవేటు ఆస్పత్రులు, స్కూల్స్ను భాగం చేస్తూ నిరుపేద వృద్ధుల కోసం ప్రత్యేక నుమాయిష్ సందర్శనను ఏర్పాటు చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్ నిర్వాహకులు సైతం పూర్తి సహాయ సహకారాలు అందించడానికి సై అన్నారు. అయితే రోజువారీ వేళల్లో అయితే పెద్ద వయసు వారికి రద్దీలో, జనం మధ్యన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని.. మంగళవారం మధ్యాహ్నం ప్రత్యేకంగా 2గంటల నుంచీ సాయంత్రం రద్దీ మొదలయ్యే లోగా దీనిని పూర్తి అయేలా కార్యక్రమాన్ని డిజైన్ చేశారు. అనాధాశ్రమాల నుంచి.. నగరవ్యాప్తంగా 89 మంది వీల్చైర్స్ ఉప్పల్, చిక్కడపల్లి.. ఇలా నగరంలోని 12 ఓల్డేజ్ హోమ్స్, సీనియర్ సిటీజన్ అసోసియేషన్లకు చెందిన సభ్యులను సైతం ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేశారు. పెద్దలు అందరినీ కార్లలో గౌరవంగా తోడ్కొని వచ్చారు. అక్కడ నుంచి నడవలేని వారి కోసం దాదాపుగా 80కిపైగా వీల్ఛైర్లను సిద్ధం చేశారు. అంతేకాకుండా నర్సింగ్ స్కూల్స్కు సంబంధించిన విద్యార్థులను కూడా ఉంచారు. వీరి కోసం ప్రత్యేకంగా ఉచిత ట్రైన్ రైడ్స్ను నుమాయిష్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. అదే విధంగా వాహనాల కోసం ఉచిత పార్కింగ్ను కూడా కలి్పంచారు. ఫుడ్ ప్యాక్స్.. పిస్తా హౌజ్, షాజ్ మహమ్మూద్ అనే వాలంటీర్ల సహకారంతో ఫుడ్ ప్యాక్స్ అందించారు. అలాగే కొందరు దాతలు ఇచి్చన సహకారంతో వృద్ధులకు ఉపయోగపడే టవల్స్ వంటివి కొనుగోలు చేసి అందించారు.పెద్దలకు ప్రత్యేకంగా.. ఏడాదికో సారి నుమాయిష్ లాంటి ప్రదర్శనను తిలకించాలని అందరూ అనుకున్నట్టే సీనియర్ సిటిజన్స్ కూడా ఆశిస్తారు. అయితే ఆశించినట్టుగా చాలా మందికి జరగకపోవచ్చు. కొందరికైనా దీన్ని సాకారం చేద్దామనే ఆలోచనతో ఈ ‘సీనియర్ సిటిజన్స్ ఎట్ నుమాయిషి కార్యక్రమాన్ని నిర్వహించాం. ఒక సీనియర్ సిటిజన్గా పెద్దలకు సంబంధించిన జెరంటాలజీ సబ్జెక్ట్లో మాస్టర్స్ చేసిన వ్యక్తిగా ఇలాంటి కార్యక్రమాలు పెద్దవాళ్ల మనసుకు ఎంత సంతోషాన్ని అందిస్తాయనేది నాకు తెలుసు. – మతీన్ అన్సారీ, వ్యవస్థాపకులు, దోబారా స్వచ్ఛంద సంస్థ -
నుమాయిష్.. సోషల్ జోష్..
కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పెద్ద ఎత్తున హైదరాబాద్లో సందడి చేస్తున్నారు. సాధారణంగా నగరంలో కొత్తగా ప్రారంభించిన కేఫ్ అయినా లేదా ఏదైనా ఆసక్తికరమైన ఈవెంట్ అయినా, ఇన్స్టా రీల్స్, యూట్యూబ్ వీడియోల్లో తక్షణమే ప్రత్యక్షమవుతుంది. అయితే వందల సంఖ్యలో వెరైటీ ఉత్పత్తులు, వేర్వేరు ప్రాంతాలకు చెందిన స్టాల్స్.. ఉండే నుమాయిష్ ఎగ్జిబిషన్ ఇన్ఫ్లుయెన్సర్లలో సోషల్ జోష్ నింపుతోంది.. దీంతో వీరికి చేతినిండా పని పెడుతోంది. ఈ క్రమంలో దీని గురించిన మరిన్ని విషయాలు.. హైదరాబాద్లోని నాంపల్లి మైదాన ప్రాంతం ఇప్పుడు కిక్కిరిసిన దుకాణాలతో, సందర్శకులతో కిటకిటలాడుతోంది. జనవరి 3న ప్రారంభమైన ఈ ఐకానిక్ ఈవెంట్ ఫిబ్రవరి 18, 2025 వరకూ సందర్శకులను అలరించనుంది. మరోవైపు ఈ 84వ ఆల్ ఇండియా ఇండ్రస్టియల్ ఎగ్జిబిషన్ ఈసారి సోషల్ మీడియా వేదికగా భారీ ప్రచారం అవుతోంది. విభిన్న రకాల కంటెంట్స్ చేసేందుకు వీలుండడంతో ఇది క్రియేటర్లకు గమ్యస్థానంగా మారింది. స్థానికులకు, సందర్శకులకు ఎల్లప్పుడూ ఇష్టమైన హైదరాబాద్ ఐకానిక్ వార్షిక ఫెయిర్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్ల ప్రవాహానికి నిలయంగా మారింది.రోజుకొకటి.. అదే వెరైటీ.. కొంతమంది కంటెంట్ క్రియేటర్స్.. ఒక్కో రోజును ఎగ్జిబిషన్లోని ఒక్కో విభాగాలకు అంకితం చేస్తున్నారు. ఉదాహరణకు, ఒక రోజు రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ గురించి, మరొక రోజు సంప్రదాయ చేనేత స్టాల్స్ గురించి.. తర్వాతి రోజు రైడ్లు.. ఎంటర్టైన్మెంట్ జోన్లను ఇలా విభజిìæంచి చూపిస్తున్నారు. ఈ సమాచారం వీక్షకులకు వినోదాన్ని మాత్రమే కాకుండా నుమాయిష్ సందర్శనను ప్లాన్ చేయడంలో కూడా ఉపకరిస్తోంది. వీరి కంటెంట్కు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. నగరంతో పాటు దేశవ్యాప్తంగానూ అనేక మందిని ప్రభావితం చేస్తోంది. రీల్స్ కేరాఫ్గా.. ఆహార ప్రియుల సాహసాల నుంచి షాపింగ్ స్ప్రీల వరకూ.. ఫీడ్లో స్క్రోల్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ప్రత్యేకతతో నుమాయిష్ షాపింగ్, ఆహార ఉత్పత్తులను మాత్రమే కాకుండా సృజనాత్మక సోషల్ మీడియా కంటెంట్ను కూడా అందిస్తుంది. ఈ విషయాన్ని శరవేగంగా వ్యాపిస్తుండడంతో నుమాయిష్ రీల్స్, వీడియోలకు కేరాఫ్గా మారింది. దీంతో ఇన్ఫ్లుయెన్సర్లు, సోషల్ మీడియా నిర్వాహకులతో ఎగ్జిబిషన్ సందడిగా మారుతోంది.అడుగడుగునా కెమెరాలు.. నుమాయి‹Ùలోని కలర్ఫుల్ స్ట్రీట్స్ మీదుగా నడుస్తుంటే.. సందడిగా ఉన్న స్టాల్స్కు ముందు పలు కెమెరాలను అమర్చడాన్ని గమనించవచ్చు. ఇన్స్టా, లేదా యూట్యూబ్ ద్వారా ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్లోని ప్రతి మూలనూ కవర్ చేస్తూ ప్రతిరోజూ వందల సంఖ్యలో కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు. లక్నో చికన్ కారీ స్టాల్స్ నుంచి కాశ్మీరీ షాపుల వరకూ నోరూరించే ఫుడ్ కోర్ట్ నుంచి వినోద ప్రదేశంలో థ్రిల్లింగ్ రైడ్ల వరకూ దేనికదే వెరైటీగా కినిపిస్తోంది. దీంతో మెటీరియల్కు కొరత లేకపోవడం వీరికి మరింత ఉత్తేజాన్ని అందిస్తోంది.క్రేజీగా..మెన్ ఎట్ నుమాయిష్?.. ఈ సంవత్సరం ‘మెన్ ఎట్ నుమాయిష్’ పేరుతో ఓ రీల్ ఇంటర్నెట్లో క్రేజీగా మారింది. మగవాళ్లు తమ కుటుంబాలతో కలిసి షాపింగ్ ట్రిప్లలో చురుకుగా పాల్గొంటున్నట్లు చూపే ఈ రీల్ వేగంగా వైరల్ అయ్యింది. ఈ రీల్కి ఇన్స్టాలో ఒక్క రోజులో 1.5 మిలియన్లకు పైగా వీక్షణలు, 75,000 పైగా లైక్లు రావడం విశేషం. షాపింగ్ బ్యాగ్లను మోసుకుంటూ భార్యల్ని అనుసరించే భర్తలు, పిల్లలను ఎత్తుకుని ఆడిస్తుంటే మహిళలు షాపింగ్లో మునిగిపోవడం.. రీల్ని సూపర్ హిట్ చేశాయి. -
బెంగళూరులో 23 నుండి ఐఎంటీఈఎక్స్ 2025
న్యూఢిల్లీ: మెషిన్ టూల్ పరిశ్రమకు సంబంధించి జనవరి 23 నుండి 29 వరకు బెంగళూరులో ఐఎంటీఈఎక్స్ 2025 ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో అమెరికా, జర్మనీ, ఇటలీ, జపాన్ తదితర 23 దేశాల నుండి 1,100కు పైగా ఎగ్జిబిటర్లు పాల్గోనున్నారు. సుమారు 90,000 చ.మీ. విస్తీర్ణంలో నిర్వహించే ఎగ్జిబిషన్లో టూల్టెక్, డిజిటల్ మాన్యుఫాక్చరింగ్ మొదలైన కార్యక్రమాల్లో భారత తయారీ సాంకేతికత సామర్థ్యాలను ప్రతిబింబించే పలు ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మెషిన్ టూల్ రంగ సంస్థలు కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఇది ఉపయోగపడగలదని ఐఎంటీఎంఏ ప్రెసిడెంట్ రాజేంద్ర ఎస్ రాజమాణె తెలిపారు. -
నుమాయిష్ ఎగ్జిబిషన్లో జోరుగా లేడీస్ డే వేడుకలు (ఫొటోలు)
-
నాంపల్లి : నుమాయిష్ ఎగ్జిబిషన్కు..పోటెత్తిన సందర్శకులు (ఫొటోలు)
-
Hyderabad: జనవరి 3 నుంచి నుమాయిష్..
అబిడ్స్: జనవరి 3 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ప్రారంభం కానున్న అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) ప్రవేశ రుసుమును ఈసారి రూ.40 నుంచి రూ.50కి పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 2 వేల స్టాళ్లతో ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే ఎగ్జిబిషన్ను ఈ ఏడాది రెండు రోజులు వాయిదా వేశామని, 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు వెల్లడించారు. ఆదివారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సొసైటీ ఉపాధ్యక్షుడు కె.నిరంజన్, కార్యదర్శి ఆర్. సురేందర్రెడ్డి, కోశాధికారి డాక్టర్ ప్రభా శంకర్, సంయుక్త కార్యదర్శి డి.మోహన్, పబ్లిసిటీ కనీ్వనర్లు సురేష్కుమార్, సురేష్రాజ్లు మాట్లాడారు. జనవరి 1న ప్రారంభం కావాల్సిన ఎగ్జిబిషన్ను మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ సంతాప దినాల కారణంగా జనవరి 3న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఎగ్జిబిషన్లో డబుల్ డెక్కర్ బస్సును మిని ట్రైన్తో పాటు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఎగ్జిబిషన్ నలుమూలలా 160 సీసీ కెమెరాలు, 250 మంది వలంటీర్లు, ప్రైవేటు సెక్యూరిటీతో బందోబస్తు పర్యవేక్షిస్తామన్నారు. గోల్డెన్జూబ్లీ బ్లాక్ ఎదురుగా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సందర్శకులు, ఇతరులు ఎవరైనా శుభ కార్యక్రమాలు, ఇతర ప్రకటనలు ఇవ్వవచ్చన్నారు. ప్రతి రోజు మధాహ్నం నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని ఆదివారాల్లో రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ ఉంట్టుందన్నారు. మినీ ట్రైన్ టికెట్ రూ.30, డబుల్ డెక్కర్ టికెట్ రూ.40గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్, వైఫై టవర్.. మొదటిసారిగా పలు శాఖల అధికారుల కోసం కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎగ్జిబిషన్ ప్రతినిధులు వెల్లడించారు. ప్రతి సంవత్సరం సెల్ఫోన్ల నెట్వర్క్ సమస్య వస్తుండడంతో మొదటి సారిగా వైఫై టవర్ను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. నుమాయిష్లో సీనియర్ సిటిజన్ల కోసం వీల్ చైర్లను సమకూరుస్తున్నామన్నారు. జనవరి 7వ తేదీన లేడీస్ డే గా, జనవరి 31వ తేదీని చి్రల్డన్స్ డేగా ప్రకటించినట్లు తెలిపారు. గత సంవత్సరం యశోధ ఆసుపత్రి సహకారంతో ఉచితంగా వైద్య సేవలు అందించామన్నారు. గత ఏడాది నుమాయిష్ నిర్వహణ ద్వారా ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల రూపంలో రూ.66 కోట్ల ఆదాయం సమకూర్చినట్లు వారు వివరించారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ఎగ్జిబిషన్ ప్రతినిధులు డాక్టర్ గంగాధర్, హన్మంతరావు, అశ్వినిమార్గం, జీవీ రంగారెడ్డి, ఆదిత్య మార్గం తదితరులు పాల్గొన్నారు. -
మాదాపూర్ : ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు (ఫొటోలు)
-
విజయవాడ : హై లైఫ్ ఎగ్జిబిషన్లో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
భారీస్థాయిలో సిద్ధేశ్వర అగ్రికల్చరల్ షో, క్యాట్ అండ్ డాగ్ షో కూడా
సోలాపూర్: పట్టణంలోని ఓం మైదానంలో డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 25 వరకూ వ్యవసాయ ప్రదర్శన నిర్వహించనున్నట్లు శ్రీ సిద్దేశ్వర దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ధర్మరాజు కాడాది తెలిపారు. స్మార్ట్ ఎక్స్ పో గ్రూప్ నేతృత్వంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ, ఆత్మా, జిల్లా పరిషత్ విభాగం సహకారంతో ఐదు రోజుల పాటు నిర్వహించనున్న ఈ వ్యవసాయ ప్రదర్శనలో భాగంగా 300 స్టాల్స్ను ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు. మంగళవారం నిర్వహించిన సమావేశంలో వ్యవసాయ ప్రదర్శనకు సంబంధించిన విశేషాలను గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వ్యవసాయ పరిశోధన కేంద్రం, సోలాపూర్ దానిమ్మ పరిశోధన కేంద్రం, జొన్న పరిశోధన కేంద్రం, వ్యవసాయ విజ్ఞాన కేంద్రం సోలాపూర్ , మోహల్ డివిజన్, సిల్క్ ఖాదీ గ్రామద్యోగ్ పరిశ్రమలు, పశుసంవర్ధక, సామాజిక అటవీ, జాతీయ బ్యాంకులు, నాబార్డ్, చక్కెర కర్మాగారాల సహకారంతో ఈ ప్రదర్శనను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొత్త వ్యవసాయ సాంకేతిక ఉత్పత్తులు, వ్యవసాయ యాంత్రికీకరణ, పాల ఉత్పత్తి, సెరికల్చర్, తేనెటీగల పెంపకం, అగ్రి బిజినెస్,వర్టికల్ ఫారి్మంగ్, ఆధునిక వ్యవసాయ పనిముట్లకు సంబంధించి వివరణాత్మక సమాచారాన్ని రైతులు సులభంగా పొందగలుగుతారని చెప్పారు. ఈ వ్యవసాయ ప్రదర్శనలో సోలాపూర్కు గర్వకారణమైన ఖిలార్ ఎద్దులు, ఆవులతోపాటు ప్రపంచంలోనే అరుదైన, అత్యంత పొట్టి రకమైన పుంగనూరు దేశీయ ఆవులను కూడా ప్రదర్శించనున్నట్లు ధర్మరాజు కాడాది పేర్కొన్నారు. సోలాపూర్, నాసిక్, పుణే రైతులు ఉత్పత్తి చేసిన దాదాపు 500 రకాల అరుదైన దేశవాళీ విత్తనాల ప్రదర్శన, విక్రయాలను చేపట్టనున్నట్లు తెలిపారు.క్యాట్, డాగ్ షో అలాగే డిసెంబర్ 22న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు క్యాట్, డాగ్ షో పోటీలు సాయంత్రం విజేతలకు బహుమతి ప్రదానం జరుగుతుందని, డిసెంబర్ 23న రాష్ట్రస్థాయి దేశవాళీ ఆవులు, ఎద్దుల ప్రదర్శన, పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామని వివరించారు. అదేరోజున పుష్ప ప్రదర్శన కూడా జరుగుతుందని ధర్మరాజు కాడాది వివరించారుప్రదర్శనకు సంబంధించిన ఇతర విశేషాలు.. 300 కు పైగా కంపెనీల హాజరు ప్రముఖ కంపెనీల ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వాహనాల ప్రదర్శన. భయనా నుంచి ప్రత్యేకంగా తీసుకువస్తున్న ఆరు కిలోల కోడి ప్రపంచంలోనే అతి పొడవైన దేశీయ మిరపకాయల ప్రదర్శన ప్రత్యేక హాలులో ఆర్గానిక్ ఫార్మింగ్, యానిమల్, బర్డ్, ఫ్లవర్ ఎగ్జిబిషన్ రైస్ ఫెస్టివల్, వ్యవసాయ సాహిత్య ప్రదర్శన -
హైదరాబాద్ : జ్యూయల్స్ ఎక్స్పో నగరంలో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఎగ్జిబిషన్ మెరిసిన సీరత్ కపూర్, సాన్వే మేఘనా (ఫొటోలు)
-
హైదరాబాద్ శిల్పారామంలో జానపద జాతర.. ప్రజలందరికీ ఉచిత ప్రవేశం
భారతీయ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేందుకు వేడుక సిద్ధమైంది. ‘లోక్ మంథన్’ పేరుతో నవంబర్ 21 నుంచి 24 వరకు మహోత్తరమైన ‘జానపద జాతర‘ హైదరాబాద్ శిల్పారామంలో కనుల విందు చేయనున్నది. ‘ప్రజ్ఞా ప్రవాహ్’ సంస్థ 2016 నుంచి ప్రతి రెండేళ్లకోసారి దేశంలోని ఒక్కో రాష్ట్రంలో లోక్ మంథన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. విదేశాల నుంచి సైతం ఒక్కో తెగ, ఒక్కో జాతికి సంబంధించిన ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకారులు దాదాపు 1500 మంది ఈ ‘జానపద జాతర’లో తమ కళలను ప్రదర్శిస్తారు. భిన్నత్వంలో ఏకత్వం చాటే ఈ మేళా ప్రారంభోత్సవానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాజరవుతారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అగ్ర నేత మోహన్ భాగవత్తో పాటూ అనేకమంది కేంద్రమంత్రులూ వస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లోక్మంథన్ ఆహ్వాన కమిటీ గౌరవ అధ్యక్షులుగా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.భారతీయ జానపద కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ఈ దేశమంతా ఒకటేననే ఏకత్వాన్ని నిరూపించడమే లోక్ మంథన్ ప్రధాన లక్ష్యం. ‘జాతీయ గిరిజన గౌరవ దివస్’ పేరుతో భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి పురస్కరించుకొని నిర్వహించే ఈ వేడుక మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. సదస్సులు, సమావేశాల ఆధారంగా ప్రపంచంలోని వనవాసి, గిరివాసి సమస్యలను చర్చించి, వాటి పరిష్కారానికి మార్గాన్ని కూడా అన్వేషిస్తారు. సంప్రదాయ సాంస్కృతిక వాయిద్యాలు, పనిముట్లు ప్రదర్శిస్తారు. ఈ జాతరలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ సాంస్కృతిక వారసత్వానికి చెందినవారు కూడా వచ్చి ప్రదర్శనలిస్తారు.ఇండోనేషియా కళాకారులు రామాయణం ఆధారంగా ప్రదర్శించే ‘కేచక్’ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. ప్రపంచంలో అబ్రహామిక్ మతాలకు పూర్వమున్న మతాలు, సంస్కృతుల వారు సైతం లోక్మంథన్కు హాజరవుతున్నారు. వీరిలో సిరియాలోని రోమోలు, ఆర్మేనియాలోని యజిదీలు (సూర్యపుత్రులు), లిథువేనియా వాసులు సైతం ఉన్నారు. అబ్రహామిక్ మతాల రాకకు పూర్వం ఆయా దేశాలలో అచరించిన, నేటికీ ఆచరిస్తున్న సూర్యారాధన, యజ్ఞం (అగ్నిని పూజించడం) నిర్వహణ విధానాలను వీరు హైదరాబాద్ లోక్మంథన్లో చేసి చూపిస్తారు. చదవండి: మణిపుర్ ఘర్షణలకు ముగింపెప్పుడు?ఈ సందర్భంగా జరిగే ఎగ్జిబిషన్లో తెలంగాణ, త్రిపుర, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్తో సహా 10 రాష్ట్రాలకు చెందిన విభిన్న కళలు, సంప్రదాయ ఆహారం, సంప్రదాయ గ్రామీణ క్రీడలు, సాహిత్యం, ఇతర సాంస్కృతిక అంశాలౖపై చర్చలు ఉంటాయి. భారతీయ ప్రజలు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా... వారి అందరి సాంస్కృతిక పునాదులు జానపదంలోనే ఉన్నాయి. మన మూలాలను ఒకసారి అందరికీ చాటిచెప్పే లక్ష్యంతో జరుగుతున్న ఈ జాతరకు అందరూ ఆహ్వానితులే. ఉత్సవాలు జరిగే నాలుగు రోజులూ శిల్పారామంలోకి ప్రజలందరికీ ఉచిత ప్రవేశం ఉంటుంది.– పగుడాకుల బాలస్వామి; ప్రచార ప్రసార ప్రముఖ్, వీహెచ్పీ, తెలంగాణ రాష్ట్రం(నేటి నుంచి ‘లోక్ మంథన్’ ప్రారంభం) -
ఫ్యాషన్ ఎగ్జిబిషన్లో మెరిసిన నటి దివి, దీక్షా పంత్ (ఫొటోలు)
-
1500 కళాకారులు.. 350 ఎగ్జిబిట్స్, 100 స్పీకర్స్, 12 దేశాలు
సాక్షి, హైదరాబాద్: రెండేళ్లకోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘లోక్ మంథన్’ వేడుకలకు సర్వం సిద్ధమైంది. భారతీయ జానపద సాంస్కృతిక ఉత్సవాలను ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి ప్రముఖులు, సుమారు 2 వేల మందికి పైగా జానపద కళాకారులు తరలి రానున్నారు. ఇప్పటికే ప్రీ లోక్ మంథన్ పేరిట అవగాహన సదస్సులను, ప్రచార కార్యక్రమాలను చేపట్టారు. దేశంలో విశిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థ అమలులో ఉండేదని, విదేశీయుల దండయాత్రల కారణంగా గ్రామీణ ప్రజలకంటే పట్టణవాసులు ఉన్నతులుగా భావించే వివక్ష ఏర్పడిందని, ఈ నేపథ్యంలో గ్రామీణ విజ్ఞానం నిర్లక్ష్యానికి గురైందని లోక్ మంథన్ నిర్వాహకులు భావిస్తారు. అందుకే ప్రకృతి జానపదుల గొప్పతనాన్ని లోకానికి చాటిచెప్పే లక్ష్యంతోనే ‘లోక్ మంథన్’ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జానపదుల విశ్వాసాలు, జీవన విధానం, దృక్పథం, వేల ఏళ్లుగా సమాజాన్ని ఏలిన వ్యవస్థల వివరాలను వెలికి తీసుకురావాలనేదే లోక్మంథన్ ఉద్దేశం. ప్రజ్ఞా భారతి ఆధ్వర్యంలో ఈ లోక్మంథన్ వేడుకలు ఇప్పటి వరకు రాంచీ, భోపాల్, గువాహటి, తదితర నగరాల్లో ఘనంగా జరిగాయి. భాగ్యనగరం వేదికగా.. ఈ బృహత్తర కార్యక్రమానికి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, ఆహారం, ఆరోగ్యం, ఆధ్యాత్మికత తదితర అంశాలపై సమాలోచనల సమాహారమే లోక్మంథన్. అర్మేనియా, లూథియానా వంటి దేశాల మూల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పలు కళా ప్రదర్శనలు, సమాలోచనలు చేసేందుకు వేలాది మంది తరలిరానున్నారు. బాలి నుంచి పద్మశ్రీ గ్రహీత వాయన్ దిబియా తన బృందంతో కలిసి రామాయణ ఇతిహాసం ప్రదర్శించనున్నారు.చదవండి: ఒత్తయిన జుట్టు.. ఒత్తిడితో ఫట్టునగరీకరణ కారణంగా అస్తిత్వాన్ని మరిచిపోతున్న నేటి తరానికి భారతీయ సామాజిక జీవిత మూలాలను తెలియజేసే ప్రయత్నమే లోక్ మంథన్. మన వ్యవస్థలో మొదటి నుంచి అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రముఖ స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా ఆ సంస్కృతి మరుగునపడింది. దీంతో అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియజేసేందుకు దేశంలోని వివిధ నగరాల్లో లోక్ మంథన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో జరిగే ఈ లోక్మంథన్కు దేశ విదేశాలకు చెందిన వందలాది మంది కళాకారులు, మేధావులు, పరిశోధకులు హాజరుకానున్నారు.మనది అడవి బిడ్డల సంస్కృతి నగర ప్రజలు కెరీర్ వైపు, ఆధునికత వైపు విస్తారంగా పరుగులు తీస్తున్నారు. సమాజాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సమూహానికి.. మన సమాజం మూలాలను గుర్తు చేసే ప్రయత్నమే లోకమంథన్. మన భారతీయల వ్యవస్థలో మొదటి నుంచీ అడవి బిడ్డల సంస్కృతి, సంప్రదాయాలకు ముఖ్యమైన స్థానం ఉండేది. కానీ కాలక్రమేణా అది మరుగున పడిపోయింది. అందుచేత అసలైన భారతీయతను నగర ప్రజలకు తెలియచెప్పేందుకు దేశంలోని వివిధ నగరాలలో లోక మంథన్ నిర్వహిస్తున్నాం. – నందకుమార్, ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ కన్వీనర్ -
కళింగలో పట్టు ప్రదర్శన
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 కళింగ కల్చరల్ హాలు వేదికగా ప్రతిష్టాత్మక ‘జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన’ ఆదివారం ప్రారంభమైంది. ఈ ప్రదర్శణను రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్స్ ఫౌండర్, ఆక్యుపేషనల్ హెల్త్ ఎన్విరాన్మెంటల్ సేఫ్టీ ఆఫీసర్ సాత్విక గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కళింగ కల్చరల్ హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు మన సాంస్కృతిక వైభవానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని తెలిపారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూ్యమ్స్ వ్రస్తోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని సాతి్వక గుప్తా అన్నారు. ఈ సందర్భంగా చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత గురించి తెలుసుకున్నారు. అనంతరం జాతీయ పట్టు వస్త్ర ప్రదర్శన నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 17 వరకూ కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాలకు చెందిన చేనేత కారులు, చేతిపని బృందాలు తమ సిల్క్ హ్యండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్స్ వంటి 75 వేల రకాల ఉత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. -
హైదరాబాద్లో ‘డిజైన్ డెమోక్రసీ’ ప్రారంభం
హైదరాబాద్: ఎంతగానో ఎదురుచూస్తున్న డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ 2024’ హైదరాబాద్లో ప్రారంభమైంది. నగరంలోని హైటెక్స్లో ప్రారంభమైన ఈ ప్రదర్శన అక్టోబర్ 4 నుండి 7వ తేదీ వరకు నాలుగు రోజులపాటు కొనసాగనుంది.తెలంగాణ ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్తో కలిసి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, ఫీక్కీ ఫ్లో మాజీ చైర్పర్సన్ పింకీ రెడ్డి, డిజైన్ డెమోక్రసీ వ్యవస్థాపకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ ప్రారంభించారు.తెలంగాణ మ్యూజియం బ్రాండ్ డైరెక్టర్ మాన్సీ నేగి, క్యూరేటర్ సుప్రజా రావుతో కలిసి డిజైన్ డెమెక్రసీ వ్యవస్థపాకులు పల్లికా శ్రీవాస్తవ్, శైలజా పట్వారీ, అర్జున్ రాఠీ నిర్వహిస్తున్న ఈ ఫెస్టివల్ అసాధారణ సృజనాత్మక ప్రతిభ, వినూత్న ప్రదర్శనల వేదికగా నిలిచింది. -
ఆధునికత, హస్తకళా నైపుణ్యం మేళవింపుతో గౌరాంగ్ హోం ‘నీల్’ కలెక్షన్ ఎగ్జిబిషన్
హైదరాబాద్కు చెందిన ప్రముఖ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ సరికొత్త కలెక్షన్ను లాంచ్ చేశారు. జాతీయ అవార్డు ఫ్యాషన్ డిజైనర్ గౌరంగ్ షా, సాంప్రదాయ భారతీయ వస్త్రాలు , హస్తకళలు, జమ్దానీ కళను పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా "గౌరంగ్ హోమ్"లోని "నీల్" పేరుతో తొలి కలెక్షన్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. ఇందులో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఫర్నిచర్, ఫర్నీషింగ్లు , పింగాణీ వస్తువులు ప్రదర్శనకుంటాయి. నాణ్యత, టైమ్లెస్ డిజైన్కు ప్రాధాన్యతినిస్తూ, సాంప్రదాయ హస్తకళ లేటెస్ట్ ట్రెండ్ మిళితమై ఈ వస్తువులు కొలువు దీరతాయి."గౌరంగ్ హోమ్" ద్వారా ఇంటీరియర్ డిజైన్ సేవల్లోకి ప్రవేశిస్తూ, కాన్సెప్ట్-టు-ఫినిష్ స్టైల్లో ఇంటిని అందంగా తీర్చిదిద్దు కోవడంలో పాపులర్ డిజైన్ ఫిలాసఫీని ప్రతిబింబించేలా హైదరాబాద్లోని హైటెక్స్లో “గౌరంగ్ హోమ్” కలెక్షన్ ఎగ్జిబిషన్ అక్టోబరు 4న ప్రారంభం కానుంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:00 వరకు అందుబాటులో ఉంటుంది.'నీల్' కలెక్షన్లోని ప్రతి భాగం ఆ కళ గురించి మాత్రమే కాకుండా, దానిని తయారు చేసిన శిల్పి నైపుణ్యాన్ని తెలిపుతూ,ఈ కలెక్షన్ మీ ఇంటిని నిజంగా ప్రత్యేకంగా చేస్తుంది అంటారు గౌరాంగ్. ఇండియన్ ఇంటీరియర్స్ కోసం ఇదొక కొత్త అధ్యాయమన్నారు. నీల్ కలెక్షన్స్లో ఫర్నిషింగ్స్, బెడ్స్ప్రెడ్లు, కంఫర్టర్లు, దిండు కవర్లు , టేబుల్ లినైన్స్ సిగ్నేచర్ స్టైల్లో ఉంటాయి. ఇందులో జమ్దానీ నేత, హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాన్, కసౌటి, సుజినీ కళాత్మకతతో ఇండిగో (నీలిరంగు)కలర్లో ఆకట్టుకుంటాయి.అందానికి, ఆరోగ్యానికి తగినట్టుగా శతాబ్దాల రాగి ,తగరంతో తయారు చేసిన శతాబ్దాల నాటి వస్తువలను సిరామిక్తో తయారు చేసిన క్రోకరి మరో ప్రత్యేక ఆకర్షణగా ఉండబోతున్నాయి. ఇందులో పురాతన కుండల వినియోగానికి ప్రతీకగా, చేతితో తయారు చేసిన డిన్నర్వేర్ ఉంటుంది. ప్రతీ వస్తువును ప్రపంచవ్యాప్తంగా లభించే మట్టితో తయారు చేయడం విశేషం.ఈ వెంచర్ ద్వారా, తన ప్రసిద్ధ డిజైన్ ఫిలాసఫీని జీవితానికి తీసుకురావాలనేదే గౌరంగ్ లక్ష్యం. భారతదేశ చేనేత సంప్రదాయాలను పరిరక్షించడం, పర్యావరణ అనుకూల పదార్థాలు, సహజ రంగులు, సాంప్రదాయ పద్ధతులు,కళాకారుల నైపుణ్యాన్ని మెచ్చుకునేలా పర్యావరణ స్పృహ ఉన్న ఔత్సాహిక గృహాలంకరణ వినియోగదారులను ఆకట్టుకోనుంది. -
హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన నటి సీరత్ కపూర్, మోడల్స్..(ఫొటోలు)
-
హెచ్ఐసిసి లో జరిగిన హైలైఫ్ ఎగ్జిబిషన్ లో ముద్దుగుమ్మల సందడి (ఫొటోలు)
-
హైదరాబాద్ హెచ్ఐసీసీలో.. హైలైఫ్ ఎగ్జిబిషన్!
మాదాపూర్: ప్రముఖ డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మాదాపూర్లోని హెచ్ఐసీసీలో మూడు రోజుల పాటు కొనసాగనున్న హైలైఫ్ ఎగ్జిబిషను నటి శ్రవంతి చొకరపు, మాలవిక శర్మ నిర్వాహకుడు డొమినిక్తో కలసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వివాహాది శుభకార్యాలకు ప్రత్యేక డిజైన్లతో కూడిన వ్రస్తాభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దేశంలోని 350 మంది డిజైనర్లు రూపొందించిన వ్రస్తాభరణాలు స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. గృహాలంకరణ ఉత్పత్తులు, వధువరులకు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. నటి ప్రీతి సుందర్ తో పాటు పులవురు మోడల్స్, డిజైనర్లు పాల్గొన్నారు. -
25, 26న స్టైల్ పితార ఫ్యాషన్ ఎగ్జిబిషన్
8 ఏళ్లుగా క్రియేటీవ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో స్టైల్ పితార ఫ్యాషన్ లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నట్లు ప్రతినిధులు రమారాటి, వైశాలి ఇనాని, మీనల్ శారద, వినిత బల్దువలు పేర్కొన్నారు. కోఠిలోని కార్యాలయంలో సోమవారం స్టైల్ పితార పోస్టర్ను ఆవిష్కరించారు. గృహిణులు వారి ప్రతిభతో తయారు చేసిన ఉత్పత్తులను వారే స్వయంగా స్టాళ్లలో ప్రదర్శించే అవకాశం ఉందన్నారు. సామాజికంగా, ఆధ్యాతి్మకంగా క్రియేటివ్ ఆర్ట్స్ చారిటీ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుందన్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో రెండు రోజుల పాటు రామ్కోఠిలోని కచి్చభవన్లో ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ఎగ్జిబిషన్ను ప్రముఖ సంఘ సేవకురాలు భగవతి మహేష్ బలద్వా, ప్రముఖ వైద్యురాలు డాక్టర్ శ్వేత అగర్వాల్ ప్రారంభిస్తారన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు ప్యాషన్ డిజైనింగ్, పేపర్ స్టాల్స్, ఫుడ్స్టాల్స్, గేమ్స్, జువెలరీ, హ్యాండీ క్రాప్్ట, ఫుడ్ ఐటమ్స్ 100కుపైగా స్టాళ్లలో ఏర్పాటు చేయనున్నారు. -
హైదరాబాద్: హైలైఫ్ ఎగ్జిబిషన్లో సందడి చేసిన ముద్దుగుమ్మలు (ఫోటోలు)
-
Fish Prasadam 2024 : చేప ప్రసాదం కోసం పోటెత్తిన జనాలు (ఫొటోలు)
-
ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ (ఫొటోలు)
-
ముత్యాల నగరంలో మత్స్యకన్యలు
సాక్షి, హైదరాబాద్: మత్స్యకన్యలు, సాగర కన్యల గురించి కథలుగా చెప్పుకోవడం, సినిమాల్లో చూడటం తప్ప నిజంగా వారిని చూసిన వారెవరూ లేరు. అయితే ఈ జల కన్యలు ఉన్నది వాస్తవమో కాదో కానీ... హైదరాబాద్ నగరానికి చేరుకున్న మత్స్య కన్యలు మాత్రం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తున్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా కూకట్పల్లిలో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ మెర్మెయిడ్ షోలో మనం చూస్తుంది నిజమేనేమో అనిపించేలా మత్స్యకన్యలు ఆకట్టుకుంటున్నారు. ఫిలిప్పీన్ సాగర కన్యలు.. అమెజాన్ చేపలు.. అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ను ఏర్పాటు చేసి, అందులో అరుదైన చేపల ప్రదర్శన, స్కూబా డైవింగ్ వంటి వినూత్న ప్రదర్శనలు ఏర్పాటు చేయడం నగరవాసులకు పరిచయమే. కానీ ఊహాజనిత కథలుగా చెప్పుకునే సాగరకన్యలు, హాలీవుడ్ సినిమాల్లో అందంగా కనిపించే మత్స్యకన్యల ప్రదర్శన మాత్రం దేశంలోనే ఇదే మొదటిసారి.దీని కోసం పసిఫిక్ మహాసముద్రంలో ప్రదర్శననిచ్చే ఫిలిప్పీన్కు చెందిన ఆరుగురు యువతులు నగరానికి చేరుకున్నారు. మర్మెయిడ్గా పిలుచుకునే వీరు జల కన్యల వస్త్రధారణతో 8 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అండర్ వాటర్ టన్నెల్లో ఆక్సిజన్ లేకుండా ప్రదర్శన చేయడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. ఈ మమెడ్ షోలు గతంలో దుబాయ్, థాయ్లాండ్, హాంకాంగ్ వంటి దేశాలకు మాత్రమే పరిమితం. ఈ అండర్ వాటర్లో సింగపూర్, మలేసియాతో పాటు అమెజాన్ నది నుంచి తీసుకువచి్చన 600 అరుదైన చేపలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా ఇక్కడి స్కూబా డైవింగ్ కూడా మంచి అనుభూతిని అందిస్తుంది. మరో 37 రోజుల వరకు ఈ ప్రదర్శన జరగనుందని నిర్వాహకులు తెలిపారు. విజ్ఞానం, వినోదమే లక్ష్యంగా.. విదేశాల్లో మాత్రమే చూడగలిగే మెర్మెయిడ్ షోను కోట్ల రూపాయల వ్యయంతో, ఎంతో వ్యయప్రయాసలకోర్చి నగరంలో ఏర్పాటు చేశాం. ఎగ్జిబిషన్ రంగంలో మాకు 39 ఏళ్ల అనుభవం ఉంది. ప్రజలకు అద్భుత అనుభూతిని అందించేందుకు ఫిలిప్పీన్స్ నుంచి జలకన్యలను తీసుకువచ్చాం. ఆక్సిజన్ లేకుండా నిమిషానికిపైగా నీటిలోనే ఉంటూ ప్రదర్శన ఇవ్వడం అరుదైన కళ. వీటితో పాటు 27కు పైగా అమ్యూజ్మెంట్ గేమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులకు విజ్ఞానం, వినోదం అందిస్తున్నాం. ప్రతి రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది. షో మాత్రం మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంటుంది. – రాజారెడ్డి, నిర్వాహకుడు -
Hyderabad: సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
ముగిసిన నుమాయిష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ (నుమాయిష్) ఆదివారంతో ముగిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల జనవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 18వ తేదీ రాత్రి వరకు కొనసాగింది. ప్రతి సంవత్సరం 46 రోజులు కొనసాగే ఎగ్జిబిషన్ ఈసారి 49 రోజుల పాటు కొనసాగింది. ముగింపు రోజు ఆదివారం మధ్యాహ్నం నుంచే సందర్శకులు భారీగా తరలివచ్చారు. సుమారు 70 వేల మంది వచి్చనట్లు బుకింగ్ కన్వీనర్ చంద్రశేఖర్ తెలిపారు. 49 రోజుల్లో మొత్తం 22 లక్షల మంది నుమాయి‹Ùకు వచ్చినట్లు అంచనా. 2,400 స్టాళ్లను ఏర్పాటు చేశామని, కనువిందు చేసేలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించామని సొసైటీ ఉపాధ్యక్షుడు వనం సత్యేందర్, కార్యదర్శి హన్మంతరావు, జాయింట్ సెక్రటరీ స్వర్ణజిత్ సింగ్, కోశాధికారి రాజేంద్రకుమార్లు తెలిపారు. గోషామహల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షించారు. -
ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా సోలో ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్!
ఫోటోగ్రఫీ అనేది కేవలం ఒక ఛాయ చిత్రం కాదు. తీసిన ఫోటోలోని కళాత్మక దృష్టితో అర్థమయ్యేలా లేదా వివరించేలా ఉండాలి. నిజానికి అవి చూడగానే మనస్సులో ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలుగుతుంది. ప్రకృతిలోని అద్భుతాలను చిన్న కెమెరాతో గొప్పగా భలే బంధించారే అనిపిస్తుంది. అందుకు ఆ వ్యక్తిలో మంచి సృజనాత్మకతో కూడిన నైపుణ్యం ఉండాల్సిందే. ఇక ఆయా ఫోటోలను సోలోగా లేదా గ్రూప్గా ప్రదర్శించడం అనేది కూడా ఓ ఆర్టే. ఎందుకంటే? ప్రేక్షకులను ఆక్టటుకునే థీమ్ తోపాటు వారు అటెన్షన్ పెట్టి చూసేలా సరైన క్యాచీ టైటిల్తో ఈవెంట్ నిర్వహించాలి. అప్పుడే ఆ ప్రదర్శన పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది. ఇప్పుడూ ఇదంతా ఎందుకు చెబుతున్నాననంటే ఇలాంటి ఫోటోగ్రఫిక్ ఎగ్జిబిషన్ని ప్రియాంక గాంధీ కుమారుడు రైహాన్ వాద్రా గత నెల జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3 వరకు నిర్వహించారు. ఆ పోటోలు ఎంతగా అలరిస్తున్నాయంటే.. రైహన్ వాద్రా తన సోలో ఫోటో గ్యాలరీ ఎగ్జిబిషన్ బికనీర్ హౌస్లోని లివింగ్ ట్రేడిషన్స్ సెంటర్ వేదికగా నిర్వహించారు. అందులోకి అడుగు పెట్టగానే మేఘాలపై నడుస్తున్నట్లు అనిపిస్తుంది. ఆకాశమే నేలగా మారిందా! అన్నంత అద్భుతంగా ఉంటుంది. ఆయన ఈ ఎగ్జిబిషన్ని 'ఉపమాన'(పోలిక) అనే వైవిధ్య భరితమైన టైటిల్తో నిర్వహించారు. ఆ టైటిల్ తగ్గట్టుగానే ఆ ఫోటోలు ఒక దానికి మించి ఒకటి ఉండటం విశేషం. ఇదేమీ అతని తొలి సోలో ప్రదర్శన కాదు. రైహాన్ సోలో ఎగ్జిబిషన్ 'డార్క్ పర్సెప్షన్ యాన్ ఎక్స్పోజిషన్ ఆఫ్ లైట్, స్పెస్ అండ్ టైమ్' పేరుతో 2021లో నిర్వహించడం జరిగింది. రైహాన్ 8 ఏళ ప్రాయం నుంచి ఫోటోలు తీయడం ప్రారంభించారు. అతను విజువల్ అండ్ ఇన్స్టాలేషన్ ఆర్టిస్ట్ ఫోటోగ్రాఫర్ అని పిలిపించుకునేందుకే ఇష్టపడతాడు. ఆయన తన తాతయ్య రాజీవ్ గాంధీ వలే అందమైన వన్యప్రాణులను కెమెరాలో బంధించడం అంటే మక్కువ. ఇక వాద్రా నిర్వహించిన ఈ ఎగ్జిబిషన్లో ఒక గది మొత్తం రాజస్తాన్లోని అభయ అరణ్యాల్లో క్లిక్ చేసిని చిరుతపులి ఫోటో చూస్తే..చెట్లతో ఆవాసం ఏర్పరుచుకున్నట్లు కనిపిస్తుంది. ఇక ఇతర గదుల్లో లైఫ్ సైజ్ మిర్రర్లతో వ్యక్తుల వ్యక్తీకరణ ఫోటోగ్రాఫ్లు ఉన్నాయి. నిజానికి ఈ ఆర్ట్ చాలా శక్తిమంతమైన ట్రిక్. అన్ని వర్గాలప్రజల హవాభావాలను తనదైన శైలిలో కెమరాతో బంధించే కళ. ఇది గ్రహణ శక్తికి సంబంధించిన ఆర్ట్ అని చెప్పొచ్చు. ఈ ఎగ్జిబిషన్ రైహాన్ నిర్వహిస్తున్న ఐదు వరుస సోలో ప్రదర్శనల్లో ఒకటి. ఈ ప్రదర్శన తెలియని దానిని తెలిసిన వాటితో పోల్చగలిగే మహత్తర ఊహతీత జ్ఞానం గురించి చెబుతుంది. ఇక రైహాన్ కేవంలో సోలో ప్రదర్శనలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో గ్రూప్ ప్రదర్శనల్లో కూడా పాల్గొన్నారు. (చదవండి: నరకం ఎలా ఉంటుందో చూడాలనుకుంటే ఈ పార్క్కి వెళ్లాల్సిందే!) -
భళా.. బాల మేధావులు
సాక్షి, అమరావతి: విజయవాడలో నిర్వహిస్తున్న ‘సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్’ సందర్శకులను ఆకట్టుకుంటోంది. ప్రభుత్వ విద్యార్థుల్లో దాగివున్న శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాలను ఎలుగెత్తి చాటుతోంది. ఏపీ పాఠశాల విద్యాశాఖ, విశ్వేశ్వరయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజికల్ మ్యూజియం, కర్ణాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్వంలో ఫిబ్రవరి 1వ తేదీ వరకు 6 రోజులపాటు ఎగ్జిబిషన్ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు రూపొందించిన 210 ప్రాజెక్ట్లను ఇక్కడ ప్రదర్శనకు ఉంచారు. అత్యుత్తమ ప్రదర్శనలను జాతీయ పోటీలకు ఎంపిక చేయనున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో 8 నుంచి 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలకు ఇక్కడ అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు రూపొందించిన 30 నమూనాలు సైతం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సోమవారం సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఎగ్జిబిషన్కు తరలివచ్చారు. తమ వయసు విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను తిలకించి, ఆసక్తిగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకే.. సైన్స్ రంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్రెడ్డి తెలిపారు. సదరన్ సైన్స్ ఎగ్జిబిషన్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమెటిక్స్, భూమి/అంతరిక పరిజ్ఞానం, పర్యావరణం, ఇంజినీరింగ్, అగ్రి, బయో సైన్స్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే అంశాలకు చోటు కల్పించామన్నారు. న్యాయ నిర్ణేతలు ఉత్తమ ప్రదర్శనలను గుర్తించి జాతీయ పోటీలకు ఎంపిక చేస్తారని వివరించారు. తక్కువ ఖర్చు.. ఆదాయం హెచ్చు ఈ చిత్రంలో కనిపిస్తున్న కె.హేమమాధురి, పి.పావని చిత్తూరు జిల్లా పెదపంజానిలోని మహత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇద్దరూ రైతుకు మేలు చేసే సమగ్ర వ్యవసాయ (ఇంటిగ్రేటెడ్ పారి్మంగ్) విధానాన్ని రూపొందించారు. తక్కువ ఖర్చుతో పంటలు పండిస్తూనే.. ఎరువుల ఖర్చు లేకుండా అదనపు ఆదాయంతో పాటు ఎక్కువ లాభాలు వచ్చే ప్రాజెక్ట్కు రూపకల్పన చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని అంశాలను అనర్గళంగా వివరిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని, ఇంగ్లిష్ ప్రావీణ్యం ప్రదర్శిస్తూ.. సదరన్ సైన్స్ ఫెయిర్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆపదలో ఆదుకునే తుపాకీ సైనికులు, ఫారెస్ట్ సిబ్బంది, అగ్నిమాపకదళ సిబ్బంది విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తుంటారు. ఒక్కోసారి దారి తప్పడమో, మంచులో కూరుకుపోవడమో జరుగుతుంది. అలాంటప్పుడు వారున్న చోటును తెలిసేలా అద్భుతమైన తుపాకిని రూపొందించాడు మంగుళూరుకు చెందిన విద్యార్థి పి.తేజస్. ఓ వైపు శత్రువులపై బుల్లెట్ల వర్షం కురిపించడంతోపాటు సైనికుడి ఉనికిని తన బృందానికి చేరవేసేలా సెన్సార్ను బిగించాడు. ఇది బయటి వారికి సిగ్నల్స్ను పంపించి ఆచూకీ చెబుతుంది. తేజస్ తయారు చేసిన తుపాకి ఒక్కసారి వినియోగానికి రూ.30 మాత్రమే ఖర్చవుతుంది. మంటల్లో కాలిపోతున్న ఎత్తయిన భవనాల్లోకి ఈ తుపాకి ద్వారా ఆక్సిజన్ బాల్స్ను ఫైర్ చేసి మంటలను సైతం ఆర్పేయవచ్చు. -
నుమాయిష్.. జోష్
అబిడ్స్: ఎగ్జిబిషన్ సందర్శకులతో కిక్కిరిసింది. 83వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనశాల (నుమాయిష్)ను ఆదివారం 80 వేల మంది సందర్శించారు. జనవరి 1వ తేదీన ప్రారంభమైన ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15న ముగియనుంది. ఆదివారం వరకు దాదాపు 8.50 లక్షల మంది ఎగ్జిబిషన్ను సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు వనం సత్తేందర్, కార్యదర్శి హనుమంతరావు, కోశాధికారి ఏనుగుల రాజేంద్రకుమార్లు తెలిపారు. సందర్శకుల సౌకర్యార్థం ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశామన్నారు. వలంటీర్లతో పాటు పోలీసులు ఆదివారం ఎగ్జిబిషన్ పరిసరాల్లో ఎగ్జిబిషన్ లోపల భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బేగంబజార్ ఇన్స్పెక్టర్ ఎన్.శంకర్ తెలిపారు. సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ముమ్మరం చేశామన్నారు. మఫ్టిలో పోలీసులు ఉండి బందోబస్తు చేపడుతున్నారన్నారు. -
హైదరాబాద్ లో వెడ్డింగ్ జ్యూవెల్లరీ స్పెషల్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
హైదరాబాద్లో విమానాల ప్రదర్శన.. టికెట్ ఎలా బుక్ చేసుకోవాలంటే..
గడిచిన రెండేళ్లలో విమానాల్లో ప్రయాణించేవారి సంఖ్య 26 కోట్లకు పెరిగిందని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. బేగంపేట విమానాశ్రయంలో ‘వింగ్స్ ఇండియా 2024’ వైమానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి వీకే సింగ్, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ పౌర విమానయాన రంగంలో ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 2047 నాటికి విమానయాన రంగం 20 ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ముంబయి, దిల్లీలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు గుర్తిచేశారు. ఉడాన్ పథకం కింద జమ్మూకశ్మీర్లో హెలికాప్టర్ ప్రయాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. డ్రోన్లకు డిమాండ్ పెరగడంతో.. మహిళా పైలట్లను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఉడాన్ 5.3ను మంత్రి ప్రారంభించారు. సమావేశంలో పలు విమానయాన సంస్థల మధ్య ఒప్పందాలు జరిగాయి. తెలంగాణలో ఎన్నో అవకాశాలు -మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్లో వింగ్స్ ఇండియా ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఏవియేషన్ రంగానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. సులభతర వాణిజ్య విధానం ఇక్కడ అమలవుతోందని చెప్పారు. ఏరో స్పేస్ పెట్టుబడులకు హైదరాబాద్ ఎంతో అనుకూలం. డ్రోన్ పైలట్లకు ఎక్కువగా శిక్షణ ఇచ్చి.. వ్యవసాయం, అత్యవసర పరిస్థితులు, శాంతిభద్రతల్లో డ్రోన్లు వినియోగిస్తున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: బుల్లెట్ రైలు ప్రాజెక్టు దక్కించుకున్న కంపెనీ ఇదే.. వింగ్స్ ఇండియా 2024 సందర్శకులకు 20, 21వ తేదీల్లో అనుమతిస్తారు. భారత వాయుసేనకు చెందిన సారంగ్ బృందం ఈ రోజు నుంచి 21వ తేదీ వరకు విన్యాసాలు నిర్వహించనుంది. 18న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15 నుంచి 5 వరకు విన్యాసాలుంటాయి. 19న ఉదయం 11 నుంచి 12 వరకు, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 వరకు, సాయంత్రం 4.15-5 వరకు విన్యాసాలు ఉంటాయి. 20, 21వ తేదీల్లో సందర్శకులను అనుమతించనున్నారు. టికెట్ రూ.750గా నిర్ణయించారు. ‘బుక్మైషో’ యాప్ ద్వారా టికెట్లను కొనుగోలు చేయవచ్చు. మూడేళ్లలోపు పిల్లలకు ఉచితం. 30 అడుగుల దూరంలో బారికేడ్ల నుంచి మాత్రమే చూసే అవకాశం ఉంటుంది. -
బంజారాహిల్స్ లో ఎక్సక్లూజివ్ పాప్-అప్ ఎగ్జిబిషన్.. (ఫోటోలు)
-
Numaish Exhibition Images 2024: నాంపల్లిలో నుమాయిష్ సందడి (ఫొటోలు)
-
సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన ముద్దుగుమ్మలు
-
Kovilpatti: కళాపూర్ణోదయం
తమిళనాడులోని కోవిల్పట్టి అనే చిన్న పట్టణం అద్భుత చిత్రకారులకు నెలవు. క్యాలెండర్లు, మ్యాగజైన్లు, బుక్ కవర్లు, ఇన్విటేషన్లు, గ్రీటింగ్కార్డ్స్... మొదలైన వాటికి వేసిన అద్భుత పెయింటింగ్లు గత కాల జ్ఞాపకాలుగానే మిగిలిపోయాయి. ఆ చిత్రకారుల గురించి నామమాత్రంగా కూడా తెలియకుండా పోయింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘కోవిల్పట్టి: ది టౌన్ దట్ పేపర్డ్ ఇండియా’ పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. వీటికి సంబంధించిన అద్భుత పెయింటింగ్లు నెట్లో చక్కర్లు కొడుతూ ‘ఆహా’ అనిపిస్తున్నాయి. -
విజయవాడ : హైలైఫ్ ఎగ్జిబిషన్ ఈవెంట్లో మెరిసిన మోడల్స్ (ఫొటోలు)
-
బంజారా హిల్స్ తాజ్ కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఉమేష్ మధ్యాన్, మోడల్స్ (ఫోటోలు)
-
హైదరాబాద్ లో 150 రకాల విదేశీ పక్షుల ప్రదర్శన ఎక్కడో తెలుసా (ఫొటోలు)
-
డ్రీమ్ సిటీలో డ్రీమ్హాక్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ ‘డ్రీమ్హాక్’కు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ప్రారంభమైన యాక్షన్–ప్యాక్డ్ గేమింగ్ మహోత్సవం మూడ్రోజులపాటు కొనసాగనుంది. గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్ డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేమ్లతోపాటు వర్క్షాప్లు, అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్స్టర్, హ్యుందయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. పీసీ మోడ్, మొబైల్ మోడ్ విధానంలో గేమ్స్ నిర్వహించగా హైదరాబాద్తోపాటు దేశంలోని వివిధ నగరాల డిజిటల్ గేమర్స్ పాల్గొంటున్నారు. డ్రీమ్హాక్ రాపిడ్ ఓపెన్ టోర్నమెంట్, డ్రీమ్హాక్ బ్లిట్జ్ ఓపెన్ టోర్నమెంట్, కేఓ ఫైట్ నైట్, పబ్జీ ఆధారిత గేమ్లు, రెట్రో జోన్ గేమ్స్ మోనోపోలీ, లూడో, క్యారమ్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్వో వంటి ప్రసిద్ధ బోర్డ్ గేమ్లతో డ్రీమ్హాక్ అలరిస్తుంది. వివిధ విభాగాల విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు డ్రీమ్హాక్ ప్రకటించింది. -
మ్యాథ్స్తో ఆర్ట్ను మిళితం చేసే సరికొత్త ఆర్ట్!
‘ఆర్టిస్ట్గా అన్నీ కుమారి ప్రత్యేకత ఏమిటి?’ అనే ప్రశ్నకు ఒక ముక్కలో జవాబు చెప్పాలంటే... ‘మాథ్స్, ఆర్ట్ను మిళితం చేసి సరికొత్త ఆర్ట్ను సృష్టించింది’ జీవితం కూడా గణితంలాంటిదే. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కొన్ని ఎంతకీ కావు... ఈ సారాంశం కుమారి చిత్రాల్లో ప్రతిఫలిస్తుంది... మనం పుట్టి పెరిగిన వాతావరణం ఆలోచనల్లో, ఆచరణలో, చివరికి ఆర్ట్లో కూడా ప్రభావం చూపుతుంది. దీనికి నిలువెత్తు సాక్ష్యం అన్నీ కుమారి ఆర్ట్. గణితం, సంగీతం, క్రాఫ్ట్ల గురించి విలువైన చర్చలు జరిగే ఇంట్లో పెరిగింది కుమారి. చిన్నటిప్పటి నుంచి తనకు లెక్కలు అంటే ఇష్టం. లెక్కలంటే భయపడే పిల్లలకు భిన్నంగా అన్నీ కుమారి గంటల తరబడి లెక్కలు చేస్తూ కూర్చునేది. అంకెలు, సంఖ్యలు తన ప్రియ నేస్తాలుగా మారాయి. ‘ఆర్ట్కు లెక్కలకు దోస్తు కుదరదు’ అంటారు. అయితే అన్నీకి లెక్కలు అంటే ఎంత ఇష్టమో, ఆర్ట్ అంటే కూడా అంతే ఇష్టం. అయితే ఆర్ట్ స్కూల్లో మాత్రం అంకెలు నచ్చినంతగా చిత్రాలు నచ్చలేదు. తనకు కావాల్సినదేదో ఆ చిత్రాల్లో లోపించినట్లుగా అనిపించేది. ఆ సమయంలో రకరకాల ప్రయోగాల గురించి ఆలోచించేది. విజువల్ వకాబులరీ సృష్టించాలనే ఆలోచన అలా వచ్చిందే. ఆర్ట్ స్కూల్ తరువాత... బొమ్మలు గీస్తూ కూర్చోలేదు. తనలోని శూన్యాన్ని భర్తీ చేసుకోవడానికి ప్రయాణాన్ని సాధనంగా ఎంచుకుంది. జార్ఖండ్లోని హజరీబాగ్కు వెళ్లి సోరాయి మ్యూరల్ ఆర్ట్ సంప్రదాయాన్ని, తమిళనాడు వెళ్లి కోలమ్ ఫ్లోర్ డ్రాయింగ్ సంప్రదాయాన్ని అధ్యయనం చేసింది. ఆ కళలో చుక్కలు, గీతలు, వంకలు చూస్తుంటే రకరకాల గణిత సూత్రాలు కంటిముందుకు వచ్చేవి. దీనికితోడు ప్రాచీన భారతీయ ఆలయాలలోని ఆర్కిటెక్చర్లో గణితం ఒక భాగమై ఉందనే విషయాన్ని అర్థం చేసుకుంది. ప్రకృతి ప్రపంచానికి, గణిత సూత్రాలకు మధ్య ఉండే అంతర్లీన సంబంధం కుమారిని ఆకట్టుకుంది. సైన్స్కు ఉండే శక్తి అది సృష్టించే వస్తువుల్లో కనబడుతుంది. ఇక ఆర్ట్కు ఉండే శక్తి మానవ ఉద్వేగాలను, అనుభవాలను ప్రతిఫలించే వేదికలో కనబడుతుంది. ముఖ్య అంశం ఏమిటంటే గణితానికి సంబంధించిన సంక్లిష్ఠతను సరళీకరించి జనాలలోకి తీసుకువెళ్లే శక్తి ఆర్ట్కు ఉంది. అందుకే ఈ రెండు బలమైన మాధ్యమాలను ఒకేచోటుకి తీసుకురావాలనుకుంది. తను సృష్టించే ఆర్ట్ ఎలా ఉండాలంటే... మన సంస్కృతీ, సంప్రదాయాలలోకి తిరిగి ప్రయాణించేలా, మన కళలను పండగలా సెలబ్రేట్ చేసుకునేలా, మన మూలాలతో ఆత్మీయంగా కనెక్ట్ అయ్యేలా ఉండాలి అనే లక్ష్యంతో బయలుదేరింది. ఆ లక్ష్యసాధనలో విజయం సాధించి ఆర్టిస్ట్గా తనదైన ప్రత్యేకత నిలుపుకుంది. తాజాగా అన్నీ కుమారి ఆర్ట్ ఎగ్జిబిషన్ ముంబైలోని తావో ఆర్ట్ గ్యాలరీలో జరుగుతోంది. (చదవండి: ఆంగ్ల మహాసముద్రంలో ఆనంద విహారం!) -
మగువల మనసు దోచే చీరల ప్రదర్శన (ఫోటోలు)
-
హైదరాబాద్ : బంజారాహిల్స్ సూత్ర ఎగ్జిబిషన్ ప్రారంభంలో మోడల్స్ సందడి (ఫొటోలు)
-
మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా విజేతగా రాహుల్..
హైదరాబాద్: నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా భాగ్యనగర్ బాడీబిల్డింగ్ అసోసియేషన్, హైటెక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా 2023 పోటీలను నిర్వహించారు. ఆదివారం జరిగిన ఈ పోటీల్లో మిస్టర్ స్పోర్టెక్స్ క్లాసిక్ ఇండియా టైటిల్ను తెలంగాణాకు చెందిన రాహుల్ గెలుచుకున్నారు. ఈ సందర్భంగా బీబీఏ ప్రెసిడెంట్ కె సంపత్ రెడ్డి మాట్లాడుతూ., పురుషుల ఫిజిక్, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ విభాగాల్లో పోటీలు జరిగాయని తెలిపారు. టైటిల్ విజేతకు రూ. లక్ష నగదు బహుమతి, మొత్తం టోర్నీ పేరిట రూ.6 లక్షల నగదు అవార్డులు అందుకుంటారన్నారు. 55 కిలోలు, 55–60 కిలోలు, 60–65 కిలోలు, 65–70 కిలోలు 70–75 కిలోలు, 75–80 కిలోలు, 80–85 తదితర విభాగాల్లో బాడీబిల్డింగ్ పోటీలు, 85 కిలోల పైన పురుషుల ఫిజిక్ పోటీలు 170 సెంటీమీటర్ల లోపు, 170 సెంటీమీటర్ల పైన తదితర విభాగాల్లో నిర్వహించామన్నారు. -
సిద్దిపేటలో జురాసిక్ పార్క్
వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన డైనోసార్లకు హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ వెండితెరపై రూపం ఇచ్చి ప్రాణం పోశారు. 1993లో వచ్చి న జురాసిక్ పార్క్ క్రియేట్ చేసిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కూడా ఆ చిత్రానికి కొనసాగింపుగా అనేక సినిమాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రజలకు డైనోసార్లపై ఉన్న ఆసక్తిని గమనించి ఆ తర్వాత డైనోసార్ థీమ్తో ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో పార్కులు వెలిశాయి. నూతన సాంకేతికతను ఉపయోగించి నిజంగా ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా డైనోసార్లను తయారుచేసి ప్రదర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటైన రీతిలో ఇప్పుడు కొత్తగా డైనోపార్క్ మన తెలంగాణలోనూ అందుబాటులోకి రాబోతుంది. దానికి సిద్దిపేట వేదిక కాబోతుంది. - సాక్షి, సిద్దిపేట విదేశాల్లోని పార్కుల తరహాలో డైనోపార్క్ అంటే ఏదో ఎగ్జిబిషన్లా బొమ్మలు, 3డీ యానిమేషన్ స్క్రీన్లు కాదు. అమెరికా, సింగపూర్లలోని యూనివర్సల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనోపార్క్ల తరహాలో కోమటిచెరువు సమీపంలో పార్క్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ పార్క్ పనులు ఏడాది కిందట మొదలు కాగా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో.. డైనోసార్ పార్క్ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ డైనోపార్క్లో పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్ఫాల్స్ ఇలా మూడు వేల శతాబ్దాల కిందట భూమండలం మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో వివిధ రకాల డైనోసార్లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూఇటూ కలియతిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తూ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాకింగ్ డైనో.. ఈ డైనో థీమ్ పార్క్లో వాకింగ్ డైనోసార్ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో చిన్నారులు కూర్చుంటే నడుచుకుంటూ వెళ్తుంది. ఒకేసారి ఆరుగురు చిన్నారులు కూర్చునే విధంగా రూపొందించారు. అలాగే లోపల గుహల్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్ను ఏర్పాటు చేశారు. డైనోసార్ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుండగా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్క్ను చూసేందుకు వస్తున్న పిల్లలను అలరించేందుకు డైనోసార్ సూట్ వేసుకుని ఇద్దరు తిరగనున్నారు. మినీ ట్రాక్.. ఓపెన్ ట్రైన్ డైనోసార్ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్ను నిర్మించారు. దీనిపై ఓపెన్ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుంది. ఈ ఓపెన్ ట్రైన్లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్లు మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్ను డిజైన్ చేశారు. గుజరాత్ను మించేలా.. మన దేశంలో గుజరాత్లోని రయోలిలో డైనోసార్ గుడ్లు లభించాయి. దీంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో నిలకడగా ఉండే డైనోసార్లను ప్రదర్శనకు ఉంచారు. డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ.. తోక ఊపుతుంది. కానీ సిద్దిపేటలో ప్రారంభంకాబోతున్న పార్క్లో కదిలే డైనోసార్లు 18 ఉన్నాయి. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేశారు. ఒక రకంగా దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్క్ అని అంటున్నారు. కొత్త అనుభూతి కలిగిస్తుంది కోమటి చెరువులో మరో మణిహారంగా డైనోసార్ పార్క్ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే రాక్గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్ల చెంతన వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు ఉంటుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ఉండబోతుంది. -
భార్య బిజినెస్ను ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బన్నీకి ఎంత క్రేజ్ ఉందో స్నేహారెడ్డికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూతురు, కొడుకుతో కలిసి బన్నీ చేసే అల్లరి ఫోటోల, వీడియోలను తరచూ తన ఇన్స్టాలో షేర్ చేస్తుంటుంది స్నేహారెడ్డి. ఇక బన్నీ భార్యగానే కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె సొంతంగా PICABOO పేరుతో ఓ ఆన్లైన్ ఫోటో స్టూడియోను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 2016లో ప్రారంభించిన ఈ కంపెనీ ఇప్పటికీ సక్సెస్ఫుల్గా సాగుతోంది. ప్రస్తుతం PICABOOPOPUP పేరుతో ఫస్ట్ ఎడిషన్ కోసం స్నేహారెడ్డి ఓ గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది. ఇందులో దేశ వ్యాప్తంగా వివిధ డిజైనర్ బ్రాండ్స్ సందడి చేశాయి. ముఖ్యంగా మామ్ అండ్ కిడ్స్ కోసం ప్రత్యేకంగా ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కోసం స్నేహారెడ్డి కూతురు అర్హతో కలిసి హాజరయ్యింది. ఈ సందర్భంగా స్టాల్స్ యజమానులతో సరదాగా ముచ్చటించింది. ఆ తర్వాత అల్లు అర్జున్ కొడుకు అయాన్తో కలిసి ఈవెంట్లో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియలో వైరల్గా మారాయి. భార్య ఈవెంట్ను సపోర్ట్ చేయడానికి బన్నీ రావడం ముచ్చటేస్తుందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. -
అరటి నార.. అందమైన చీర
పిఠాపురం: వస్త్ర ప్రపంచంలో కాకినాడ జిల్లా కొత్తపల్లి, గొల్లప్రోలు మండలంలోని చేనేత కార్మికులు చరిత్ర సృష్టించారు. వారు నేసిన జాంధానీ చీరలు మహిళా లోకం అందాన్ని మరింత ఇనుమడింపజేసి అంతర్జాతీయ ఖ్యాతిని అందుకుంటున్నాయి. రెండువైపులా ఒకే విధంగా కనిపించడమే జాంధానీ చీరల ప్రత్యేకత. చీర తయారయినప్పుడు ఎంత విలువుంటుందో.. అది కాస్త పాడయినపుడు కూడా ఎంతో కొంత ధర పలకడం దీని విశిష్టత. మిగిలిన ఏ రకం చీరలకూ ఈ అవకాశం లేకపోవడం గమనార్హం. కుటీర పరిశ్రమగా ప్రారంభమైన జాంధానీ చీరల తయారీ నేడు ప్రపంచస్థాయి గుర్తింపునకు నాంది పలుకుతున్నాయి. ప్రతీ ఏటా కోట్ల రూపాయల జాంధానీ చీరల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎగ్జిబిషన్లో స్థానం సంపాదించి విదేశీ ఆర్డర్లు సైతం సా«ధించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్ను జోడించి మరింత సోయగాలు అద్దడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో ‘జాంధాని’ పేటెంట్ హక్కుతో పాటు ఉప్పాడ కాటన్, సిల్క్ మాదిరిగా ఇండియన్ హేండులూమ్స్లోనూ స్థానం సంపాదించింది. ఈ క్రమంలో జాంధానీకి నయా ట్రెండ్ను జోడించి మరింత సోయగాలు అద్దేలా చేనేతలకు ప్రోత్సాహం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని సహజసిద్ధంగా లభించే అరటి, అవిసె మొక్కల నారతో మంచి మంచి డిజైన్లతో వ్రస్తాలను తయారు చేసేలా వారికి శిక్షణ ఇస్తుంది. బనానా సిల్క్ నేతపై శిక్షణ.. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా భారత ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషన్ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు శిక్షణ ఇస్తుంది. ఇందుకోసం కాకినాడ జిల్లాలోని తాటిపర్తి, ప్రత్తిపాడులో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 20 మందికి చొప్పున కొత్త కొత్త డిజైన్లతో బనానా, లినిన్ నేతపై అధికారులు శిక్షణ ఇస్తున్నారు. బనానా దారంతో నేత అరటి బెరడులో ఉండే పీచుతో తయారు చేసిన దారంతో జాంధానీ చీరలు తయారు చేస్తారు. ఈ చీరల్లో ఉపయోగించే రంగులు కెమికల్స్కు స్వస్తి పలికి ఆర్గానిక్ పద్ధతిలో ప్రకృతి సిద్ధమైన బనానా దారంను ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. సిల్క్ దారం ఎక్కువ కాలం మట్టిలో కలవకుండా ఉండడం వల్ల కాలుష్యం పెరిగే అవకాశాలు ఉండడంతో బనానా దారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. మూసా ఫైబర్గా పిలవబడే ఇది వేడి తట్టుకోవడంతో పాటు మంచి స్పిన్నింగ్ సామర్థ్యం కలిగి అత్యధిక నాణ్యతతో ఉంటుంది. ప్రస్తుతం దీనిని కేరళ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న కాలంలో అరటి బెరడులకు గిరాకీ పెరగనుంది. బనానా దారం తయారీకి చర్యలు .. బనానా, లినిన్ దారాలను కేరళ, తమిళనాడు, చెన్నై నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. త్వరలో తయారీకి చర్యలు తీసుకుంటాం. స్కీం ఫర్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ టెక్స్టైల్స్ సెక్టార్ ద్వారా విజయవాడలోని వీవర్స్ సర్విస్ సెంటర్ ద్వారా కార్మికులకు శిక్షణ ఇస్తున్నాం. – కె.పెద్దిరాజు, చేనేత జౌళి శాఖాధికారి, కాకినాడ -
Niharika Konidela Photos: హై లైఫ్ ఎగ్జిబిషన్లో నిహారిక సందడి (ఫొటోలు)
-
న్యూయార్క్ బుద్ధిస్ట్ ఆర్ట్ ఎగ్జిబిషన్: ప్రత్యేకతను చాటుకున్న నీతా అంబానీ
న్యూయార్క్లోని మెట్ మ్యూజియంలో జూలై 17న బౌద్ధ కళల ప్రదర్శన ప్రత్యేక ప్రివ్యూకు నీతా అంబానీ హాజరయ్యారు. మెట్ మ్యూజియంలో ప్రారంభ బౌద్ధ కళా ప్రదర్శన 'ట్రీ & సర్పెంట్: ఎర్లీ బౌద్ధ కళ ఇన్ ఇండియా, 200 BCE–400 CE' ప్రత్యేక ప్రివ్యూలో ఆమె తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ ఎగ్జిబిషన్ జూలై 21- నవంబర్ 13, 2023 వరకు మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ , ది మెట్ ఫిఫ్త్ అవెన్యూలో జరగనుంది. భారతదేశానికి కళను తీసుకురావడానికి ప్రపంచంలోని వివిధ మ్యూజియంలతో భాగస్వామ్యం కావాలని చూస్తున్నాం. ఎన్ఎంఏసీసీ లాంచ్ తరువాత గత 3 నెలల్లో, ప్రతిరోజూ 5000-6000 మందిని వస్తున్నారు. కేవలం రెండు ప్రదర్శనలను ఒకటిన్నర లక్షల మంది దర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఆసక్తికరమైన భారతీయ సంస్కృతి పట్ల ఆసక్తి పెరుగుతోందన్నారు నీతా అంబానీ.ఈ కార్యక్రమానికి నీతా అంబానీతో పాటు, భారతదేశంలోని యుఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, యుఎస్లోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు ,న్యూయార్క్లోని భారత కాన్సుల్ జనరల్ రణధీర్ జైస్వాల్తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత, నీతా భారతదేశాన్ని 'బుద్ధుని భూమి' అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రతి ఒక్కరూ 'బుద్ధం శరణం గచ్ఛామి' అనే పవిత్ర మంత్రాన్ని పఠించడంలో తనతో కలిసి రావాలని ఆమె అభ్యర్థించారు.200 BCE- 400 CE వరకు భారతదేశంలోని బౌద్ధ పూర్వపు మూలాలను హైలైట్ చేసే 140 వస్తువులను ఇక్కడ ప్రదర్శించనున్నారు., నాలుగు నెలల పాటు జరిగే ఈ ప్రదర్శనను ప్లాన్ చేయడానికి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్.ఎన్.హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్, ఫ్రెడ్ ఐచానర్ ఫండ్ కలిసి పనిచేశాయి. నీతా 2016 నుండి మెట్ మ్యూజియంలో కీలకమైన భాగంగా ఉన్నారు. నవంబర్ 2019లో ఆమె గౌరవ ధర్మకర్తగా ,మెట్స్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ సభ్యురాలిగా ఎంపికయ్యారు. దీంతో మ్యూజియం ట్రస్టీల బోర్డులో చేరిన తొలి భారతీయురాలు నీతా కావడం విశేషం. #WATCH | We are looking at collaborating with various museums of the world to bring art to India. In last 3 months, after we opened NMACC, we saw footfall of 5000-6000 every day just for two exhibits we had over one and a half lakh people coming. India is at the right place and… pic.twitter.com/yga2AOeiUa — ANI (@ANI) July 19, 2023 -
Anchor Varsha Photos: హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్లో జబర్దస్త్ వర్ష సందడి (ఫొటోలు)
-
మాదాపూర్: ఆకట్టుకున్న ఇంటీరియర్ ప్రదర్శన (ఫొటోలు)
-
రాష్ట్రంలో బొమ్మల కొలువు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో టాయ్ (బొమ్మల) మ్యూజియం కొలువుదీరనుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంస్కృతి, సంప్రదాయాలు, నైపుణ్యాన్ని ప్రతిబింబించే బొమ్మలను ఇందులో ప్రదర్శించనున్నారు. చిన్నారుల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసంపెంపొందించడంతో పాటు ఆరోగ్యకరమైన విజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం టాయ్ మ్యూజియాలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు మూడేళ్ల కిందట తొలి దశలో గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల్లో ప్రతిపాదించింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా ఈ ప్రాజెక్టు ఆలస్యమైంది. రెండేళ్ల క్రితం గుజరాత్లో తొలి బొమ్మల మ్యూజియం పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో రూ.15 కోట్ల అంచనా వ్యయంతో విజయనగరంలో బొమ్మల మ్యూజియాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. ఇప్పటికే పురావస్తు, ప్రదర్శనశాలల శాఖ.. సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేసే పనిలో నిమగ్నమైంది. దేశం నలుమూలల నుంచి.. మన రాష్ట్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలతో పాటు జమ్మూకశ్మీర్ (పేపర్ బొమ్మలు) పంజాబ్ (ఫోక్), రాజస్థాన్ (గుడ్డ, స్టఫ్డ్), గుజరాత్ (ఎర్ర మట్టి), మహారాష్ట్ర (చెక్క, వంట సామగ్రి), కర్ణాటక (చెన్నపట్న బొమ్మలు), తమిళనాడు (తంజావూరు), తెలంగాణ (నిర్మల్), పశ్చిమ బెంగాల్ (నాటుంగ్రాం), మధ్యప్రదేశ్ (తమలపాకుతో చేసేవి), బిహార్ (కన్యాపుత్రి), ఉత్తరప్రదేశ్ (చెక్కబొమ్మలు), అసోం (ఆషారికండి) తదితర సుమారు 50కిపైగా ప్రసిద్ధి చెందిన ప్రాంతాల నుంచి కొబ్బరి పీచు, రబ్బరు, ప్లాస్టిక్, మెటల్, పింగాణీలతో చేసిన కళాకృతులు, బొమ్మలను సేకరించి మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచనున్నారు. ఈ సాంప్రదాయ బొమ్మలతో పాటు నూతన సాంకేతిక విజ్ఞానాన్ని అందించేలా రోబోటిక్, ఎల్రక్టానిక్ వంటి సుమారు లక్ష నుంచి రెండు లక్షల బొమ్మలను ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా మ్యూజియం సందర్శనకు వచ్చే చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయనున్నారు. జాతీయ, స్థానిక సంస్కృతికి అద్దం పట్టడంతో పాటు శాస్త్రవేత్తలు, కళాకారులు, ప్రముఖ వ్యక్తుల గురించి బొమ్మల మ్యూజియం పరిచయం చేయనుంది. అలాగే పరిశోధన, సంస్కృతి, విజ్ఞాన శాస్త్రాన్నిప్రోత్సహించనుంది. గుజరాత్లో ప్రపంచంలోనే అతిపెద్దది.. కాగా గుజరాత్లోని గాంధీనగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద బొమ్మల మ్యూజియం రూపుదిద్దుకుంటోంది. చిల్డ్రన్స్ యూనివర్సిటీ ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తోంది. 30 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.1,500 కోట్ల అంచనా వ్యయంతో రతన్పూర్, షాపూర్ గ్రామాల మధ్యలో గిఫ్ట్ సిటీ సమీపంలో 11 లక్షలకు పైగా బొమ్మలతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో పురాతన కాలం నుంచి ఆధునిక యుగం వరకు అనేక రకాల బొమ్మలను ప్రదర్శించనున్నారు. ఇస్రో–డీఆర్డీవో సహాయంతో ఎల్రక్టానిక్, బ్యాటరీ, సౌర ఆధారిత చిన్న అంతరిక్ష నౌక, పృథ్వీ, అగ్ని క్షిపణులు, ఉపగ్రహాల సాంకేతిక విజ్ఞానంపై అవగాహన కల్పించేలా బొమ్మలను తయారు చేయనున్నారు. ఇప్పటివరకు అమెరికాకు చెందిన మిస్సౌరీ రాష్ట్రంలోని బ్రాన్సన్ టాయ్ మ్యూజియం 10 లక్షల బొమ్మలతో అతిపెద్ద మ్యూజియంగా గుర్తింపు పొందింది. ఇందులో మోడల్ రైళ్లు, విమానాలు, కార్లు, సూపర్ హీరో, డిస్నీ వరల్డ్ వంటి బొమ్మలు 1800 సంవత్సరం నుంచి తాజా టెక్నాలజీ వరకు ఉన్నాయి. వారసత్వ, విజ్ఞాన, పరిశోధన కేంద్రంగా.. బొమ్మల మ్యూజియం చారిత్రక, వారసత్వ విజ్ఞానాన్ని భద్రపరుస్తుంది. సందర్శకులు తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవచ్చు. విద్యార్థులకు విజ్ఞానం, పరిశోధకులకు రీసెర్చ్ సెంటర్గా ఎంతో ఉపయోగపడుతుంది. విజయనగరంలో స్థలం అందుబాటులో ఉండటంతో బొమ్మల మ్యూజియాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించాం. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి డీపీఆర్ను పంపించి అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక సంపదను కాపాడటంలో విశేష కృషి చేస్తోంది. అందుకే జిల్లాల్లో మ్యూజియాలను అభివృద్ధి చేస్తున్నాం. – జి.వాణీమోహన్, కమిషనర్, పురావస్తు–ప్రదర్శనశాలల శాఖ భవిష్యత్తు తరాలకు అందించడానికే.. భారతదేశం గొప్ప కళలకు ప్రసిద్ధి చెందింది. వాటిని మన భవిష్యత్తు తరాలకు అందించడమే టాయ్ మ్యూజియాల లక్ష్యం. అందుకే దేశ వ్యాప్తంగా రకరకాల బొమ్మలను సేకరించి ఇందులో ప్రదర్శిస్తాం. ఈ మ్యూజియాలే పెద్ద వర్క్షాపు సెంటర్లుగా మారనున్నాయి. బాల్యంలో స్నేహితులతో కలిసి బొమ్మలతో ఆడుకుంటే చిన్నారుల్లో మానసిక ఎదుగుదలతో పాటు సామాజిక స్పృహ, సృజనాత్మకత పెరుగుతుంది. ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవు. టాయ్ మ్యూజియం ద్వారా కొంత వరకు దీన్ని అధిగమించవచ్చు. – రజత్భార్గవ, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి -
అరుదైన శిలా ఫలకం.. అంతులేని నిర్లక్ష్యం!
