స్ఫూర్తి నింపిన మహిళ | Inspiration by a woman | Sakshi

స్ఫూర్తి నింపిన మహిళ

May 31 2014 4:38 AM | Updated on Sep 2 2017 8:05 AM

స్ఫూర్తి నింపిన మహిళ

స్ఫూర్తి నింపిన మహిళ

మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ. అవయవ దానంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ముంబయిలో నివాసముండే ఆలం...

పంజగుట్ట, న్యూస్‌లైన్: మరణిస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది ఓ మహిళ. అవయవ దానంతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచింది. ముంబయిలో నివాసముండే ఆలం, అనిత (32) తమ ఆరేళ్ల కుమారుడితో సహా ఓ పని నిమిత్తం మహబూబ్‌నగర్ వెళ్లారు. ఈ నెల 22న ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదవశాత్తూ కింద పడ్డారు.

ఈ ఘటనలో అనితకు తీవ్రగా గాయాలయ్యాయి. ఆలం, కుమారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అనితను చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్ ఆసుపత్రికి తరలించగా... పరిస్థితి విషమించడంతో అక్కడి వైద్యులు నగరంలోని కేర్ ఆసుపత్రికి పంపించారు. చికిత్స పొందుతు న్న ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్టు ఈ నెల 29న వైద్యులు నిర్థారించారు.

జీవన్‌దాన్ ప్రతినిధుల సలహాతో ఆలం... అనిత అవయవాలు దానం చేసేందుకు అంగీకరించారు. ఆమె రెండు కిడ్నీలు, కాలేయం, గుండె నా ళాలను సేకరించినట్టు నిమ్స్ జీవన్‌దాన్ ప్రతినిధి అనురాధ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement