తెలంగాణకు అత్యంత ప్రాముఖత్య ఇస్తా | I will give maximum importance to develop te;angana, says bandaru dattatreya | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అత్యంత ప్రాముఖత్య ఇస్తా

Published Sat, Nov 8 2014 10:45 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

తెలంగాణకు అత్యంత ప్రాముఖత్య ఇస్తా - Sakshi

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తానని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ తెలిపారు. కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ  శనివారం దత్తాత్రేయకు  స్వయంగా ఫోన్ చేసి ఢిల్లీకి రావల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది. దాంతో కేబినెట్లో దత్తన్న బెర్త్ ఖారరు  కావటంతో పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ వారికి స్వీట్స్ పంచారు.

అనంతరం దత్తాత్రేయ విలేకర్లతో మాట్లాడుతూ నరేంద్ర మోదీ మంత్రివర్గంలో చేరటం ఆనందంగా ఉందన్నారు. తాను భారతదేశానికి మంత్రిని కాబట్టి దేశమంతా పర్యటన చేయాల్సి ఉంటుందన్నారు. అయితే తెలంగాణతో పాటు కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా కృషి చేస్తానని ఆయన తెలిపారు. మోదీ మార్గంలో స్వచ్ఛమైన పరిపాలన అందించటమే తన బాధ్యత అన్నారు. కాగా తన కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు దత్తాత్రేయ తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement