Cabinet expansion
-
మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదు
సాక్షి, న్యూఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని సీఎం రేవంత్రెడ్డి(Revanth Reddy) స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ(Cabinet Expansion)పై ఏఐసీసీ పెద్దలతో చర్చించినా, ప్రస్తుత ఎన్నికలు, ఇతర అంశాల దృష్ట్యా ప్రస్తుతం విస్తరణ చేయడం లేదన్నారు. ‘‘మంత్రివర్గ విస్తరణపై చర్చ లు జరుగుతున్నాయి. అయితే ఇప్పటికైతే విస్తరణ ఉండదు. ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. మరోవైపు స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీనిపై అధిష్టానం ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు విస్తరణ ఉంటుంది. ఈ విషయంలో నా ప్రమేయం ఏమీ లేదు. నేను మంత్రి పదవుల కోసం ఎవరి పేరును సిఫార్సు చేయడం లేదు.మంత్రి పదవులకు అర్హులైన వారిని ఏఐసీసీనే ఎంపిక చేస్తుంది. వారు ఎవరి పేరు సూచిస్తే వారితో ప్రమాణస్వీకారం చేయిస్తా..’’అని చెప్పా రు. శుక్రవారం ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శితో కేసీ వేణుగోపాల్లతో భేటీ అనంతరం పార్లమెంట్ ప్రాంగణంలో మీడియా ప్రతినిధులతో సీఎం రేవంత్ చిట్చాట్ చేశారు. అత్యంత శాస్త్రీయంగా కులగణన నిర్వహించామని, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఒక్కరోజులో పూర్తి చేయలేదని చెప్పారు.1.12 కోట్ల కుటుంబాల సమగ్ర వివరాలు సేకరించాకే లెక్కలు బయటపెట్టామన్నారు. ఈ సర్వేలో ఎక్కడా బీసీల శాతం తగ్గలేదని, బీసీలు ఐదున్నర శాతం పెరిగారని.. ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా బీజేపీ సభ్యులు సైతం అంగీకరించారని పేర్కొన్నారు. ఈ కులగణన లెక్కల ఆధారంగానే సంక్షేమ విధానాలకు రూపకల్పన చేస్తామన్నారు. ప్రస్తుత సర్వేతో ముస్లిం రిజ ర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందన్నారు. కేటీఆర్ అరెస్ట్పై తొందరపడం.. ఫార్ములా–ఈ రేసు కేసులో చట్టప్రకారమే నడుచుకుంటున్నామని, ఇప్పటికే నగదు బదిలీ జరిగిన కంపెనీకి నోటీసులు ఇచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. నోటీసులపై స్పందించేందుకు సదరు కంపెనీ గడువు కోరిందన్నారు. ఈ విషయంలో మాజీ మంత్రి కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న తొందరేమీ తమకు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలపై కేసుల విషయంలో ఎక్కడా రాజకీయ జోక్యం లేదని, చట్టప్రకారమే నడుచుకుంటున్నామని చెప్పారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిçస్ లోకూర్ కమిషన్ నివేదిక అందిందని, దానిని అడ్వొకేట్ జనరల్ పరిశీలనకు పంపామని వెల్లడించారు. రాహుల్గాం«దీతో దూరమేమీ లేదు.. రాష్ట్రంలో పీసీసీ కమిటీ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఒకట్రెండు రోజుల్లోనే దీనిపై ప్రకటన ఉంటుందని రేవంత్ చెప్పారు. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉంటారని, అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇక పార్టీ అగ్రనేత రాహుల్గాం«దీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని రేవంత్ చెప్పారు. ఈ పర్యటనలో తాను రాహుల్ అపాయింట్మెంట్ కూడా కోరలేదన్నారు. రాహుల్ గాంధీతో ఎప్పటికప్పుడు ఫోన్లో టచ్లో ఉన్నామంటూ.. రాహుల్ గాంధీ పెట్టిన మెసేజీలను చూపించారు. -
మంత్రి పదవి ఆశలపై నీళ్లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మంత్రి పదవుల(Ministerial post) ఆశావహులకు కాంగ్రెస్(Congress) అధిష్టానం షాకిచ్చింది. రాష్ట్ర పార్టీ పెద్దలంతా ఢిల్లీ వెళ్లారని, ఈసారి కేబినెట్ బె ర్తులు ఖరారై త్వరలోనే మంత్రులుగా ప్రమాణ స్వీ కారం చేస్తామనుకున్నవారి ఆశలపై నీళ్లు చల్లింది. కేబినెట్ విస్తరణ(Cabinet expansion) ఇప్పుడప్పుడే అవసరం లేదని తేల్చేసింది. ఎమ్మెల్యేలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అంకం ఎప్పటికో తెలియని సమయానికి వా యిదా పడింది. సీఎం రేవంత్(revanth reddy) స్వయంగా ఈ విష యం ప్రకటించడంతో మంత్రి పదవి రేసులో ఉన్న ఎమ్మెల్యేలు నిరాశలో మునిగిపోవాల్సి వచ్చింది. అదిగో ఇదిగో అంటూనే.. రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం సీఎంతోపాటు మరో 11 మంది మంత్రులు కలిపి మొత్తం 12 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం మరో ఆరుగురిని మంత్రులుగా నియమించే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ 7న సీఎం, 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచీ మిగిలిన ఆరు బెర్తులు ఖాళీగానే ఉన్నాయి. వీటిని భర్తీ చేసే అంశంపై తరచూ ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. ఆ పండుగ, ఈ పండుగ, ఆ ఎన్నికలు, ఈ ఎన్నికల తర్వాత అంటూ కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూనే వచ్చింది.సామాజిక వర్గాలు, జిల్లాల వారీగా కూర్పు కుదరడం లేదని, ఎమ్మెల్సీ ఎన్నికలతో కూడా ఈ అంశం ముడిపడి ఉన్నందున ముహూర్తం కుదరడం లేదనే చర్చ జరిగింది. అయితే ఈసారి పార్టీ అధిష్టానం తెలంగాణ పార్టీ పెద్దలను ఢిల్లీకి పిలిపించడంతో.. మంత్రివర్గ విస్తరణతోపాటు పీసీసీ కార్యవర్గం, కార్పొరేషన్ల చైర్మన్ పోస్టుల భర్తీ వంటివి కొలిక్కి వస్తాయని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఆశించారు. కార్యవర్గానికి లైన్ క్లియర్.. రాష్ట్ర నేతల ఢిల్లీ పర్యటనలో కొలిక్కి వచ్చిన ఏకైక అంశం టీపీసీసీ కార్యవర్గ కూర్పు మాత్రమే. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్కుమార్గౌడ్ బాధ్యతలు తీసుకుని నాలుగు నెలలు దాటింది. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఇప్పటికీ పార్టీ సంస్థాగత పదవులు ఖాళీగా ఉండటాన్ని అధిష్టానం సీరియస్గా తీసుకుంది. ఇటీవల కేసీ వేణుగోపాల్ హైదరాబాద్కు వచ్చినప్పుడు 15 రోజుల్లో పార్టీ పదవులను భర్తీ చేయాలని స్పష్టం చేశారు.దీనితో వేగంగా కసరత్తు చేపట్టి ఓ కొలిక్కి తేవడంతో.. టీపీసీసీ కార్యవర్గ కూర్పునకు అధిష్టానం ఆమోదం తెలిపింది. ఒకట్రెండు రోజుల్లోనే టీపీసీసీ కార్యవర్గాన్ని ఏఐసీసీ ప్రకటించే అవకాశం ఉంది. పీసీసీ కార్యవర్గంలోనూ వైస్ ప్రెసిడెంట్ పోస్టుకు చాలా డిమాండ్ ఉందని.. దీనితో 25కు చేరిందని తెలిసింది. పార్టీ కోశాధికారి, ప్రచార కమిటీ చైర్మన్ పోస్టులను కూడా ఈసారి భర్తీ చేయనున్నట్టు సమాచారం. కొన్ని జిల్లాల డీసీసీ అధ్యక్షులను కూడా మార్చే అవకాశం ఉందని సమాచారం. కార్పొరేషన్ పదవులకు ‘కోడ్’ తిప్పలు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల అంశం కూడా ఈసారి తేలిపోతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆశించాయి. చాలా మంది నేతలు ఆ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇప్పటికే వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, త్వరలోనే రానున్న స్థానిక ఎన్నికల కోడ్ కారణంగా ప్రస్తుతానికి వీటిని కూడా వాయిదా వేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రస్తుతానికి పార్టీ పదవులు.. స్థానిక ఎన్నికలు ముగిశాకే అధికారిక పదవులు దక్కనున్నాయి. నాలుగు జిల్లాలు.. నాలుగు సామాజిక వర్గాలు ప్రస్తుత కేబినెట్ కూర్పును పరిశీలిస్తే... రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల నుంచి ఏ ఒక్కరికీ మంత్రివర్గంలో చాన్స్ దక్కలేదు. దీంతో ఈ నాలుగు జిల్లాల నుంచి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవులు వస్తాయనే ఆశలో ఉన్నారు. రేసులో ప్రేమ్సాగర్రావు, జి.వివేక్, వినోద్, పి.సుదర్శన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, దానం నాగేందర్ల పేర్లు వినిపించాయి.ఇప్పటికే కేబినెట్లో స్థానమున్న జిల్లాల నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, వాకిటి శ్రీహరి, నాయిని రాజేందర్రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఈర్లపల్లి శంకర్ తదితరుల పేర్లు తెరపైకి వచ్చాయి. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ, ఆమేర్ అలీఖాన్ కూడా కేబినెట్ రేసులోకి వచ్చారు. పేర్ల మాట ఎలా ఉన్నా ఈసారి నాలుగు బెర్తులు తప్పకుండా భర్తీ అవుతాయని.. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఒక్కో ఎమ్మెల్యేకు చాన్స్ ఉంటుందనే చర్చ జరిగింది. కానీ కేబినెట్ విస్తరణ లేదని అధిష్టానం తేల్చేసింది. -
ఇప్పట్లో లేనట్టేనా?.. కేబినెట్ విస్తరణపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కుల గణన పక్కాగా చేశామని.. త్వరలో దీనిపై చట్టం కూడా తీసుకొస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. పార్లమెంటులో మీడియాతో ఆయన చిట్చాట్ నిర్వహించారు. మా సర్వేలో బీసీలు 5 శాతం పెరిగారు. సూర్యాపేట, గజ్వేల్లో సభలు నిర్వహిస్తాం. మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరుగుతున్నాయి. నేను ఎవరి పేరు సిఫారసు చేయను. అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు మంత్రులవుతారు’’ అని సీఎం రేవంత్ అన్నారు.‘‘ఏదో ఒక హోటల్లో నలుగురు కూర్చుంటే దాన్ని అసంతృప్తి అని ఎలా అంటారు?. రాహుల్ గాంధీతో నాకు ఎలాంటి గ్యాప్ లేదు ఇదంతా బీఆర్ఎస్ ప్రచారం. అన్ని విషయాలు ఎప్పటికప్పుడు మేము ఫోన్లో చర్చించుకుంటున్నాం. మేము నిర్వహించిన కుల గణనపై పార్లమెంటులోని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. ప్రచారంపై ఫోకస్ లేదు. ప్రస్తుతం మేము ఇచ్చిన హామీల అమలుపైనే దృష్టి పెట్టాం’’ అని రేవంత్ చెప్పారు.ఇదీ చదవండి: గీత దాటితే వేటే..!‘‘ఈ-ఫార్ములా రేసు స్కామ్లో ఆ కంపెనీకి నోటీసులు ఇచ్చాం. ఆ కంపెనీ స్పందించేందుకు సమయం అడిగింది. సమాధానం వచ్చిన తర్వాత తదుపరి కార్యచరణ ఉంటుంది. తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో జరిగిన అక్రమాలపై జస్టిస్ లోకూర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రస్తుతం అడ్వకేట్ జనరల్ పరిశీలనలో ఉంది. ఏజీ ఒపీనియన్ తర్వాత దానిపై ఎలా ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకుంటాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. -
కేబినెట్ విస్తరణపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ నివాసంలో టీ కాంగ్రెస్ నేతల కీలక భేటీ ముగిసింది. ఈ భేటీలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్గౌడ్ మీడియాతో మాట్లాడారు.‘త్వరలో సూర్యాపేట లేదా ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ ఉంటుంది. ఫిబ్రవరి మొదటి లేదా రెండవ వారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం.ఈ నెలాఖరు వరకు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ల చైర్మన్ల పదవులు భర్తీ చేస్తాం. ప్రభుత్వ, పార్టీ పనితీరు భేషుగ్గా ఉందని కేసీ వేణుగోపాల్ ప్రశంసించారు. కేబినెట్ విస్తరణ అంశంపై సీఎం, అధిష్టానం కలిసి నిర్ణయం తీసుకుంటారు. జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కేసీ వేణుగోపాల్ దిశా నిర్దేశం చేశారు. పీసీసీ కార్యవర్గ కూర్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది. కష్టపడి పనిచేస్తూ ప్రజల్లో ఉన్న వారికే పదవులు వస్తాయి’అని మహేష్కుమార్గౌడ్ తెలిపారు. -
ఢిల్లీకి సీఎం రేవంత్..మంత్రివర్గ విస్తరణపై ఫోకస్..!
సాక్షి,హైదరాబాద్: ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ(ఏఐసీసీ) నూతన కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం(జనవరి14) సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, మంత్రులు, పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ వెళ్లారు. బుధవారం ఏఐసీసీ కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం,పీసీసీ అధ్యక్షుడు ఏఐసీసీ నేతలను రేవంత్రెడ్డి కలిసే అవకాశముంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న మంత్రివర్గ విస్తరణపై రేవంత్రెడ్డి అధిష్టానంతో చర్చించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.కాగా,ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ అధికారులు 16న ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్తారు. ఈనెల 19 వరకు సింగపూర్లో పర్యటించనున్న వీరు తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యంపై ఒప్పందాలు చేసుకుంటారు. వీటితో పాటు కొత్త పెట్టుబడులపై సీఎం బృందం సింగపూర్లో పారిశ్రామిక వేత్తలతో చర్చించనుంది. సింగపూర్ పర్యటన తర్వాత ఈనెల 20 నుంచి 22 వరకు రేవంత్రెడ్డి స్విట్జర్లాండ్లోని దావోస్లో పర్యటించనున్నారు.గతేడాది కొత్తగా సీఎం అయిన తర్వాత రేవంత్రెడ్డి తొలిసారిగా దావోస్లో పర్యటించిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లినప్పుడల్లా మంతత్రివర్గ విస్తరణపై చర్చ జరగడం సాధారణమైపోయింది. అయితే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంతత్రి వర్గ విస్తరణ జరగలేదు. మంత్రి వర్గ విస్తరణ కోసం ఇటు కాంగగ్రెస్ పార్టీ తరపున గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు, అటు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరు ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. -
‘మీరు చెప్పిందల్లా చేయడానికి కీలు బొమ్మను కాను!’
ముంబై: ఎన్సీపీ అధినేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్కు భారీ షాక్ తగిలింది. మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత ఛగన్ భుజ్బల్.. బహిరంగంగా అసంతృప్తి వెల్లగక్కారు. ఇప్పుడు ఈ అంశం మహా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.ఛగన్(77) ఓబీసీ సామాజిక వర్గపు బలమైన నేత. మొన్నటి ఎన్నికల్లో యోలా నుంచి ఘన విజయం సాధించారాయన. ఇక మహాయుతి కూటమిలో ఎన్సీపీ-అజిత్ వర్గం తరఫున ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చనే ఖాయమని చర్చ నడిచింది. అయితే అలా జరగలేదు. పైగా రాజ్యసభకు పంపిస్తాం.. రాజీనామా చేయండి అంటూ ఓ ప్రతిపాదన చేశారు. దీంతో అవమాన భారంతో రగిలిపోతున్నారాయన.నాసిక్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను మంత్రివర్గంలో ఉండాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా కోరుకున్నారు. కానీ, కొందరి వల్ల అది జరగలేదు. మంత్రి పదవి దక్కకపోవడం కంటే.. నాకు ఎదురైన అవమానమే నన్ను ఎక్కువగా బాధిస్తోంది’’ అని ఆవేదనపూరితంగా మాట్లాడారాయన.ఈ క్రమంలో పార్టీలో ఇంతకు ముందు ఎదురైన చేదు అనుభవాలను ఆయన ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల్లో నాసిక్ నుంచి నేను పోటీ చేయాలని మోదీ, అమిత్ షా పట్టుబట్టారు. అందుకు నెలపాటు ప్రిపేర్ అయ్యాను. తీరా ఎన్నికలొచ్చేసరికి.. నాకు సీటు ఇవ్వలేదు. రాజ్యసభ సీటు ఇవ్వమని కోరాను. కానీ, సునేత్రా.. నితిన్ పాటిల్ పేర్లు పరిశీలనలో ఉన్నాయని చెప్పారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నా అనుభవం రాజ్యసభలో పనికి వస్తుందని చెబితే.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు. తీరా అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచాక ఇప్పుడు రాజ్యసభ సీటు ఇస్తామంటున్నారు. అందుకోసం నితిన్ పాటిల్ను రాజీనామా చేయిస్తారట... నేనేం వాళ్ల చేతుల్లో కీలు బొమ్మను అనుకుంటున్నారా?. వాళ్లు నిల్చోమంటే నిల్చుని.. కూర్చోమంటే కూర్చోని.. రాజీనామా చేయమంటే రాజీనామా చేస్తే నా నియోజకవర్గ కార్యకర్తలు నా గురించి ఏమనుకుంటారు?’’ అని మండిపడ్డారాయన. అయితే ఈ క్రమంలో ఎక్కడా ఆయన అజిత్ పవార్ పేరును ప్రస్తావించకపోవడం గమనార్హం.బుధవారం తన నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలతో చర్చించిన తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారాయన. అయితే రెండు, మూడేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన తర్వాతే రాజ్యసభ సభ్యత్వం గురించి ఆలోచిస్తానని ఆయన చివర్లో చెప్పడం కొసమెరుపు. రాజకీయాల్లోకి రాకముందు ఛగన్ భుజ్బల్.. మార్కెట్లో కూరగాయలు, పండ్లు అమ్ముకునే చిరువ్యాపారి. శివసేన ఆవిర్భావం తర్వాత ఆ పార్టీకి, బాల్ థాక్రే సిద్ధాంతాలకు ఆకర్షితుడై అందులో చేరాడు. కార్పొరేటర్ స్థాయి నుంచి మేయర్ స్థాయికి ఎదిగారు. ఆపై శివసేన తరఫున ఎమ్మెల్యేగానూ రెండుసార్లు నెగ్గారు. కాంగ్రెస్ వేటు వేయడంతో శరద్ పవార్ ఎన్సీపీని స్థాపించగా.. భుజ్బల్ అందులో చేరారు. గతంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా, పలు శాఖలకు మంత్రిగానూ ఆయన పని చేశారు. -
‘మహా’ కేబినెట్ విస్తరణ.. షిండేకు బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బీజేపీ!
ఢిల్లీ: మహారాష్ట్ర కేబినెట్ విస్తరణపై మరో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. మహాయుతి కూటమి ప్రభుత్వంలో శివసేనకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శివసేన ఆశిస్తున్నట్టు హోంశాఖ వారికి దక్కే చాన్స్ లేనట్టు కీలక నేత ఒకరు చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వశాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు.మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వంలో మంత్రి విస్తరణ కోసం ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ బుధవారం ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా కేబినెట్ విస్తరణపై అమిత్ షా, నడ్డాతో ఫడ్నవీస్ నిన్న అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. ఈ క్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు బీజేపీకి చెందిన కీలక నేత ఒకరు చెప్పారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రలో మంత్రి వర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. డిసెంబర్ 14 నాటికి విస్తరణ జరగనుంది. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీఎం పదవితో సహా 21 నుండి 22 మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్లో నాలుగు నుండి ఐదు మంత్రి పదవులు ఖాళీగా ఉంచవచ్చని ఆయన చెప్పారు.ఇదే సమయంలో సదరు కీలక నేత మరో బాంబు పేల్చారు. మహాయుతి కూటమిలో భాగస్వామ్య పక్షమైన శివసేనకు వారు కోరుకున్నట్లు హోం శాఖ దక్కే అవకాశం లేదన్నారు. అలాగే, మరో కీలకమైన ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా శివసేనకు ఇచ్చే ఛాన్స్ లేదని చెప్పుకొచ్చారు. ఇక, చివరకు శివసేనకు అర్బన్ డెవలప్మెంట్ శాఖ కేటాయించవచ్చని ఆయన తెలిపారు. దీంతో, శివసేన నేతల్లో టెన్షన్ నెలకొన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ మహాయుతి కూటమిలో ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.#MaharashtraGovtFormation | Maharashtra Chief Minister Devendra Fadnavis met Home Minister Amit Shah, Deputy Chief Minister Eknath Shinde skips meeting as per sources; talks likely on portfolio allocation pic.twitter.com/g9aM3hXP2x— NDTV (@ndtv) December 12, 2024ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫలితాలు వెలువడిన తర్వాత దాదాపు 10 రోజుల అనంతరం వివిధ నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే సమయంలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణం చేశారు. -
ఏపీ కేబినెట్ విస్తరణపై ఉత్కంఠ
-
హోం మంత్రి పదవి ఇవ్వాలని..!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: దసరాకు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఖాయమని ఆయన అనుచరులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలోనూ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందన్న చర్చ బయటకు రావడంతో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి వస్తుందన్న ప్రచారం జోరుగా సాగింది. అప్పుడు విస్తరణ జరగలేదు. ఇటీవల సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఢిల్లీ వెళ్లిన సందర్భంలోనూ మంత్రివర్గ విస్తరణపైనే అధిష్టానంతో చర్చించారని వార్తలు వచ్చాయి. అప్పటికప్పుడు నిర్ణయం వెలువడకపోయినా దసరాకు ముందు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాల్లో ఊగాహానాలు జోరందుకున్నాయి. దీంతో మంత్రి వర్గంలో రాజగోపాల్రెడ్డికి బెర్త్ ఖాయమనే చర్చ మళ్లీ మొదలైంది.ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి..మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మంత్రి పదవి వస్తుందని భావిస్తూ వస్తున్నారు. కానీ, మొదట్లో ఉమ్మడి జిల్లా నుంచి తన సోదరుడైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి, ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి పదవులు వచ్చాయి. ఆ తర్వాత మంత్రి వర్గ విస్తరణలో రాజగోపాల్రెడ్డికి తప్పకుండా అవకాశం దక్కుతుందని జోరుగా చర్చ సాగింది. అయితే పది నెలలు అవుతున్నా మంత్రివర్గ విస్తరణ జరగనే లేదు. మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిన ప్రతిసారి రాజగోపాల్రెడ్డి పేరు ప్రస్తావనకు వస్తోంది.ఎంపీ ఎన్నికల సందర్భంలో అధిష్టానం హామీపార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఢిల్లీ, రాష్ట్ర అధిష్టానం తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా రాజగోపాల్రెడ్డి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. రాహుల్గాంధీ ప్రధాని కావాలంటే రాష్ట్రం నుంచి ఎక్కువ మంది ఎంపీలను గెలిపించాలని అధిష్టానం, రాష్ట్ర పార్టీ నేతలు, ముఖ్యమంత్రి కలిసి నిర్ణయించారు. అభ్యర్థుల ఎంపికతోపాటు వారి గెలుపు బాధ్యతలను జిల్లాల్లోని ముఖ్య నేతలకు అప్పగించారు. అందులో భాగంగా భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని గెలిపించే బాధ్యతను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి సీఎం రేవంత్రెడ్డి అప్పగించారు. ఆ సమయంలో ఎంపీని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్లుగా చర్చ జరిగింది. మొత్తానికి భువనగిరి ఎంపీగా చామల కిరణ్కుమార్రెడ్డిని దగ్గరుండీ గెలిపించారు. అప్పటి నుంచి మంత్రి పదవి కచ్చితంగా వస్తుందని రాజగోపాల్రెడ్డి భావించినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ మాత్రం జరగలేదు. అయితే, దసరాకు మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఈ నేపధ్యంలో అధిష్టానం హామీ మేరకు రాజగోపాల్రెడ్డికి బెర్త్ దక్కుతుందా అన్న చర్చ మళ్లీ జోరందుకుంది.హోం మంత్రి పదవి ఇవ్వాలని..!ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు ప్రతిపక్ష, అటు అధికార పక్షాల మధ్య పోటాపోటీగా అసెంబ్లీలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ వేదికలతోపాటు రాజకీయ వేదికల్లోనూ పెద్ద ఎత్తున అధికార, ప్రతిపక్షాలు పోటా పోటీగా విమర్శలు చేసుకున్నాయి. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అధికార పక్షం, పాలన చేత కాక గత ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తుందని ప్రతిపక్షం విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తనకు హోంమంత్రి పదవి ఇవ్వాలని, తాను హోంమంత్రి అయితేనే కేసీఆర్ను సమర్థంగా ఎదుర్కొంటానని రాజగోపాల్రెడ్డి పలు సమావేశాల్లోనూ చెప్పుకొచ్చారు.ఎస్టీ కోటాలో బాలునాయక్కు!ఎస్టీ లంబాడా కోటాలో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్కు మంత్రి పదవి వస్తుందని చర్చ సాగుతోంది. రాష్ట్రంలో ఆదివాసీ గిరిజన కోటాలో సీతక్కకు అధిష్టానం అవకాశం కల్పించింది. లంబాడా కోటాలో మరొక మంత్రి పదవి ఇస్తారన్న చర్చ సాగుతోంది. -
ఆషాఢం తర్వాతే..! కేబినెట్ విస్తరణ, పీసీసీ, నామినేటెడ్ పదవుల భర్తీ
సాక్షి, న్యూఢిల్లీ: సమీకరణలు కుదరలేదు. జిల్లాలు, సామాజిక వర్గాల ప్రాతిపదికపై ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. దీంతో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం, నామినేటెడ్ పదవుల భర్తీ ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం తాత్కాలికంగా నీళ్లు చల్లింది. ఆయా అంశాలపై మరో వారం, పదిరోజుల తర్వాత తీరిగ్గా చర్చిద్దామంది. అప్పటివరకు వేచి చూడాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సూచించింది. వాస్తవానికి జూలై మొదటి వారంలోనే కీలక పదవుల భర్తీ జరుగుతుందని సీఎం స్వయంగా ప్రకటించారు. ఆ మేరకు ముమ్మర కసరత్తు జరిగినా చివరకు అన్నీ వాయిదా పడ్డాయి. కేబినెట్ విస్తరణ సహా పదవుల పంపకాలన్నీ ఆషాఢ మాసం పూర్తయ్యాక ఆగస్టులోనే ఉండే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలంటున్నాయి. తాజా భేటీలోనూ తేలని సమీకరణలు రాష్ట్ర కేబినెట్లో ఖాళీలు పూరించడం, కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, నామినేటెడ్ పదవుల భర్తీపై గడిచిన వారం, పది రోజులుగా ముమ్మర కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. సీఎం రేవంత్రెడ్డి వారం కిందట కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో ఈ అంశాలపై చర్చలు జరిపారు. అధిష్టానం సైతం ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డిల అభిప్రాయాన్ని తీసుకుంది. తాజాగా బుధవారం కూడా ఈ అంశాలపై చర్చించేందుకు ఢిల్లీ వచ్చిన రేవంత్రెడ్డి మరోమారు ఖర్గే, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాం«దీ, కేసీలతో భేటీ అయ్యారు. సుమారు గంట పాటు చర్చలు కొనసాగాయి. మంత్రివర్గంలోకి తీసుకునేందుకు పరిగణనలోకి తీసుకుంటున్నవారి పేర్లను మరోమారు పరిశీలించారు. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నుంచి వాకిటి శ్రీహరి, నిజామాబాద్ జిల్లా నుంచి పి.సుదర్శన్రెడ్డి, నల్లగొండ జిల్లా నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, బాలూనాయక్, రంగారెడ్డి జిల్లా నుంచి మల్రెడ్డి రంగారెడ్డి, టి.రామ్మోహన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేంసాగర్రావు, వివేక్ల పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ఇందులో వాకిటి శ్రీహరి పేరుపై ఏకాభిప్రాయం ఉన్నప్పటికీ మిగతా పేర్ల విషయంలో పీఠముడి నెలకొంది. ఇలాగైతే ఏం చేయాలి..? నిజామాబాద్ జిల్లా నుంచి పీసీసీ అధ్యక్ష రేసులో మహేశ్కుమార్ గౌడ్, గతంలో నిజామాబాద్ నుంచి ఎంపీగా ఉన్న మధుయాష్కీ గౌడ్లు ఉన్న దృష్ట్యా, ఒకవేళ వీరిలో ఒకరికి ఆ పదవి కట్టబెడితే, అదే జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న సుదర్శన్రెడ్డిని ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత నెలకొంది. దీనిపై నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఇక నల్లగొండ జిల్లాలో రాజగోపాల్రెడ్డికి మంత్రి పదవి ఇస్తే, ఇదే జిల్లా నుంచి ఇప్పటికే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డిలతో కలిపి మొత్తం ముగ్గురు రెడ్లు మంత్రులవుతారు. ఒకవేళ ఆ అంశాన్ని పక్కన పెట్టినా, జిల్లా నుంచి ఎస్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలూనాయక్కు మంత్రి పదవి ఇవ్వడం కష్టంగా మారుతుంది. ఇక ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇద్దరు సీనియర్ నేతలు జి.వివేక్, ప్రేంసాగర్ రావుల విషయంలోనూ సందిగ్ధత నెలకొంది. భట్టి సహా ఇతర నేతలు మద్దతిస్తున్న వెలమ సామాజిక వర్గానికి చెందిన ప్రేంసాగర్ను కేబినెట్లోకి తీసుకుంటే ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రుల సంఖ్య పెరుగుతుంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ నుంచి మల్రెడ్డి, రామ్మోహన్రెడ్డి రేసులో ఉండగా, ఇక్కడ ఒక మైనార్టీకి అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా గట్టిగా ఉంది. దీంతో వీరి విషయంలోనూ నిర్ణయానికి రాలేకపోయారు. ఇలా పలు పేర్ల విషయంలో పలు సమీకరణాలు ముడిపడి ఉండటంతో నేతలు ఒక నిశి్చతాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ దృష్ట్యానే కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాలని, వారం, పదిరోజుల తర్వాత దీనిపై చర్చిద్దామని హైకమాండ్ పెద్దలు ముఖ్యమంత్రికి చెప్పినట్లుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పీసీసీ సైతం వాయిదానే.. బుధవారం నాటి భేటీలో పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై కూడా చర్చించినా, దీన్ని సైతం అధిష్టానం పెద్దలు తేల్చలేకపోయారు. అధ్యక్ష పదవిని బీసీ సామాజిక వరాŠిగ్నకి చెందిన సీనియర్ నేతలు మహేశ్, మధుయాష్కీలలో ఒకరికి కట్టబెట్టాలనే ఆలోచన చేసిప్పటికీ సమీకరణలు కుదరని దృష్ట్యా, ఎస్సీ సామాజిక వర్గం నుంచి అడ్లూరి లక్ష్మణ్కుమార్, సంపత్కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ల పేర్లు కూడా మరోమారు చర్చకు వచ్చినట్లు తెలిసింది. దీంతో జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలు, మంత్రివర్గ విస్తరణ తేలిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం భావించినట్లు తెలిసింది. ఇక కేబినెట్ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి నియామకం పూర్తయ్యాకే ఇతర పదవుల భరీŠత్ అంశంపై హైకమాండ్ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్ గూటికి కేకే – పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మల్లికార్జున ఖర్గే – కేకే అనుభవం కాంగ్రెస్ను బలోపేతం చేస్తుందని వ్యాఖ్య సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బుధవారం కేకేకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లోక్సభా పక్ష నేత రాహుల్గాందీ, రా్ర‹Ù్టర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేకే రాకను స్వాగతించిన ఖర్గే, రాహుల్.. రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు పని చేయాలని సూచించారు. కాంగ్రెస్లో చేరికతో తిరిగి సొంత ఇంటికి వచ్చినట్లుగా ఉందని కేకే వ్యాఖ్యానించారు. ఈ భేటీ అనంతరం కేకే రాకను స్వాగతిస్తూ ఖర్గే ఎక్స్లో పోస్ట్ చేశారు. కేకే అనుభవం పార్టీని బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. -
టీపీసీసీ చీఫ్.. కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్షుడి నియామక కసరత్తు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. గత 20 రోజులుగా అధిష్టానం పరిశీలనలో ఉన్న కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం పలుమార్లు చర్చల అనంతరం తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటు న్నాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్ కుమార్గౌడ్, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు అధిష్టానం తుది పరిశీలనలో ఉన్నట్లు గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కుమార్, బలరాం నాయక్ల పేర్లను కూడా అధిష్టానం పరిశీలిస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎస్సీ కోటాలో తమ జిల్లాకు చెందిన అడ్లూరి లక్ష్మణ్కు అవకాశం ఇవ్వాలని మంత్రి డి.శ్రీధర్బాబు, సీనియర్ నేత జీవన్రెడ్డి అధిష్టానాన్ని కోరినట్లు తెలుస్తోంది. అన్ని ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వారిలో ఒకరిని ఈ నెల ఆరో తేదీలోగా పీసీసీ చీఫ్గా ప్రకటిస్తారని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. దీనిపై తుది నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలతో మరోమారు అధిష్టానం చర్చించనుంది. ఇందుకోసం సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. వారితో చర్చించాక టీపీసీసీ అధ్యక్షుడి ఎంపికపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోనుంది. అయితే మహేశ్కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గుచూపే అవకాశం ఉందని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి.మంత్రివర్గం రేసులో బాలూనాయక్, టి. రామ్మోహన్రెడ్డిమంత్రివర్గ విస్తరణలో నల్లగొండ జిల్లాకు చెందిన లంబాడా సామాజికవర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఎన్. బాలూనాయక్కు అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. గిరిజన వర్గాల నుంచి ఆదివాసీలకు ఇప్పటికే కేబినెట్లో స్థానం కల్పించినందున లంబాడా సామాజికవర్గానికి కూడా అనివార్యంగా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ కోటాలో బాలూనాయక్ పేరు కూడా ఉందని తెలుస్తోంది. బాలూనాయక్కు మంత్రి పదవి లభిస్తే డిప్యూటీ స్పీకర్గా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే అదే జిల్లాకు చెందిన పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఢిల్లీలోనే ఉండి ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో ఎవరిని ఏ పదవికి ఎంపిక చేయాలనే విషయంపైనా బుధవారం నాటి చర్చల్లో స్పష్టత రానుంది.పీసీసీ చీఫ్గా నా పేరు పరిశీలించండిఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిసి కోరిన మహేశ్కుమార్గౌడ్సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్గా తన పేరును పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఖర్గేను ఆయన కలిశారు. పీసీసీ చీఫ్ పదవి ఆశిస్తున్న నేతలు అధిష్టానం పెద్దలను కలుస్తూ తమ పేర్లను పరిశీలించాలని కోరుతున్నారు. అందులో భాగంగానే మహేశ్కుమార్గౌడ్ ఖర్గేను కలిసి తన పేరును పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. ఆయన ఇటీవల కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతోపాటు జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కూడా కలవడం తెలిసిందే. -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఆ జిల్లా నుంచి ముగ్గురికి కీలక పదవులు!
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల నాలుగో తేదీన మరి కొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం.మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోసారి పిలుపు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు.కాగా, అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళవారం లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇదిలా ఉండగా.. మంత్రి వర్గంలోకి మరో ఆరుగురికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇద్దరు బీసీ, ఒక మైనార్టీ, ఇద్దరు ఓసీ, ఒక ఎస్టీకి కేబినెట్లో ఛాన్స్ దక్కనున్నట్టు సమాచారం. మరోవైపు.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలకు కీలక పదవులు ఇస్తారనే టాక్ నడుస్తోంది. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వనున్నట్టు సమాచారం.అలాగే, మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ పదవి రేసులో ముందు వరుసలో ఉన్నారు. ఇక, ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్కు వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ పదవి ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను పటిష్టం చేసేందుకే పదవులు ఇస్తున్నారనే చర్చ నడుస్తోంది. -
ఎల్లుండే తెలంగాణ కేబినెట్ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. జూలై మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్రెడ్డి తన ఢిల్లీ పర్యటనలో చెప్పిన నేపథ్యంలో.. ఈ నెల 4న మరికొంత మందిని మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశముందని సమాచారం. ఈ మేరకు పార్టీ అధిష్టానం కూడా గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని గాందీభవన్ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సోమవారం రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో భేటీ కావడాన్ని కూడా ప్రస్తావిస్తున్నాయి. కేబినెట్ విస్తరణ గురించి గవర్నర్కు రేవంత్ చెప్పారని, 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరారని తెలుస్తోంది. రాధాకృష్ణన్ జార్ఖండ్ గవర్నర్గా, పుదుచ్చేరి ఇన్చార్జి లెఫ్టినెంట్ గవర్నర్గా సైతం వ్యవహరిస్తుండడంతో ఈ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. మంత్రివర్గ కూర్పు గురించి రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలు కొనసాగుతుండగా, కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలకు మరోమారు పిలుపు వచ్చింది. సీఎం రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డిలు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం ఇచ్చిన సమయాన్ని బట్టి మంగళ లేదా బుధవారం వారు హస్తిన చేరుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన తుది జాబితాకు ఆమోదముద్ర వేస్తారని, తుది దఫా చర్చల్లో భాగంగా ఇప్పటివరకు స్పష్టత రాని ఒకట్రెండు బెర్తుల విషయంలో నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పి.సుదర్శన్రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారయ్యాయని, ప్రేంసాగర్రావు, వివేక్లలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఈ దఫా నాలుగు బెర్తులు భర్తీ చేస్తారని, ముస్లిం మైనారీ్టల కోసం ఒక బెర్తు, ఎస్టీల కోసం మరో బెర్తును ఖాళీగా ఉంచవచ్చని తెలుస్తోంది. ఢిల్లీలో చర్చల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత రానుంది. నాలుగో వారంలో బడ్జెట్ భేటీ! సీఎం రేవంత్రెడ్డి సోమ వారం మధ్యాహ్నం రాజ్భవన్కు వెళ్లారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో దాదాపుగా రెండు గంటల పాటు భేటీ అయ్యారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేశారు. కాగా సీఎం పలు అంశాలను గవర్నర్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్టు తెలిసింది. ఈ నెల 22న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన పక్షంలో 23, 24 తేదీల్లో..ఒకవేళ 23న కేంద్రం బడ్జెట్ పెట్టినట్లైతే 24 లేదా 25 తేదీల్లో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టవచ్చని, ఇందుకు అనుగుణంగా అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ అవుతుందని సమాచారం. -
తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మంత్రి దామోదర రాజనర్సింహ కీలక వ్యాఖ్యలు చేశారు త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందన్న దామోదర.. శాఖల మార్పులు, చేర్పులు తప్పక ఉంటాయన్నారు. ఈ కేబినెట్ విస్తరణలో సీతక్కకు హోంమంత్రి పదవి దక్కే చాన్స్ ఉందంటూ వ్యాఖ్యానించారు. ఇక దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉందన్నారు. నిజామాబాద్ నుంచి ఒకరికి మంత్రి దక్కే చాన్స్ ఉందన్నారు. -
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఖరారైన ముహూర్తం
-
వారంలో విస్తరణ! ఢిల్లీలో ముమ్మర కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఢిల్లీలో ముమ్మర కసరత్తు జరుగుతోంది. కేబినెట్లో ఖాళీగా ఉన్న ఆరు స్థానాలను భర్తీ చేయడంపై నేతలు దృష్టి సారించారు. గడిచిన మూడు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి ఈ అంశంతో పాటు, పీసీసీ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం పెద్దలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. బుధవారం కూడా ఏఐసీసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీలతో జరిపిన భేటీల్లో మంత్రివర్గ విస్తరణకు గ్రీన్సిగ్నల్ లభించడంతో పాటు, కొన్ని పేర్లపై సానుకూలత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఆయా పేర్లపై రాష్ట్ర సీనియర్ మంత్రుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నట్లు తెలిసింది. అన్నీ కుదిరితే వారంలోనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మూడు కోణాల్లో పరిశీలన: రాష్ట్ర కేబినెట్లో ప్రస్తుతం 12 మంది మంత్రులు ఉండగా, మరో 6 స్థానాలు భర్తీ చేసేందుకు అవకాశం ఉంది. ఈ ఆరు స్థానాలకు ప్రస్తుతం 10 నుంచి 12 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోటీ పడుతున్నట్లు సమాచారం. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, పి.సుదర్శన్రెడ్డి, టి.రామ్మోహన్రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి లాంటి వారు రేసులో ఉన్నారు. అయితే ఇప్పటివరకు అసలు ప్రాతినిధ్యం లేని జిల్లాల్లో నిజామాబాద్ నుంచి సుదర్శన్రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తున్నా, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచి్చన సీనియర్ నేత పోచారం శ్రీనివాస్రెడ్డి పేరు సైతం తాజాగా తెరపైకి వచి్చనట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు రైతు కమిషన్ చైర్మన్ పోస్టు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సీఎంతో రాష్ట్ర నేతల సమావేశాలు సుదర్శన్రెడ్డికి సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్, భట్టి విక్రమార్కలు మద్దతిస్తున్నట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లాకు చెందిన మల్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలు ఇద్దరూ గడిచిన మూడ్రోజులుగా ఢిల్లీలోనే ఉండి బలంగా లాబీయింగ్ చేస్తున్నారు. బుధవారం ఈ ఇద్దరు సీఎం రేవంత్తో భేటీ అయ్యారు. బీసీ సామాజిక వర్గం నుంచి మహేశ్గౌడ్, వాకాటి శ్రీహరి పేర్లు పరిశీలనలో ఉండగా, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి మంత్రి పదవి దాదాపు ఖరారైందని అంటున్నారు. వీరిద్దరు కూడా మూడ్రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. శ్రీహరి సైతం బుధవారం ముఖ్యమంత్రిని కలిసి తన పేరు పరిశీలనకు విన్నవించినట్లు తెలిసింది. వెలమ సామాజిక వర్గం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, మదన్మోహన్తో పాటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ల మధ్య పోటీ నెలకొన్నట్లు సమాచారం. అయితే ఈ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే జూపల్లి కృష్ణారావు ఉన్నందున మరొకరికి అవకాశం ఇస్తారా? లేదా? అన్న దానిపై చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. ప్రేమ్సాగర్రావుకు అవకాశం ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించినట్లు తెలిసింది. ఇక ఎస్సీ కోటాలో జి.వివేక్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ప్రాతినిథ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాలతో పాటు ఇటీవలి పార్లమెంట్ ఎన్నికల్లో వారి పనితీరు ఆధారంగా మంత్రి పదవులు భర్తీ చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. నేతలు బిజీబిజీ మంత్రివర్గ విస్తరణపై రెండ్రోజుల కిందటే మల్లికార్జున ఖర్గే, రాహుల్గాం«దీ, కేసీ వేణుగోపాల్తో చర్చలు జరిపిన సీఎం రేవంత్రెడ్డి బుధవారం మరోమారు వారితో సమావేశమయ్యారు. విస్తరణ విషయంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. మరోపక్క పదవుల పంపకంపై చర్చించేందుకు ఢిల్లీకి వచి్చన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్కుమార్ రెడ్డి, శ్రీధర్బాబులు ముందు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీప్దాస్ మున్షీతో భేటీ అయ్యారు. కాగా కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, జూలై 1 లేదా 2న విస్తరణ జరగవచ్చని తెలిసింది. పీసీసీ రేసులో ముగ్గురు పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా మూడు పేర్లపై హైకమాండ్ పెద్దల వద్ద చర్చలు జరిగినట్లు తెలిసింది. ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్ ఈ పదవికి పోటీ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పీసీసీ పదవిని ఎస్టీకి ఇవ్వనందున బలరాం పేరును ముఖ్యమంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే ఆయన పేరును కొందరు వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. దీంతో మహేశ్గౌడ్కు రేవంత్, ఇతర సీనియర్లు మద్దతు పలికినట్లు తెలుస్తోంది. మహేశ్గౌడ్ కూడా హైకమాండ్ పెద్దలతో తనకున్న పరిచయాలను ఆధారంగా చేసుకుని లాబీయింగ్ చేస్తున్నారు. -
హస్తినలో సీఎం రేవంత్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్రెడ్డి హస్తినకు చేరుకున్నారు. రెండురోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వచ్చిన రేవంత్రెడ్డి శనివారం జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటారు. కోడ్ ముగిసినందున కేబినెట్ విస్తరణతోపాటు నామినేటెడ్ పదవుల కేటాయింపునకు సంబంధించిన అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చించే అవకాశాలున్నాయని పార్టీవర్గాలు తెలిపాయి.ఇటీవలి లోక్సభ ఫలితాల్లో ఇండియా కూటమి మెరుగైన ప్రదర్శన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీని కలిసి అభినందించనున్నారు. 2019లో తెలంగాణలో కేవలం మూడు లోక్సభ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ , తాజా ఎన్నికల్లో ఎనిమిది స్థానాలు గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని తాజా పరిస్థితి గురించి రాహుల్ సహా పార్టీ పెద్దలకు రేవంత్రెడ్డి వివరించే అవకాశాలున్నాయి. రేవంత్ ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవితో పాటు పీసీసీ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.దీంతో రాబోయే రోజుల్లో క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పూర్తిస్థాయి నూతన పీసీసీ అధ్యక్షుడిని నియమించే అంశంపైనా హైకమాండ్తో చర్చించే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా శనివారం ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎం రేవంత్రెడ్డితోపాటు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, సీడబ్ల్యూసీ సభ్యురాలు దీపాదాస్ మున్షీ, శాశ్వత ఆహ్వానితుడు, రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రత్యేక ఆహ్వానితుడు, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డిలు హాజరు కానున్నారు.ప్రజలకు సీఎం మృగశిర కార్తె శుభాకాంక్షలు సాక్షి, హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా...రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తొలకరి జల్లుల పలకరింపుతో పుడమి పులకరించిందని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు వృద్ధి చెందాలని, అన్నదాతల ఇంట సిరులు పండాలని కోరుకుంటున్నట్లు శుక్రవారం ఓ ప్రకటనలో ఆకాంక్షించారు. -
‘లోకల్’ రూట్లో కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో మార్పుచేర్పులకు రంగం సిద్ధమవుతోంది. కీలక ఎన్నికలన్నీ ముగియడం, కేబినెట్లో బెర్తులు ఖాళీ ఉండటం నేపథ్యంలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టవచ్చని తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా.. అన్ని జిల్లాలు, సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం దక్కేలా కేబినెట్లో మార్పులు చేర్పులు ఉంటాయని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు నాటికి విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిసింది. ప్రస్తుతం సీఎం రేవంత్ సహా 12 మంది మంత్రులు ఉన్నారు.మరో ఆరుగురిని కేబినెట్లోకి తీసుకునేందుకు వీలుంది. ఈ మేరకు కేబినెట్ కూర్పుపై సీఎం రేవంత్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతమున్న మంత్రుల్లో ఒకరిద్దరిని తొలగించవచ్చనే చర్చ జరుగుతోంది. దీనికితోడు ప్రస్తుతం సీఎం వద్ద ఉన్న పలు కీలక శాఖలను పంపిణీ చేసే క్రమంలో.. కొందరు మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే చర్చ జరుగుతోంది. సీడబ్ల్యూసీ సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారమే ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చించే అవకాశం ఉంది. పాలన, పట్టు.. రెండింటిపై ఫోకస్తో.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యాక 12 మంది మంత్రులతోనే పరిపాలన కొనసాగుతోంది. కొన్ని కీలక శాఖలు ఇంకా సీఎం రేవంత్ వద్దనే ఉన్నాయి. గత ఐదు నెలల్లో మూడు నెలల పాటే పాలన సజావుగా సాగింది. రెండు నెలలకుపైగా ఎన్నికల కోడ్తోనే గడిచిపోయింది. పాలన విషయంలో పలు రకాల సమస్యలు అటు సీఎం, ఇటు కేబినెట్ దృష్టికి వచ్చాయి. ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణతో త్వరలో పూర్తిస్థాయి పరిపాలన మొద లుపెట్టాలనే యోచనలో సీఎం రేవంత్ ఉన్నారని తెలిసింది. ప్రస్తుతం కీలక ఎన్నికలన్నీ ముగిశాయి.లోక్సభతోపాటు పలు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ స్థానిక సంస్థలకు, తర్వాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంది. కొన్ని ఉమ్మడి జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ ‘స్థానిక’ ఎన్నికల సందర్భంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. పలు సామాజిక వర్గాలకు కేబినెట్లో స్థానం లేకపోవడం కూడా ‘స్థానిక’ ఎన్నికల్లో ప్రభావం చూపవచ్చని నేతలు అంటున్నారు. కేబినెట్ విస్తరణతో ఈ ఇబ్బందులు తీరుతాయని పేర్కొంటున్నారు. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తి! లోక్సభ ఎన్నికల సందర్భంగా కొందరు మంత్రుల పనితీరుపై అధిష్టానం అసంతృప్తితో ఉందన్న చర్చ జరుగుతోంది. కొందరు మంత్రులు ఇన్చార్జులుగా ఉన్న నియోజకవర్గాల్లో సరిగా పనిచేయకపోవడం, చాలా మంది మంత్రుల నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల్లో తక్కువ ఓట్లు రావడం వంటి అంశాలు నివేదికల రూపంలో అధిష్టానానికి చేరినట్టు తెలిసింది. సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో స్వల్పంగా ఓట్లు తక్కువగా వచ్చినప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తీరు, రిజర్వేషన్ల అంశాన్ని లేవనెత్తడంపై అధిష్టానం మన్ననలు పొందినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అధిష్టానంతో చర్చించనున్న సీఎం! కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో పాల్గొనేందుకు సీఎం రేవంత్ శుక్రవారం సాయంత్రమే ఢిల్లీ వెళ్లారు. శనివారం రాత్రి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలకు విందు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పార్టీ అధిష్టానంతో మంత్రివర్గ విస్తరణపై కీలక చర్చలు జరిపే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. కేంద్ర రాజకీయాల హడావుడి ముగిసిన తర్వాత ఆగస్టు నాటికి కేబినెట్ విస్తరణ జరగవచ్చని అంటున్నాయి.‘చాన్స్’పై సామాజిక వర్గం, జిల్లాలవారీ లెక్కలు!రాష్ట్ర కేబినెట్ నుంచి ఒకరిద్దరికి ఉద్వాసన ఉండవచ్చన్న ప్రచారం జరుగుతున్నా టీపీసీసీ నుంచి ఎలాంటి స్పష్టత రావడం లేదు. మంత్రులుగా నియామకమై చాలా తక్కువ సమయమే కావడంతో ఎవరి పనితీరు ఏమిటనేది అంచనా వేయడం సాధ్యం కాదనే చర్చ జరుగుతోంది. కానీ ఒకరిద్దరు మంత్రుల వ్యవహారశైలిపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయన్న ప్రచారమూ ఉంది. మరోవైపు మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరు వస్తారన్న దానిపై మాత్రం ఆసక్తి నెలకొంది. కేబినెట్ ప్రస్తుత కూర్పును బట్టి.. కొన్ని ఉమ్మడి జిల్లాలు, కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం కలి్పంచాల్సి ఉంది. అందులో ఎస్సీ (మాదిగ), ఎస్టీ (లంబాడా), బీసీ (ముదిరాజ్)లకు బెర్త్ ఖాయమని గాం«దీభవన్ వర్గాలు అంటున్నాయి. ⇒ పెద్ద బీసీ సామాజిక వర్గాల్లో ఒకటైన మున్నూరు కాపులకు కేబినెట్ చాన్స్ రాలేదు. కొండా సురేఖ ఉన్నా ఆమెను పద్మశాలి కోటాలోనే లెక్క వేస్తున్నారు. ఈ క్రమంలో మున్నూరుకాపులకు విస్తరణలో చాన్స్ ఉంటుందనే చర్చ జరుగుతోంది. ⇒ ఇక కేబినెట్లో ముదిరాజ్లకు అవకాశమిస్తామని లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ ప్రకటించిన నేపథ్యంలో ఆ వర్గానికి బెర్త్ దక్కే చాన్స్ ఉంది. ⇒ ఇతర వర్గాల విషయానికి వస్తే రెడ్డి ఎమ్మెల్యేల్లో ఒకరికి చాన్స్ ఉంటుందని అంటున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వకుంటే వెలమ వర్గాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు చెప్తున్నారు. వెలమ కోటాలో ముగ్గురు నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ⇒ గ్రేటర్ హైదరాబాద్ పరిధి నుంచి కేబినెట్లో ఎవరికి స్థానం దక్కలేదు. ఇప్పటికే ఇక్కడ పార్టీ బలహీనంగా ఉండటం, రాష్ట్రానికి గుండెకాయ వంటి ప్రాంతానికి కేబినెట్లో ప్రాతినిధ్యం లేకపోవడం నష్టమన్న అంచనాలో పార్టీ ముఖ్యులు ఉన్నారు. దీనితో గ్రేటర్ హై దరాబాద్ పరిధి నుంచి ఒకరికి కేబినెట్ చాన్స్ రావొచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ⇒ కేబినెట్ కూర్పులో స్థానం దక్కని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కూడా ఈసారి ప్రాతినిధ్యం కల్పిస్తారని నేతలు చెప్తున్నారు. ⇒ ఎవరికి చాన్స్ దక్కుతుందన్నదానిపై స్పష్టత లేకపోయినా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, రెడ్డి లేదా వెలమ, జీహెచ్ఎంసీ, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల కోటా లెక్కల్లోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని చర్చ జరుగుతోంది. -
‘బడ్జెట్’ లోపే కేబినెట్ విస్తరణ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కేబినెట్ విస్తరణ ఉండవచ్చని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతం కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండటంతో.. ఎవరెవరికి అవకాశం వస్తుందన్న దానిపై కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠ కనిపిస్తోంది. కొత్తగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి, అగ్రవర్ణాలకు చెందిన ఇద్దరు నేతలకు అమాత్యయోగం దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. అయితే అందుబాటులో ఉన్న ఆరు పదవులను ఒకేసారి భర్తీ చేస్తారా? పలు సమీకరణాల నేపథ్యంలో ఒకట్రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా? అన్నదానిపై స్పష్టత రావడం లేదు. వచ్చే 15 రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగినా ఆశ్చర్యం లేదని టీపీసీసీ నేతలు చెప్తున్నారు. ఏ కోటాలో ఎవరికి? రాష్ట్ర కేబినెట్లో సీఎం సహా మొత్తం 18 మంది అవకాశం ఉంది. ఇప్పటికే 12 మందితో రేవంత్ ప్రభుత్వం కొలువుదీరింది. ఇందులో ఎస్టీలకు ఒకటి, బీసీలు, ఎస్సీలకు రెండు చొప్పున ఇవ్వగా, ఏడు పదవులను అగ్రవర్ణాలకు కేటాయించారు. ఇందులో రెడ్డి సామాజికవర్గానికి నాలుగు.. వెలమ, కమ్మ, బ్రాహ్మణ వర్గాలకు ఒక్కోటి ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఒక్కో మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎస్సీ కోటాలో చెన్నూరు ఎమ్మెల్యే జి.వివేక్ వెంకటస్వామి, ఎస్టీ కోటాలో దేవరకొండ నుంచి బాలూనాయక్లకు.. బీసీ కోటాలో మక్తల్ నుంచి వాకిటి శ్రీహరి ముదిరాజ్కుగానీ, ఎంబీసీ కోటాలో ఈర్లపల్లి శంకర్ (షాద్నగర్)కుగానీ అవకాశం రావొచ్చని అంటున్నారు. అగ్రవర్ణాలకు సంబంధించి.. రెడ్డి సామాజికవర్గం నుంచి పి.సుదర్శన్రెడ్డి (బోధన్), కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి (మునుగోడు), మల్రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం)ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మల్రెడ్డికి అసెంబ్లీలో చీఫ్విప్ హోదా ఇవ్వొచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక వెలమ సామాజికవర్గ కోటాలో కె.ప్రేమ్సాగర్రావు (మంచిర్యాల), మదన్మోహన్రావు (ఎల్లారెడ్డి) పేర్లు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలూ రేసులో.. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక కాబోతున్న ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు కూడా మంత్రి పదవి రేసులో వినిపిస్తోంది. ఆయనకు శాసనమండలిలో విప్ హోదా ఇస్తారని కూడా అంటున్నారు. అయితే వెంకట్కు మంచి హోదా కలి్పంచాలని స్వయంగా రాహుల్గాంధీ చెప్పారని.. ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చని గాం«దీభవన్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తమ్మీద 15 రోజుల్లోనే, లేదా బడ్జెట్ సమావేశాల్లోపు కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నాయి. మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారీగా మరికొందరు నేతలు, మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారని పేర్కొంటున్నాయి. మైనార్టీ కోటాలో ఎవరికి? కేబినెట్లో మైనార్టీ కోటా కింద ఎవరిని, ఎలా ఎంపిక చేస్తారన్న దానిపై స్పష్టత రావడం లేదు. ఈసారి విస్తరణలో ఖాళీగా ఉన్న ఆరు బెర్తులు భర్తీ చేస్తారా, నాలుగైదు మాత్రమే నింపుతారా అన్నది మైనార్టీ కోటాను బట్టే ఉంటుందనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తరఫున మైనార్టీ నేతలెవరూ ఎమ్మెల్యేలుగా ఎన్నికకాకపోవడంతో.. వారికి ఎమ్మెల్సీలుగా అవకాశమిస్తేనే మంత్రి పదవి లభించనుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా బీసీ, ఓసీ వర్గాలకు చెందిన ఇద్దరిని కాంగ్రెస్ ఎంపిక చేసింది. నల్లగొండ గ్రాడ్యుయేట్స్, పాలమూరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మైనార్టీలు పోటీచేసే అవకాశం లేదన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనార్టీ నేతను శాసనమండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అటు అధిష్టానం, ఇటు సీఎం రేవంత్ల మదిలో ఏముందనే దానిపై స్పష్టత లేదు. మైనార్టీ కోటాలో మంత్రిపదవి రేసులో.. మాజీ మంత్రి షబ్బీర్ అలీ, అజారుద్దీన్, ఫిరోజ్ఖాన్ల పేర్లు ఉన్నాయి. ఆమేర్ అలీఖాన్, జాఫర్ జావేద్ల పేర్లు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల జాబితాలో ఉండటం గమనార్హం. త్వరలోనే నామినేటెడ్ పదవులు కూడా.. రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకాలను చేపట్టేందుకూ కాంగ్రెస్ సర్కారు సిద్ధమైంది. విదేశ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డి ఈనెల 22న ఉదయం రాష్ట్రానికి తిరిగి రానున్నారు. తర్వాత రెండు, మూడు రోజుల్లో నామినేటెడ్ పోస్టుల ప్రకటన ఉంటుందని గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీసీ, టీఎస్ఐఐసీ, రైతు సమన్వయసమితి, మహిళా కమిషన్తోపాటు పలు కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించే అవకాశం ఉందని వివరిస్తున్నాయి. -
మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 28 మంది ప్రమాణం
భోపాల్: మధ్యప్రదేశ్లోని కొత్తగా ఎన్నికైన బీజేపీ ప్రభుత్వం సోమవారం కేబినెట్ను విస్తరించింది. సీఎం మోహన్ యాదవ్ తన తన మంత్రి వర్గంలోకి 28 మందిని తీసుకున్నారు. 28 మందితో మధ్యప్రదేశ్ గవర్నర్ మంగూభాయ్ సీ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో కేంద్ర మాజీ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయవర్గీయ, ప్రద్యుమన్ సింగ్ తోమర్, విశ్వాస్ సారంగ్ ఉన్నారు. వీరిలో 18 మంది కేబినెట్ మంత్రులుగా, ఆరుగురు స్వతంత్రులుగా, మిగతా నలుగురు సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నూతన మంత్రి వర్గంలో అయిదుగురు మహిళలు ఉన్నారు. మొత్తం 28 మంది మంత్రుల్లో 11 మంది ఓబీసీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అయిదుగురు షెడ్యూల్ కులాలు(ఎస్సీ), ముగ్గురు షెడ్యూల్ తెగల (ఎస్టీ) వర్గానికి చెందినవారు ఉన్నారు. కాగా ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి శివరాజ్ సింగ్ చౌహాన్కు కాకుండా మరో నేత మోహన్ యాదవ్కు బీజేపీ అధిష్ఠానం సీఎం పదవి కట్టబెట్టింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మోహన్ యాదవ్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నాయకత్వం ఎంపిక చేసిన రెండు వారాల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరిగింది. చదవండి: ‘దేశంలో మోదీకి ప్రత్యామ్నయ నేత ఎవరూ లేరు’ -
ఎన్నికల వేళ.. మధ్యప్రదేశ్ కేబినెట్ విస్తరణ
భోపాల్: అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో జరగనున్న వేళ మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా బీజేపీకే చెందిన ఎమ్మెల్యేలు రాజేందర్ శుక్లా, గౌరీశంకర్ బిసెన్, రాహుల్ లోధిలను కేబినెట్లోకి తీసుకున్నారు. కుల, ప్రాంతీయ సమీకరణాల్లో సమతూకం పాటించే లక్ష్యంతో ఒక బ్రాహ్మణ, ఇద్దరు ఇతర వెనుకబడిన కులాల(ఓబీసీ) వీరికి తాజాగా ప్రమోషన్ ఇచి్చనట్లు భావిస్తున్నారు. శనివారం ఉదయం రాజ్భవన్లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మంగుభాయ్ పటేల్ ముగ్గురితో మంత్రులుగా ప్రమాణం చేయించారు. తాజా విస్తరణతో మంత్రుల సంఖ్య 34కు చేరింది. -
CM KCR : తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్
హైదరాబద్: తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ విస్తరణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణపై గవర్నర్ కార్యాలయానికి ప్రగతి భవన్ నుంచి లేఖ వెళ్లింది. ప్రమాణస్వీకారానికి సమయం ఇవ్వాలని గవర్నర్ ను ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విజ్ఞప్తి వచ్చింది. అయితే సీఎంవో లేఖపై రాజ్ భవన్ కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గవర్నర్ ఆఫీస్ నుంచి షెడ్యూల్ రాగానే కొత్త మంత్రితో ప్రమాణస్వీకారం చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. ఈటల స్థానంలో పట్నం ప్రస్తుతానికి ఉన్న సమాచారం మేరకు క్యాబినెట్ విస్తరణను ఒకరికే పరిమితం చేయనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ మంత్రివర్గంలో 18మందికి అవకాశం ఉంది. ప్రస్తుతం 17 మంది మంత్రులు ఉన్నారు. ఖాళీగా ఉన్న ఈటల స్థానంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి అవకాశం ఇస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఒక వేళ గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకోవాలని భావిస్తే.. ప్రస్తుతమున్న వారిలో ఒకరిని పక్కనపెట్టే అవకాశముంది. పాండిచ్చేరి నుంచి హైదరాబాద్ నిన్న పాండిచ్చేరిలో ఉన్న గవర్నర్ తమిళిసైకు మంత్రి వర్గ విస్తరణ గురించి సమాచారం అందించడంతో హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. అదే సమాచారాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు గవర్నర్. Reached Hyderabad in the afternoon for engagements in Telangana today and tomorrow — Dr Tamilisai Soundararajan (@DrTamilisaiGuv) August 21, 2023 ఇది కూడా చదవండి: మంత్రివర్గంలోకి ‘పట్నం’.. రేపు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం -
తెలంగాణ కేబినెట్ విస్తరణ.. ఉద్వాసన ఎవరికో?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించి తెలంగాణలో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. మొత్తం 119 స్థానాలకు గానూ ఒకే విడతలో 115 మందితో కూడిన తొలి విడత అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. వీరిలో తొమ్మిదిమంది సిట్టింగ్లకు హ్యండ్ ఇచ్చారు. మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒకే విడతలో భారీ సంఖ్యలో అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్.. తాజాగా మరో అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉన్న తరుణంలో తెలంగాణ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. బుధవారం రాష్ట్ర మంత్రివర్గాన్ని విస్తరణ జరపాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈటల రాజేందర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత చాలా కాలంగా ఆయన స్థానం ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈటల స్థానంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డికి కేబినెట్లో చోటుదక్కే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా కామారెడ్డి సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న నేపథ్యంలో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్దన్ ను కేబినెట్లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. చదవండి: 95 నుంచి 105 స్థానాల్లో గెలుస్తాం.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ మేనిఫెస్టో మంత్రి వర్గంలో 18 మందికి ఛాన్స్ ఉంది. ఎన్నికల వేళ అసంతృప్తితో రగలిపోతున్న మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిని క్యాబినెట్ లోకి తీసుకోనున్నారు. తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి రోహిత్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ కేసీఆర్ ప్రకటించారు. అదే స్థానాన్ని కోరుకున్న మహేందర్ రెడ్డిని ఏదోవిధంగా సర్ధుబాటు చేయాలని భావించారు. బుధవారం కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రిగా మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గతంలో 2014 తెలంగాణ ప్రభుత్వ మొదటి క్యాబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా మహేందర్ రెడ్డి పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికై బీఆర్ఎస్ లో చేరిన సబితారెడ్డి.. కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్ప్ దక్కించుకోవడంతో… మహేందర్ రెడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారు. ఒకదశలో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఎన్నికల ముందు సడెన్ గా పట్నంకు కేసీఆర్ క్యాబినెట్ లో ఛాన్స్ ఇచ్చారు. ఇక గంపా గోవర్ధన్ పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. దీంతో ఇద్దరిని తీసుకోవాలంటే ఎవరో ఒకరికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. ప్రస్తుతం కెసిఆర్ మంత్రి వర్గంలో ముగ్గురు (సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి) రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారున్నారు. పట్నం మహేందర్ రెడ్డిని కేబినెట్ లోకి తీసుకుంటే .. సమీకరణాలు మారుతాయి కాబట్టి ఓ రెడ్డి మంత్రిని తప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు మూడు నెలలే ఉంది కాబట్టి ఒకరిని బుజ్జగించి మంత్రి పదవి నుంచి తప్పుకోమనే అవకాశాలు కనిపిస్తున్నాయి. పట్నం మహేందర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కాబట్టి అదే జిల్లాకు చెందిన సబితాకు నచ్చజెపుతారా అన్నది పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఎవరికి ఉధ్వాసన పలుకనున్నారు? లేదా కేవలం మహేందర్ రెడ్డి వరకే పరిమితం చేసి విస్తరణ చేస్తారా అనేది తెలియాల్సి ఉండాలి. కేబినెట్ విస్తరణపై ఇంకా అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు పాండిచ్చేరి నుంచి ఈ రాత్రికి గవర్నర్ హైదరాబాద్ రానున్నారు. -
విపక్షాల ఐక్యతకు కౌంటర్గా ఎన్డీయే బలప్రదర్శన!
సాక్షి, న్యూఢిల్లీ: 2024 సార్వత్రిక ఎన్నికలకు దృష్టిలో ఉంచుకునే రాజకీయ పరిణామాలు శరవేగంగా.. రోజుకో మలుపు తిరుగుతున్నాయి. బీజేపీకి అధికారం దూరం చేసే క్రమంలో.. సాధ్యమైనంత వరకు ఐక్యంగా ఉండాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే ఉమ్మడి ప్రధాని అభ్యర్థిని నిలపాలనే యోచనలోనూ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈలోపే బీజేపీ మరో ప్లాన్తో ముందుకు వచ్చింది. విపక్ష కూటమి సమావేశం కంటే ముందే ఎన్డీయే కూటమి బలప్రదర్శన చేయాలని నిర్ణయించుకంది. ఈ మేరకు జులై 18వ తేదీన ఎన్డీయే విస్తృతస్థాయి సమావేశానికి సిద్ధమవుతున్న బీజేపీ.. మిత్రపక్షాలకు సమాచారం అందించింది. ఎన్డీయే పక్షాలనే కాదు.. ఏ కూటమికి చెందని కొన్ని పార్టీలకు సైతం ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ లిస్ట్లో అకాలీదళ్, చిరాగ్ పాశ్వాన్ కూడా ఉన్నారు. మరోవైపు కర్ణాటకలో జేడీఎస్తోనూ పొత్తు కోసం యత్నిస్తున్న బీజేపీ.. ఆ పార్టీకి ఆహ్వానం పంపింది. ఇక తమిళనాడులో గత కొంతకాలంగా విబేధాలతో దూరంగా ఉంటూ వస్తున్న మిత్రపక్షం అన్నాడీఎంకేకు సైతం ఆహ్వానం పంపింది. పార్లమెంట్ సమావేశాలకు ముందరే జరగనున్న ఈ కీలక సమావేశం ద్వారా విపక్షాల ఐక్యతకు కౌంటర్ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. మంత్రివర్గ విస్తరణపై సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ఇవాళ(గురువారం) మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ భేటీ జరిగింది. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు గంటలకు పైగా సాగిన సమావేశంలో.. కేబినెట్ మార్పులు చేర్పులపైనే ప్రధానాంశంగా చర్చ జరిగింది. ఈ శని లేదంటే ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఎన్నికల దృష్ట్యానే ఈ కేబినెట్ కూర్పు ఉండనున్నట్లు తెలుస్తోంది. -
కీలక శాఖలన్నీ సిద్దూ వద్దే.. డీకేకు రెండు శాఖలు?
బెంగళూరు: కర్ణాటకలో శనివారం 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడంతో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. గత వారమే సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో పాటు మరో 8 మంది మంతత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిచే గవర్నర్ తావర్చంద్ గెహ్లత్ శనివారం రాజ్భన్లో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కేబినెట్ మొత్తం 34 మందితో పూర్తిగా ఉంది. కాగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పటికీ వారికి శాఖల కేటాయింపులను అధికారికంగా ప్రకటించలేదు. అయితే కీలక శాఖలన్నీ సిద్ధరామయ్య తనవద్దే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. ఆర్థికశాఖ, కేబినెట్ వ్యవహారాలు, బ్యూరోక్రసీ, ఇంటలిజెన్స్ వంటి శాఖలను సిద్దూ నిర్వహించనున్నట్లు సమాచారం. ఇక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు నీటిపారుదల శాఖతోపాటు బెంగళూరు నగర అభివృద్ధిని అప్పగించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. జీ పరమేశ్వరకు హోంమంతత్రిత్వ శాఖ కేటాయించే అవకాశం ఉంది. కేజే జార్జ్కు న్యాయ శాఖ, చెలువరాయస్వామికి వ్యవసాయం, మునియప్పకు ఆహారం, పౌర సరాఫరాలు, సతీష్ జారికిహోళికి పబ్లిక్ వర్క్స్, బైరతి సురేష్కు పట్టణాభివృద్ధి శాఖ, ఎంబీ పాటిల్ పరిశ్రమల బాధ్యతలు, నాగేంద్రకు యూత్& స్పోర్ట్స్, వెంకటేష్కు పశుపోషణ, తిమ్మపూర్ ఎక్సైజ్, రామలింగారెడ్డి రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు కేటాయించే ఛాన్స్ ఉంది. అయితే మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవే అంటూ ఓ ప్రకటన సోషల్ మీడియాలోవైరల్గా మారింది. చదవండి: ఆర్ఎస్ఎస్ను బ్యాన్ చేస్తే.. కాంగ్రెస్ బూడిదవుతుంది: బీజేపీ హెచ్చరిక శనివారం ప్రమాణ స్వీకారం చేసిన వారిలో మాజీ సీఎం ఆర్. గుండురావు తనయుడు దినేశ్ గుండు రావు, మాజీ ముఖ్యమంత్రి బంగారప్ప కుమారుడు మధు బంగారప్ప, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర ఖండ్రేతో పాటు కృష్ణభైరేగౌడ, రహీంఖాన్, సంతోశ్లాడ్, కేఎన్ రాజణ్ణ, కే వెంకటేశ్, హెచ్.సి.మహదేవప్ప, భైరతి సురేశ్, శివరాజ్ తంగడిగి, ఆర్బీ .తిమ్మాపుర్, బి.నాగేంద్ర, డి.సుధాకర్, లక్ష్మీ హెబ్బాళ్కర్, చలువరాయస్వామి, మంకుళ్ వైద్య, ఎంసీ .సుధాకర్, హెచ్.కె.పాటిల్, శరణ్ప్రకాశ్ పాటిల్, శివానందపాటిల్, ఎస్.ఎస్.మల్లికార్జున, శరణబసప్ప దర్శనాపూర్ ఉన్నారు. మొత్తం కేబినెట్లో ఒకే ఒక్క మహిళకు చోటు దక్కింది. బెళగావి రూరల్ నుంచి రెండోసారి ఎన్నికైన లక్ష్మీ హెబ్బాళ్కర్ను మంతత్రి వర్గంలోకి తీసుకున్నారు. ఈమె పేరును డీకే ప్రతిపాదించారు. మంత్రివర్గంలో అయిదుగురు వక్కలిగ వర్గం.. ఏడుగురు లింగాయత్ వర్గానికి చెందిన నేతలు ఉన్నారు. అయిదుగురు రెడ్డీ, ఆరుగురు ఎస్సీ, ముగ్గురు ముస్లిం మైనార్టీ, ముగ్గురు ఎస్టీ, ఆరుగురు ఓబీసీ , ఒక బ్రహ్మాణ, ఒక మరాఠా, ఒక క్రిస్టియన్, ఒక జైన్ మంత్రి ఉన్నారు. చదవండి: మీడియా ముందుకు ముగ్గురు సీఎంలు.. ఏమన్నారంటే? Live ನೂತನ ಸಚಿವರ ಪ್ರಮಾಣ ವಚನ ಸ್ವೀಕಾರ ಸಮಾರಂಭ https://t.co/y1KDAW2Byl — Karnataka Congress (@INCKarnataka) May 27, 2023 -
మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్సిగ్నల్
సాక్షి బెంగళూరు: పూర్తి స్థాయి కేబినెట్కు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఇప్పటికే 8 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా, తాజాగా మరో 24 మంది శనివారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. మంత్రివర్గ జాబితాతో ఢిల్లీకి వెళ్లిన సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ అక్కడ అధిష్టానంతో చర్చించి తుది జాబితాకు ఆమోదం పొందారు. ప్రస్తుతం మంత్రివర్గంపై ఓ కొలిక్కి రావడంతో ఇక శాఖల కేటాయింపు అంశంతో సిద్ధరామయ్య ముందు మరో కొత్త తలనొప్పి రానుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్ తమ సన్నిహితులకు మంత్రి పదవులు ఇప్పించుకునేందుకు అధిష్టానం వద్ద లాబీయింగ్ చేశారు. ఇక ఈ నూతన మంత్రులకు శాఖల కేటాయింపులోనూ ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి పీఠం వరించకపోవడంతో కీలక శాఖలు తనకు అప్పగించాలని డీకే శివకుమార్ పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు రోజులుగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఢిల్లీలో ఏఐసీసీ పెద్దలతో వరుస సమావేశమవుతూ మంత్రివర్గం కూర్పును ఒక కొలిక్కి తీసుకువచ్చారు. కాగా, పూర్తి స్థాయి మంత్రివర్గానికి అధిష్టానం ఆమోదం చెప్పినట్లు తెలిసింది. దీంతో కొత్తగా 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శనివారం బెంగళూరు రాజ్భవన్లో ఉదయం 11.45 గంటలకు మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండనుంది. గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం జరగనుంది. కాగా తొలుత 20 మందిని మంత్రులుగా ప్రకటించి మరో నాలుగు స్థానాలను పెండింగ్లో పెట్టాలని భావించారు. అయితే మంత్రి పదవి కోసం పోటీ తీవ్రంగా ఉండడంతో ఒకేసారి 24 స్థానాలు భర్తీ చేయాలని చివరికి నిర్ణయించారు. మంత్రివర్గ విస్తరణలో కొందరు సీనియర్లకు మొండిచేయి తప్పేలా లేదు. సీనియర్లు ఆర్వీ దేశ్పాండే, దినేశ్ గుండూరావు, అప్పాజీ నాడగౌడ, టీబీ జయచంద్ర, బీకే హరిప్రసాద్ వంటి నేతలకు మంత్రి పదవులు దక్కకపోవచ్చు. అయితే వీరంతా ఢిల్లీలో తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కని నేతలకు భవిష్యత్తులో అవకాశం కల్పిస్తామనే హామీతో హైకమాండ్ పంపిస్తున్నట్లు తెలిసింది. -
మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ..? దీపాలి దాస్కు బెర్తు పక్కా!
భువనేశ్వర్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మంత్రి మండలి పునర్వ్యవస్థీకరణ సోమవారం జరగనున్నట్లు తెలుస్తోంది. స్వస్థలం హర్యానా పర్యటనలో ఉన్న గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ ఆదివారం భువనేశ్వర్కు తిరిగి రానున్నారు. దీంతో 22న కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో ఇటీవల ఝార్సుగుడ నియోజకవర్గం నుంచి సమీప ప్రత్యర్థిపై భారీ ఆధిక్యతతో గెలుపొందిన దివంగత మంత్రి కుమార్తె దీపాలి దాస్కు మంత్రి బెర్తు లభించే అవకాశాలపై చర్చ జరుగుతోంది. కొనసాగుతున్న మంత్రి మండలిలో ఇటీవల ఇద్దరు మంత్రులతో పాటు స్పీకర్ విక్రమ కేశరి అరూఖ్ రాజీనామా చేశారు. మిగిలిన ఇద్దరిలో మంత్రులు సమీర్ రంజన్ దాస్, శ్రీకాంత్ సాహు ఉన్నారు. స్పీకర్ పదవికి రాజీనామా చేసిన విక్రమ్ కేశరి అరుఖ్కు కొత్త మంత్రి మండలిలో స్థానం లభిస్తుందని ఊహాగానాలు బలంగా వ్యాపించి ఉన్నాయి. మరో కొత్త ముఖం ఎవరనేది ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది. ఈ ఖాళీల భర్తీతో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కొంతమంది మంత్రుల శాఖలను మార్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. -
కేంద్ర కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?.. భారీ మార్పులు?
సాక్షి, ఢిల్లీ: త్వరలో కేబినెట్ విస్తరణకు కేంద్రం సన్నద్ధమవుతోంది. పునర్వ్యవస్థీకరణ, విస్తరణ చర్చలు జోరందుకున్న క్రమంలో పార్లమెంట్ సమావేశాలకు ముందే కేబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోదీ భారీ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు తెలిసింది. దీంతో పార్టీ సంస్థాగతంగానూ పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతోపాటు 2024లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వంలో, పార్టీలో భారీ మార్పులుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, తెలంగాణపై కమలదళం ఇప్పటికే స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కేంద్ర కేబినెట్ విస్తరణలో ఇక్కడి నుంచి మరొకరికి మంత్రి పదవి వరించనుందనే ప్రచారం సాగుతోంది. ఆ దిశగా ప్రధాని మోదీ యోచిస్తున్నట్టు సమాచారం. తెలంగాణ నుంచి లోక్సభకు, రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకరికి మంత్రి పదవి ఇచ్చే అవకాశాలున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ కిషన్రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. చదవండి: యూపీ సీఎం కాషాయ దుస్తులపై కాంగ్రెస్ మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు -
Cabinet Expansion: ఎమ్మెల్యేల్లో అసంతృప్తి సెగలు
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఒక స్పష్టత రాలేకపోయింది. దీంతో మంత్రివర్గ విస్తరణ సందిగ్ధంలో పడిపోయింది. శిందే, ఫడ్నవీస్, అమిత్షా మధ్య రాష్ట్రానికి చెందిన అంశాలపై 30 నిమిషాలపాటు కీలక సమావేశం జరిగినప్పటికీ కనీసం మంత్రివర్గ విస్తరణ తేదీ కూడా నిర్ణయించలేక పోయారు. దీంతో మంత్రివర్గ విస్తరణ వచ్చే సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే అవకాశముందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై ఆరు నెలలు గడిచింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ చేపట్టి నాలుగు నెలలు కావస్తోంది. ప్రభుత్వంలో శిందే, ఫడ్నవీస్సహా 20 మంది మంత్రులు కొనసాగుతున్నారు. అప్పట్లో మిగతా వాటిలో 13 శాఖలు శిందే తమ వద్దే ఉంచుకున్నారు. క్యాబినెట్లో తమకు స్ధానం లభించకపోవడంతో మిగతావారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తులను సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని నాలుగు నెలలు గడిచినా ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంతో ఇటు శిందే వర్గం, అటు ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మంత్రివర్గంలో తమకు ఎప్పుడు స్ధానం లభిస్తుందా..? అని ఇరువర్గాల ఎమ్మెల్యేలు కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. కానీ వారి ఆశలు అడియాశలవుతున్నాయి. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే రెండో దశ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని నెల రోజుల కిందట శిందే ప్రకటించారు. ప్రస్తుతం మంత్రులపై ఉన్న అదనపు శాఖల భారం తగ్గుందని తెలిపారు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలలో కొంత ఆశలు చిగురించాయి. కానీ శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గరపడుతోనప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. శీతాకాల సమావేశాల్లో తన వద్ద ఉన్న 13 శాఖలకు సంబంధించి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ఒక్కరే సమాధానమివ్వడం సాధ్యం కాదని శిందే ముందే తెలుసుకున్నారు. దీంతో శిందే తన వద్ద ఉన్న 13 శాఖల బాధ్యతలు ఇతర మంత్రులకు అప్పగించారు. దీన్నిబట్టి మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనని ఇరు వర్గాల ఎమ్మెల్యేలకు పరోక్షంగా తెలిసిపోయింది. కాని త్వరలో అమిత్ షాతో భేటీ అయి మంత్రి వర్గ విస్తరణపై చర్చించి ఒక స్పష్టత తీసుకొస్తామని శిందే, ఫడ్నవీస్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యేలలో మళ్లీ ఆశలు చిగురించాయి. ఆ ప్రకారం బుధవారం ఢిల్లీలో అమిత్షాతో శిందే, ఫడ్నవీస్, కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై భేటీ అయ్యారు. సమావేశం అనంతరం శిందే, ఫడ్నవీస్ రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన సమస్యలపై సుమారు 30 నిమిషాలు కేంద్ర హోంమంత్రితో చర్చించారు. కానీ ఈ సమావేశంలో నాగ్పూర్లో ఈ నెల 19వ తేదీ నుంచి జరగనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు చేపట్టాల్సిన మంత్రివర్గ విస్తరణపై ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. దీంతో పరిస్ధితి మళ్లీ మొదటికే వచ్చింది. దీంతో ఇరు వర్గాల ఎమ్మెల్యేలలో ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. శాసనసభ శీతాకాల సమావేశాలకు ముందు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొంది. శీతాకాల సమావేశాల తర్వాత చేయవచ్చనే మీడియా కథనాన్ని ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. శీతాకాల సమావేశాల తరువాతే! నిజానికి శీతాకాల సమావేశాల తర్వాత చేయొచ్చని మీడియా కథనాలను ఉటంకిస్తూ వార్తలు వస్తున్నాయి. ఢిల్లీలో అమిత్ షాతో అర్థరాత్రి జరిగిన సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. ఈ సమావేశం తర్వాత మంత్రివర్గ విస్తరణపై నిర్ణయాన్ని ఖరారు చేశారు. ఈ సమావేశానికి ఫడ్నవీస్, షిండే ఇద్దరూ హాజరయ్యారు. నిజానికి శీతాకాల సమావేశాలకు ముందే షిండే–ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని ముందుగా భావించారు. కానీ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఇప్పుడు శీతాకాల సమావేశాల తర్వాతే మంత్రివర్గ విస్తరణ ఖరారయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం భయపడుతోంది... ప్రస్తుతం, మంత్రివర్గంలో ముఖ్యమంత్రి శిందే, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్తో సహా 20 మంది కేబినెట్ ర్యాంక్ మంత్రులు ఉన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో జాప్యంపై విపక్షాలు దూకుడు పెంచాయి. శిందే, ఫడ్నవీస్లు ప్రతి ఎమ్మెల్యేకు మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకే ఇప్పుడు తమకు మంత్రి పదవులు ఇవ్వకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారని బీజేపీ భయపడుతోందని వారు వ్యాఖ్యానించారు. -
Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ మళ్లీ వాయిదా!
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా అని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యేలకు మళ్లీ నిరాశే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి నాగ్పూర్లో జరిగే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని గత నెలలో ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన వెల్లడించారు. అంతేగాకుండా డిసెంబరు 5–9 తేదీల మధ్య ఏదో ఒకరోజు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం కూడా చేస్తారని శిందే, ఫడ్నవీస్ సంకేతాలిచ్చారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. కానీ ప్రత్యక్షంగా ఈ ముహూర్తం కూడా దాటిపోయే అవకాశం ఏర్పడింది. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్నప్పటికీ మంత్రివర్గ విస్తరణపై ఇంతవరకు శిందే, ఫడ్నవీస్ మధ్య సాధారణ చర్చగాని, సమావేశంగాని జరగలేదు. దీంతో ఇరువర్గాల ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో తిరుగుబాటు లేదా దెబ్బతీసే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెలరోజులకు మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతా వారికి ఆవకాశం దొరకకపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో తమకు చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. ఆ విధంగా తనతో వచ్చిన ఎమ్మెల్యేలందరికీ శిందే హామీ కూడా ఇచ్చారు. కానీ ఆ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి మళ్లీ సొంత గూటి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) లోకి చేరే ప్రమాదం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే శిందే, ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం సంక్షో¿భంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని శిందే, ఫడ్నవీస్ ప్రకటించి అసంతృప్తులందరినీ సంతృప్తి పరిచే ప్రయత్నం జరిగింది. కానీ అసంతృప్తులకు హామీ ఇచ్చి దాదాపు ఐదు నెలలు కావస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు సమయం కూడా దగ్గరపడుతోంది. ఈ నాలుగైదు రోజుల్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలి. కానీ ఇంతవరకు దాని ఊసే ఎత్తడం లేదు. కనీసం శిందే, ఫడ్నవీస్ మధ్య చర్చ కూడా జరగడం లేదు. శిందే, ఫడ్నవీస్ ఆదివారం నాగ్పూర్–షిర్డీ హై స్పీడ్ కారిడార్పై ట్రయల్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఫడ్నవీస్ ఢిల్లీ వెళతారని తెలిసింది. ఈ నెల 11వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ నాగ్పూర్ పర్యటనకు వస్తున్నారు. ఆ సమయంలో నాగ్పూర్లో మెట్రో రైలు మార్గం, దివంగత బాల్ ఠాక్రే సమృద్ధి మహామార్గ్ నాగ్పూర్–షిర్డీ మొదటి దశ 520 కిలోమీటర్ల మేర మార్గాన్ని మోడీ ప్రారంభిస్తారు. దీంతో మోడీ పర్యటన నేపధ్యంలో శిందే, ఫడ్నవీస్ ఏర్పాట్ల పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ తరువాత వారం రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైతాయి. దీన్ని బట్టి ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని స్పష్టమవుతోంది. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు... అసెంబ్లీ శీతాకాల సమావేశానికి ముందు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంత్రివర్గ విస్తరణను వాయిదా వేయాలని, రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులేతో శిందే సమావేశమయ్యారు. మంత్రివర్గ విస్తరణ కోసం కేంద్రం అనుమతి కోసం వేచి ఉండకుండా, కూటమి భాగస్వాములు ఇద్దరూ కలిసి కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులు, కార్పొరేషన్ల కేటాయింపులను ప్రారంభించవచ్చని నిర్ణయించారు. ‘శిందే తిరుగుబాటులో ఆయనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. మంత్రివర్గ విస్తరణ చేయకుంటే.. విస్తరణలో తమ పేర్లు చేర్చకుంటే ఆందోళనకు దిగుతామని కొందరు హెచ్చరించారు. అసంతృప్త ఎమ్మెల్యేలను కేటాయింపుల ద్వారా శాంతింపజేయడమే సీఎం శిందే ముందున్న తక్షణ సమస్య’’ అని పేరు వెల్లడించని ఒక బీజేపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఐదు నెలల క్రితమే తొలి మంత్రివర్గ విస్తరణ జరిగినా, మెజారిటీ మంత్రిత్వ శాఖలు ఇంకా కేటాయించలేదు. ముఖ్యమంత్రి, ఆయన డిప్యూటీలపై గరిష్ట శాఖల భారం ఉంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ విధానాలపై, పరిపాలన అమలుపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తోంది. శిందే, ప్రముఖ మంత్రులతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వ్యవహారం సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది. ఒకవేళ ప్రతికూల ఫలితం వస్తే ప్రభుత్వం ప్రమాదంలో పడుతుంది. అందువల్లనే విస్తరణలను ఆలస్యం చేయడంపై వారు చాలా ఆలోచిస్తున్నారు’’ అని ఆ సీనియర్ బీజేపీ నాయకుడు అన్నారు. కేబినెట్ హోదాతో రాష్ట్ర బోర్డులను కేటాయిస్తే ఒకే దెబ్బకు రెండు పిట్టలు పడ్డట్టేనని శిందే సన్నిహితుడు ఒకరు అభిప్రాయపడ్డారు. ‘ఇంతకుముందు క్రీమ్ పోర్ట్ఫోలియోలను డిమాండ్ చేసిన ఎమ్మెల్యేలు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. మంత్రి పదవి లభించని పక్షంలో బోర్డులతో సరిపెట్టుకోవడానికి కూడా వారు సిద్ధంగా ఉన్నారు. దీనివల్ల పోటీ తగ్గుతుంది. కాబట్టి తర్వాత, పోర్ట్ఫోలియోలను పంపిణీ చేయడం, మంత్రివర్గాన్ని విస్తరించడం మాకు సమస్య కాదు. ఇది పక్కా ప్రణాళికతో కూడిన వ్యూహం’ ఆయన అన్నారు. -
ఎమ్మెల్యేలకు దేవేంద్ర ఫడ్నవీస్ తీపి కబురు
సాక్షి, ముంబై: మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శుభవార్త ఆందించారు. శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని నాగ్పూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఫడ్నవీస్ ప్రకటించారు. త్వరలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ ముహూర్తం ఖరారుచేసి తేదీ ప్రకటిస్తుందని ఆయన అన్నారు. దీంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం, ఫడ్నవీస్ వర్గం ఎమ్మెల్యేలలో ఆనందం వెల్లివిరిసింది. ముఖ్యంగా గత మూడు నెలలుగా అసంతృప్తితో బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతున్న శిందే వర్గం ఎమ్మెల్యేల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. అయితే కరోనా మహమ్మారి కారణంగా నాగ్పూర్లో జరగాల్సిన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ముంబైలో చాలా తక్కువ రోజులు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈసారి నాగ్పూర్లో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు రెండు వారాలపాటు కచ్చితంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. ఒకవేళ ఎమ్మెల్యేలకు అభ్యంతరం లేకుంటే నూతన సంవత్సర వేడుకలు నాగ్పూర్లో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. ఉద్ధవ్తో కలవం.. రాజ్ ఠాక్రే సత్సంబంధాలు ఇదిలాఉండగా భవిష్యత్తులో ఉద్ధవ్ ఠాక్రేతో చేతులు కలిపే సమస్యే లేదని విలేకరులడిగిన ఓ ప్రశ్నకు ఫడ్నవీస్ సమాధానమిస్తూ స్పష్టం చేశారు. ఉద్ధవ్ తన మనసుకు చాలా బాధ కల్గించారని, ఆయనతో ఇకపై చేతులు కలిపే ప్రసక్తేలేదని అన్నారు. ఎమ్మెన్నెస్తో పొత్తు పెట్టుకుంటారా? అని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీలు వేరైన అనేక ఏళ్లుగా రాజ్ ఠాక్రేతో తమకు సత్సంబంధాలున్నాయి. ఆయన తనకు మంచి మిత్రుడని, రాజకీయంగా కాకపోయిన మంచి మిత్రులుగా కలిసే ఉంటామని ఫడ్నవీస్ వెల్లడించారు. మూడునెలలుగా పెండింగ్లోనూ.. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి కొత్తగా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన నెల రోజులకు మంత్రి వర్గ విస్తరణ జరిగింది. మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగి దాదాపు మూడు నెలలు కావస్తోంది. అయినప్పటికీ రెండో దశ విస్తరణకు ఇంకా ముహూర్తం లభించకపోవడంపై ఎమ్మెల్యేలలో అసంతృప్తి నెలకొంది. ముఖ్యంగా శిందే వర్గం ఎమ్మెల్యేలలో అసంతృప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దీంతో వారిని సంతృప్తి పరిచేందుకు త్వరలో రెండో దశ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో ప్రకటించారు. కాని ఇంతవరకు దాని ఊసు ఎత్తడం లేదు. మహిళలకు దక్కని ప్రాధాన్యం అప్పట్లో ఏక్నాథ్ శిందే తిరుగుబాటుతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం రద్దయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు నెల రోజులకు మొదటి దశ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇందులో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన తొమ్మిది మంది చొప్పున ఇలా 18 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మిగతావారికి ఆవకాశం దొరక్కపోవడంతో కొందరు ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. అంతేగాకుండా ఈ మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై ఇటు మహిళా వర్గం నుంచి, అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. దీంతో రెండో దశ మంత్రివర్గ విస్తరణ త్వరలో ఉంటుందని అందులో మహిళలకు చోటు కల్పిస్తామని అప్పట్లో అందరినీ బుజ్జగించే ప్రయత్నం జరిగింది. రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తి ముఖ్యంగా అప్పట్లో ఏక్నాథ్ శిందేతోపాటు శివసేన నుంచి బయటపడిన ఎమ్మెల్యేలు కొత్త ప్రభుత్వంలోని మంత్రివర్గంలో చోటు లభిస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ ఆశ నిరాశకు గురిచేసింది. శిందే వర్గం ఎమ్మెల్యేలలో నెలకొన్న అసంతృప్తి రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఫలితంగా శిందేపై తిరుగుబాటుచేసి సొంత గూటిలోకి (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) చేరే ప్రమాదం ఏర్పడింది. ఒకవేళ అదే జరిగితే బీజేపీ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకోవడం ఖాయం. ఆ పరిస్ధితి రాకముందే శిందే, ఫడ్నవీస్ జాగ్రత్త తీసుకున్నారు. చివరకు శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందే మంత్రివర్గ విస్తరణ చేపడతామని ఫడ్నవీస్ ప్రకటించి ఈ అంశానికితెరదించారు. (క్లిక్ చేయండి: మరో ‘మహా’కూటమి?.. ఉద్ధవ్కు చెక్ పెట్టేందుకు పావులు) -
ప్రభుత్వ ఏర్పాటులో ‘కీలక’పాత్ర ఉంటే మాత్రం ఇచ్చేయడమేనా!!
ప్రభుత్వ ఏర్పాటులో ‘కీలక’పాత్ర ఉంటే మాత్రం ఇచ్చేయడమేనా!! -
Maharashtra: ఫడ్నవీస్కు కీలక శాఖ.. మంత్రులకు శాఖల కేటాయింపులివేనా?
సాక్షి,ముంబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన 40 రోజుల తర్వాత మినీ మంత్రివర్గ విస్తరణ, మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రక్రియ మంగళవారం పూర్తయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటివరకు ఎవరికీ మంత్రిత్వ శాఖల కేటాయింపు జరగలేదు. ఇప్పుడు అందరి దృష్టి ఎవరెవరికి ఏయే మంత్రిత్వ శాఖలు లభిస్తాయనే అంశం తెరమీదకు వచ్చింది. తమకు కీలక శాఖల బాద్యతలు అప్పగిస్తారా లేక అంతగా ప్రాధాన్యత లేని శాఖలు లభిస్తాయా అనే దానిపై మంగళవారం ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్లో చర్చ మొదలైంది. దీంతో శిందే, ఫడ్నవీస్ తీసుకునే తుది నిర్ణయంపై దృష్టి సారించారు. తాజా మంత్రివర్గ విస్తరణతో శిందే, ఫడ్నవీస్తోపాటు మొత్తం 20 మంది మంత్రులు కలిసి ప్రభుత్వాన్ని నడిపించనున్నారు. రాష్ట్రంలో అత్యంత కీలక పదవైన హోం శాఖను దేవేంద్ర ఫడ్నవీస్ దక్కించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై శిందే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మహిళలకు దక్కని ప్రాతినిధ్యం ఇదిలాఉండగా రాష్ట్ర కేబినెట్లో గరిష్టంగా 43 మంది ఎమ్మెల్యేలను తీసుకునే అవకాశమున్నప్పటికీ మొదటి దశలో ఇరు వర్గాల నుంచి 18 మందిని చేర్చుకున్నారు. మహిళలకు 50% రిజర్వేషన్ అమలులో ఉన్నప్పటికీ 1957–2019 మధ్య కాలంలో కేవలం 40 మంది మహిళలకు మంత్రి మండలిలో స్థానం లభించింది. అందులో 18 మంది మహిళలకు కేబినెట్లో, 22మంది మహిళలకు సహాయ మంత్రులుగా పదవులు లభించాయి. కాగా, బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిందే, ఫడ్నవీస్ వర్గం వద్ద మొత్తం 14 మంది మహిళా ఎమ్మెల్యేలున్నారు. కానీ మొదటిసారి చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి వరించలేదు. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ముఖ్యమంత్రి శిందే వద్ద నగరాభివృద్ధి శాఖ, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వద్ద అత్యంత కీలకమైన హోం శాఖను ఉంచుకునే అవకాశాలున్నాయి. మిగతా మంత్రులకు ఏ శాఖలు కేటాయించాలనే దానిపై తుది జాబితా అధికారికంగా ప్రకటించలేదు. కానీ విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఏ మంత్రికి, ఏ శాఖ లభించే అవకాశాలున్నాయో వాటి వివరాలు మంత్రివర్గ విస్తరణ ప్రత్యేకతలు ►ఔరంగాబాద్ జిల్లాకు ఏకంగా మూడు మంత్రి పదవులు ►మహిళలకు స్థానం కల్పించకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఇదే ప్రథమం ►భాగస్వామ్య పార్టీలకు మంత్రి పదవులు లేవు ►మంత్రివర్గంలో స్థానం లభించిన శిందే వర్గంలోని మంత్రులందరూ ధనవంతులే ►కొత్త మంత్రివర్గంలో చోటు లభించిన మంత్రుల్లో 70% మందిపై వివిధ కేసులు నమోదై ఉన్నాయి ►ఇరు వర్గాల మధ్య 35–65 ఫార్మూల ఒప్పందం ఉన్నప్పటికీ 50–50% మంత్రి పదవులు కేటాయించారు ►నేరారోపణలున్న అబ్దుల్ సత్తార్, సంజయ్ రాథోడ్కు మంత్రివర్గంలో మళ్లీ స్థానం కల్పించడం ఇదిలా ఉండగా శిందే, ఫడ్నవీస్ వర్గీయులకు మాత్రమే మంత్రిమండలిలో స్థానం లభించడంతో భాగస్వామ్య చిన్న, చితక పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేలలో కొంత అసంతృప్తి వాతావరణం నెలకొంది. ఇప్పటికే కొందరు తమ అసంతృప్తిని బహిరంగంగానే బయటపెట్టారు. తదుపరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడుంటుంది? తమకు అవకాశం ఎప్పుడు లభిస్తుందనే దానిపై ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే రెండో దశ మంత్రివర్గ విస్తరణ సెప్టెంబరులో ఉంటుందని శిందే వర్గానికి చెందిన ప్రహార్ సంఘటన ఎమ్మెల్యే బచ్చు కడూ స్పష్టం చేశారు. అందులో అసంతృప్తులందరికీ స్థానం లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. 18 మంది మంత్రుల ప్రమాణస్వీకారం
-
కొలువుదీరిన మహారాష్ట్ర కేబినెట్.. 18 మంది మంత్రులు వీరే
సాక్షి, ముంబై: ఎట్టకేలకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణ పూర్తయ్యింది. 18 మందితో మహారాష్ట్ర కేబినెట్ కొలువుదీరింది. మంత్రి వర్గంలో బీజేపీ నుంచి తొమ్మిది,షిండే వర్గం నుంచి 9 మందికి చోటు లభించింది. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్లో గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ 18 మంది ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: చంద్రకాంత్ పాటిల్,సుధీర్ మునగంటివార్, గిరీష్ మహాజన్, సురేశ్ ఖడే, రాధాకృష్ణ విఖే పాటిల్, రవీంద్ర చవాన్, మంగళ్ ప్రభాత్ లోధా, విజయ్ కుమార్ గవిత్, అతుల్ సేవ్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిండే వర్గం: దాదా భుసే, శంభురాజ్ దేశాయ్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్, తానాజీ సావంత్, అబ్దుల్ సత్తార్, దీపక్ కేసర్కర్, గులాబ్రావ్ పాటిల్, సంజయ్ రాథోడ్ ఉన్నారు. మంత్రుల జాబితా ఇదే Chandrakant Patil and Vijay Kumar Gavit are among the nine BJP leaders who are taking oath as ministers in Maharashtra Cabinet at Raj Bhavan in Mumbai pic.twitter.com/DCyzwjEVVa— ANI (@ANI) August 9, 2022 కాగా బీజేపీ నుంచి డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ దక్కనున్నట్టు ప్రచారం జరుగుతోంది. శిండే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఇక శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్లు సీఎం, డిప్యూటీ సీఎంలుగా జూన్ 30న ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. Maharashtra Cabinet expansion | Governor Bhagat Singh Koshyari administers the oath of office to 18 MLAs as ministers pic.twitter.com/2eDIBVxWj3 — ANI (@ANI) August 9, 2022 -
మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ.. అగ్రస్ధానంలో ఉన్న ఎమ్మెల్యేలు వీరే
సాక్షి, ముంబై: నెల రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెందిన మంత్రివర్గ విస్తరణకుæ ఎట్టకేలకు ముహూర్తం లభించింది. శిందే, ఫడ్నవీస్ ముందుగా కుదుర్చుకున్న 35–65 ఫార్మూలా ప్రకారం ప్రస్తుతం మినీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు గవర్నర్ నివాసమైన రాజ్ భవన్లో శిందే, ఫడ్నవీస్ వర్గానికి చెందిన 18–20 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ఆ తరువాత మరోదశలో శిందే, ఫడ్నవీస్ వర్గంతోపాటు భాగస్వామ్య చిన్నాచితక పార్టీల ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి. అందుకోసం రాజ్ భవన్లోని సెంట్రల్ హాలులో ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అంతేగాకుండా ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నేతలు, పదాధికారులు, శివసైనికులు, మద్దతుదారులు రాజ్భవన్కు వచ్చి ఆందోళన చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. రాజ్భవన్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద, రాజ్ భవన్ వచ్చే మార్గంలో, పరిసరాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. మంత్రివర్గ విస్తరణ మంగళవారం ఉదయం పూర్తికాగానే ఈ నెల 10–17 తేదీల మధ్య వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్ రూపొందించడంలో అసెంబ్లీ కార్యకలాపాల నిర్వాహణ కమిటీ నిమగ్నమైంది. త్వరలో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తుది షెడ్యూల్ అధికారికంగా విడుదల చేయనుంది. ఇదిలాఉండగా మంత్రివర్గంలో స్ధానం లభించిన ఇరు వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలందరూ సోమవారం రాత్రి వరకు ముంబైకి చేరుకోవాలని సమాచారం పంపించారు. సీనియర్లకు పెద్దపీట.. బీజేపీ నుంచి ఇదివరకు మంత్రులుగా పనిచేసిన అనుభవం, పాత ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో మళ్లీ అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత కొత్త ముఖాలకు అవకాశమివ్వనున్నట్లు తెలిసింది. ఏక్నాథ్ శిందే, దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన ముగించుకుని ముంబైకి చేరుకున్న తరువాత సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఫడ్నవీస్ శిందే నివాసమైన నందన్వన్ బంగ్లాకు చేరుకున్నారు. అక్కడ సుమారు గంటన్నరకుపైగా మంత్రివర్గ విస్తరణపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా ఎలాంటి వివాదాలకు తావీయకుండా సోమవారం రాత్రే మంత్రివర్గ విస్తరణ చేపట్టి, ఆ తరువాత ప్రమాణ స్వీకారం చేయించాలని శిందే, ఫడ్నవీస్ భావించారు. కాని ఇంత తక్కువ సమయంలో తమ తమ నియోజక వర్గాలలో నివాసముంటున్న ఇరు వర్గాల ఎమ్మెల్యేలందరినీ ముంబైకి రప్పించడం సా«ధ్యం కాదని గుర్తించారు. చివరకు మంగళవారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. చదవండి: మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు.. ఎట్టకేలకు విస్తరణ కొలిక్కి... గత నెలలో శివసేన పార్టీలో అసంతృప్తితో ఉన్న ఏక్నాథ్ శిందే 50 మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటుచేసి ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు, మహా వికాస్ ఆఘాడి ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చారు. ఆ తరువాత నాటకీయ పరిణామాల మధ్య ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం కుప్పకూలింది. ఆ తరువాత జూన్ 30న ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రిగా, దేవేంద్ర ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ప్రక్రియ చకచకా జరిగిపోయిన విషయం తెలిసిందే. కాని బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నెల మీద వారం రోజులు కావస్తున్నప్పటికీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడంపై మహావికాస్ ఆఘాడికి చెందిన శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారం చేజారిపోవడంతో ఇప్పటికే మహా వికాస్ ఆఘాడి నేతలు ఆగ్రహంతో ఉన్నారు. మంత్రి వర్గంలో శిందే, ఫడ్నవీస్ ఇద్దరే ఉన్నారని, ప్రభుత్వ పాలన ఇద్దరి చేతుల మీదుగానే కొనసాగుతుందని దుయ్యబట్టసాగారు. సంబంధిత శాఖల మంత్రులు, జిల్లా ఇంచార్జి మంత్రులు లేక ప్రభుత్వ పనులు కుంటుపడుతున్నాయి. అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదని, వరద బాధితులకు సాయం, పంటల నష్టానికి చేపట్టాల్సిన పంచనామ పనులు పూర్తికావడం లేదని ప్రతిపక్షాలు పనిగట్టుకుని మరీ దుమ్మెత్తి పోస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేపడతారని ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు త్వరలో ఉంటుందనే సమాధానమిస్తున్నారే తప్ప ముహూర్తం ఖరారు చేయడం లేదు. కాగా తిరుగుబాటు శిందే వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యే సస్పెన్షన్ కేసు సుప్రీం కోర్టులో పెండింగులో ఉంది. తీర్పు తరుచూ వాయిదా పడుతుండడం వల్లే మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా వేస్తున్నారని ఆరోపించసాగారు. తాజాగా ఆగస్టు 8న జరగాల్సిన విచారణ మళ్లీ ఆగస్టు 12కు వాయిదా పడింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ మళ్లీ వాయిదా వేస్తుండవచ్చని మహావికాస్ ఆఘాడి నేతలు భావించారు. అయితే సుప్రీం కోర్టు తీర్పుకు, మంత్రివర్గ విస్తరణకు ఎలాంటి సంబం«ధం లేదని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తీర్పు వెలువడే వరకు మంత్రివర్గ విస్తరణ చేపట్టకూడదని సుప్రీం కోర్టు ఎక్కడా చెప్పలేదని అన్నారు. ఎట్టకేలకు శిందే, ఫడ్నవీస్ మంగళవారం ముహూర్తం ఖరారుచేసి గత నెల రోజులుగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రమాణ స్వీకారంలో అగ్రస్ధానంలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు.. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ వర్గం: దేవేంద్ర ఫడ్నవీస్, చంద్రకాంత్ పాటిల్, జయ్కుమార్ రావల్, రాథాకృష్ణ విఖే పాటిల్, ప్రవీణ్ దరేకర్, రవీంద్ర చవాన్, నితేష్ రాణే, గిరీష్ మహాజన్, సుధీర్ మునగంటివార్, సంజయ్ కుటే ఉన్నారు. వీరిలో ఎంత మంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది మంగళవారం తేలనుంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే వర్గం: గులాబ్రావ్ పాటిల్, దీపక్ కేసర్కర్, దాదా భుసే, అబ్దుల్ సత్తార్, శంభురాజ్ దేశాయ్, సంజయ్ శిర్సాట్, సందీపాన్ భుమరే, ఉదయ్ సామంత్ తదితరులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. -
మహారాష్ట్ర కేబినెట్ విస్తరణ.. దేవేంద్ర ఫడ్నవీస్కు హోంశాఖ?
న్యూఢిల్లీ : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఈ వారంలో తన మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు అత్యంత కీలకమైన హోంశాఖ అప్పగించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. ఆగస్టు 15లోగా కేబినెట్ విస్తరణకు సీఎం షిండే సన్నాహాలు చేస్తున్నారు. జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ ప్రమాణం చేశారు. అప్పట్నుంచి వారిద్దరితోనే కేబినెట్ నడుస్తూ ఉండడంతో విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ విమర్శల్ని ఫడ్నవీస్ కొట్టిపారేశారు. ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్ చేసిన విమర్శల్ని తిప్పికొడుతూ వారి ప్రభు త్వంలో మొదటి 32 రోజులు కేవలం అయిదుగురే ఉన్న విషయాన్ని అజిత్ దాదా మర్చిపోయారా అని గుర్తు చేశారు. ఆగస్టు 15లోగా మహారాష్ట్ర ప్రభుత్వ విస్తరణ జరగనుంది. చదవండి: ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు: కేజ్రీవాల్ -
ఒకేఒక్క ఎమ్మెల్యేతో జాక్పాట్.. కేబినెట్లో చోటు!
ముంబై: మహారాష్ట్రలో శివ సేన చీలిక తర్వాత.. రెబల్ వర్గంతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక ఇప్పుడు మంత్రివర్గ కూర్పుపై దృష్టిసారించింది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలూ ఉన్నందునా.. రాజకీయ స్థిరత్వం కోసం పావులు కదుపుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇవాళ మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రేను ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కలిశారు. దాదర్(మధ్య ముంబై)లోని థాక్రే నివాసం ‘శివతీర్థ’కు స్వయంగా వెళ్లిన ఫడ్నవీస్.. గంటన్నరకు పైనే మంతనాలు జరిపారు. రాజ్థాక్రేకు గత నెలలో సర్జరీ జరిగింది. అలాగే షిండే వర్గంతో పొత్తు సమయంలో అనూహ్యంగా ఉపముఖ్యమంత్రి పదవికి సుముఖత వ్యక్తం చేశారు ఫడ్నవీస్. ఆ సమయంలో ఫడ్నవీస్ త్యాగాన్ని కొనియాడాడు రాజ్ థాక్రే. ఈ నేపథ్యంలోనే మర్యాదపూర్వకంగా కలిసినట్లు ప్రచారం జరిగింది. అయితే.. మొదటి నుంచి ఎంఎన్ఎస్.. బీజేపీకి మద్దతుదారు పార్టీనే. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యక్ష మద్దతు ప్రకటించింది ఎంఎన్ఎస్. అలాగే త్వరలో బీఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. ఇంకోవైపు మంత్రి వర్గ కూర్పు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయపరమైన చర్చ ఇద్దరి మధ్య జరిగినట్లు తెలుస్తోంది. కేబినెట్లో చోటు! మహారాష్ట్రలో బీజేపీ రాజకీయ స్థిరత్వం కోసం ప్రయత్నిస్తోంది. మరో రెండున్నరేళ్ల పాటు అధికారం కొనసాగేందుకు అవసరమైన మద్దతు కూడగడుతోంది. ఈ క్రమంలో షిండే వర్గంతో పాటు చిన్న చిన్న పార్టీలను కూడదీసుకుని ముందుకు వెళ్లాలనుకుంటోంది. గతంలోనూ.. ఇప్పుడూ ఎంఎన్ఎస్ మహారాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఇప్పుడు ఉన్నది ఒక్క సీటే అయినా.. కేబినెట్లో స్థానం ద్వారా మరింత మచ్చిక చేసుకోవాలని బీజేపీ-షిండే వర్గం భావిస్తోంది. ఎంఎన్ఎస్కు ఉన్న ఏకైక ఎమ్మెల్యే ప్రమోద్ రతన్ పాటిల్. కల్యాణ్ రూరల్ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2010లో ఎంఎన్ఎస్ పార్టీ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో 29 సీట్లు గెలవడానికి ఈయనే మూలకారణం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలోనూ ఆయనకు పట్టుంది. అందుకే ప్రమోద్కు కేబినెట్ బెర్త్ ఆఫర్ చేస్తోంది బీజేపీ. అయితే.. ఇదికాకుండా మరో ప్రతిపాదన సైతం రాజ్ థాక్రే ముందు ఉంచింది. రాజ్ థాక్రే తనయుడు అమిత్ థాక్రేకు షిండే కేబినెట్లో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అమిత్ చట్టసభలో సభ్యుడిగా లేడు. ఒకవేళ కేబినెట్ హోదా గనుక ఇస్తే.. ఎమ్మెల్యేగా లేదంటే ఎమ్మెల్సీగా తప్పకుండా గెలవాలి. దీంతో బీజేపీ ఆఫర్పై రాజ్ థాక్రే పార్టీ వర్గంతో చర్చిస్తున్నట్లు సమాచారం. -
వచ్చే వారంలో మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ
న్యూఢిల్లీ: మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ వచ్చే వారంలో ఉంటుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే చెప్పారు. ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్తో సంపూర్ణ చర్చల తర్వాత మంత్రిమండలి కూర్పు ఉంటుందని తెలిపారు. శనివారం షిండే, ఫడ్నవీస్లు ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేపట్టారు. రాష్ట్రపతి కోవింద్, ప్రధానమంత్రి మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలుసుకున్నారు. అనంతరం సంయుక్తంగా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయని మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే చెబుతున్న మాటల్ని షిండే తోసిపుచ్చారు. 164 మంది ఎమ్మెల్యేలతో తమ ప్రభుత్వం బలంగా ఉందని, పూర్తి కాలం తను పదవిలో ఉంటానని ధీమాగా చెప్పారు. ఒకప్పుడు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఫడ్నవీస్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కావడం పట్ల అసంతృప్తిగా లేదా అన్న ప్రశ్నకు తాను పార్టీ ఆదేశాలకు అనుగుణంగానే నడుచుకుంటానని బదులిచ్చారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రే నాయకుడని, షిండే నాయకత్వంలో పని చేస్తామనన్నారు. ప్రభుత్వాన్ని పూర్తికాలం విజయవంతంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. శుక్రవారం హోం మంత్రి అమిత్ షాతో షిండే, ఫడ్నవీస్ సుదీర్ఘంగా జరిపిన చర్చల్లో అధికార పంపిణీ కసరత్తు కొలిక్కి వచ్చినట్టు సమాచారం. -
మహారాష్ట్రలో కేబినెట్ విస్తరణ.. బీజేపీకి పెద్ద పీట?
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం అనంతరం.. శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా, 45 మంది మంత్రులతో నూతన కేబినెట్ను షిండే ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, కొత్త కేబినెట్లో బీజేపీకి చెందిన వారు 25 మంది, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నుంచి 13 మంది మంత్రులు ఉంటారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇక, స్వతంత్రులకు సైతం కేబినెట్లో స్థానం కల్పించనున్నట్టు తెలుస్తోంది. కాగా, వీరిలో సీఎం షిండే, డిప్యూటీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మినహా అందరూ కొత్తవారేనని సమాచారం. ఇదిలా ఉండగా.. ఏక్నాథ్ షిండే, బీజేపీ మధ్య ఓ ఒప్పందం కుదిరినట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందం ప్రకారమే.. శివసేనతో ప్రతీ ముగ్గురు ఎమ్మెల్యేలకు, బీజేపీలో ప్రతీ నలుగురు ఎమ్మెల్యేలకు ఓ మంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు.. షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై జూలై 11న సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోనున్నట్టు విశ్వసనీయ సమాచారం. 🔴 New Maharashtra cabinet: 25 ministers from BJP, 13 from Chief Minister Eknath Shinde's Sena, say sources https://t.co/VU6h2cDdEU pic.twitter.com/NXlTPoeb71 — NDTV (@ndtv) July 7, 2022 ఇది కూడా చదవండి: ఉద్ధవ్కు మరో ఎదురుదెబ్బ.. షిండే వర్గంలోకి 66 మంది శివసేన కార్పొరేటర్లు! -
AP: సీఎం జగన్ కీలక సమావేశం
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కేబినెట్ విస్తరణపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందోనన్న చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం మధ్యాహ్నం మరోసారి మంత్రివర్గ కూర్పుపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమావేశం కానున్నారు. సీఎం జగన్ తుది జాబితా తయారీపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎం జగన్తో సమావేశమయ్యారు. అయితే, పాత, కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండనుంది. కేబినెట్లో 10 మంది పాత మంత్రులే కొనసాగే అవకాశం ఉండగా.. కొత్తగా మరో 15 మందికి మంత్రి వర్గంలో చోటు కల్పించనున్నారు. కాగా, ఈరోజు మధ్యాహ్నం వరకు ఫైనల్ లిస్ట్ను సిద్ధం చేసి తర్వాత జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు పంపించనున్నారు. -
AP: మంత్రి ఎవరు?, కానిదెవరు?
సాక్షి, అమరావతి: సార్.. మంత్రి పదవులు ఎవరికిస్తున్నారు? బాసు.. టెన్షన్ భరించలేకపోతున్నా.. మా ఎమ్మెల్యేకి మంత్రి పదవొస్తుందో రాదో చెప్పు?గురూ.. మా జిల్లాలో ఎవరెవరు మంతవ్రుతారు? తెలిస్తే చెప్పవా? ఏమండి.. పాత మంత్రులు ఎందరు ఉంటారు? కొత్తగా ఎవరొస్తారు? ఇది ఇప్పుడు రాష్ట్రంలో ఏ ఇద్దరు కలిసినా సాగుతున్న సంభాషణ. ఏ ఒక్కర్ని కదిలించినా ఒక్కటే మాట.. ‘మంత్రి అయ్యేదెవరు’? రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, షాపింగ్ కాంప్లెక్స్లు, జనం గుమికూడే ప్రధాన కూడళ్లతోపాటు ఫోన్లలోను కొద్ది రోజులుగా మంత్రి పదవులు ఎవరికి అనేది ఆరా తీయడమే కన్పిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అనుచరులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్కంఠతతో తీవ్ర ఉన్నారు. సామాన్య ప్రజలు సైతం మంత్రులెవరో ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు ఫోన్ల తాకిడి కొత్త మంత్రివర్గ కూర్పు నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మీడియా ప్రతినిధులకు నాయకులు, కార్యకర్తలు, బంధుమిత్రుల నుంచి ఫోన్ల తాకిడి పెరిగింది. ఫోన్ చేసి మరీ మంత్రులెవరంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అదేమంటే మీడియాకే మందు తెలుస్తుందనేగా మీకు చేస్తున్నదంటూ ఒకింత బెదిరిస్తున్నారు. సమాచారం రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ప్రతినిధులకు వచ్చిన కొన్ని ఫోన్లతో కొన్ని ఆసక్తికర అంశాలు ఇలా ఉన్నాయి.. మోహన్: అన్నా నమస్తే.. మంత్రి పదవులు ఎవరెవరికి ఇస్తారన్నా? విలేకరి: ఏమో అన్నా.. నాకెలా తెలుస్తుంది. మోహన్: అదేంటన్న మీ మీడియాకే మందు తెలుస్తుంది కదా? విలేకరి: సమీకరణలు, మార్పులు, కూర్పులను ఏదో కొద్దిగా అంచనా వేసి కథనాలు ఇస్తుంటాం. అన్నీ మాకే తెలుసని నీవనుకుంటే ఎలా అన్నా? మోహన్: సరే.. కొంచెం తెలిస్తే చెప్పండన్నా? విలేకరి: అలాగే ఏదైనా తెలిస్తే చెబుతాను. రాంబాబు: సార్.. మంత్రుల లిస్ట్ వచ్చిందా? విలేకరి: లేదండి.. అధికారికంగా విడుదల చేసాకే పూర్తి స్పష్టత వస్తుంది. రాంబాబు: అదేంటి.. కొన్ని పత్రికల్లో ఏకంగా మంత్రుల జాబితాను వేసేస్తున్నారు కదా? విలేకరి: ఉహాగానాలు వంద వస్తుంటాయి. ప్రభుత్వ అధికారిక ప్రకటనతోనే స్పష్టత వస్తుంది. రాంబాబు: మా జిల్లాలో పేర్లు ఏమైనా తెలిశాయా బాసూ.. విలేకరి: జిల్లాలు, సామాజికవర్గాలవారీగా మంత్రులను సీఎం ఎంపిక చేస్తారంట. ఇప్పుడు మనం జిల్లాలో పలానా వాళ్లకు మంత్రి పదవి వచ్చేస్తోందని చెప్పలేం. ఎందుకంటే సామాజికవర్గ సమీకరణల్లో ఒక్కటి మారితే మిగిలిన పేర్లపైన ప్రభావం పడుతుంది. సామాజిక సర్దుబాటులో ఉండే జాబితా కొంచెం క్లిష్టంగానే ఉంటుంది. మనం అంచనా వేయలేం. శాస్త్రి: టెన్షన్ భరించలేకపోతున్నాం. మా ఎమ్మెల్యేకు మంత్రి పదవి వస్తుందంటారా? విలేకరి: టెన్షన్ ఎందుకండి. సీఎం వద్ద మంత్రుల జాబితా ఉంటుంది. సోమవారం ప్రమాణస్వీకారం కాబట్టి ఆదివారమే మంత్రుల జాబితా ప్రకటిస్తారని అంటున్నారు. మరో 24 గంటలు ఓపిక పడితే మీ టెన్షన్కు తెరపడుతుంది. శాస్త్రి: ఏమోనండీ.. ఈ టెన్షన్ ఎక్కువైపోతోంది. తెలిస్తే చెప్పండి ప్లీజ్.. మంత్రి పదవులపైనా బెట్టింగ్లు సందట్లో సడేమియా అన్నట్టు బెట్టింగ్ రాయుళ్లు ఈ అంశాన్ని కూడా వదల్లేదు. పాత మంత్రుల్లో ఎంత మంది కొనసాగుతారు? కొత్తగా ఎంత మందికి ఇస్తారు? ఏఏ ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు? ఏ జిల్లాలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయి? ఎవరికి ఏ శాఖ ఇచ్చే అవకాశం ఉంది? అనే అనేక కోణాల్లో పందేలు కడుతున్నారు. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ తరహా బెట్టింగ్లు జరుగుతున్నట్టు సమాచారం. చదవండి: AP: కొత్త మంత్రివర్గంలోకి 15 మంది కొత్తవారు! -
AP: మంత్రుల ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను తలశిల రఘురాం, పొలిటికల్ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు. ఏప్రిల్ 11వ తేదీన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. -
సీఎం జగన్తో సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం రాత్రి సుమారు రెండు గంటల పాటు సీఎంతో సమావేశమైన సజ్జల.. శనివారం మరోసారి భేటీ అయ్యారు. మంత్రి వర్గ విస్తరణపై సీఎంతో చర్చించినట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ నిర్ణయం అంతా సీఎందే అని సజ్జల ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
సీఎం జగనే మాకు బలం
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తమకు కొండంత బలమని మంత్రులు చెప్పారు. సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. గురువారం మంత్రివర్గ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే.. జగన్కు సైనికుడిగా పని చేయడమే ఇష్టం సీఎం వైఎస్ జగన్కు సైనికుడిగా పనిచేయడమే నాకు ఇష్టం. అందరం సమష్టిగా పనిచేసి 2024లో మళ్లీ పార్టీని అధికారంలోకి తెస్తాం. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని మొదట్లోనే సీఎం చెప్పారు. అందులో భాగంగానే నేడు మంత్రులందరం చాలా సంతోషంగా రాజీనామాలు చేశాం. – అనిల్ కుమార్, జల వనరుల శాఖ మంత్రి పార్టీ కోసం పనిచేసే గొప్ప అవకాశం మంత్రులందరం రాజీనామా చేశాం. మరికొందరికి మంత్రులుగా అవకాశం లభిస్తుంది. పార్టీ కోసం పని చేసే గొప్ప అవకాశాన్ని సీఎం మాకు కల్పిస్తున్నారు. ఇదో గొప్ప అరుదైన క్షణం. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక శాఖ మంత్రి ఓటర్లంతా జగన్ వైపే నేను చాలా అదృష్టవంతుడిని. పేద కుటుంబంలో పుట్టా. మంత్రి పదవి వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా సమర్థంగా పనిచేశాను. ఓటర్లంతా జగన్ వైపు ఉన్నారు. కోటీశ్వరులు అంతా టీడీపీ వెంట ఉన్నారు. బలమైన నాయకుడు జగన్ని ఎదుర్కొనేందుకు పవన్ కల్యాణ్, చంద్రబాబు వంటి బలహీనులంతా ఏకమవుతున్నారు. – నారాయణ స్వామి, ఎక్సైజ్ శాఖ మంత్రి ఏ బాధ్యతలు ఇచ్చినా చేయడానికి సిద్ధం మాకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించాం. ఇకపై సీఎం ఏ బాధ్యతలు అçప్పగించినా చేయడానికి సిద్ధం. అవసరం మేరకు కొందరికి కేబినెట్ హోదాలో ప్రాంతీయ బాధ్యతలు అప్పగిస్తామని చెప్పారు. ఎవరికి ఏ బాధ్యతలు ఇస్తారనేది రెండు మూడు రోజుల్లో తెలుస్తుంది. – తానేటి వనిత, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎక్కడైనా సమర్థంగా పనిచేస్తాం మేమందరం ప్రభుత్వానికి, పార్టీకి నిండు మనసుతో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. స్వచ్ఛందంగా రాజీనామా పత్రాలు ఇచ్చాం. ఎవ్వరూ అసంతృప్తితో లేరు. మా సీఎం జగన్ నాయకత్వంలో ఎక్కడైనా సమర్థంగా పని చేస్తాం. – కురసాల కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి పార్టీ బాధ్యతలను గౌరవంగా స్వీకరిస్తా మూడేళ్లు సీఎంతో కలిసి పని చేసే అవకాశం దక్కడం గొప్ప వరం. మంత్రిగా పర్యాటక రంగం అభివృద్ధికి కొత్త పాలసీని తేవడం సంతృప్తినిచ్చింది. కరోనా లేకుంటే మంచి ఫలితాలు సాధించేవాళ్లం. పార్టీ బాధ్యతలు గౌరవంగా భావిస్తున్నాను. వచ్చే ఎన్నికల్లో పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తాం. – ముత్తంశెట్టి శ్రీనివాసరావు, పర్యాటక శాఖ మంత్రి పార్టీని అధికారంలోకి తేవడమే లక్ష్యం కేబినెట్ ఎలా ఉండాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం. వచ్చే ఎన్నికల్లో పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే మా బాధ్యత. సీఎం జగన్మోహన్రెడ్డి వైఎస్సార్కంటే మెరుగ్గా పనిచేస్తున్నారు. ఏ వాగ్దానంతో అధికారంలోకి వచ్చారో దానికి కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నారు. – బొత్స సత్యనారాయణ, పురపాలక శాఖ మంత్రి సీఎం నిర్ణయానికి కట్టుబడి ఉంటాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఐదారుగురు మంత్రులు కేబినెట్లో కొనసాగే అవకాశం ఉంది. నాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి. రాజీనామా విషయంలో సీఎం జగనే ఎక్కువగా బాధపడ్డారు. పార్టీ పరంగా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రికి తెలిపాం. – వెలంపల్లి శ్రీనివాస్, దేవదాయ శాఖ మంత్రి సీఎం ఏ బాధ్యతలు అప్పగించినా స్వీకరిస్తాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏ బాధ్యతలు అప్పగించినా నిర్వహిస్తాం. సీఎం ఒక ఆశయం, సిద్ధాంతం కోసం పనిచేస్తున్నారు. ఇకపై పార్టీ బలోపేతానికి పనిచేస్తాం. అనుభవం, సమీకరణల రీత్యా కొందరిని కొనసాగిస్తున్నట్లు సీఎం చెప్పారు. బడుగు బలహీన వర్గాలకు కేబినెట్ లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రజల కోసం శక్తివంచన లేకుండా పని చేసిన సీఎం జగన్ చరిత్ర పుటల్లో నిలిచిపోతారు. – కొడాలి నాని, పౌర సరఫరాల శాఖ మంత్రి -
అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపైనే..
సాక్షి, ముంబై: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇటీవల ముగియడంతో ఇక అందరి దృష్టి మంత్రివర్గ విస్తరణపై పడింది. మంత్రి పదవి దక్కనివారు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందోనని కళ్లలో వత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగియగానే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీంతో తమకు మంత్రి వర్గంలో చోటు లభిస్తుందా..లేదా.. ఒకవేళ చోటు లభిస్తే ఏ శాఖ తమకు లభిస్తుందని మహావికాస్ ఆఘాడి ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే బేరీజు వేసుకుంటున్నారు. ఇదిలాఉండగా అసెంబ్లీ స్పీకర్ను ఎన్నుకునేందుకు గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీ నుంచి ఇప్పటికీ అనుమతి లభించలేదు. ఫలితంగా బడ్జెట్ సమావేశాలు స్పీకర్ లేకుండానే కొనసాగాయి. దీంతో కనీసం మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు చేసుకోవాలని మహా వికాస్ ఆఘాడి మంత్రులందరు భావిస్తున్నారు. అందుకు ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మంత్రులు చొరవ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో ఇరుపార్టీల మంత్రులు ఈ నెల ఏడు లేదా ఎనిమిదో తేదీన ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కానున్నారు. రెండేళ్లలో ఎన్నో ఒడిదుడుకులు... ఓ యువతి ఆత్మహత్య కేసులో సంజయ్ రాఠోడ్ అటవీ శాఖ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ శాఖ ప్రస్తుతం ఉద్ధవ్ ఠాక్రే వద్ద ఉంది. అదేవిధంగా వంద కోట్ల అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అనిల్ దేశ్ముఖ్ హోంశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం దేశ్ముఖ్ ఈడీ కస్టడీలో ఉన్నారు. ఖాళీగా ఉన్న హోం శాఖ పదవీ బాధ్యతలు దిలీప్ వల్సే పాటిల్ చూసుకుంటున్నారు. మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 50 శాతం కాలవ్యవధి పూర్తయింది. దీంతో మంత్రి వర్గ విస్తరణ అంశం జోరందుకుంది. ఇదిలాఉండగా మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టేందుకు నానా పటోలే 2021 ఫిబ్రవరిలో అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి స్పీకర్ పదవి ఖాళీగానే ఉంది. చదవండి: (పెరిగిన ఇళ్ల విక్రయాలు.. రికార్డు స్థాయిలో రిజిస్ట్రేషన్లు) అయితే తాత్కాలికంగా ఈ పదవి బాధ్యతలు ఉపాధ్యక్షుడు నరహరీ జిరవల్ వద్ద ఉన్నాయి. జిరవల్ ఎన్సీపీకి చెందిన ఎమ్మెల్యే. విధాన్ పరిషత్ స్పీకర్ రామ్రాజే నింబాల్కర్ నాయిక్ సభ్యత్వం 2022 జూలైలో పూర్తికానుంది. దీంతో విధాన్సభ, విధాన్ పరిషత్లో కీలకమైన స్పీకర్ పదవులు పరస్పరంగా మార్చుకునే అవకాశాలున్నాయి. దీనిపై కూడా మహావికాస్ ఆఘాడి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అసెంబ్లీలో స్పీకర్ పదవికి రాజీనామా చేసిన నాటి నుంచి నానా పటోలేకు మంత్రి పదవిపై ఆసక్తి పెరిగిపోయింది. ప్రస్తుతం శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కోటాలోని మంత్రి పదవులు ఖాళీగా లేవు. దీంతో తమ వాటాలోని మంత్రుల పదవుల్లో మార్పులు జరిగితే తప్ప తమకు అవకాశం లభించదని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. ఇప్పటికే నిధుల పంపిణీ విషయంలో తమను చిన్నచూపు చూస్తున్నారని, ఫలితంగా తమ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టలేకపోతున్నామని అసంతృప్తికి గురైన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ అధినేత్రి సోనియా గాం«ధీకి నేరుగా లేఖ రాశారు. ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేశారు. దీంతో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్ధానం కల్పించి వారిని సంతోషపెట్టే ప్రయత్నం జరుగుతోంది. అందుకు గురువారం లేదా శుక్రవారం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ కావాలని భావిస్తున్నారు. ఈ భేటీలో ఏఏ అంశాలపై చర్చిస్తారు? మంత్రివర్గ విస్తరణపై ఏం నిర్ణయం తీసుకుంటారనేదానిపై అందరూ దృష్టి సారించారు. -
తన మార్కు చూపించేలా సీఎం ప్లాన్.. 8 మంది మంత్రులు ఇంటికేనా?
సాక్షి, బెంగళూరు(కర్ణాటక): తనదైన మార్కు చూపించేలా మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని సీఎం బసవరాజ బొమ్మై భావిస్తున్నారు. ఆయన సీఎం పీఠమెక్కి నాలుగు నెలలైంది. కేబినెట్లో సుమారు 8 మంది పనితీరు బాగాలేదని బొమ్మై అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అటువంటివారిని సాగనంపి కొత్తవారిని తీసుకోవాలని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపు లక్ష్యంగా ఈ మార్పులు ఉండాలని అనుకుంటున్నారు. పరిషత్ ఎన్నికల ముగియగానే ఈనెల 10వ తేదీన స్థానిక సంస్థల కోటాలో 25 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. వాటి ఫలితాలు 14న వెల్లడిస్తారు. ఆ వెంటనే కేబినెట్లో మార్పులు చేర్పులు చేపట్టే అవకాశముంది. మొన్నటి సీఎం ఢిల్లీ పర్యటనలోనూ మంత్రుల మార్పు గురించి హైకమాండ్తో చర్చించారు. ఎవరిని ఉంచాలి, ఎవరిని తీసేయాలనేదానిపై నాయకత్వం నుంచి సూచనలు రాగానే పని ప్రారంభిస్తారు. పార్టీలో బలమైన నేతగా ఉన్న బీఎస్ యడియూరప్పను బుజ్జగించేలా ఆయన తనయుడు బీవై విజయేంద్రకు మంత్రివర్గంలో స్థానం కల్పించే ఆలోచన ఉంది. చదవండి: ‘సినిమాలు తప్ప బాలకృష్ణకు ప్రజా సమస్యలపై ధ్యాసేలేదు.. ఆరు నెలలకోసారైనా..’ -
ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా యూపీ మంత్రివర్గ విస్తరణ
లక్నో: వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని ఆదివారం మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా ఏడుగురిని కేబినెట్లో చేర్చుకున్నారు. వీరిలో ఒకరు బ్రాహ్మణ నాయకుడు కాగా, ముగ్గురు ఓబీసీ, ఇద్దరు ఎస్సీ, ఒక ఎస్టీ నాయకుడు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బ్రాహ్మణ నేత జితిన్ ప్రసాదకు ఊహించినట్లుగానే కేబినెట్లో స్థానం దక్కింది. ఓబీసీ వర్గానికి చెందిన ఛత్రపాల్ గంగ్వార్ (ఎమ్మెల్యే), ధరంవీర్ ప్రజాపతి(ఎమ్మెల్సీ), డాక్టర్ సంగీతా బల్వంత్ బిండ్(ఎమ్మెల్యే), ఎస్సీ సామాజిక వర్గం నుంచి దినేష్ ఖతీక్(ఎమ్మెల్యే), పల్తూరామ్(ఎమ్మెల్యే), ఎస్టీ సామాజిక వర్గం నుంచి సంజీవ్ కుమార్(ఎమ్మెల్యే) మంత్రులయ్యారు. చదవండి: (యూపీ బరిలో ఒవైసీ అలజడి) బ్రాహ్మణుల్లో అసంతృప్తిని చల్లార్చడానికేనా! ఉత్తరప్రదేశ్ ఓటర్లలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారు. రాజకీయంగా నిర్ణయాత్మక శక్తిగా కొనసాగుతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి బలమైన మద్దతుదారులైన బ్రాహ్మణులు క్రమంగా బీజేపీ వైపు చేరిపోయారు. ఠాకూర్ సామాజికవర్గం నాయకుడైన సీఎం యోగి పట్ల వారిలో అసంతృప్తి రగులుతోంది. యోగి ప్రభుత్వంలో తమను అణచివేస్తున్నారన్న భావన బ్రాహ్మణుల్లో పెరిగిపోతోంది. పరిస్థితిని గమనించిన బీజేపీ అధిష్టానం బ్రాహ్మణ వర్గాన్ని మంచి చేసుకొనే ప్రయత్నాలు ప్రారంభించింది. కాంగ్రెస్ పార్టీలోని ప్రముఖ బ్రాహ్మణ నాయకుడు, రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న జితిన్ ప్రసాదపై వల విసిరింది. తమ పార్టీలోకి వస్తే సముచిత గౌరవం కల్పిస్తామని హమీ ఇచ్చింది. దీంతో ఆయన ఈ ఏడాది జూన్లో బీజేపీలో చేరారు. అనుకున్నట్లుగానే మంత్రి పదవిని కట్టబెట్టింది. తద్వారా బ్రాహ్మణుల ఓట్లను గంపగుత్తగా బీజేపీ వైపు మళ్లించే బాధ్యతను ఆయనపై మోపింది. చదవండి: (Punjab: 15 మందితో నూతన మంత్రి వర్గం) -
కర్ణాటక కేబినెట్ విస్తరణ
-
రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి పిలుపు !
బెంగళూరు: కర్ణాటక కేబినెట్ విస్తరణ వ్యవహారంపై రెండు రోజుల్లో ఢిల్లీ నుంచి తనకు పిలుపు రావచ్చని కర్ణాటక నూతన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శనివారం వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వెళ్లిన ఆయన శనివారం తిరిగి వచ్చారు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్, బీజేపీ జాతీయాధ్యక్షుడు నడ్డాలను కలిశారు. అయితే నడ్డాను శనివారం కలిసే అవకాశం రాలేదని, మళ్లీ పిలుపు రావచ్చని పేర్కొన్నారు. అప్పుడు ఢిల్లీ వెళ్లి కేబినెట్ కూర్పుపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. మంత్రివర్గ విస్తరణ రెండు దశల్లో జరగనుందా అని మీడియా ప్రశ్నించగా, ఆ విషయాన్ని ఇప్పుడే వెల్లడించలేమని పేర్కొన్నారు. కొనసాగుతున్న లాబీయింగ్.. మంత్రులను ఎంపిక చేసే వ్యవహారంలో పలువురు ఆశావహులు ఇప్పటికే ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ ప్రాంరభించారు. మాజీ మంత్రులు సైతం ఢిల్లీ వేదికగా తమ అవకాశాలను పరీక్షించుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు రమేశ్ జార్కిహోళి, ఎంపీ రేణుకాచార్య, మునిరత్నలు మాజీ సీఎం యడియూరప్పను ఆయన నివాసంలో కలిశారు. బీజేపీ సీనియర్ నేత కె.ఎస్ ఈశ్వరప్ప మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా యడియూరప్ప తొలగింపు జరిగాక తనను సీఎం చేయాల్సిందని, ఇప్పటికైనా తనకు డిప్యూటీ సీఎం ఇవ్వాల్సిందిగా పలువురి నుంచి ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉందని అన్నారు. మా వర్గం నుంచి ఎవరూ లేరు.. హవేరీ ఎమ్మెల్యే నెహరు ఒలేకర్ మాట్లాడుతూ.. రాబోయే కేబినెట్లో తనకు చోటు దక్కాలని తమ నియోజకవర్గ కార్యకర్తలు కోరుకుంటున్నారని చెప్పారు. ఇలాంటి ఓ అవకాశం రావడం ఇది మూడో సారి అని, నేతలు తనను దీవిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. తమ చాలవాడి వర్గం నుంచి ఇప్పటి వరకూ బీజేపీలో ఎవరికీ అవకాశం దక్కలేదని అన్నారు. కాంగ్రెస్లో తమ వర్గానికి గతంలో అవకాశం దొరికిందని అన్నారు. ఇప్పుడు అవకాశం రాకపోతే కాంగ్రెస్ వైపు వెళతారనే భయం ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా కేబినెట్ను ఏర్పాటు చేయాలని ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య బీజేపీని కోరారు. ముఖ్యమంత్రి ఒక్కడే అన్ని వ్యవహారాలను నిర్వహించలేరని పేర్కొన్నారు. -
బసవరాజు బొమ్మై కేబినెట్: కుర్చీలాట షురూ..
సాక్షి, బెంగళూరు: కొత్త సీఎం ప్రమాణ స్వీకారంతో బీజేపీలో ఒక ఘట్టం ముగియగానే మరో ముఖ్య ఘట్టానికి కౌంట్డౌన్ మొదలైంది. కొత్త ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై కేబినెట్లో పదవుల కోసం పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు ముమ్మర ప్రయత్నాలకు నాంది పలికారు. ఢిల్లీలోనూ మకాం వేసి నేతలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పాత కేబినెట్లో పది మందికి పైగా మంత్రులకు మొండిచేయి తప్పేలా లేదు. ఈసారి కొత్తవారికి అందులోనూ బీజేపీ మూలాలు ఉన్నవారికి మంత్రి పదవులు దక్కేలా ఉంది. యడియూరప్ప మంత్రివర్గంలో సీనియర్ మంత్రులు అయిన కేఎస్ ఈశ్వరప్ప, సురేశ్ కుమార్, సీసీ పాటిల్, కోటా శ్రీనివాస పూజారి, శశికళా జొల్లె తదితరులకు చెక్ పడుతుందని సమాచారం. ఆ సీనియర్లకు భరోసా?.. గత కాంగ్రెస్– జేడీఎస్ల నుంచి వచ్చిన వలసదారుల్లో 15 మంది వరకూ యడియూరప్ప వద్ద మంత్రిగా ఉండేవారు. కొత్త మంత్రివర్గంలో 5–6 మందికి మాత్రమే మంత్రిభాగ్యం దక్కవచ్చని వినికిడి. సీనియర్ మంత్రులు, ఆర్.అశోక్, శ్రీరాములు, గోవింద కారజోళ, డాక్టర్ సీఎన్ అశ్వత్థ నారాయణ, లక్ష్మణ సవది, వి.సోమణ్ణ, మాధుస్వామి వంటి నేతల స్థానాలకు ఢోకా లేదని చెప్పుకుంటున్నారు. సభాపతి విశ్వేశ్వర హెగ్డే కాగేరికి చాన్సుంది. ఆదివారంలోగా నిర్ణయం ఆదివారంలోగా ఖరారు చేసి మంత్రిమండలిని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కొత్త సీఎం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గ కూర్పు మొత్తం బీజేపీ అధిష్టానం చేతుల్లో ఉంది. బీజేపీ హైకమాండ్ నిర్ణయం మేరకే కేబినెట్ కూర్పు జరగనున్నట్లు తెలిసింది. యడియూరప్ప మాజీ సీఎం అయినప్పటికీ పార్టీ ఎమ్మెల్యేలకు ఆయనే పెద్దదిక్కుగా ఉన్నారు. ఆశావహులు యడియూరప్ప ఇంటికి పరుగులు పెడుతున్నారు. యడ్డి చెబితే మంత్రి పదవి వచ్చేస్తుందని ఆశతో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఎస్ఆర్ విశ్వనాథ్, అప్పుగౌడ పాటిల్, రేణుకాచార్య, మునేనకొప్ప, తిప్పారెడ్డి తదితరులు ఆయనను కలిసి చర్చించారు. -
రాజస్తాన్పై కాంగ్రెస్ దృష్టి
జైపూర్: పంజాబ్లో రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించిన కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు తన దృష్టి రాజస్తాన్పైకి మళ్లించింది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్ల మధ్య ఇంకా ఘర్షణాత్మక వాతావరణమే కొనసాగుతోంది. కేబినెట్లో బెర్త్ల కోసం సచిన్ పైలెట్ వర్గీయులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు. దీనిపై కాలయాపన జరుగుతూ ఉండటంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు రోజుల క్రితమే సచిన్ పైలెట్ అధిష్టానం తమ డిమాండ్లను నెరవేరుస్తుందని సూచనప్రాయంగా వెల్లడించారు. ఆ తర్వాతే మంత్రివర్గంలోకి తీసుకునే సభ్యులపై కసరత్తు చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి కె.సి. వేణుగోపాల్, రాజస్తాన్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ అజయ్ మాకెన్ జైపూర్కు చేరుకొని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్తో మంతనాలు జరిపారు. ఈ నెల 28న కేబినెట్ విస్తరణ చేపట్టాలని అధిష్టానం భావిస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోత్సారా ఆదివారం ఉదయం 25 మంది ఎమ్మెల్యేలతో సమావేశమై కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ సమావేశానికి హాజరైన సచిన్ పైలెట్ కేబినెట్లో తన వర్గీయులకి చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. తొమ్మిది ఖాళీలు వేణుగోపాల్, అజయ్ మాకెన్ గత రెండు రోజులుగా వరుసగా పార్టీ నాయకుల్ని కలుసుకొని మాట్లాడుతున్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. ‘‘కేబినెట్ విస్తరణపై చర్చలు జరిపాం. జిల్లా, బ్లాక్ స్థాయిలో పార్టీ చీఫ్ల నియామకం, వివిధ పాలకమండళ్లు, కార్పొరేషన్లలో నియామకాలకు సంబంధించిన కసరత్తు మొదలైంది. రాజస్తాన్ కాంగ్రెస్లో ఎలాంటి విభేదాలు లేవు. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని నేతలందరూ చెబుతున్నారు ’’ అని మాకెన్ తెలిపారు. రాజస్తాన్ కేబినెట్లో అత్యధికంగా 30 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం సీఎం గహ్లోత్తో సహా కేబినెట్లో 21 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా తొమ్మిది మందికి కేబినెట్లో చోటు కల్పించే అవకాశం ఉంది. గత ఏడాది 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి ముఖ్యమంత్రి గహ్లాత్పై సచిన్ పైలెట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ అధిష్టానంతో సయోధ్య కుదిరి ఆయన వెనక్కుతగ్గారు. -
ఆస్తులే కాదు.. అప్పులూ ఉన్నాయి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన కేంద్ర మంత్రి వర్గంలో ఆస్తులే కాదు అప్పులు కూడా రూ.కోట్లలో ఉన్నవారు ఉన్నారని నేషనల్ ఎలక్షన్ వాచ్/ఏడీఆర్ సంస్థ పేర్కొంది. తాజా మంత్రివర్గంలోని ప్రధాని సహా 78 మంది మంత్రులకు సంబంధించి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లలోని సమాచారం మేరకు ఈ వివరాలు వెల్లడించినట్లు సంస్థ తెలిపింది. ఈ అంశాలపై దృష్టి.. తాజా మంత్రివర్గ విస్తరణలో 43 మంది కొత్త వారు చేరిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఈ నివేదికలో మంత్రుల నేర, ఆర్థిక, విద్య తదితర అంశాలపై దృష్టి సారించినట్లు సంస్థ తెలిపింది. 33 మంది (42శాతం) మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, అందులో 24 (31 శాతం) మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, హోంశాఖ సహాయ మంత్రి నిశిత్ ప్రమానిక్పై హత్య సంబంధిత కేసు కూడా ఉందని తెలిపింది. 70 మంది (90 శాతం) కోటీశ్వరులని, మంత్రుల సరాసరి ఆస్తుల విలువ రూ.16.24 కోట్లు అని నివేదికలో తెలిపింది. సర్బానంద సోనోవాల్, ఎల్. మురుగన్ల వివరాలు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్ల నుంచి సేకరించినట్లు సంస్థ పేర్కొంది. విద్య: 12 మంది మంత్రులు తమ విద్యార్హతలు 8 నుంచి 12 మధ్యేనని పేర్కొనగా 64 మంది మంత్రులు గ్రాడ్యుయేషన్ అంతకన్నా ఎక్కువని, ఇద్దరు డిప్లొమా చదివినట్లు అఫిడవిట్లోపేర్కొన్నారు. ఎనిమిది పాస్: జాన్ బర్లా, నిశిత్ ప్రమానిక్ 10 పాస్: బిశ్వేశ్వర్ తుడు, రామేశ్వర్ తేలి, నారాయణరాణే 12 పాస్: అమిత్ షా, అర్జున్ ముండా , పంకజ్ చౌధరి, రేణుక సింగ్ సూరత, సాధ్వి నిరంజన్ జ్యోతి, స్మృతి ఇరానీ, రాందాస్ అథవాలే. క్రిమినల్ కేసులు: నలుగురు కేంద్రమంత్రులపై హత్యాయత్నం కేసులు నమోదుకాగా నిశిత్ ప్రమానిక్పై హత్య సంబంధిత కేసునమోదైంది. మతఘర్షణల కేసులు.. ఐదుగురు మంత్రులపై మత ఘర్షణల కేసులు నమోదు అయ్యాయి. మతం, జాతి, మతం, మత విశ్వాసాలను అవమానించడం ద్వారా మతపరమైన ఘర్షణలకు ఉద్దేశ పూర్వక చర్యలకు పాల్పడడం (ఐపీసీ సెక్షన్ 295ఏ) రూ.10 కోట్లపైనే అప్పులు 16 మందిమంత్రులకు రూ.కోటికన్నా ఎక్కువ అప్పులు ఉండగా వీరిలో ముగ్గురుకి రూ.10 కోట్లకన్నా పైనే అప్పులున్నాయని వారి వారి అఫిడవిట్లు చెబుతున్నాయనిసంస్థ పేర్కొంది. రూ.కోటి కన్నా తక్కువే ఎనిమిది మంది మంత్రు ల ఆస్తి రూ.కోటికన్నా తక్కువేనని వారి అఫిడవిట్లు చెబుతున్నా యని సంస్థ పేర్కొంది. ధన ‘మంత్రులు’ -
కేబినెట్ విస్తరణ: నిర్మలా సీతారామన్ ట్వీట్ వైరల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జంబో కేబినెట్ విస్తరణలో మహిళా మంత్రుల సంఖ్య కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మహిళా సహచరులతో దిగిన ఒక ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. దీంతో ఈ ఫోటోవైరల్గా మారింది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో సహా మొత్తం తొమ్మిది మందితో కలిసి దిగిన ఫోటోను ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. కొత్త కేబినెట్లో మహిళలకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కొత్త మహిళా మంత్రులకు అభినందనలు తెలుపుతూ బయోకాన్ ఎండీ కిరణ్ మజుందార్ షా సహా పలువురు మహిళా దిగ్గజాలు, ఇతర ప్రముఖులు కూడా ఈ ఫోటోను షేర్ చేయడం విశేషం. With Minister @smritiirani and the ministers who were sworn in today. From left @DarshanaJardosh @PratimaBhoumik @ShobhaBJP @bharati_mp @M_Lekhi @AnupriyaSPatel @Annapurna4BJP Grateful to National President @JPNadda for graciously joining us. pic.twitter.com/ghoW6t7sTX— Nirmala Sitharaman (@nsitharaman) July 7, 2021 దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్ లోని సూరత్ నుండి లోక్సభకు ఎంపికయ్యారు. బీజేపీ తరపున ఆమె మూడో సారి ఎంపీగా ఉన్నారు. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా ఈమె వృత్తిరీత్యా వ్యాపారవేత్త . ప్రస్తుతం వస్త్రాలు, రైల్వే సహాయమంత్రి. ప్రతిమా భౌమిక్ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్ త్రిపుర వెస్ట్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సామాజిక న్యాయం, సాధికారత శాఖా సహాయ మంత్రి శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెందిన శోభ వరసగా రెండోసారి ఎంపీగా ఉన్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రి. భారతి ప్రవీణ్ పవార్ (42): మహారాష్ట్రలోని ఖందేశ్కు చెందిన డా. భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి (54): సుప్రీంకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త లేఖి ఎన్డీఎంసీ సభ్యురాలు కూడా న్యూఢిల్లీ నుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. విదేశీ వ్యవహారాలు, సంస్కృతి మంత్రి అనుప్రియ సింగ్ పటేల్ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్(సోనేలాల్) పార్టీ అధ్యక్షురాలు.మీర్జాపూర్ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. వాణిజ్యం & పరిశ్రమల మంత్రిగా నియమితులయ్యారు. అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్లోని నార్త్ఛోతంగపూర్కు చెందిన అన్నపూర్ణ దేవి నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. జార్ఖండ్ మంత్రిగా పనిచేశారు. తొలిసారి ఎంపీగా గెలిచి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. విద్యాశాఖ సహాయ మంత్రిగా ఎంపికయ్యారు. కాగా రెండోసారి అధికారం చేపట్టిన తరువాత ప్రధాని మోదీ తన తొలి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్ లాంటి కీలక మంత్రులకు అనూహ్యంగా ఉద్వాసన పలకడం చర్చకు దారి తీసింది. ఒక దశలో ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్కు ఉద్వాసన తప్పదనే వాదన కూడా వినిపించింది. కొత్త మంత్రులంతా బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు.నేడు (గురువారం) దాదాపు అందరూ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. -
కేబినెట్ విస్తరణ: 35 మంది కొత్త మంత్రుల ప్రొఫైల్..
సాక్షి, న్యూఢిల్లీ : పలు రాష్ట్రాల్లో ఎన్నికలు, సామాజిక సమీకరణాల ప్రాతిపదికగా 77 మంది మంత్రులతో కొత్త మంత్రి మండలి కొలువుతీరింది. నారాయణ రాణె, శర్బానంద, జ్యోతిరాదిత్య సింథియా, అనుప్రియ పటేల్ తదితరుల కొత్త కేబినెట్లో స్థానం సంపాదించారు. వీరిలో కొందరు గురించి క్లుప్తంగా.. నారాయణ రాణే (69): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన వారు. శివసేనలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగానూ విధులు నిర్వర్తించారు. అనంతరం కాంగ్రెస్లో కీలకపాత్ర పోషించారు. 2017లో సొంతంగా మహారాష్ట్ర స్వాభిమాన్ పక్ష పార్టీని స్థాపించారు. 2020లో పార్టీని బీజేపీలో విలీనం చేశారు. బీజేపీ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆరు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసిన రాణే రాజ్యసభ సభ్యుడు కావడం తొలిసారి. మహారాష్ట్ర పరిశ్రమలు, రెవెన్యూ, ఓడరేవులు, పశుసంవర్ధక వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. 35 ఏళ్లుగా ఏదో ఒక పదవిలో ఉన్నారు. రాజకీయాలకు ముందు 1971 నుంచి 1984 వరకూ ఆదాయపన్ను శాఖలో పనిచేశారు. శర్బానంద సోనోవాల్ (58): అస్సాంలోని దిబ్రూగఢ్కు చెందినవారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేసిన సోనోవాల్ అసోం గణపరిషద్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో బీజేపీలో చేరారు. 2014లో లఖింపూర్ నుంచి ఎంపీగా ఎన్నికై ప్రధాని మోదీ కేబినెట్లో క్రీడల మంత్రిగా పనిచేశారు. 2016లో అస్సాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. వీరేంద్ర కుమార్ (67): మధ్యప్రదేశ్లోని సాగర్లో జన్మించారు. సీనియర్ పార్లమెంటేరియన్. ఏడుసార్లు ఎంపీగా గెలిచారు. 17వ లోక్సభ ప్రొటెం స్పీకర్గా పనిచేశారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ విస్తరణ సమయంలో మైనారిటీ వ్యవహారాలు, మహిళ,శిశు అభివృద్ధి శాఖల సహాయ మంత్రిగా నియమితులయ్యారు. జ్యోతిరాదిత్య సింథియా (50): మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2020లో బీజేపీలో చేరి రాజ్యసభ సభ్యుడయ్యారు. జ్యోతిరాదిత్య రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రామచంద్ర ప్రసాద్ సింగ్ (63): బిహార్లోని నలందకు చెందిన రామచంద్ర ప్రసాద్ ఎన్డీయే భాగస్వామ్య పార్టీ జేడీయూ కీలకనేత. యూపీ క్యాడర్ 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన సింగ్ 2010 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారు. అశ్విని వైష్ణవ్ (50): ఒడిశాకు చెందిన అశ్విని వైష్ణవ్ 2019లో రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి. పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీయే చేశారు. 1994 బ్యాచ్ ఐఏఎస్ (27వ ర్యాంకు) అధికారి. జాతీయ మానవ హక్కుల కమిషన్ ప్రశంసలు పొందారు. 1999లో ఒడిశాలో సైక్లోన్ సమయంలో యూఎస్ నేవీ వెబ్సైట్ ట్రాక్ చేసి తాజా పరిస్థితులు ఉన్నతాధికారులకు చేరవేసి భారీ నష్టం జరగకుండా చూశారు. వాజపేయి హయాంలో పీఎంవోలో పనిచేశారు. పశుపతి కుమార్ పారస్ (68): బిహార్లోని ముంగేర్కు చెందిన పశుపతి పారస్ ఎన్డీయే భాగసామ్య లోక్జనశక్తి పార్టీ అధ్యక్షుడు. బిహార్లోఏడు సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశంలోని సీనియర్ చట్టసభ సభ్యుల్లో ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా ప్రజా జీవితంలోకొనసాగుతున్నారు. భాగల్పూర్ వర్సిటీ నుంచి బీఈడీ చేశారు. భూపేందర్ యాదవ్ (52): బీజేపీలో ట్రబుల్ షూటర్గా పేరుపొందిన భూపేందర్ యాదవ్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అమిత్షా అనుచరుడిగా పేరొందిన భూపేందర్ పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో తన నాయకత్వ లక్షణాల ద్వారా గుర్తిం పు పొందారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల సమ యంలో పార్టీ పర్యవేక్షకుడిగా వ్యవహరించారు. పంకజ్చౌధరి (56): ఉత్తరప్రదేశ్లోని మహారాజ్గంజ్ లోక్సభ సభ్యుడు. ఆరోసారి ఎంపీగా ఉన్నారు. గతంలో గోరఖ్పూర్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న చౌధరి గోరఖ్పూర్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. అనుప్రియ సింగ్ పటేల్ (40): ఎన్డీయే భాగస్వామి అప్నాదళ్(సోనేలాల్) పార్టీ అధ్యక్షురాలు. ఛత్రపతి సాహూజీ మహరాజ్ వర్సిటీ నుంచిఎంబీయే చేసిన అనుప్రియ అమిటీ వర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు. మీర్జాపూర్ నుంచి వరసగా రెండోసారి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రధాని మోదీ తొలి కేబినెట్లో ఆరోగ్య శాఖసహాయమంత్రిగా పనిచేశారు. యూపీ ఎమ్మెల్యేగానూ పనిచేశారు. వెనకబడిన వర్గాల సమస్య పరిష్కారం నిమిత్తం మైనారిటీ వ్యవహారాల స్థానంలో ఓబీసీ మంత్రిత్వశాఖ తీసుకురావాలని ఇటీవలే అనుప్రియ డిమాండు చేశారు. ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగేల్ (61): యూపీలోని ఆగ్రాకు చెందిన భగేల్ ఐదోసారి ఎంపీ. యూపీప్రభుత్వంలో పశుసంవర్ధక, మత్స్య, మైనర్ ఇరిగేషన్ శాఖలకు మంత్రిగా పనిచేశారు. మిలటరీ సైన్స్లో పీహెచ్డీ చేసిన భగేల్ ఎల్ఎల్బీ తోపాటు ఎంఏ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. రాజీవ్ చంద్రశేఖర్ (57): బెంగళూరుకు చెందిన రాజీవ్ రాజ్యసభ సభ్యుడు. పలు పార్లమెంటరీ స్థాయీ సంఘాల్లో సభ్యుడిగా ఉన్నారు. విజయవంతమైన పారిశ్రామికవేత్తగా గుర్తింపుపొందారు. హార్వర్డ్ యూనివర్సిటీలో అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ చేసిన రాజీవ్ కంప్యూటర్ సైన్స్లో ఎంటెక్ చేశారు. శోభ కరాంద్లాజే (54): దక్షిణ కన్నడ ప్రాంతానికి చెంది శోభ ఉడుపి చిక్మగ్లూర్ నియోజకవర్గంనుంచి వరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కర్ణాటకలో ఆహార, ప్రజా పంపిణీ, విద్యుత్తు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేశారు. మూడు దశాబ్దాలుగా ప్రజా జీవనంలో ఉన్న శోభ సోషియాలజీలో ఎంఏ చేశారు. భానుప్రతాప్ సింగ్ వర్మ: ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్కు చెందిన భానుప్రతాప్ జలాన్ నియోజకవర్గం నుంచి ఐదోసారి ఎంపీగా గెలిచారు. యూపీ ఎమ్మెల్యేగానూ ఎన్నికైన వర్మ మూడు దశాబ్దాలకు పైగా ప్రజా జీవితంలో ఉన్నారు. బుందేల్ఖండ్ వర్సిటీ నుంచి ఎంఏ, ఎల్ఎల్బీ పట్టా అందుకున్నారు. దర్శన విక్రమ్ జర్దోష్ (60): గుజరాత్లోని సూరత్కు చెందిన దర్శన మూడోసారి సూరత్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గుజరాత్ సోషల్ వెల్ఫేర్ బోర్డు సభ్యురాలిగా పనిచేసిన దర్శన సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్గా పనిచేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న ఆమె బీకాం చదివారు. సంస్కృతి ఆర్ట్ కల్చర్ సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. మీనాక్షి లేఖి (54): న్యూఢిల్లీ నియోజవర్గం నుంచివరసగా రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయవాది అయిన లేఖి ఎన్డీఎంసీ సభ్యురాలిగా కూడా ఉన్నారు. మీడియాలో బీజేపీ వాయిస్గా పేరుపొందిన మీనాక్షి సామాజిక కార్యకర్తగానూ సేవలందించారు. ప్రధాని మోదీని ‘చౌకీదార్ చోర్ హై’అని వ్యాఖ్యానించిన రాహుల్గాంధీపై సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ ఛైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ప్యానెల్ స్పీకర్ సభ్యురాలు. అన్నపూర్ణదేవి (51): జార్ఖండ్లోని నార్త్ఛోతంగపూర్కు చెందినఅన్నపూర్ణ దేవి కోడర్మ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన ఆమె జార్ఖండ్ సాగునీరు, మహిళ, శిశు అభివృద్ధి, రిజి్రస్టేషన్ శాఖల మంత్రిగా పనిచేశారు. రెండు దశాబ్దాల క్రితం 30 ఏళ్ల వయసులో జార్ఖండ్ మైన్స్,జియాలజీ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాంచీవర్సిటీ నుంచి చరిత్రలో ఎంఏ చేశారు. ఎ.నారాయణ స్వామి (64): కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన నారాయణ స్వామి చిత్రదుర్గ నియోజకవర్గం నుంచితొలిసారి ఎన్నికయ్యారు. కర్ణాటక అసెంబ్లీకి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన కేబినెట్మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజా జీవితంలో ఉన్న నారాయణస్వామి బీఏ చదివారు. కౌశల్ కిషోర్ (61): ఉత్తరప్రదేశ్లోని అవద్కు చెందిన కౌశల్ మోహన్లాల్గంజ్ నియోజకవర్గానికి రెండోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీ ప్రభుత్వంలో సహాయమంత్రిగా పనిచేసిన కౌశల్ మూడు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. బీఎస్సీ చదివారు. అజయ్భట్ (60): ఉత్తరాఖండ అల్మోడాకు చెందిన అజయ్ భట్ నైనిటాల్–ఉధమ్సింగ్నగర్ నుంచి తొలిసారి ఎన్నికయ్యారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన భట్ ఉత్తరాఖండ్ ప్రభుత్వంలో పలు మంత్రిత్వశాఖలు చేపట్టారు. రెండున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న అజయ్భట్ న్యాయవాది. బీఎల్ వర్మ (59): ఉత్తరప్రదేశ్లోని రోహిలాఖండ్కు చెందిన వర్మ రాజ్యసభ సభ్యుడు మూడున్నర దశాబ్దాలుగా ప్రజాజీవితంలో ఉన్న వర్మ వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత వర్సిటీ నుంచి ఎంఏ పూర్తిచేశారు. అజయ్కుమార్ (60): ఉత్తరప్రదేశ్లోని అవద్కు చెందిన అజయ్కుమార్ ఖేరి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాపరిషద్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా పదవులు నిర్వహించారు. మూడు దశాబ్దాలపాటు ప్రజాజీవితంలో ఉన్న అజయ్కుమార్ బీఎస్సీ ఎల్ఎల్బీ చేశారు. చౌహాన్ దేవుసిన్హ్ (56): గుజరాత్లోని ఖేడాకు చెందిన చౌహాన్ వరసగా రెండోసారి ఖేడా నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆల్ఇండియా రేడియోలో ఇంజినీరుగా పనిచేసిన చౌహాన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డిప్లొమాచేశారు. భగవంత్ కుభ(54): కర్ణాటకలోని బీదర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మెకానికల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. కపిల్ మోరేశ్వర్ పాటిల్ (60): మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతానికి చెందిన కపిల్ భివండి నియోజకవర్గంనుంచిప్రాతినిధ్యం వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వివిధ పదవుల్లో ఉన్న కపిల్ సర్పంచి, జిల్లా పరిషద్ అధ్యక్షుడిగానూ వ్యవహరించారు. ముంబయి వర్సిటీ నుంచి బీఏ పూర్తి చేశారు. ప్రతిమా భౌమిక్ (52): అగర్తలాకు చెందిన ప్రతిమా భౌమిక్ త్రిపుర వెస్ట్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. బయోసైన్స్లో గ్రాడ్యుయేషన్ చేశారు. సుభాష్ సర్కార్ (67): పశ్చిమ బెంగాల్ మేదినిపూర్కు చెందినసుభాష్ బంకురా నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎయిమ్స్ కల్యాణి బోర్డు సభ్యుడైన సుభాష్ గైనకాలజిస్ట్. చిన్నతనం నుంచే సామాజిక కార్యక్రమంలో చురుగ్గా ఉండేవారు. ఐదు దశాబ్దాల ప్రజా జీవితంలో ఉన్న సుభాష్ రామకృష్ణ మిషన్తోకలిపి పనిచేసేవారు. కలకత్తా వర్సిటీ నుంచి ఎంబీబీఎస్ చేశారు. భగవత్ కిషన్రావ్ కరాద్ (64): మరాట్వాడా ప్రాంతానికి చెందిన భగవత్ రాజ్యసభ సభ్యుడు. ఔరంగాబాద్ మేయర్గా పనిచేసిన ఆయన మరాట్వాడా లీగల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్గానూ వ్యవహరించారు. వృత్తి రీతా వైద్యుడైన భగవత్ ఎంబీబీఎస్, ఎంఎస్(జనరల్ సర్జరీ), ఎంసీహెచ్(పీడియాట్రిక్ సర్జరీ), ఎఫ్సీపీఎస్ (జనరల్ సర్జరీ ) చేశారు. రాజ్కుమార్ రంజన్ సింగ్ (68): ఇంఫాల్కు చెందిన రాజ్కుమార్ ఇన్నర్ మణిపూర్ నియోజవర్గంనుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న రాజ్కుమార్ జియోగ్రఫీ ప్రొఫెసర్. గువాహటి యూనివర్సిటీ నుంచి జీయోగ్రఫీలో ఎంఏ ,పీహెచ్డీ చేశారు. భారతి ప్రవీణ్ పవార్ (42): మహారాష్ట్రలోని ఖందేశ్కు చెందిన భారతి దిండోరి నియోజకవర్గం నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నాసిక్జిల్లా పరిషద్ సభ్యురాలిగా చేసిన భారతి రక్షిత నీరు అందించడం, పౌష్టికాహారలోపాన్ని రూపుమాపడంలో కృషి చేశారు. నాసిక్లోని ఎన్డీఎంవీపీఎస్ వైద్య కళాశాల నుంచి సర్జరీలో ఎంబీబీఎస్ చేశారు. బిషే్వశ్వర్ తుడు(56): ఒడిశాలోని మయూర్భంజ్కు చెందిన తుడు తొలిసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒడిశాలోని జలవనరుల విభాగంలో సీనియర్ ఇంజినీరుగా పనిచేశారు. రూర్కెలాలోని ఉత్కళమణి గోపబంధు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిప్లొమా చేశారు. శాంతను ఠాకూర్ (38): ప్రధాని మోదీ కేబినెట్లో రెండో అత్యంత పిన్నవయస్కుడు. పశ్చిమ బెంగాల్కు చెందిన శాంతను బాంగాన్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మతువా వర్గానికి చెందిన శాంతను కర్ణాటక దూరవిద్య వర్సిటీ నుంచి బీఏ ఇంగ్లిష్ చేశారు. ముంజపరా మహేంద్రభాయ్ (52): గుజరాత్లోని సురేంద్ర నగర్కు చెందిన ముంజపరా వృత్తిరీతా వైద్యుడు. జనరల్ మెడిసిన్లో ఎండీ చేసిన ముంజపరా మూడు దశాబ్దాలుగా కార్డియాలజిస్ట్, ప్రొఫెసర్గా గుర్తింపుపొందారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండే ఆయన వైద్య శిబిరాల ద్వారా 8లక్షలకు పైగా రోగులకు సేవలందించడంతోపాటు రూ.2కే మందులు అందించేవారు. ఎల్.మురుగన్ (44): ఉభయసభల్లోనూ సభ్యుడు కాదు. తమిళనాడులోని కొంగునాడుకు చెందిన మురుగన్ 15 ఏళ్లుగా మద్రాస్ హైకోర్టులో న్యాయ వాదిగా ప్రాక్టీసు చేస్తున్నారు. జాతీయ ఎస్సీ కమిషన్కు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. మద్రాస్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, లా లో పీహెచ్డీ చేశారు. నిశిత్ ప్రమానిక్ (35): ప్రధాని మోదీ కేబినెట్లో అత్యంత పిన్న వయస్కుడు. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురికి చెందిన నిశిత్ కూచ్బెహార్ నుంచి తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీసీఏ చదివిన నిశిత్ ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్గా పనిచేశారు. -
మోదీ పునర్ వ్యవస్థీకరణ రూపం ఇలా..
కేబినెట్ మంత్రులు 1. రాజ్ నాథ్ సింగ్: రక్షణ శాఖ 2. అమిత్ షా: హోం శాఖ, సహకార శాఖ 3. నితిన్ గడ్కరీ: రోడ్డు రవాణా, రహదారులు 4. నిర్మలా సీతారామన్: ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు 5. నరేంద్ర సింగ్ తోమర్: వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ 6. జైశంకర్: విదేశాంగ వ్యవహారాలు 7. అర్జున్ ముండా: గిరిజన వ్యవహారాలు 8. స్మృతీ ఇరానీ: మహిళా, శిశు అభివృద్ధి శాఖ 9. పీయూష్ గోయల్: వాణిజ్య, పరిశ్రమల శాఖ, ఆహార ప్రజా పంపిణీ శాఖ, జౌళి శాఖ 10.ధర్మేంద్ర ప్రధాన్ : విద్యాశాఖ మంత్రి; నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత శాఖ 11. ప్రహ్లాద్ జోషి : పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు శాఖ, గనుల శాఖ 12. నారాయణ్ రాణే: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ 13. శర్భానంద సోనోవాల్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ, ఆయుష్ శాఖ 14. ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ: మైనారిటీ వ్యవహారాలు 15. డాక్టర్ వీరేంద్ర కుమార్ సామాజిక న్యాయం, సాధికారత శాఖ 16. గిరిరాజ్ సింగ్: గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ 17. జ్యోతిరాదిత్య సింధియా: పౌర విమానయాన శాఖ 18. రామ్చంద్ర ప్రసాద్ సింగ్: ఉక్కు శాఖ 19. అశ్విని వైష్ణవ్ రైల్వే శాఖ; కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 20. పశుపతి కుమార్ పారస్: ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ 21. గజేంద్ర సింగ్ షెఖావత్: జల్ శక్తి 22. కిరెన్ రిజిజు: న్యాయ శాఖ 23. రాజ్ కుమార్ సింగ్: విద్యుత్, నూతన, పునరుత్పాదక ఇంధన శాఖ 24. హర్దీప్ సింగ్ పూరి: పెట్రోలియం, సహజ వాయువు, గృహ, పట్టణ వ్యవహారాలు 25. మన్సుఖ్ మాండవియా: ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, రసాయనాలు, ఎరువుల శాఖ 26. భూపేందర్ యాదవ్: పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ, కార్మిక , ఉపాధి శాఖ 27. మహేంద్ర నాథ్ పాండే: భారీ పరిశ్రమలు 28. పురుషోత్తం రూపాల: మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ 29. జి.కిషన్ రెడ్డి : సాంస్కృతిక శాఖ, పర్యాటకం,ఈశాన్య ప్రాంత అభివృద్ధి 30. అనురాగ్ సింగ్ ఠాకూర్: సమాచార, ప్రసార శాఖ, యువజన వ్యవహారాలు, క్రీడలు సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా) 1. రావు ఇందర్జిత్ సింగ్: గణాంకాలు, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ (స్వతంత్ర హోదా) ; ప్రణాళిక మంత్రిత్వ శాఖ (స్వతంత్ర ఛార్జ్); కార్పొరేట్ వ్యవహారాలు సహాయ మంత్రి 2. డాక్టర్ జితేంద్ర సింగ్: ౖ సెన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్) భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ (ఇండిపెండెంట్ ఛార్జ్); పీఎంవో, డీవోపీటీ, అణు ఇంధన శాఖ, అంతరిక్ష శాఖలో సహాయ మంత్రి సహాయ మంత్రులు 1. శ్రీపాద యశో నాయక్: ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గ మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖ 2. ఫగన్సింగ్ కులస్:తే ఉక్కు మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 3. ప్రహ్లాద్æ సింగ్ పటేల్ : జల్ శక్తి, ఫుడ్ ప్రాసెసింగ్, 4. అశ్విని కుమార్ చౌబే: వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ 5. అర్జున్ మేఘవాల్: పార్లమెంటరీ వ్యవహారాలు, 6. వీకే సింగ్ : రహదారులు, పౌర విమానయానం 7. క్రిషన్ పాల్ : విద్యుత్, భారీ పరిశ్రమలు 8. దాన్వే రావ్సాహెబ్ : రైల్వే శాఖ, బొగ్గు శాఖ, గనుల శాఖ 9. రామ్దాస్ అథవాలే: సామాజిక న్యాయం,సాధికారత మంత్రిత్వ శాఖ 10. సాధ్వీ నిరంజన్ జ్యోతి : వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ, గ్రామీణాభివృద్ధి 11. సంజీవ్ బాల్యాన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ 12. నిత్యానంద్ రాయ్: హోం శాఖ 13. పంకజ్ చౌదరి: ఆర్థిక శాఖ 14. అనుప్రియా సింగ్ పటేల్: వాణిజ్యం, పరిశ్రమలు 15. ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ భగెల్: న్యాయ శాఖ 16. రాజీవ్ చంద్రశేఖర్: నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 17. శోభా కరంద్లాజే: వ్యవసాయ, రైతు సంక్షేమం 18. భాను ప్రతాప్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 19. దర్శన విక్రమ్ జర్దోష్: వస్త్ర మంత్రిత్వ శాఖ, రైల్వే 20. వి. మురళీధరన్: విదేశాంగ శాఖ 21. మీనాక్షి లేఖి : సాంస్కృతిక శాఖ 22. సోమ్ ప్రకాష్: వాణిజ్యం, పరిశ్రమలు 23. రేణుకా సింగ్ సారుత: గిరిజన వ్యవహారాలు 24. రామేశ్వర్ తేలి: పెట్రోలియం, సహజ వాయువు, 25. కైలాష్ చౌదరి వ్యవసాయ, రైతు సంక్షేమం 26. అన్నపూర్ణ దేవి : విద్యా శాఖ 27. ఎ.నారాయణస్వామి సామాజిక న్యాయం, సాధికారత 28. కౌషల్ కిషోర్: గృహ, పట్టణ వ్యవహారాలు 29. అజయ్ భట్ : రక్షణ, పర్యాటకం 30. బీఎల్ వర్మ : ఈశాన్య ప్రాంత అభివృద్ధి 31. అజయ్ కుమార్: హోం శాఖ 32. దేవుసింగ్ చౌహాన్ : కమ్యూనికేషన్స్ 33. భగవంత్ ఖూబా: పునరుత్పాదక ఇంధన శాఖ, 34. కపిల్ మోరేశ్వర్ పాటిల్: పంచాయతీ రాజ్ 35. ప్రతిమా భూమిక్: సామాజిక న్యాయం, సాధికారత 36. సుభాస్ సర్కార్: విద్యా శాఖ 37. భగవత్ కిషన్రావు కరా:ద్ ఆర్థిక శాఖ 38. రాజ్కుమార్ రంజన్ సింగ్: విదేశాంగ, విద్యా శాఖ 39. భారతి ప్రవీణ్ పవార్ : ఆరోగ్య, కుటుంబ సంక్షేమ 40. బిశ్వేశ్వర్ తూడూ: గిరిజన వ్యవహారాలు, జల్ శక్తి 41. శాంతను ఠాకూర్ : ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గం 42. మహేంద్రభాయి మహిళా, శిశు, ఆయుష్ శాఖలు 43. జాన్ బర్లా : మైనారిటీ వ్యవహారాలు 44. ఎల్. మురుగన్: మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, సమాచార, ప్రసార శాఖ 45. నిశిత్ ప్రామానిక్ : హోం, క్రీడలు -
అవకాశం రావడం గర్వంగా ఉంది: కిషన్ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జి.కిషన్రెడ్డికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖలు దక్కాయి. ఈ మేరకు బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మూడు శాఖలకు అయిదుగురు సహాయ మం త్రులను కేటాయించారు. శ్రీపాద యశో నాయక్, అజయ్భట్లను కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రులుగా, మీనాక్షి లేఖి, అర్జున్ రాం మేఘ్వాల్లను సాంస్కృతిక శాఖ సహాయ మంత్రులుగా, బీఎల్ వర్మ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించనున్నారు. బుధవారం సాయంత్రం రాష్ట్రపతి భవన్లో కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆయన తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... గర్వంగా ఉంది... తెలంగాణ నుంచి నరేంద్ర మోదీ ప్రభుత్వంలో మొట్టమొదటి కేబినెట్ మంత్రిగా తనకు అవకాశం రావడం గర్వంగా ఉంది. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్తకు అవకాశం దక్కుతుందనడానికి నాకు కేబినెట్ పదవి రావడమే ఒక నిదర్శనం. హోం మంత్రి అమిత్ షాతో కలిసి పనిచేసిన అనుభవం ఎన్నటికీ మర్చి పోలేను. పార్టీకి– ప్రభుత్వానికి, ప్రజలకు–కార్యకర్తలకు మధ్య మంత్రిగా ఎలా సమన్వయం చేయాలో అమిత్ షా నుంచి నేర్చుకున్నాను. కేంద్ర కేబి నెట్ మంత్రిగా రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు సాయం చేయడంలో శక్తివంచన లేకుండా పని చేస్తాను. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి ఇద్దరు ముఖ్యమంత్రులు ముందుకు రావాలి. ఈ వ్యవహారాల్లో తప్పని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. పదోన్నతి కోరలేదు.. ఈ రెండేళ్ళలో ఏ రోజూ అధిష్టానం వద్ద పదోన్నతి కోసం అడగలేదు. అలా అడిగే అవకాశం బీజేపీలో చాలా తక్కువగా ఉంటుంది. అయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన నాతో పాటు అనేక మందిని విస్తరణలో భాగంగా పార్టీ అగ్ర నాయకత్వం మంత్రులుగా అవకాశం ఇచ్చింది. కేంద్ర మంత్రివర్గంలో బడుగు, బలహీనవర్గాల వారికి అత్యధిక ప్రాతినిధ్యం లభించింది. కేంద్ర కేబినెట్ మంత్రిగా వెంకయ్యనాయుడు తర్వాత నాకు అవకాశం లభించింది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా జమ్మూ, కశ్మీర్, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించిన కారణంగా గత రెండేళ్ళలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అందుబాటులో ఉండలేకపోయాను. ఇకపై తెలుగు రాష్ట్రాలకు కేంద్రం తర ఫున అందుబాటులో ఉంటాను. ‘సబ్ కే సాత్ సబ్ కే వికాస్’ అన్న రీతిలో తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తాను. వివాదాల పరిష్కారం.. ఇటీవల పలు అంశాల్లో రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నిస్తాను. నాకు ఏ బాధ్యత అప్పగించినా, ఏ శాఖ కేటాయించినా, ఆ శాఖ ద్వారా తెలుగు ప్రజలకు మంచి పేరు తెచ్చేలా పనిచేస్తాను. తెలుగు ప్రజలు, నాకు ఓటేసిన ప్రజలు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ తలదించుకునే ఎలాంటి పనిచేయనని హామీ ఇస్తున్నాను. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా పరిస్థితుల్లో భారత ప్రజలను సంఘటితం చేసి కరోనాపై పోరాడాల్సిన అవసరం ఉంది. కరోనా కారణంగా గత ఏడాదిగా అదుపు తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, ఉద్యోగాల కల్పన, మౌలిక వసతులను మెరుగుపర్చే దిశగా కేంద్రం ముందుకెళ్తుంది. రింగ్ రోడ్డు పనులపై.. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీ నివాసంలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో తెలంగాణకు మణిహారమైన హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిపై చర్చించాను. అంతేగాక తెలంగాణకు సంబంధించి రైల్వే, ఇతర ప్రాజెక్టుల విషయంలో ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసు కుంటున్నాను. హైదరాబాద్లో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం కోసం నా వంతు కృషి చేశాను. రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో రాజకీయం చేయడం సహజం. ఒకరిపై ఒకరికి పోటీ ఉంటుంది. అయితే ఎన్నికల తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలన్నీ సమన్వయంతో కలసి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్టికల్ 370 ప్రస్తావన.. 2019లో లోక్సభ సభ్యుడిగా గెలిచిన తర్వాత హోంశాఖ సహాయమంత్రిగా అమిత్ షా తీసుకున్న నిర్ణయాలు, తీసుకొచ్చిన చట్టాల అమలు విష యంలో నా వంతు ప్రయత్నం చేశాను. జమ్మూ, కాశ్మీర్లో గతంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితి, ఉగ్రవాద బాధిత నేపథ్యంలో ఆర్టికల్ 370 తొలగించాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత అక్కడ ఎక్కువగా పర్యటించాల్సి వచ్చింది. ఆర్టికల్ 370 తొలగింపు డిమాండ్ జనసంఘ్ సమయం నుంచి ఉంది. ఆర్టికల్ 370 తొలగింపు, పౌరసత్వ సవరణ చట్టం తేవడంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా నా వంతు పాత్ర పోషించాను. రెండేళ్ల పాటు అమిత్ షా తో కలసి పనిచేయడం మర్చిపోలేని అనుభవాన్ని ఇచ్చింది. కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి, పరిపాలనా వ్యవహారాల్లో భాగమయ్యాను. ప్రతిక్షణం పార్టీ కోసమే ఆలోచించాను. పార్టీ కోసమే పనిచేశాను. 1980 నుంచి ఈరోజు వరకు పార్టీ బలోపేతం కోసం నిరంతరం పని చేస్తూనే ఉన్నాను. సాధారణ కార్యకర్తగా ఎలాగైతే పనిచేశానో కేంద్రమంత్రిగాను ఒదిగి ఉంటూ అలాగే పని చేస్తాను. కిషన్రెడ్డికి సంజయ్ శుభాకాంక్షలు కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జి.కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలోని కిషన్రెడ్డి నివాసంలో ఆయనను కలసి సన్మానించారు. కిషన్రెడ్డి కృషికి, పార్టీకి చేసిన సేవలకు తగిన గుర్తింపుగా ఈ పదవి దక్కిందని తాను భావిస్తున్నానని చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని చెప్పడానికి కిషన్రెడ్డికి కేబినెట్ హోదా దక్కడమే నిదర్శనమన్నారు. కాగా, కిషన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, సుభాష్ చందర్జీ తదితరులు పాల్గొన్నారు. -
శివసేనకు చెక్ పెట్టేందుకే.. ఆ నలుగురికి అవకాశం!
సాక్షి, ముంబై: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో మంత్రిమండలి విస్తరణలో మహారాష్ట్రకు చెందిన నలుగురు లోకసభ సభ్యులకు (ఎంపీలకు) అవకాశం లభించింది. అందరూ ఊహించినట్లుగానే మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు కేంద్ర మంత్రి మండలిలో స్థానం దక్కింది. ఆయనతోపాటు ఓబీసీ సమాజానికి చెందిన భివండీ ఎంపీ కపిల్ పాటిల్, 2019లో దిండోరి లోకసభ ఎన్నికల్లో రెండు లక్షల ఓట్ల మెజార్టీతో విజయం సాధించిన డాక్టరు భారతీ పవార్, ఔరంగాబాద్కు చెందిన రాజ్యసభ సభ్యుడు డా. భాగవత్ కరాడ్ మొదలగు నలుగురికి కేంద్ర మంత్రిమండలిలో అవకాశం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం సాయంత్రం జరిగిన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాల్లో మహారాష్ట్రకు చెందిన ఈ నలుగురు ప్రమాణస్వీకారం చేశారు. దీనిపై మహారాష్ట్ర బీజేపీలో ఆనందం వ్యక్తమవుతోంది. రాబోయే ముంబై, థానే, ఔరంగాబాద్ తదితర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికతోపాటు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారిన ఓబీపీ రాజకీయ రిజర్వేషన్, మరాఠా రిజర్వేషన్ తదితర అంశాలన్నింటిని దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర నుంచి నలుగురికి అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు తెలుపుతున్నారు. రాణేకు కేంద్ర మంత్రిత్వ శాఖలో అవకాశంపై ప్రధాని నరేంద్రమోదీపై శివసేన విమర్శలు గుప్పించింది. శివసేన నాయకుడు కిషోర్ తివారీ మాట్లాడుతూ.. ‘‘ నారాయణ్ రాణే ఒక జెడ్పీ బ్లాక్ లీడర్. శివసేన అధినేత బాలసాహెబ్ ఠాక్రే రాణేను ముఖ్యమంత్రిగా మార్చడానికి ముందు ఆయన గుమస్తా. అతన్ని పెద్దగా చేసిన వ్యక్తినే మట్టుపెట్టాడు. రాణే ఎక్కడికి వెళ్తాడో అక్కడ గందరగోళం సృష్టిస్తాడు.ం మోదీ మంత్రిత్వ శాఖలో అదే జరుగుతుంది ’’అన్నారు. శివసేనకు చెక్ పెట్టేందుకే.. కేంద్ర మంత్రి మండలిలో మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేకు అవకాశం ఇవ్వడంతో మహారాష్ట్రలో ముఖ్యంగా కోంకణ్లో పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని బీజేపీ భావిస్తోంది. మరోవైపు మరాఠా రిజర్వేషన్ అంశంపై కూడా బీజేపీకి లాభం చేకూరనుందని భావిస్తున్నారు. ముంబైతోపాటు కోంకణ్లో శివసేన ప్రభావం అధికంగా ఉంటుంది. ఇలంటి నేపథ్యంలో శివసేనకు గట్టి పోటీ ఇవ్వాలంటే శివసేనతో ఢీ కొనేందుకు నారాయణ రాణేను రంగంలోకి దింపనున్నారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. దూకుడు స్వభావం కలిగిన నారాయణ రాజకీయ జీవితం శివసేన నుంచి ప్రారంభమైంది. కార్పొరేటర్ నుంచి ముఖ్యమంత్రి వరకు అన్ని పదవులు శివసేనలో ఉండగానే ఆయనకు దక్కాయి. అయితే శివసేనను వీడిన ఆయన ముందు కాంగ్రెస్లో అనంతరం బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం లభించింది. దీనిపై ఆయన కుటుంబీకులతోపాటు మద్దతుదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. థానేలో పట్టు కోసం.. భివండీలో ఎంపీ కపిల్ పాటిల్కు కేంద్ర మంత్రి పదవి దక్కడంపై భివండీతోపాటు థానే జిల్లాలోని బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. థానే జిల్లాలో శివసేనకు చెక్ పెట్టేందుకు ఆయనకు మంత్రి మండలిలో అవకాశం ఇచ్చినట్లు రాజకీయ నిపుణులు చెబుతున్నారు. గ్రామపంచాయితీ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగిన కపిల్ పాటిల్ ఎన్సీపీలో ఉండేవారు. అయితే 2014లో బీజేపీలో ప్రవేశించిన ఆయన లోకసభ సభ్యునిగా విజయం సాధించారు. అనంతరం 2019లో కూడా వరుసగా భివండీ లోకసభ నుంచి విజయం సాధించారు. ఇలా రెండు మార్లు విజయం సాధించిన ఆయనకు కేంద్ర మంత్రి మండలిలో అవకాశం దక్కడంపై బీజేపీ కార్యకర్తల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భివండీలో పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. మరోవైపు తెలుగువారైన బీజేపీ కార్యకర్తలు, పదాధికారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి వరకు.. డాక్టరైన భాగవత్ కరాడ్ కార్పొరేటర్ నుంచి కేంద్రమంత్రి వరకు ఎదిగారు. అహ్మదపూర్ తాలూకా చిఖలీ గ్రామంలోని రైతు కుటుంబానికి చెందిన ఆయన సుమారు 5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి విద్యాబ్యాసం చేశారు. ఇలా ఔరంగాబాద్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి విద్యాభ్యాసం చేసి డాక్టరయ్యారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్గా రెండు పర్యాయాలు మేయర్గా విధులు నిర్వహించారు. 2020లో ఆయన రాజ్యసభ సభ్యునిగా నియామాకం అయ్యారు. ఇలా ఓబీసీ సమాజానికి చెందిన ఆయనకు ముఖ్యంగా డాక్టరు అయిన భాగవత్ కరాత్కు మంత్రి పదవిలో చోటు ఇచ్చి ఓబీసీ వర్గాలను కొంత మేర సంతోషపరిచారని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని ఓబీసీలకు ఒకరకంగా కేంద్రంలో ప్రాతినిథ్యం ఇచ్చినట్టు అయింది. మహిళకు అవకాశం.. కేంద్ర మంత్రి మండలి విస్తరణలో మొత్తం నలుగురికి అవకాశం దక్కగా ఇందులో ఒకే ఒక్క మహిళగా డా. భారతీ పవార్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీ పవార్ కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసి డాక్టర్గా మారిన ఆమె జిల్లా పరిషత్ ఎన్నికలతో రాజకీయాల్లో ప్రవేశించారు. ఎన్సీపీ నుంచి పోటీ చేసిన ఆమె బీజేపీలో చేరారు. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా దిండోరి లోకసభ నియోజకవర్గం నుంచి ఏకంగా రెండు లక్షల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే Ðకేంద్ర మంత్రిమండలి విస్తరణలో మాత్రం ఆమె పేరు పెద్దగా చర్చల్లో విన్పించలేదు. ప్రీతం ముండే, రక్షా ఖడ్సే, హీనా గావిత్ పేర్లు విన్పిం చాయి. అయితే చివరికి ఊహించని విధంగా ఆమె పేరు ఖరారైంది. దీనిపై ఆమెమద్దతు దారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. -
53000 శిఖరంపై సెన్సెక్స్
ముంబై: చివరి అరగంటలో మెటల్, బ్యాంకింగ్, ఆర్థిక షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 194 పాయింట్ల లాభంతో తొలిసారి 53వేల పైన 53,055 వద్ద స్థిరపడింది. ఈ స్థాయి సెన్సెక్స్కు సరికొత్త రికార్డు ముగింపు. నిఫ్టీ 61 పాయింట్లు పెరిగి 15880 వద్ద నిలిచింది. అయితే రూపాయి బలహీనత, ప్రపంచ మార్కెట్లలో ప్రతికూలతలు సూచీల లాభాలను పరిమితం చేశాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో బ్యాంకింగ్ షేర్లు రాణించాయి. భారత తయారీ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతున్న క్రమంలో మెటల్ షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపారు. ముందస్తు ఇళ్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో రియల్టీ షేర్లు రాణించాయి. మరోవైపు ఆటో, మీడియా షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. దీంతో ఈ రెండు రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్ఈ చిన్న, మధ్య తరహా షేర్లు అరశాతానికి పైగా లాభపడ్డాయి. ఉదయం సెన్సెక్స్ 59 పాయింట్ల లాభంతో 52,920 వద్ద, నిఫ్టీ రెండు పాయింట్ల స్వల్ప లాభంతో 15,820 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించాయి. ట్రేడింగ్ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడాయి. ఆఖర్లో అనూహ్య కొనుగోళ్లతో సెన్సెక్స్ 244 పాయింట్లు ర్యాలీ చేసి 53,105 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 15,894 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.533 కోట్ల షేర్లను కొన్నారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.232 కోట్ల షేర్లను అమ్మారు. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ ఏడు పైసలు బలహీనపడి 74.62 వద్ద స్థిరపడింది. ఫెడ్ రిజర్వ్ మినిట్స్ (బుధవారం రాత్రి) వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు రక్షణాత్మక సాధనాలైన బాండ్లు, డాలర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ‘‘మిడ్సెషన్ తర్వాత మెటల్ షేర్లు రాణించడంతో మార్కెట్ బౌన్స్బ్యాక్ అయ్యింది. దేశీయంగా స్టాక్ మార్కెట్ను ప్రభావితం చేసే పరిణామాలేవీ లేకపోవడంతో రానున్న రోజుల్లో సూచీల గమనానికి అంతర్జాతీయ పరిణామాలే కీలకం కానున్నాయి. మార్కెట్ పతనమైతే జాగ్రత్త వహిస్తూ కొనుగోళ్లు చేయడం మంచిందే’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. పరుగులు పెట్టిన పేపర్ షేర్లు... కొన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్న పేపర్, పేపర్ ఉత్పత్తుల షేర్లు ఇంట్రాడేలో పరుగులు పెట్టాయి. స్కూళ్లు, కాలేజీలు పునఃప్రారంభంతో ఈ ఆర్థిక సంవత్సరంలో పేపర్, పేపర్ ఉత్పత్తుల డిమాండ్ 11–15% వృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. చైనాలో కలప ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయ కలప కంపెనీలకు కలిసొస్తుందని నిపుణులు తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► స్టీల్ ఉత్పత్తిని తగ్గించాలని చైనా యోచిస్తున్న తరుణంలో స్టీల్ షేర్లు రాణించాయి. ► తొలి క్వార్టర్లో ఇళ్ల అమ్మకాలు భారీగా పెరిగినట్లు రియల్టీ ఎస్టేట్ సంస్థ శోభ లిమిటెడ్ ప్రకటనతో ఈ కంపెనీ షేరు ఆరు శాతం లాభపడి రూ. 521 వద్ద ముగిసింది. ► క్యూ1 అమ్మకాలు రెండింతల వృద్ధిని సాధించినప్పటికీ.., లాభాల స్వీకరణతో టైటాన్ షేరు రెండు శాతం నష్టపోయి రూ.1,727 వద్ద స్థిరపడింది. -
మెగా మార్పుల మోదీ మండలి
ఎట్టకేలకు ఒక పునర్వ్యవస్థీకరణ! గంటన్నర సాగిన మహా పునర్వ్యవస్థీకరణ! అనేక ఆశ్చర్యాలు కలిగిస్తూ... పాత బరువులు కొన్ని వదిలించుకొని, కొత్త ముఖాలు, సహకార శాఖ లాంటి కొత్త శాఖలతో, సరికొత్త ఇమేజ్ వచ్చేలా... కేంద్ర క్యాబినెట్ ఎన్నికల మార్కు సమూల పునర్వ్యవస్థీకరణ!! 2019లో రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టాక నరేంద్ర మోదీ బుధవారం తొలిసారి మంత్రి మండలిలో చేసిన భారీ మార్పుచేర్పులు అనేక కోణాల్లో ఆసక్తికరం. సన్నిహితులైన పలువురు పాత మంత్రులకు ఆయన ఉద్వాసన పలికారు. తొలిసారి ఎంపీలైనవారికీ, విద్యాధికులకూ చోటిచ్చారు. కొత్తగా ఏడుగురు స్త్రీలకు అవకాశమిచ్చి, మొత్తం 11 మంది మహిళా మంత్రుల క్యాబినెట్గా నారీ శక్తిని గౌరవించారు. అదే సమయంలో కులాలు, ప్రాంతాల వారీ పదవుల పందేరంతో సమతూకం కోసం ప్రయత్నించారు. ఉత్తరప్రదేశ్ సహా ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న ప్రాంతాల్లో పట్టు బిగించేందుకు అక్కడి వారిని మంత్రులుగా చేర్చుకున్నారు. 35 ఏళ్ళ అతి పిన్నవయస్కుడికి (పశ్చిమబెంగాల్ –నిశిత్ ప్రామాణిక్) ఛాన్సిచ్చి, మంత్రిమండలి సగటు వయసు 58 ఏళ్ళనే మార్కు పడేలా చూశారు. వెరసి, ఇది ‘మోడీ 2.0 క్యాబినెట్’ అనే భావన కలిగించారు. క్యాబినెట్ విస్తరణ వార్త కొద్ది రోజులుగా వినిపిస్తున్నా, ఈ స్థాయి మార్పులను నిన్న మొన్నటి దాకా ఎవరూ ఊహించలేదు. ‘మినిమమ్ గవర్నమెంట్... మ్యాగ్జిమమ్ గవర్నెన్స్’ అనేది ఒకప్పుడు మోదీ వ్యాఖ్య. దానికి తగ్గట్టే ఆయన తొలి క్యాబినెట్ తక్కువమందితోనే సాగింది. కానీ, సమర్థ పాలనకూ, సమస్యల పరిష్కారానికీ తగినంతమంది జట్టులో ఉండాలని రెండేళ్ళ ఎదురుదెబ్బలతో ఆయనకు తెలిసొచ్చినట్టుంది. అందుకే, ఇప్పుడు 78 మందికి తన టీమ్ను విస్తరించారు. 2014లో తొలిసారిగా మోదీ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఎన్నడూ లేనంత పెద్ద జట్టు ఇది. ఈ కొత్త కూర్పులో 12 మంది పాతవారికి స్వస్తి పలికారు. 36 మంది కొత్త మంత్రులకు చోటిచ్చారు. టీఆరెస్పై పైచేయి సాధించి, పట్టు బిగించదలచిన తెలంగాణలో ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి పదోన్నతి కల్పించారు. అదే రీతిలో మరో ఆరుగురికి ప్రమోషన్ దక్కింది. జ్యోతిరాదిత్య సింధియా సహా బుధవారం మొత్తం 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. ఏడేళ్ళుగా అధికారంలో ఉన్న మోదీ ఈ స్థాయిలో క్యాబినెట్ మార్పులు చేయడం ఇదే తొలిసారి. 2019లో రెండో దఫా పగ్గాలు చేపట్టాక, ఆయన మంత్రివర్గ విస్తరణ చేయనే లేదు. కానీ, ఇప్పుడు చేయక తప్పలేదు. కరోనా కష్టకాలంలో ఆరోగ్య, ఆర్థిక, కార్మిక రంగాల్లో ఎదురైన సవాళ్ళతో పడిపోతున్న ఇమేజ్ను కూడగట్టుకొనేందుకు, క్యాబినెట్లో కొత్త రక్తం ఎక్కించడమే మందు అని మోదీ బృందం భావించింది. అవునన్నా కాదన్నా.. కరోనా రెండో ఉద్ధృతి అంచనాలో, సమర్థంగా ఎదుర్కోవడంలో ప్రభుత్వ వైఫల్యం ప్రపంచ వేదికపై అప్రతిష్ఠ తెచ్చింది. కొత్త ఐ.టి. నిబంధనలు, సినిమాటోగ్రాఫ్ చట్టం సవరణల లాంటివీ విమర్శల పాలయ్యాయి. దేశరాజధాని వెలుపల రైతుల ఆందోళనను విరమిపజేయడంలో మంత్రుల దౌత్య వైఫల్యం లాంటివీ బాధిస్తున్నాయి. వెరసి, పరిస్థితి చేయి దాటక ముందే సరిదిద్దుకోవాలనే ఆలోచన ఈ తాజా కూర్పుకు దారి తీసింది. ఇప్పటికిప్పుడు ఆరోగ్య మంత్రి– ఆయన సహాయకుడు (డాక్టర్ హర్షవర్ధన్, అశ్వినీ చౌబే), సమాచార శాఖ మంత్రి (ప్రకాశ్ జావదేకర్), ఐ.టి మంత్రి (రవిశంకర్ ప్రసాద్), విద్యా మంత్రి (రమేశ్ పోఖ్రియాల్), కార్మిక మంత్రి (సంతోష్ గాంగ్వర్)తో రాజీనామా చేయించారు. కొత్త వారికి బాధ్యతలు ఇచ్చారు. అలాగే, వచ్చే ఏడాది మొదట్లో ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్ సహా అయిదు రాష్ట్రాలకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వ్యూహం కూడా కొలువు తీరిన కొత్త మంత్రుల ప్రాంతాలు, సామాజిక నేపథ్యాలతో అర్థమవుతోంది. సరికొత్త కేంద్ర క్యాబినెట్లో సుమారు 27 మంది ఓబీసీలు, అయిదుగురు మైనారిటీలని ఓ లెక్క. అంటే ఈ పునర్వ్యవస్థీకరణ రాజకీయ అనివార్యతలతో పాటు, ఓటర్లను దృష్టిలో పెట్టుకొని చేసిన ఓ రాజకీయ విన్యాసం కూడా అని స్పష్టమవుతోంది. అలాగే, కేంద్రమంత్రి సదానంద గౌడతో రాజీనామా చేయించి, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సన్నిహితురాలైన శోభా కరంద్లాజేకు క్యాబినెట్లో చోటివ్వడం గమనార్హం. అధికారంలోకి వచ్చాక బీజేపీ హవాకూ, మోదీ పాపులారిటీకీ తొలిసారిగా గత ఏణ్ణర్ధ కాలంలో బలమైన దెబ్బలు తగిలాయి. మార్పులు అనివార్యమని తేలింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంభంపాటి హరిబాబు సహా కొత్త గవర్నర్లకు ఛాన్సిచ్చి, మంగళవారం మొదట కొన్ని మార్పులు చేశారు. బుధవారం కేంద్ర క్యాబినెట్లో సమూల మార్పులు తెచ్చారు. ఇక, పలు ఖాళీలతో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న పార్టీ వ్యవస్థాగత మార్పులు చేయడమే బాకీ. సమైక్య ప్రతిపక్షం లేకపోయినప్పటికీ, సర్వసన్నద్ధమవుతున్నట్టు మోదీ బృందం ఒక రకంగా సంకేతాలిచ్చింది. మిత్రపక్షాలకూ క్యాబినెట్లో చోటిచ్చిన బీజేపీ... కొత్త రక్తంతో పాలనలో, పనితీరులో మార్పు తెస్తామంటోంది. ప్రభుత్వ పాలనలో, పనితీరులో మార్పు మాటెలా ఉన్నా... ముందు చూడగానే ఏదో మారిందని భావనాత్మకంగా అనిపించడానికి ఈ మెగా మార్పులు ఉపకరిస్తాయి. రేపు నిజంగా ప్రభుత్వ పాలనలోనూ ఈ మార్పు కనిపిస్తే మంచిదే. ఆ దిశలో ఇది తొలి అడుగు అవునో, కాదో కొద్దికాలమైతే గానీ తెలియదు. ఇప్పటికైతే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలలో ప్రతిపక్షాలతో యుద్ధానికి సిద్ధమవుతున్న మోదీ సర్కారు కొత్త యోధులతో సిద్ధమైనట్టు కనిపిస్తోంది. -
కేంద్ర కేబినెట్ విస్తరణ: పర్యాటక శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. తాజా సమాచారం ప్రకారం వివిధ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి. ► కిషన్ రెడ్డి - పర్యాటక ,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ ► నితిన్ గడ్కరీ - రవాణా శాఖ ► రాజ్ నాథ్ సింగ్ - రక్షణ శాఖ ►మన్సుఖ్ మాండవీయ - ఆరోగ్యశాఖ కేటాయింపు ►అమిత్ షా - హోంశాఖ, సహకార శాఖ ► అర్జున్ ముండా - గిరిజన సంక్షేమం ► కిరణ్ రిజిజు - న్యాయశాఖ ► నిర్మలా సీతారామన్ - ఆర్ధిక శాఖ ►స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ ► భూపేంద్ర యాదవ్ - కార్మిక శాఖ ►డాక్టర్ జై శంకర్ - విదేశీ వ్యవహారాలు ► పురుపోషత్తమ్ రూపాల - మత్స్య, పశుసంవర్దక, డెయిరీ ►పీయూష్ గోయల్ - వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార ప్రజా పంపిణీ ►అశ్వినీ వైష్ణవ్ - రైల్వే, ఐటీ మంత్రిత్వశాఖ ► రాజ్ కుమార్ సింగ్ - విద్యుత్, పునరుత్పాదక ఇందన శాఖ ►ధర్మేంద్ర ప్రధాన్ - విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ ►హర్దీప్సింగ్ పూరీ - పెట్రోలియం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ ►మహేంద్రనాథ్ పాండే - భారీ పరిశ్రమల శాఖ ►జ్యోతిరాదిత్య సింధియా - పౌర విమానయాన శాఖ ►గిరిరాజ్ సింగ్ - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ ►అనురాగ్ ఠాకూర్ - సమాచార ప్రసార శాఖ ►భూపేంద్ర యాదవ్ - పర్యావరణ,అటవీశాఖ, కార్మిక శాఖ ►పశుపతి పరసు - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ► గజేంద్ర సింగ్ షెకావత్ - జల్ శక్తి ► సర్వానంద్ సోనోవాల్ - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్ శాఖ ► ప్రహ్లాద్ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ ► రామచంద్రప్రసాద్ సింగ్ - ఉక్కుశాఖ ► నరేంద్ర సింగ్ తోమర్ - వ్యవసాయ శాఖ ►వీరేంద్ర కుమార్ - సామాజిక న్యాయం,సాధికారత ► ముక్తార్ అబ్బాస్ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ ► నారాయణ్ రాణే - చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ► ధర్మేంద్ర ప్రదాన్ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ చదవండి : ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి -
యూపీ ఎన్నికలు: కేంద్ర కేబినెట్ బెర్త్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏసర్కార్ తాజా కేబినెట్ విస్తరణ తీవ్ర ఆసక్తిని రేపుతోంది. ఇటీవలి అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి తగిలిన ఎదురు దెబ్బ నేపథ్యంలో తన మంత్రి వర్గాన్ని భారీగా విస్తరించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొగ్గు చూపారు. ప్రధానంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఒక సంవత్సరమే సమయం ఉండటంతో అటు కుల, ఇటు మిత్ర పక్షాలను సంతృప్తిపరచేలా వివిధ సమీకరణాలను మోదీ పరిశీలించినట్టు తెలుస్తోంది. 2022లో రానున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా, ఈ రోజు కేంద్ర కేబినెట్లో చేరే అవకాశం ఉన్న యూపీకి చెందిన అభ్యర్థులను పరిశీలిస్తే వరుణ్ గాంధీ, అనుప్రియా పటేల్, రీటా బహుగుణ జోషిలకు మోదీ కొత్త మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉంది. అనుప్రియా పటేల్ అప్నా దళ్ (సోనెలాల్) అధ్యక్షురాలు అనుప్రియా పటేల్ను కేంద్ర మంత్రివర్గంలో చేర్చడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. యూపీ అసెంబ్లీలో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ, యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని యూపీ కేబినెట్ విస్తరణలో అప్నా దళ్ (సోనెలాల్) కోటా 2019 ఆగస్టులో పెరగలేదు. వాస్తవానికి అనుప్రియా పటేల్ తన పార్టీ నుండి ఇద్దరు మంత్రులకు బెర్తులు పొందాలని భావించారు ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించే క్రమంలో అనుప్రియకు అవకాశం రానుంది. వరుణ్ గాంధీ వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం రానుందని భావిస్తున్న కేంద్ర మాజీమంత్రి మేనకాగాంధీ కుమారుడు, వరుణ్ గాంధీకి అనూహ్యంగా మోదీ కేబినెట్లో ఛాన్స్ దక్కనుంది. ఇప్పటిదాకా దూకుడు నాయకుడిగా పేరొందిన వరుణ్గాంధీని పక్కన పెట్టిన మోదీ ఇపుడిక అవకాశాన్నివ్వనున్నారు.ముఖ్యంగా యూపీలో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంక గాంధీ వాద్రాకు, గాంధీ కుటుంబానికి చెక్ పెట్టేలా వరుణ్ గాంధీని రంగంలోకి దింపనుంది. రీటా బహుగుణ జోషి అలహాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ, ప్రొఫెసర్ రీటా బహుగుణ జోషి కూడా కేంద్ర మంత్రివర్గం రేసులో ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ తొలి మంత్రివర్గంలో పర్యాటక రంగంతో పాటు మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి. బలమైన మహిళా బ్రాహ్మణ నాయకురాలిగా, విద్యావేత్తగా, రీటా బహుగుణ కీలకంగా ఉన్నారు. అజయ్ మిశ్రా ఉత్తరప్రదేశ్లోని బ్రాహ్మణ ఓటర్లను ఆకర్షించడానికి లఖింపూర్ ఖేరి ఎంపీ అజయ్ మిశ్రాను కేంద్రమంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం ఉంది. తద్వారా మోదీ 2.0 క్యాబినెట్లోకి యువతకు ప్రాధాన్యం అవకాశం సందేశాన్నివ్వనుంది. రామ్ శంకర్ కాథెరియా దళిత ఓటర్లను ఆకర్షించే బీజేపీ వ్యూహంలో భాగంగా దళిత నాయకుడు, ఇటావా ఎంపి రామ్ శంకర్ కాథెరియాకు అవకాశం దక్కనుంది. షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ మాజీ ఛైర్మన్. ఇంతకుముందు ఆగ్రా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కాథెరియా, మోదీ తొలి కేబినేట్లో కూడా చోటు దక్కించుకున్నారు. -
మోదీ మెగా టీం: రేసు గుర్రాలు వీరే?!
సాక్షి, న్యూఢిల్లీ: 2019 మేలో రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన క్యాబినెట్ను భారీగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నారు. 2024లో కూడా అధికార పీఠం లక్క్ష్యంగా పలు సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని మంత్రుల మండలి పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాలు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూండటంతో పాటు యువ రక్తానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారని సమాచారం. కేంద్ర కేబినెట్లో కొత్తగా 43 మందికి అవకాశం కల్పించనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు ప్రధాని ఆహ్వానం అందుకున్న నేతలు ఆయన నివాసానికి చేరుకున్నారు. కేబినెట్ బెర్త్ ఖాయం చేసుకున్న వారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, భూపేంద్ర యాదవ్, ఆర్.పి.సింగ్, అనుప్రియ పటేల్, పశుపతి పరాస్, అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాల, కిషన్రెడ్డి, కపిల్ పాటిల్, మీనాక్షి లేఖి, అశ్వినీ వైష్ణవ్, శాంతను ఠాకూర్, పంకజ్ చౌదరి, దిలేశ్వర్ కామత్, రాహుల్ కాస్వా, వినోద్ సోంకర్, చందేశ్వర్ ప్రసాద్, రామ్నాథ్ ఠాకూర్, రాజ్కుమార్ రంజన్సింగ్, అజయ్ మిశ్ర, బీఎల్ వర్మ, అజయ్ భట్, శోభా కరంద్లాజే ఉన్నారు. సామాజిక సమీకరణాలు.. వివిధ అంచనాలు కేంద్ర కేబినెట్లో 12 మంది ఎస్సీలకు చోటు దక్కనుంది. వీరిలో ఇద్దరికి కేబినెట్ హోదా లభించే అవకాశం. అలాగే 8 మంది ఎస్టీలకు చాన్స్ దక్కనుండగా, వీరిలో ముగ్గురికి కేబినెట్ హోదా కల్పించనున్నారు. ఇక బీసీల విషయానికి వస్తే 27 మంది ఓబీసీలకు చోటు దక్కనుంది. వీరిలో ఐదుగురికి కేబినెట్ హోదా లభించనుంది. వీరితో పాటు ఐదుగురు మైనారిటీ మంత్రులకు ఛాన్స్ లభించనుంది. ముగ్గురికి కేబినెట్ హోదా దక్కనుంది. వీరితోపాటు ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధులకు ఒక్కొక్కరు చొప్పున సమానం ప్రాతినిధ్యాన్నివ్వనున్నారు. మహిళలు భారీగా విస్తరించనున్న మోదీ కొత్త కేబినెట్లో 11 మంది మహిళలకు మంత్రులుగా అవకాశం లభించనుందని అంచనా. ముఖ్యంగా ఇద్దరికి కేబినెట్ హోదా కల్పించ నున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనంతరం, రాష్ట్రపతి భవన్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండనుంది. కేంద్రమంత్రుల సగటు వయసు 58 సంవత్సరాలు కాగా 50 ఏళ్ల లోపు వయసు ఉన్న మంత్రులు 14 మంది ఉండగా, 50 ఏళ్ల లోపు వయసు ఉన్నవారిలో ఆరుగురికి కేబినెట్ ర్యాంక్ ఉంది. దీంతో ప్రస్తుతం 53గా ఉన్న కేబినెట్ సభ్యుల సంఖ్య 81 వరకు పెరగ వచ్చనేది ప్రధాన అంచనా. -
కేంద్ర కేబినెట్ విస్తరణ: పలువురికి ఉద్వాసన
సాక్షి, న్యూడిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణపై భారీ ఊహాగానాల మధ్య కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం దాదాపు ఖరారైనట్టే. ప్రస్తుత కేబినెట్లో మరో 43 మందిని కొత్తగా మంత్రి పదవులు వరించనున్నాయని అంచనా. వీరిలో నలుగురు మాజీ సీఎంలకు కేబినెట్లో బెర్త్ ఖాయంగా కనిపిస్తోంది. స్వతంత్ర హోదా, సహాయ మంత్రి బాధ్యతలను నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. అలాగే సీనియర్ మంత్రుల నుంచి అదనపు బాధ్యతలను అప్పగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ కేబినెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఇప్పటికే ఇద్దరు మంత్రులు వెల్లడించారు. తాజాగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా ప్రకటించారు. కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి సంతోష్ గాంగ్వర్ తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ను మోదీ కేబినెట్ నుంచి తప్పించ నున్నారు. దీంతో కేబినెట్ విస్తరణకు ముందే రమేష్ రాజీనామాను ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం, 21 మంది క్యాబినెట్ మంత్రులు, స్వతంత్ర బాధ్యత కలిగిన తొమ్మిది మంది మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు ఉన్నారు. తాజా ఈ విస్తరణతో ఈ సంఖ్య 81కి పెరగొచ్చని భావిస్తున్నారు. మోదీ కేబినెట్నుంచి రాజీనామా చేసినవారు ప్రధానంగా కీలకమంత్రులను మంత్రివర్గంనుంచి తప్పించడం పలువురిని విస్మయ పర్చింది. ఐటీ శాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవడేకర్, కేంద్ర కార్మిక శాఖమంత్రి, విద్యా శాఖా మంత్రికి తోడు కేంద్ర కెమికల్స్, ఎరువుల మంత్రి డీవీ సదానంద గౌడ కూడా కేంద్ర మంత్రి మండలికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రి దేబశ్రీ చౌదరి, పర్యావరణ సహాయ మంత్రి బాబూల్ సుప్రియో తప్పుకున్నారు. అలాగే విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే కూడా తప్పుకోనున్నారు. బెంగాల్కు చెందిన మరో మంత్రి ప్రతాప్ సారంగి కూడా రాజీనామా చేశారు. -
కేంద్ర మంత్రివర్గ సమావేశం రద్దు
సాక్షి, ఢిల్లీ: మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం నేపథ్యంలో ఉదయం 11 గంటలకు జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ భేటీ రద్దు అయ్యింది. కాగా, యువ రక్తంతో కేంద్ర కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే రెండోసారి కొలువు దీరి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. అలాగే 2022 మార్చిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ కాలపరిమితి, అలాగే, 2022 మే నెలలో ఉత్తరప్రదేశ్ శాసనసభ కాలపరిమితి ముగియనుంది. మంత్రివర్గ విస్తరణలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనున్నారు. అలాగే, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇప్పటికే సీనియర్ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ను మంత్రిమండలి నుంచి తప్పించి కర్నాటకకు గవర్నర్గా పంపించారు. ఇప్పుడున్న మంత్రుల్లో మరి కొందరు కూడా తమ పదవులను కోల్పో నున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొందరి శాఖల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రకటనకు ముందే, బుధవారం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిపాయి. -
27 మందితో కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ?
సాక్షి, న్యూఢిల్లీ: యువ రక్తంతో కేంద్ర కేబినెట్ కొత్త రూపు సంతరించుకోనుంది. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే రెండోసారి కొలువు దీరి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. అలాగే 2022 మార్చిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల శాసనసభ కాలపరిమితి, అలాగే, 2022 మే నెలలో ఉత్తరప్రదేశ్ శాసనసభ కాలపరిమితి ముగియనుంది. మంత్రివర్గ విస్తరణలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనున్నారు. అలాగే, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇప్పటికే సీనియర్ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ను మంత్రిమండలి నుంచి తప్పించి కర్నాటకకు గవర్నర్గా పంపించారు. ఇప్పుడున్న మంత్రుల్లో మరి కొందరు కూడా తమ పదవులను కోల్పో నున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొందరి శాఖల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రకటనకు ముందే, బుధవారం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఉంటుందని తెలిపాయి. యువతకు ప్రాధాన్యం నేటి కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నట్టు, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్ నుంచి జ్యోతిరాధిత్య సింథియా, పశ్చిమ బెంగాల్ నుంచి శంతను ఠాకూర్ లేదా నిశిత్ ప్రామాణిక్, లద్దాఖ్ ఎంపీ జమ్యాంగ్ త్సెరింగ్, మహారాష్ట్ర నుంచి నారాయణ రాణె, డాక్టర్ ప్రీతమ్ గోపీనాథ్ ముండే, వరుణ్ గాంధీ, రాజస్థాన్ నుంచి చంద్రప్రకాశ్ జోషి, రాహుల్ కశ్వాన్లకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో 20 మంది కేబినెట్ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా గల మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు.. మొత్తంగా 52 మంది మాత్రమే ఉన్నారు. తాజాగా ఈ సంఖ్యను 79కి పెంచనున్నట్టు తెలుస్తోంది. అంటే, మరో 27 మందితో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఉండనుందని సమాచారం. వీరిలో అత్యధికులు కొత్తవారే ఉండనున్నారు. మరోవైపు, మహిళల ప్రాతినిధ్యం పెంచడంతో పాటు వివిధ రంగాల్లో నిపుణులైన ఒకరిద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రధాని యోచిస్తున్నట్లు తెలిసింది. మంత్రిమండలిలో గరిష్టంగా 81 మంది వరకు ఉండవచ్చు. ఆరెస్సెస్ ముఖ్య నేతలు మోహన్ భాగవత్, కృష్ణ గోపాల్, మన్మోహన్ వైద్య గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండడం గమనార్హం. కేబినెట్లోకి మిత్రపక్షాలు.. ఎన్డీయే నుంచి శివసేన, శిరోమణి అకాళీదళ్ వెళ్లిపోయాక ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఒక్కటే అధికారం పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్జేపీ, అప్నాదళ్లకు కేబినెట్లో చోటు దక్కనుంది. అప్నాదళ్ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, జేడీయూ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామచంద్రప్రసాద్ సింగ్, పూర్ణియా నియోజకవర్గ ఎంపీ సంతోష్ సింగ్ కుశావహ లేదా ముంగర్ నియోజకవర్గ ఎంపీ లలన్సింగ్, లోక్ జనశక్తి పార్టీ నుంచి పశుపతి కుమార్ పారస్లకు చోటు దక్కే అవకాశముంది. మరో మిత్రపక్షం ‘ఆల్ ఇండియా జార్ఖండ్ స్టుడెంట్స్ యూనియన్’కు కూడా అవకాశం లభించనుందని సమాచారం. పారస్, నారాయణ రాణె యూపీకి ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ నుంచి కనీసం ఐదుగురికి మంత్రిపదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్ సింగ్, మహరాజ్గంజ్ ఎంపీ పంకజ్ చౌదరి, పిలిబిత్ ఎంపీ వరుణ్ గాంధీ, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ ఛైర్మన్, ఎంపీ రాంశంకర్ కటేరియా, రాజ్యసభ సభ్యుడు సకల్దీప్ రాజ్భర్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బీహార్ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ మోదీకి కేబినెట్ బెర్త్ ఖాయమైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాధిత్య సింథియాతోపాటు ఎంపీ రాకేష్ సింగ్లకు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, ఉత్తరాఖండ్ తాజా మాజీ ముఖ్యమంత్రి తీరథ్సింగ్రావత్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేలకు కేబినెట్ పదవులు దక్కనున్నట్టు సమాచారం. రాజస్థాన్ నుంచి ఛిత్తోర్గఢ్ ఎంపీ చంద్రప్రకాశ్ జోషి, చురు ఎంపీ రాహుల్ కశ్వాన్, ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్కు అవకాశం దక్కనున్నట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇన్నర్ మణిపూర్ ఎంపీ డాక్టర్ రంజన్సింగ్ రాజ్కుమార్కు మంత్రిమండలిలో ప్రాతినిధ్యం దక్కనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ మంగళవారం సాయంత్రం పార్టీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకోవడంతో, మంత్రివర్గంలో ఆయన చేరికపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు చోటు దక్కే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఆదిలాబాద్ ఎంపీ, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నేతగా పేరున్న సోయం బాపూరావుకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా ఆదివాసీలు, గోండ్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కంభంపాటి హరిబా బుకు మిజోరం గవర్నర్ పదవి దక్కడంతో.. మంత్రివర్గ కూర్పులో ఆంధ్రప్రదేశ్కు చోటు దక్కబోదని సంకేతం ఇచ్చినట్టయింది. కొత్తగా సహకార శాఖ దేశంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను నూతనంగా ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది బుధవారం కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు చేర్పులు జరుగబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో సహకార్ సే సమృద్ధి భావనను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ శాఖకు ప్రత్యేక లీగల్, పాలసీ విధానాలను రూపొందిస్తారు. బుధవారం విస్తరణలో ఈ శాఖకు మంత్రిని ప్రకటించవచ్చు. నిజమైన ప్రజా ఉద్యమంగా సహకారోద్యమాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. సహకార సంఘాలు సులభంగా వ్యాపారాలు నిర్వహించుకునే వీలు కల్పించడం, మల్టి స్టేట్ కోఆపరేటివ్స్ను ఏర్పాటు చేయడంపై కొత్త శాఖ దృష్టి సారిస్తుంది. -
ప్రధాని మోదీ నివాసంలో జరగాల్సిన కీలక భేటీ రద్దు
-
క్లైమాక్స్లో కేబినెట్ విస్తరణ.. భేటీ రద్దు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ విస్తరణ కసరత్తు తుదిదశకు చేరుకుంది. ఈ వారం ఢిల్లీలో అందుబాటులో ఉండాలని పలువురు ఎంపీలకు అధిష్టానం సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో అస్సాం మాజీ సీఎం శర్వానంద్ సోనోవాల్, పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు ఎంపీలు హస్తినకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, ప్రధాన కార్యదర్శి సంతోష్ తో ఈ సాయంత్రం ప్రధాని చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికలు లక్క్ష్యంగా ఈ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. మొత్తంగా ఏడుగురిపై వేటు పడే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల భేటీ రద్దు? ఇదిలా ఉంటే మంగళవారం సాయంత్రం జరగాల్సిన మంత్రుల భేటీ రద్దైనట్లు కథనాలు వెలువడుతున్నాయి. మంగళ, గురువారం ప్రధాని పాల్గొనబోయే భేటీలు రద్దైనట్లు పీఎంవో నుంచి ఓ ప్రకటన వెలువడిందని ఆ కథనాల సారాంశం. బీజేపీ చీఫ్తో పాటు అమిత్ షా సహా మంత్రులు ఈ భేటీకి హాజరవుతారనే ఆశిస్తుండగా.. ఒకవేళ నిజంగా రద్దు అయితే తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోదీ-బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి సంతోష్ భేటీ మాత్రం యథావిధిగా కొనసాగనుందని మరో కథనం వెలువడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వారంలోనే జరగాల్సిన కేబినెట్ విస్తరణ అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
-
కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలి విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడో రేపో తన మంత్రిమండలిని విస్తరించనున్నట్టు తెలుస్తోంది. మోదీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్.సంతోష్లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మరో 25 మందికి చోటు ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో ఉన్న మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం. ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్రపక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్కు, జేడీయూ, లోక్జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది. రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింథియా, ఎంపీ రాకేష్ సింగ్లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. తెలంగాణ నుంచి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా జి.కిషన్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణ నుంచి.. 2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కనుంది. ఆదిలాబాద్ ఎంపీ బాపూరావుకు సహాయమంత్రి పదవి దక్కే చాన్సున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. ఏపీ నుంచి బీజేపీకి లోక్సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ , జీవీఎల్ నరసింహారావులలో జీవీఎల్కుగానీ, టీజీ వెంకటేష్కుగానీ చాన్సు దక్కొచ్చని తెలుస్తోంది. -
Cabinet Reshuffle: కేంద్ర మంత్రివర్గ విస్తరణ!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఇటీవల కేంద్ర మంత్రులతో వరుస సమావేశాలు నిర్వహిస్తుండటంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురువారం నుంచి ప్రారంభమైన సమావేశాల్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రుల పనితీరును విశ్లే షించేందుకే వీరి సమావేశాలు జరుగుతున్నాయని పలువురు నేతలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఏదైనా కీలక పథకం కూడా ప్రకటించే అవకాశం ఉందని వార్తలొ స్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనా«థ్ రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలువురు అగ్రనేతలను కలిశారు. దీంతో ఆ రాష్ట్రం నుంచి మంత్రులను ఎంపిక చేసే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో మిత్రపక్షమైన అప్నా దళ్ నేత అనుప్రియ పటేల్ బీజేపీ నేతలను కలిశారు. భేటీలు.. సమీక్షలు.. గురువారం ప్రధాని మోదీ తన ఇంట్లో ఏకంగా 5 గంటల పాటు సమావేశం నిర్వహించారు. ఇందులో ఏడుగురు కేంద్ర మంత్రులు సైతం పాల్గొన్నారు. కోవిడ్ పంజా విప్పిన ఏప్రిల్, మే నెలల్లో మంత్రుల పనితీరును ఆయన సమీక్షిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రకాశ్ జవడేకర్‡, హర్దీప్లు ఉన్నారు. అయితే, ప్రభుత్వం ఏటా నిర్వహించే వార్షిక సమీక్ష సమావేశాలే ఇవి అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా కారణంగా సమీక్షలు ఆలస్యమై ప్రస్తుతం కొనసాగుతున్నాయని అంటున్నారు. అయితే, ఆరుగురు మంత్రులు రెండేసి శాఖలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కేబినెట్ విస్తరణపై వార్తలు ఊపందుకున్నాయి. మొత్తంగా 79 మంది మంత్రులను ప్రధాని ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో ఇంకో 20కి పైగా స్థానాలను పూరించేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ వేస్తామని ప్రధాని ప్రకటించిన నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతుండటం గ మనార్హం. ప్రస్తుతం పెట్రోలియం మంత్రిత్వ శాఖ, స్టీల్, జలశక్తి, నైపుణ్యాభివృద్ధి–ఎంటర్ప్రెన్యూర్ షిప్, విమానయానం, భారీ పరిశ్రమలు, పర్యావరణం, అడవులు–వాతావరణ మార్పు వంటి మంత్రిత్వ శాఖల సమీక్షలు జరుగుతున్నాయి. ఆయా శాఖల కార్యదర్శులు ఇప్పటికే నివేదికలను ప్రభుత్వం ఎదుట ఉంచినట్లు సమాచారం. -
Uttar Pradesh: యూపీ కేబినెట్ ప్రక్షాళన!
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ పదవుల్లో మార్పుతో పాటు, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు చెలరేగుతున్న సమయంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం ఢిల్లీ చేరుకున్నారు. యోగిపై యూపీ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకుల్లో నెలకొన్న అసంతృప్తి, బ్రాహ్మణులు బీజేపీపై గుర్రుగా ఉన్నారని, పార్టీకి దూరమయ్యే ప్రమాదముందనే సంకేతాల నేపథ్యంలో యోగి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అందరినీ కలుపుకొని వెళ్లండి లక్నో నుంచి ఢిల్లీకి వచ్చిన వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సుమారు గంటన్నర పాటు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, వచ్చే ఏడాది జరుగనున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులతో పాటు, మంత్రివర్గ విస్తరణ, పంచాయతీ ఎన్నికల ఫలితాల పరిణామాలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇటీవల లక్నో పర్యటన చేసిన ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ బీఎల్ సంతోష్, ఇన్చార్జి రాధామోహన్ సింగ్ ఫీడ్ బ్యాక్ ఆధా రంగా పార్టీలో అందరితో కలుపుకుపోవాలని సీఎం యోగికి అమిత్ షా సూచించారు. అదే స మయంలో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వా లని , రాష్ట్రంలో కుల సమీకరణాలను సరిదిద్దేందుకు క్షేత్రస్థాయిలో బలం ఉన్న పాత మిత్రులను ఏకం చేయాలని అమిత్ షా పేర్కొన్నారు. ప్రధానితో జేపీ నడ్డా భేటీ గురువారం సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు నడ్డా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కొద్ది రోజుల క్రితం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) బిఎల్ సంతోష్, రాష్ట్ర ఇన్ఛార్జి రాధా మోహన్ సింగ్ల రాష్ట్ర పర్యటనలో భాగంగా రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేలు, నాయకులతో చర్చించి ఒక నివేదికను సిద్ధం చేశారు.ఈ నివేదిక పూర్తి సారాంశాన్ని ప్రధాని మోదీకి నడ్డా, బీఎల్ సంతోష్ వివరించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలే కూడా యూపీలోని క్షేత్రస్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి... బీజేపీ అగ్రనేతలకు నివేదించారు. యోగీ నేతృత్వంలోనే 2022 అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలని ఆర్ఎస్ఎస్– బీజేపీ నిర్ణయానికి వచ్చినా... పార్టీలో, ప్రభుత్వంలో ప్రక్షాళన అవసరమని భావిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఏకే శర్మకు కేబినెట్లో చోటు! మాజీ ఐఏఎస్ అధికారి, ప్రధానికి సన్నిహితుడిగా పేరుపడ్డ ఏకే శర్మను ఉప ముఖ్యమంత్రిగా కేబినెట్లోకి తీసుకునే అవకాశాలున్నట్లు కొద్దిరోజులుగా వినపడుతోంది. గుజరాత్ కేడర్కు చెందిన శర్మ 20 ఏళ్లపాటు మోదీతో కలిసి పనిచేశారు. యూపీకి చెందిన వారు. ఈ ఏడాది జనవరిలో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోగానే శర్మను ఎమ్మెల్సీ చేశారు. యూపీలో కేబినెట్లో ఏడు ఖాళీలు ఉన్నా... శర్మ మరో అధికార కేంద్రంగా మారతారనే భయంతో యోగి మంత్రివర్గ విస్తరణ/ పునర్వవస్థీకరణను వాయిదా వేస్తున్నారు. ఇదే విషయంలో ప్రధానితో ఆయనకు విభేదాలు పొడసూపాయనే ప్రచారం జరిగింది. శర్మ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్టీ అగ్రనేతలను కలుస్తున్నారు. ఏకే శర్మతో పాటు బుధవారమే కాంగ్రెస్ను వీడి బీజేపీ చేరిన జితిన్ ప్రసాదకు కూడా కేబినెట్లో చోటు దక్కుతుందని భావిస్తున్నారు. అప్నాదల్ (ఎస్) నాయకురాలు అనుప్రియా పటేల్ కూడా గురువారం అమిత్ షాతో భేటీ కావడంతో మిత్రపక్షాల మద్దతును కూడగట్టే ప్రయత్నాలను బీజేపీ చేస్తోందనేది స్పష్టమవుతోంది. -
త్వరలో మంత్రివర్గ విస్తరణ.. డిప్యూటీ సీఎంగా ప్రధాని సన్నిహితుడు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఇటీవల జరిగిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఉత్తర్ప్రదేశ్ రాజకీయాల్లో వేడి మొదలైంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఊహాగానాలు కొనసాగుతున్నాయి. మాజీ ఐఎఎస్, ప్రస్తుత ఎమ్మెల్సీ... ప్రధాని మోదీకి సన్నిహితుడైన ఏకె శర్మను యూపీ డిప్యూటీ సీఎంగా చేసే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఎందుకంటే ఇటీవల పూర్వాంచల్, వారణాసి ప్రాంతాల్లో శర్మ చేసిన కోవిడ్ నిర్వహణను మోదీ స్వయంగా ప్రశంసించారు. మంత్రివర్గ విస్తరణలో ఐదుగురు కొత్తవారికి అవకాశం ఇవ్వనుండగా, ఏడుగురు మంత్రులను తొలగించే అవకాశాలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లోని ముగ్గురు మంత్రులు చేతన్ చౌహాన్, కమలా రాణి, విజయ్ కశ్యప్ ఇటీవల కరోనా బారినపడి మరణించారు. అటువంటి పరిస్థితిలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, రాబోయే ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి సహాయపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లో కేబినెట్, స్వతంత్ర, సహాయ మంత్రులతో కలిసి మొత్తం 60 మంది మంత్రులు ఉండవచ్చు. యోగి కేబినెట్లో 56 మంది మంత్రులు ఉండగా.. అందులో ముగ్గురి మరణంతో ఇప్పుడు మంత్రివర్గంలో 7 ఖాళీలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సామాజిక సమీకరణాలను చక్కదిద్దేందుకు కమలదళం సిద్ధమైందని సమాచారం. మరోవైపు ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వంలోని ఏడుగురు మంత్రులపై ఫిర్యాదులు ప్రధాని కార్యాలయానికి చేరుకున్నాయి. ఆ శాఖల్లోని అవినీతి, ఇతర లోపాల గురించి సమాచారం వెలుగులోకి వచి్చంది. అటువంటి పరిస్థితిలో త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో కొంతమంది మంత్రులను తొలగించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. -
మంత్రులుగా 17 మంది ప్రమాణం
పాట్నా: ఎన్నికల్లో గెలిచిన అనంతరం కొద్దిమందితో మంత్రులు, ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయగా తాజాగా కొత్తగా 17 మంత్రులుగా నియమితులయ్యారు. ఈ మేరకు రాజ్భవన్లో వారితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన పార్టీతో పాటు బీజేపీకి ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ఇరు పార్టీల ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేశారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం జరిగింది. కొత్తగా 17 మంది మంత్రులుగా గవర్నర్ ఫాగూ చౌహాన్ ప్రమాణం చేయించారు. కొత్తగా మంత్రులుగా నియమితులైన వారిలో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అధికార ప్రతినిధి సహనవాజ్ హుస్సేన్ ఉన్నారు. ఆయన గత నెలలో మండలికి ఎన్నికవడంతో ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కొత్తగా మంత్రులైన వారిలో జేడీయూ నేతలు సంజయ్ కుమార్ జా, శ్రావణ్ కుమార్, లేసి సింగ్, బీజేపీకి చెందిన మదన్ సాహని, ప్రమోద్ కుమార్ ఉన్నారు. బీహార్ అసెంబ్లీలో 36 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు నితీశ్ బృందంలో 13 మంది మాత్రమే అక్కడ మంత్రులుగా ఉండగా తాజాగా 17 మంది నియమితులవడంతో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పడింది. -
యడ్డీ ముచ్చటగా మూడోసారి
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు వాస్తవరూపం దాల్చింది. అసమ్మతి నేతల ఎత్తులు, నాయకత్వ మార్పు అంటూ గత కొన్ని నెలలుగా సాగుతున్న ప్రచారానికి తెరపడ్డట్టైంది. ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తాజాగా నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలకు కేబినెట్లో చోటుకల్పించారు. రాజ్భవన్లో బుధవారం జరిగిన కేబినెట్ విస్తరణలో గవర్నర్ వజూభాయ్ వాలా కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉమేష్ కట్టి (హక్కేరి), ఎస్.అంగర (సల్లియా), మురుగేష్ నిరానీ (బిల్గీ), అరవింద్ లింబావలీ (మహదేవపుర), ఎమ్మెల్సీలు ఆర్.శంకర్, ఎంటీబీ నాగరాజ్, సీపీ యోగేశ్వర్ ముఖ్యమంత్రి యడియూపరప్ప ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. కాగా, నాటకీయ పరిణామాల మధ్య 2019 జులైలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ యడియూరప్పకే మళ్లీ సీఎం పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. 17 మంది ఎమ్మెల్యేల తిరుబాటుతో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వ కుప్పకూలడంతో బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమైంది. అయితే, యడ్డీ నాయకత్వంపై సొంతపార్టీలోనే అసంతృప్తులు, తిరుగుబాటుదారులు ఎక్కువ కావడంతో ప్రభుత్వానికి సమస్యలు తప్పలేదు. ఇప్పటికే 2019 ఆగస్టులో ఓసారి, 2020 ఫిబ్రవరిలో మరోసారి కేబినెట్ను విస్తరించారు. అయినప్పటికీ బీజేపీ సర్కారులో లుకలుకలు తగ్గలేదు. ఈసారి యడ్డీ సీటుకు ఎసరు ఖాయమనే ప్రచారం ముమ్మరంగా సాగింది. ఈనేపథ్యంలో ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చిన సీఎం యడియూరప్ప ముచ్చటగా మూడోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టారు. -
కేబినెట్లోకి కవిత: ఎవరికి చెక్పెడతారు..!
సాక్షి, నిజామాబాద్ : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. మొత్తం 823ఓట్లకు గాను 728 ఓట్లను కైవసం చేసుకుని విపక్షాలను చిత్తు చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఘోరపరాజయం పాలైన కవిత.. తాజా ఎన్నికతో ఓటమి చెందిన గడ్డపైనే గెలుపు జెండా ఎగరేశారు. సీఎం కేసీఆర్ కుమార్తె కావడంతో ఈ ఎన్నికను టీఆర్ఎస్ అధిష్టానం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి మంత్రి ప్రశాంత్ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యేలంతా కవిత విజయం కోసం కృషి చేశారు. ఎన్నిక ఏకపక్షం కావడమే లక్ష్యంగా పెట్టుకున్న గులాబీ దళం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను భారీగా చేర్చుకుంది. ఆపరేషన్ ఆకర్ష్ను ప్రయోగించి.. కమలాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. (ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కవిత ఘన విజయం) తనను ఓడించిన ఇందూరు నుంచి మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం గమనార్హం. కవిత తాజా ఎన్నికతో తొలిసారి శాసనమండలిలో అడుగుపెట్టనున్నారు. కవిత మండలి ఎన్నికపై తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేవలం 15 నెలల పదవీకాలం ఉన్న నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి కవితను ఎంపిక చేయడం వెనుక రహస్యం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆమెను రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే పూర్థిస్థాయి మంత్రివర్గం కొలువుతీరి ఉన్న నేపథ్యంలో ఆమెను ఎలా సర్దుబాటు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సంఖ్యను బట్టి మంత్రివర్గంలో కేవలం 17 మందికే అవకాశం ఉంది. ఈ కోటా ఇప్పటికే పూర్తయ్యింది. ఒకవేళ కవితను కేబినెట్లోకి తీసుకోవాలంటే ఎవరోఒకరని తప్పించతప్పదు. ఆ సాహసం ఎవరు చేస్తారు..? సీఎం ఎవరిపై వేటు వేస్తారు? అనేది తెలియాల్సి ఉంది. (ఎమ్మెల్సీగా ఉంటారా.. మంత్రివర్గంలో చేరతారా?) సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన కేసీఆర్.. ఇప్పుడు కవిత కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఏ ఒక్కరిని తప్పించినా పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కోక తప్పదు. నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలోనే కేంద్రమంత్రి పదవి కోసం ప్రయత్నించిన కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడంతో.. తాజాగా మండలికి ఎంపిక చేసి రాష్ట్ర కేబినెట్లో చోటుకల్పించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మంత్రివర్గంలో అవకాశం లేకపోతే కేబినెట్ హోదా కల్పించి వేరే ఇతర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చకూడా తెరపైకి వచ్చింది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బీగాల గణేష్ గుప్తా, షకిల్, జీవన్రెడ్డి మాట్లాడుతూ.. కవిత మంత్రివర్గంలో చేరడం ఖాయమని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆరేళ్ళ కాలపరిమితి గల ఈ ఎమ్మెల్సీ పదవీ కాలం 2022 జనవరిలో ముగియనుంది. అప్పటి వరకు కవిత ఎమ్మెల్సీగానే కొనసాగుతురా? లేక మంత్రివర్గంలో చేరతారా అనేది తెలియాల్సి ఉంది. -
రేపు ఏపీ మంత్రివర్గ విస్తరణ
-
ఏపీ: రేపు మంత్రివర్గ విస్తరణ..
సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు(బుధవారం) మధ్యాహ్నం 1:29 నిముషాలకు మంత్రివర్గ విస్తరణ జరగనుంది. రెండు ఖాళీ స్థానాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. కొత్త మంత్రులతో గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించనున్నారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు సీఎం వైఎస్ జగన్ రాజ్భవన్కు చేరుకోనున్నారు. రాజ్యసభకు ఎన్నికైనందున సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ తమ మంత్రి పదవులకు చేసిన రాజీనామాలను నిన్న గవర్నర్ బిశ్వభూషణ్ ఆమోదించిన సంగతి తెలిసిందే. వారు రాజీనామాలు చేసిన స్థానాల్లో కొత్త మంత్రులను నియమించనున్నారు. -
మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
భోపాల్ : మధ్యప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణకు ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. గురువారం ఉదయం రాజ్భవన్లో శివరాజ్సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కేబినెట్ విస్తరణపై ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపిన ముఖ్యమంత్రి కేంద్ర నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో మంత్రుల జాబితాను సిద్ధం చేశారు. అయితే ప్రస్తుత గవర్నర్ లాల్జీటాండన్ అనారోగ్యం బారినపడటంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన స్థానంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అనందీబేన్ పటేల్కు మధ్యప్రదేశ్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆమె గురువారం బాధ్యతలు స్పీకరించనున్నారు. అనంతరం మంత్రులతో ప్రమాణం చేయించనున్నారు. (మధ్యప్రదేశ్లో కాంగ్రెస్కు ఎమ్మెల్యేల షాక్!) కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రిపదవి కోసం చాలామంది ఎమ్మెల్యేలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ను వీడి కమల్నాథ్ సర్కార్ కూలిపోవడానికి కారణమైన జోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు సైతం పదవులపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరిలో కేబినెట్ బెర్త్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్కు చెందిన 22 మంది శాసనసభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో మార్చి నెలలో కాంగ్రెస్ సర్కార్ పడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం ఊహించని పరిణామాలతో అదే నెల 23న తిరుగుబాటు సభ్యుల మద్దతులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ నేత శివరాజ్సింగ్ చౌహన్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు కరోనా క్లిష్ట కాలంలోనూ మంత్రివర్గ విస్తరణ అవసరమా అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలకు దిగుతోంది. -
ఆ ఎమ్మెల్యేల రహస్య భేటీల వెనుక ఆంతర్యమేమిటి?
సాక్షి, బెంగళూరు: కేబినెట్ విస్తరణ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి రేగిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. మొదట మంత్రి జగదీశ్ శెట్టర్ నివాసంలో సమావేశమయ్యారు. అదేవిధంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో మరో 25 మంది రెండు రోజుల క్రితం అర్ధరాత్రి వరకు భేటీ అయి చర్చించారు. గత మంగళవారం అర్ధరాత్రి సుమారు 25 మంది బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్తో భేటీ అయ్యారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శితో కలిసి భేటీ కావడం కర్ణాటక రాజకీయాల్లో కుతూహలం రేపుతోంది. ఒక్కో ఎమ్మెల్యే ప్రత్యేకంగా భేటీ అయి రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు తెలిసింది. ప్రతి ఎమ్మెల్యేతో నాలుగైదు ని మిషాల పాటు బీఎల్ సంతోష్ మాట్లాడారు. ఈక్రమంలో అర్ధరాత్రి 1.30 గంటల వరకు చర్చ కొనసాగింది. అయితే పాలనపై వ్యతిరేకమా? లేక మంత్రివర్గంలో చోటు దక్కలేదనే అసమ్మతి వ్యక్తం చేశారా? అనే విషయాలు స్పష్టంగా తెలియరాలేదు. కానీ రాజకీయ పరిణామాల గురించి చర్చించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీలో జాతీయ స్థాయిలో కీలకపాత్ర పోషిస్తున్న బీఎల్ సంతోష్ రెండు రోజుల క్రితం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వచ్చారు. ఈక్రమంలో మంత్రివర్గంలో చోటు దక్కని ఎమ్మెల్యేలు అసమ్మతి వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో సీఎంగా యడియూరప్ప ఉన్నప్పుడు కూడా జగదీశ్ శెట్టర్ సమక్షంలో అసమ్మతి లేచిన సంగతి తెలిసిందే. యడియూరప్ప పదవీచ్యుతుడు కాగా జగదీశ్ శెట్టర్ అప్పట్లో సీఎం అయ్యారు. అయితే ప్రస్తుతం యడియూరప్ప మంత్రివర్గంలో జగదీశ్ శెట్టర్ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో అసమ్మతి నేతలు భేటీ కావడం చర్చనీయంగా మారింది.