.. సూర్యాపేట జిల్లా ఫణిగిరి గుట్టపై 2003లో జరిపిన తవ్వకాల్లో క్రీస్తుశకం 1– 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందిన 3 అడుగుల సున్నపు రాయి ఫలకం వెలుగు చూసింది. సిద్ధార్థుడు బుద్ధుడిగా మారే క్రమంలో జరిగిన పరిణామాల చిత్రాలను మూడు వరుసల్లో దానిపై చెక్కారు. అరుదైన ఇలాంటి ఫలకాలకు అంతర్జాతీయ విపణిలో విపరీతమైన డిమాండ్ ఉంది. తవ్వకాలు జరిపిన కొత్తలో ఈ శిలా ఫలకాన్ని ప్రభుత్వ ఆదీనంలోని ఓ గదిలో భద్రపర్చగా.. 2003 సెపె్టంబర్లో దొంగలు దాన్ని ఎత్తుకుపోయారు. పోలీసు బృందాలు జల్లెడ పట్టి సమీపంలోని ఓ ఊరిలో దానిని స్వాదీనం చేసుకున్నారు. కానీ శిలా ఫలకం అప్పటికే రెండు ముక్కలు కావడంతో.. తాత్కాలికంగా అతికించారు. అయితే ఈ ఫలకాన్ని సురక్షిత ప్రాంతంలో ఉంచాలంటూ కోర్టు ఆదేశించడంతో.. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో సిమెంట్ బేస్ సాయంతో కదలకుండా ఏర్పాటు చేశారు. అయితే నాలుగేళ్ల క్రితం ఈ శిల్పాన్ని విమానంలో ముంబై మ్యూజియానికి తీసుకెళ్లి, తీసుకొచ్చారు. ఆ సమయంలో పగులు విచ్చుకోవటంతో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించి అతికించారు. ఈసారి అమెరికాకు తరలించి.. అమెరికాలో న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో బుద్ధుడి జీవిత పరిణామ క్రమానికి సంబంధించిన భారతీయ శిల్పాలతో అంతర్జాతీయ ప్రదర్శన ఏర్పాటు చేశారు. దానికి మన దేశం నుంచి 94 శిల్పాలను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి 9 ఉన్నాయి. వీటిలో కరీంనగర్ మ్యూజియంలో ఉన్న నాగ ముచిలింద శిల్పం పగుళ్లతో ఉండటంతో.. దాన్ని వదిలేసి మిగతా 8 శిల్పాలను ఇటీవల విమానంలో తరలించారు. ఇలా తరలించిన వాటిలో ఫణిగిరి సున్నపురాయి ఫలకం కూడా ఉంది. అరుదైన ఈ శిలా ఫలకాన్ని అంత దూరం ఎలా తరలిస్తారని ఇటీవల కొందరు కేంద్ర పురావస్తు శాఖకు ఫిర్యాదు చేశారు. ఇంతకుముందు రెండు శిల్పాలు ధ్వంసం దాదాపు 20 ఏళ్ల క్రితం స్టేట్ మ్యూజియం నుంచి బాదామి చాళుక్యుల కాలం నాటి ఎర్ర ఇసుకరాతితో చేసిన దుర్గాదేవి ప్రతిమను విదేశాలకు పంపగా.. రవాణాలో విగ్రహం ముక్కు భాగం దెబ్బతిన్నది. బెర్లిన్లో జరిగిన తేజస్ ఎగ్జిబిషన్కు తీసుకెళ్లిన ఓ నాగ శిల్పం వెనక భాగంలో దెబ్బతిన్నది. ఇలా అరుదైన శిల్పాలు దెబ్బతిన్న ఘటనలున్నా.. ఇప్పటికే దెబ్బతిని, తిరిగి అతికించిన శిలా ఫలకాన్ని విదేశాలకు తరలించడం అడ్డగోలు చర్య అని ఓ విశ్రాంత ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బంజారాహిల్స్ ఆధ్యా స్టోర్లో సందడి చేసిన డిజైనర్లు (ఫొటోలు)
-
ఆకట్టుకుంటున్న నీతా అంబానీ ఆర్ట్ ఎగ్జిబిషన్ (ఫొటోలు)
-
నీతా అంబానీ ఎగ్జిబిషన్కు అనూహ్య స్పందన.. మరికొన్ని రోజులు పొడిగింపు
ముంబై: స్వదేశ్ పేరిట నిర్వహిస్తున్న సాంప్రదాయ ఆర్ట్స్, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ను పొడిగించాలని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ (ఎన్ఎంఏసీసీ) నిర్ణయించింది. ఎగ్జిబిషన్కు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ తెలిపారు. తమ నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేలా కళాకారులకు ఒక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని తలపెట్టినట్లు ఆమె వివరించారు. వాస్తవానికి ఈ ఎగ్జిబిషన్ను తొలుత మూడు రోజుల పాటు నిర్వహించాలని భావించారు. ఇందులో తంజావూరు పెయింటింగ్లు, తోలుబొమ్మలు మొదలైన వాటిని ప్రదర్శిస్తున్నారు. ఇదీ చదవండి: మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం.. కొత్తగా 1000 ఉద్యోగాలు -
‘జనశక్తి’ ఎగ్జిబిషన్లో మోదీ
న్యూఢిల్లీ: మన్కీ బాత్ 100వ ఎపిసోడ్ పూర్తయిన సందర్భంగా నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్(ఎన్జీఎంఏ)లో ఏర్పాటైన ఎగ్జిబిషన్ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు. ‘జన శక్తి: ఒక సమ్మిళిత శక్తి’ఇతి వృత్తంతో ఏర్పాటైన ఈ ఎగ్జిబిషన్లో ప్రముఖులైన 13 మంది కళాకారుల కళా ఖండాలున్నాయి. ఎగ్జిబిషన్లో ఆయన కలియదిరిగారని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మన్కీ బాత్లో తమకు ప్రేరణనిచ్చిన అంశాల గురించి కళాకారులు ప్రధానికి వివరించారని పేర్కొంది. -
ఆంధ్రా బౌద్ధ శిల్పాలకు అంతర్జాతీయ గుర్తింపు
సాక్షి, అమరావతి: ప్రాచీన కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన ఆంధ్రప్రదేశ్కు మరో అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. రాష్ట్రానికి చెందిన ఆరు బౌద్ధ శిల్పాలు అమెరికా, దక్షిణ కొరియాల్లో అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికయ్యాయి. ఇందులో భాగంగా క్రీ.పూ. 200 ఏళ్ల నుంచి క్రీ.శ. 400 ఏళ్ల మధ్య కాలం నాటి రాష్ట్ర ప్రాచీన శిల్ప కళాసంపద ఖండాంతర ప్రజలకు కనువిందు చేయనుంది. ఈ మేరకు న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్.. ‘టీ అండ్ సర్పెంట్: ది ఎవల్యూషన్’ అనే పేరుతో అంతర్జాతీయ ప్రదర్శనను నిర్వహించనుంది. ఇందులో భాగంగా భారతదేశంలో బౌద్ధానికి పూర్వం నాటి సంస్కృతిని చాటే శిల్పాలు, బౌద్ధం తొలినాళ్లలోని అలంకారిక కళలు, చిత్రాలను ప్రపంచానికి పరిచయం చేయనుంది. ఈ క్రమంలో మన దేశం నుంచి సున్నపురాయి, బంగారం, వెండి, కాంస్యం, రాక్ క్రిస్టల్, ఐవరీ వంటి 140 రకాల శిల్పాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. అంతర్జాతీయంగా రెండు వేదికలపై.. భారతీయ బౌద్ధ శిల్పకళా రూపాల ప్రదర్శనను ముందు అమెరికాలోని న్యూయార్క్లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్లో జూలై 17 నుంచి నవంబర్ 13 వరకు నిర్వహించనున్నారు. ఈ మ్యూజియాన్ని ‘ది మెట్’ అని పిలుస్తారు. ఇది అమెరికాలో అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. 2022లో 32,08,832 మంది దీన్ని సందర్శించారు. ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే ఆర్ట్ మ్యూజియంల జాబితాలో ఇది ఎనిమిదో స్థానంలో ఉంది. యూఎస్లో అయితే రెండో స్థానంలో నిలుస్తోంది. అమెరికాలో ప్రదర్శన ముగిశాక తర్వాత దక్షిణ కొరియాలో నేషనల్ మ్యూజియం ఆఫ్ కొరియాలో డిసెంబర్ 22 నుంచి 2024 ఏప్రిల్ 14 వరకు శిల్పాలను ప్రదర్శించనున్నారు. ఇందుకోసం మెట్రోపాలిటన్ మ్యూజియం ‘స్టార్ వరల్డ్ వైడ్’ సంస్థకు పురాతన కళా రూపాలను తరలించే బాధ్యతను అప్పగించింది. దీనికి మనదేశంలో నేషనల్ మ్యూజియం నోడల్ ఏజెన్సీగా పనిచేస్తోంది. ఏపీ విగ్రహాల్లో విశిష్టతలు తొలి బౌద్ధ కళల్లో అలంకరణ ముఖ్యంగా కనిపిస్తోంది. అందమైన పువ్వులు, తీగల అల్లికలు, పూర్ణకుంభం, విజ్ఞాన, ఆధ్యాత్మిక శక్తికి ప్రతీకగా కొలిచే గుర్రం వంటి చిత్రాలు వంటివి శిల్పాల్లో ఉన్నాయి. ముఖ్యంగా శిల్పాలపై చెక్కిన ఆరాధకుల ముఖకవళికల్లో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి. మహాపురుషుని రూపం, యక్షుల చిత్రాలు, బౌద్ధంలోని వివిధ సంఘటనలను తెలిపే స్థూపం, ఒకే శిలపై సింహం తల, మొసలి, చేప, ఏనుగు తొండం రూపంలోని వాహనంపై సవారీని ప్రతిబింబించే దృశ్యాలున్నాయి. రాష్ట్రం నుంచి ఆరు విగ్రహాలు అంతర్జాతీయ ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్ నుంచి వేల సంవత్సరాల క్రితం నాటి ఆరు తెల్లటి పాలరాతి విగ్రహాలను ఎంపిక చేశారు. ఇందులో ఐదింటిని అమరావతి హెరిటేజ్ మ్యూజియం నుంచి, ఒకదాన్ని గుంటూరులోని బౌద్ధశ్రీ పురావస్తు మ్యూజియం నుంచి తరలించనున్నారు. ఇందుకు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అనుమతులు సైతం మంజూరు చేసింది. మన రాష్ట్రంలో అమరావతి ప్రాంతానికి అంతర్జాతీయ బుద్ధిజం కేంద్రంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. బుద్ధుడు తన శిష్యులకు ఇక్కడే 10 ధరణిలు (మంత్రాలు) బోధించారని.. అందుకే అమరావతి ప్రాంతం ధరణికోటగా పేరొందినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. కాలచక్ర యానం కూడా ఇక్కడి నుంచే ప్రారంభమైందని బౌద్ధులు దృఢంగా విశ్వసిస్తున్నారు. కాగా ప్రదర్శనకు తెలంగాణ నుంచి తొమ్మిది శిల్పాలను ఎంపిక చేశారు. గొప్ప కళా సంపదకు నిలయం.. బుద్ధుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నాయి. అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాలు గొప్ప శిల్ప కళా సంపదను నిక్షిప్తం చేసుకున్నాయి. ఇలాంటి ఎన్నో గొప్ప, అరుదైన శిల్పాలను ఏపీ మ్యూజియాల్లో భద్రపరిచాం. వీటిని అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేయడం ఎంతో గర్వకారణం. – జి.వాణీమోహన్, కమిషనర్, ఏపీ పురావస్తు, ప్రదర్శనశాలలు -
మహిళల నైపుణ్యం అద్భుతం
ఖైరతాబాద్: చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు దేశానికి వెన్నెముకలాంటివని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా (ఎలిప్) ఆధ్వర్యంలో నెక్లెస్రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన ‘ఎలిప్ వికార్డ్’ ఎగ్జిబిషన్ను గవర్నర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్టాళ్లలో అమ్మకానికి ఉంచిన ఉత్పత్తులను పరిశీలించి, మహిళలతో మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ముందుకు సాగుతారన్నారు. మహిళలు ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఉత్పత్తులను ఒక్కచోటకు చేర్చి ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్పత్తులన్నీ అద్భుతంగా ఉన్నాయన్నారు. ఎంఎస్ఎంఈకి అన్నివేళలా అండగా ఉంటామని, కోవిడ్ సమయంలోనూ ఎంఎస్ఎంఈ రుణాలను చెల్లించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఎలిప్ ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, కార్యదర్శి వి.శ్రీదేవి, సహాయ కార్యదర్శి పల్లవి జోషి, కోషాధికారి మహాలక్ష్మి, ఎగ్జిబిషన్ చైర్పర్సన్ శైలజ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన ఈ నెల 26 వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. -
మోదీపై బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శిస్తాం.. బీజేపీ తీవ్ర అభ్యంతరం
తిరువనంతపురం/వాషింగ్టన్: ప్రధాని మోదీపై ‘ఇండియా: ద మోదీ క్వశ్చన్’ పేరిట బ్రిటిష్ వార్తా సంస్థ బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శిస్తామని కేరళలోని వివిధ రాజకీయ పార్టీల అనుబంధ విభాగాలు మంగళవారం వెల్లడించాయి. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సీఎం విజయన్ జోక్యం చేసుకోవాలని, వివాదాస్పద డాక్యుమెంటరీ ప్రదర్శనను అడ్డుకోవాలని డిమాండ్ చేసింది. డాక్యుమెంటరీని ప్రదర్శించబోతున్నామంటూ సీపీఎం యువజన విభాగమైన డీవైఎఫ్ఐ ఫేసుబుక్లో పేర్కొంది. అనంతరం సీపీఎం విద్యార్థి విభాగం ఎస్ఎఫ్ఐ, కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(కేపీసీసీ) అనుబంధ విభాగాలు ప్రకటించాయి. రాష్ట్రంలో బీబీసీ డాక్యుమెంటరీ ప్రదర్శనకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వొద్దని బీజేపీ కేరళ అధ్యక్షుడు కె.సురేంద్రన్ కోరారు. మత కలహాలు సృష్టించడానికే ఈ డాక్యుమెంటరీని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. డాక్యుమెంటరీ గురించి తెలియదు: అమెరికా బీబీసీ డాక్యుమెంటరీ గురించి తమకేమీ తెలియదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. అమెరికా, భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలని పేర్కొంది. ఇరు దేశాల నడుమ బలమైన సంబంధ బాంధవ్యాలను తాము కోరుకుంటున్నామని వెల్లడించింది. ఇరు దేశాలు విలువలను కలిసి పంచుకోవాలన్నదే తమ ఆకాంక్ష అని ఉద్ఘాటించింది. బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో బ్రిటిష్ ప్రధానమంత్రి రిషి సునాక్ గతవారం ప్రధాని మోదీకి అనుకూలంగా మాట్లాడారు. మోదీపై అసత్యాలు ప్రచారం చేయొద్దని హితవు పలికారు. కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శన డాక్యుమెంటరీని ఎస్ఎఫ్ఐతోపాటు పలు సంఘాలు మంగళవారం కేరళలో కొన్ని ప్రాంతాల్లో ప్రదర్శించాయి. ఈ ప్రదర్శనలను వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి, నిరసన వ్యక్తం చేశారు. పాలక్కాడ్, ఎర్నాకుళం తదితర ప్రాంతాల్లో యువమోర్చా కార్యకర్తలు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి, వారిని అడ్డుకున్నారు. కేవలం కేరళలోనే కాదు, దేశవ్యాప్తంగా డాక్యుమెంటరీని ప్రదర్శిస్తామని సీపీఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ మంగళవారం తేల్చిచెప్పింది. -
ఫుల్ జోష్.. నుమాయిష్ హౌస్ఫుల్, ఇప్పటివరకు ఎంత మంది సందర్శించారంటే?
గన్ఫౌండ్రీ: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న 82వ అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిస్) సందర్శకులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏడాది లానే ఈ సారి కూడా సందర్శకులను ఆకట్టుకుంటోంది, పైగా సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఎగ్జిబిషన్ను రోజూ వేల సంఖ్యలో సందర్శకులు సందర్శించినట్లు బుకింగ్ కమిటీ ఛైర్మన్ హన్మంతు తెలిపారు. ఇప్పటి వరకు ఎగ్జిబిషన్ను 4 లక్షలకు పైగా సందర్శించినట్లు తెలిపారు. ఈ ఏడాది 23 లక్షల మంది సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. కాగా ఎగ్జిబిషన్కు సందర్శకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పలు వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారిమళ్లించారు. చదవండి: వందేభారత్లో త్వరలో స్లీపర్ బెర్తులు -
మూడేళ్ల విరామం.. మళ్లీ కనువిందు చేయనున్న ఆటో ఎక్స్పో!
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ ఎక్స్పో దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈ ఏడాది మళ్లీ కనువిందు చేయనుంది. జనవరి 11న ప్రారంభం కానుంది. 11–12 తేదీల్లో మీడియాకు, 13–18 వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రెండేళ్లకోసారి జరిగే ఆటో ఎక్స్పో వాస్తవానికి 2022లో నిర్వహించాల్సి ఉన్నప్పటికీ కరోనా మహమ్మారి పరిస్థితుల కారణంగా నిర్వహించలేదు. ఈసారి షోలో మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్, కియా ఇండియా, టయోటా కిర్లోస్కర్, ఎంజీ మోటర్ ఇండియా తదితర సంస్థలు పాల్గోనున్నాయి. అలాగే కొత్త అంకుర సంస్థలు.. ప్రధానంగా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థలు కూడా వీటిలో ఉండబోతున్నాయి. అయిదు అంతర్జాతీయ లాంచింగ్లతో పాటు 75 పైచిలుకు కొత్త ఉత్పత్తులను ఇందులో ఆవిష్కరించనున్నారు. 2020 ఎడిషన్తో పోలిస్తే ఈసారి అత్యధికంగా 46 వాహన తయారీ కంపెనీలతో పాటు 80 పైగా సంస్థలు పాల్గొంటున్నట్లు ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ తెలిపింది. కొన్ని కంపెనీలు దూరం.. ఈసారి ఆటో షోలో కొన్ని సంస్థలు పాల్గొనడం లేదు. మహీంద్రా అండ్ మహీంద్రా, స్కోడా, ఫోక్స్వ్యాగన్, నిస్సాన్.. లగ్జరీ కార్ల తయారీ కంపెనీలు మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి మొదలైనవి వీటిలో ఉన్నాయి. అటు హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటర్ వంటి ప్రధాన ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలు కూడా కేవలం ఫ్లెక్స్ ఫ్యుయల్ ప్రొటోటైప్ వాహనాలకే పరిమితం కానున్నాయి. తమలాంటి లగ్జరీ బ్రాండ్స్పై ఆసక్తి ఉండే కస్టమర్లు ఈ తరహా ఆటో ఎక్స్పోలకు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటున్నాయని గమనించిన నేపథ్యంలో ఈసారి షోలో పాల్గొనరాదని నిర్ణయించుకున్నట్లు మెర్సిడెస్–బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. దానికి బదులుగా కస్టమర్లకు మరింత మెరుగైన అనుభూతిని అందించడంపై దృష్టి పెడుతున్నట్లు ఆయన వివరించారు. అటు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ పీటర్ సోల్చ్ కూడా భారత్లో కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెట్టడంపైనే ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు. వేదిక చాలా దూరంగా ఉండటం, వ్యయాలు తడిసి మోపెడవుతుండటం వంటి అంశాలు ఆటో షోలో పాల్గొనడానికి ప్రతికూలాంశాలుగా ఉంటున్నాయని గతంలో పలు ఆటోమొబైల్ తయారీ సంస్థలు తెలిపాయి. చదవండి: రైల్వే శాఖ కీలక నిర్ణయం: ప్రయాణం చేసేటప్పుడు అలా చేస్తే చిక్కుల్లో పడినట్లే! -
Hyderabad: నోవాటెల్లో హై లైఫ్ ఎగ్జిబిషన్ గ్రాండ్ లాంఛ్ (ఫొటోలు)
-
హైలైఫ్ ఎగ్జిబిషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో సినీ తారలు, మోడల్స్ సందడి
-
స్వయం సహాయక సంఘాల బలోపేతానికి కృషి: ఎర్రబెల్లి
ఖైరతాబాద్: స్వయం సహాయక సంఘాల మహిళలను ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చెప్పారు. పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’ ఆధ్వర్యంలో గురువారం నెక్లెస్రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటుచేసిన సరస్ –2022 ఎగ్జిబిషన్ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రతి మండలంలో, జిల్లా కేంద్రాలలో ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేసి మహిళల ఉత్పత్తులను మరింత ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ నెల 28 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 32 జిల్లాలతో పాటు దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలకు చెందిన స్వయం సహాయక సంఘాల మహిళలు ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం 300 స్టాల్స్ను ఏర్పాటు చేసింది. కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్: నగరంలో జపాన్ ఇకెబనా బొమ్మల కొలువు (ఫొటోస్)
-
జనంలోకి జిన్పింగ్
బీజింగ్: చైనాలో సైనిక కుట్ర అంటూ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టిన వార్తలను పటాపంచలు చేస్తూ దేశాధ్యక్షుడు జిన్పింగ్ మంగళవారం జనబాహుళ్యంలో ప్రత్యక్షమయ్యారు. ఉబ్బెకిస్తాన్లో సమర్కండ్లో షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సమావేశాల తర్వాత 16న చైనాకు తిరిగొచ్చిన అధ్యక్షుడు జిన్పింగ్ను గృహనిర్బంధంలో ఉంచి సైన్యం అధికార పగ్గాలు చేపట్టిందనే వార్తలు నాలుగైదు రోజులుగా అన్ని సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న విషయం విదితమే. ఈ వార్తలన్నీ ఉట్టి కాకమ్మ కథలే అని రుజువుచేస్తూ జిన్పింగ్ మంగళవారం బీజింగ్లో అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటుచేసిన ఒక ఎగ్జిబిషన్లో పాల్గొన్నారు. దశాబ్దకాలంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సాధించిన విజయాలు, దేశ పురోగతిని ప్రతిబింబించేలా ఉన్న ప్రదర్శనను అధ్యక్షుడు జిన్పింగ్ తిలకించారని చైనా అధికార వార్త సంస్థ జిన్హువా తెలిపింది. జిన్పింగ్ వెంట దేశ ప్రధాని లీ క్వెకియాంగ్, పార్టీ కీలక నేతలు ఉన్నారు. జిన్పింగ్ నుంచి అధికారాన్ని సైన్యం కైవసం చేసుకుందనే వార్తలు అబద్ధమని దీంతో తేలిపోయింది. జీరో కోవిడ్ పాలసీలో భాగంగా విదేశాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ ఏడు రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను జిన్పింగ్ కూడా పాటించారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
ఏయూలో జియోలాజికల్ ఎగ్జిబిషన్
ఏయూ క్యాంపస్: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగంలో ఏయూ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన జియోలాజికల్ ఎగ్జిబిషన్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అరుదైన శిలాజాలను సేకరించే అలవాటు కలిగిన కందుల వెంకటేష్ కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న చేప శిలాజం, నత్త గుల్లలు, శంఖాలను, డైనోసార్ల శిలాజాలను, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవుల శిలాజాలను, అంతరిక్షం నుంచి భూమిని ఢీకొట్టిన ఉల్క శకలం, భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన, అందమైన ఖనిజాలను ప్రదర్శించారు. ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు బీకే అగర్వాల్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జియో డైవర్సిటీ కలిగిన ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థుల్లో ఉత్సుకతను కలిగిస్తుందన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఈ ఎగ్జిబిషన్లో అరుదైన మినరల్స్, శిలలు ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే అరుదైన శిలలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విద్యార్థులకు ఏర్పడిందన్నారు. ఇంటాక్ విశాఖ కన్వీనర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. యునెస్కో అక్టోబర్ 6 ను ఇంటర్నేషనల్ జియో డైవర్సిటీ డేగా ప్రకటించిందని వెల్లడించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. -
ఇకెబానా ఒహారా స్కూల్లో మినీ ఎగ్జిబిషన్.. ప్రత్యేక అతిథులు హాజరు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా యావత్ దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఇకెబానా (పూలు అమర్చే జపనీస్ కళ)ను నేర్పించే హైదరాబాద్లోని ఒహారా స్కూల్ కూడా ఈ ఏడాది తమ మొదటి ఈవెంట్ను దీనికే అంకితం చేసింది. ఈ సందర్భంగా ఓ మినీ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేసింది. స్కూల్ ప్రెసిడెంట్ శ్రీమతి నిర్మలా అగర్వాల్ నేతృత్వంలోని బృందం థీమ్ను రూపొందించి ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథులను ఆహ్వానించింది. శత్రువులతో పోరాడుతూ కార్గిల్ యుద్ధంలో అమరులైన మేజర్ పద్మపణి ఆచార్య సతీమణి చారులత ఆచార్య ఈ మినీ ఎగ్జిబిషన్కు అతిథిగా హాజరయ్యారు. సైన్యంలో వైద్య సేవలందించిన లెఫ్టినెంట్ కల్నల్, పీడియాట్రిషన్ ఉమ రామచంద్రన్ కూడా పాల్గొన్నారు. ఆర్మీ స్కూల్స్లో టీచర్గా పనిచేసిన శ్యామల ఖన్నా అతిథిగా వచ్చారు. ఈమె 'కౌ ఇన్ కార్గిల్', 'ది లాహోర్ కనెక్షన్' వంటి పుస్తకాలు కూడా రాశారు. చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా! -
హైదరాబాద్: సోమాజీగూడలో లలిత జ్యువలరీ ఎగ్జిబిషన్ & సేల్స్
-
సూత్ర ఎగ్జిబిషన్లో త్రివర్ణ పతాకాలతో మోడల్స్ (ఫొటోలు)
-
నేచురల్ డై హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్, వర్క్షాప్
సాక్షి, తెలంగాణ: ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ ఆధ్వర్యంలో జూన్ 17-19 వరకు మూడు రోజులపాటు ఈ ఎగ్జిబిషన్ జరగనుంది. హైదరాబాద్కు ప్రత్యేకమైన సహజ రంగులతో, చేతితో తయారు చేసిన వస్తువులు కొలువు దీర నున్నాయి.బంజారాహిల్స్లోని తెలంగాణ క్రాఫ్ట్స్ కౌన్సిల్లో తొలిసారిగా ‘నేచురల్ డై హ్యాండ్మేడ్ ఎగ్జిబిషన్’ పేరుతో దీన్ని నిర్వహించ నున్నారు. ముఖ్యంగాకరోనా, లాక్డౌన్ సంక్షోభంతో అనేక ఇబ్బందులు పడుతున్న హస్తకళా కారులు, ఉత్పత్తులకు చేయూతనివ్వడంతోపాటు, స్వదేశీ బ్రాండ్ ఉత్పత్తిని ఏకతాటి పైకి తీసుకురావాలనేది తమ ధ్యేయమని నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రదర్శనలో బెంగాల్ మస్లిన్, జమ్దానీ, కౌడి ఆర్ట్, కాలా కాటన్, లంబాడీ ఎంబ్రాయిడరీ ఆర్ట్ ఇతర సహజ రంగుల వస్త్రాలుంటాయి. పురుషులు, మహిళలు, పిల్లలకు వివిధ రకాల వస్త్రాలతోపాటు ప్రధానంగా చేతితో తయారు చేసిన వస్తువులుంటాయని పేర్కొన్నారు.ఇలాంటి దుస్తులను ధరించడం మనకు గర్వకారణం మాత్రమే కాదు ప్రేమకు సంబంధించిన విషయం. అలాగే కాలుష్య నివారణలో, మానవ, ఇతర వనరుల దోపిడీని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్ భాగస్వాములైన చేనేత కార్మికులు, కళాకారుల, నేత సంఘాలు, గ్రూప్స్ ఇందులో పాల్గొంటాయి. మిషన్ సమృద్ధిపథకంలో భాగంగా ఇండియా హ్యాండ్మేడ్ కలెక్టివ్, ‘S.A.L.T (సస్టైన్. యాక్ట్. లైవ్. ట్రాన్స్ఫార్మ్) స్టోరీస్లో మూడవ ఎడిన్లో దేశవ్యాప్తంగా ఉత్పత్తైన అద్భుత దుస్తులను, కళాఖండాలను వెలుగులోకి తేనున్నారు. జూన్ 17 ఉదయం 11 గంటలకు హైదరాబాద్కు చెందిన మాజీ మిసెస్ ఇండియా, శిల్పా రెడ్డి డాక్టర్ రామాంజనేయులు (సీఎస్ఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్), మీనా అప్నేందర్ (క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ),దుర్గా వెంకటస్వామి (స్థాపకుడు, బ్లూ లోటస్)తో కలిసి ఈఎగ్జిబిషన్ను ప్రారంభించనున్నారు. అలాగే నాగేంద్ర సతీష్, ప్రొఫెసర్ శారదా దేవి, డాక్టర్ షర్మిలా నాగరాజు, అనంతూలాంటి నిపుణులు ఈ దుస్తుల ఉత్పత్తి విధానం, ప్రయోజనాలు, కళాకారులు కష్టాలు జీవనోపాధి అవకాశాలపై ప్రసంగిస్తారు. ఈ ప్రదర్శనతోపాటు,జూన్ 17న హ్యాండ్ స్పిన్నింగ్ వర్క్షాప్, జూన్ 18న నేచురల్ డైయింగ్ వర్క్షాప్ ఉన్నాయి. వర్క్షాప్లో పాల్గొనేందుకు ముందుగా నమోదు చేసుకోవడం అవసరం. రిజిస్ట్రేషన్, ఇతర సందేహాల నివృత్తి కోసం 7305127412ను సంప్రదించవచ్చు. -
పొలానికో డ్రోన్: మోదీ
న్యూఢిల్లీ: పరిపాలనా వ్యవహారాల్లో సాంకేతికతను వినియోగించుకోవడంపై గతంలో చూపిన అలక్ష్యం కారణంగా పేదలు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువ ఇబ్బందులకు గురయ్యారని ప్రధాని మోదీ చెప్పారు. ‘ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం అట్టడుగు వర్గాలకు కూడా సేవలందించేందుకు డ్రోన్లు సహా అన్ని రకాల సాంకేతికతను వినియోగించుకుంటోంది. సులభతర జీవనం, సులభతర వాణిజ్యానికి ప్రాధాన్యం ఇస్తోంది. సుపరిపాలనకు కొత్త విధానాలను అమలు చేస్తోంది. రోజువారీ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని కనీస స్థాయికి తీసుకువచ్చింది’అని చెప్పారు. దేశంలోనే అతిపెద్ద డ్రోన్ ఎగ్జిబిషన్ భారత్ డ్రోన్ మహోత్సవ్–2022ను ఆయన శుక్రవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించుకుని సుపరిపాలన, సులభతర జీవనం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రభుత్వం ఆశించిన గ్రామస్వరాజ్ సాధనకు డ్రోన్లు ఉపకరిస్తాయని చెప్పారు. గత ప్రభుత్వాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సమస్యగా, పేదల వ్యతిరేక వ్యవహారంగా చిత్రీకరించాయన్నారు. ‘దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రతి భారతీయుడి చేతిలో ఒక స్మార్ట్ఫోన్, ప్రతి పొలంలో ఒక డ్రోన్, ప్రతి ఇల్లూ సౌభాగ్యంతో ఉండాలన్నదే తన కల అని ప్రధాని తెలిపారు. ప్రజల జీవితాల్లో డ్రోన్ కూడా ఒక భాగంగా మారనుందని చెప్పారు. డ్రోన్ పరిజ్ఞానం వినియోగంతో వ్యవసాయం రంగం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న డ్రోన్ సాంకేతికతను వ్యవసాయం, క్రీడలు, మీడియా, రక్షణ, ప్రకృతి వైపరీత్యాల నిర్వహణలో వినియోగించుకోవడం ద్వారా ఈ రంగంలో ఎందరికో ఉద్యోగావకాశాలున్నాయని తెలిపారు. డ్రోన్ సాంకేతికతపై అందరికీ అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో తమ ప్రభుత్వం ఎన్నో అనేక అవరోధాలను తొలగించిందని చెప్పా రు. ‘మారుమూల ప్రాంతాల్లోని వారికి డ్రోన్ల సా యంతో అత్యవసరమైన ఔషధాలు వంటి వాటిని సులభంగా చేరవేయవచ్చు. పోలీసులు కూడా వీటి సేవలను వినియోగించుకోవచ్చు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టి, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను భారత్తోపాటు ప్రపంచానికి అందించాలని పెట్టుబడిదారులను కోరుతున్నా’అని ప్రధాని పిలుపునిచ్చారు. ఉత్పాదకత అనుసంధాన పథకం(పీఎల్ఐ) వంటి విధానాల ద్వారా దేశంలో పటిష్టమైన డ్రోన్ ఉత్పత్తి విధానాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రెండు రోజులపాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ ప్రారంభం సందర్భంగా ప్రధాని మోదీ ఒక డ్రోన్ను ఆపరేట్ చేశారు. డ్రోన్ను పరీక్షిస్తున్న ప్రధాన మంత్రి మోదీ -
సూత్ర ఎగ్జిబిషన్లో మెరిసిన మోడల్స్